Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

వచ్చే ఎన్నికల్లో బీహార్ గాలి వీస్తుందా?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్విజయంతో బిజెపి ఆనందానికి అవధుల్లేవు. ఈ విజయవీర గర్వంతో తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ప్రభంజనం వీస్తుందని ఇప్పటి నుంచే కలలు కంటోంది. బీహార్‌లో కులాల బలం ఒక కథగా మిగిలిపోయి, చివరకు మహిళా ఓటర్లే కీలకమయ్యారు. ఈ అనుభవంతో ప్రధాని మోడీ రైతు వర్గాలను ఆకర్షించడానికి బుధవారం (19.11.25 ) దేశంలోనే అత్యంత నగరీకరణ కలిగిన తమిళనాడు లోని రైతులను పాన్ ఇండియాకు చేరువ చేశారు. వాస్తవానికి తమిళనాడు ఆదాయంలో వ్యవసాయం నుంచి వచ్చేది కేవలం 13 శాతం మాత్రమే. అయినా సరే తమిళనాడు లోని కోయంబత్తూరులో బుధవారం జరిగిన సభలో హాజరైన ప్రజానీకం తమ తువ్వాళ్లను గాలిలో ఎగురవేస్తూ మోడీకి స్వాగతం పలకడంపై పులకించిపోయి తాను రాకముందే ఇక్కడ బీహార్ గాలి వీచినట్టు కనిపిస్తోందని వాక్చాతుర్యం ప్రదర్శించారు.

కోయంబత్తూరునుంచే దేశం లోని రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి 21వ విడత ఆర్థికసాయంగా రూ. 18 వేల కోట్లను విడుదల చేయడం గమనార్హం. కోయంబత్తూరు అసెంబ్లీ స్థానం బిజెపిదే. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి తన ప్రత్యర్థి కమల్‌హాసన్‌ను చాలా స్వల్ప మెజార్టీతో ఓడించారు. 234 అసెంబ్లీ స్థానాలు కలిగిన తమిళనాడు నుంచి 2.6 శాతం ఓట్లతో నలుగురు బిజెపి ఎంఎల్‌ఎలు గెలిచారు. 2001లో కూడా కరుణానిధి నేతృత్వంలో డిఎంకెతో పొత్తు కుదుర్చుకుని బిజెపి నాలుగు స్థానాలనే దక్కించుకోగలిగింది. కానీ 2006లో పోటీ చేసిన మొత్తం 225 మంది బిజెపి అభ్యర్థుల్లో 221 మంది డిపాజిట్లు కూడా దక్కించుకోలేక కుప్పకూలింది. 2001 నుంచి బిజెపి ఓట్ల వాటా 2 శాతం నుంచి 3 శాతం మించి కొనసాగడం లేదు. గత ఐదు ఎన్నికల నుంచి బిజెపి, డిఎంకె రాజకీయంగా, సిద్ధాంతపరంగా, ఉత్తరదక్షిణ ధ్రువాలుగా ఉంటూ తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

తమిళనాడులో వ్యవసాయానికి చేనేత రంగం ఊతంగా నిలిచింది. మిగతా రాష్ట్రాల మాదిరిగానే వాతావరణ మార్పులు వ్యవసాయ, చేనేత రంగాలను ఘోరంగా దెబ్బతీశాయి. ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనకు ముందు వ్యవసాయ రంగాన్ని కేంద్రం ఆదుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్ అభ్యర్థించారు. బాగా పండిన వరి ప్రొక్యూర్‌మెంట్ ఎక్కువ చేయాలని, తేమ శాతం మినహాయింపు పరిధిని పెంచాలని, ధాన్యం మిల్లింగ్‌కు భారీగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మామిడి గుజ్జుపై జిఎస్‌టి భారం 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరారు. ఈ సమస్యలు రానున్న ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చెప్పలేం. కుల ప్రభావం ఎలా ఉన్నా సనాతన ధర్మంపై బిజెపికి, డిఎంకెకు మధ్య గట్టి పోరు ఉంటుంది. ఇదిలా ఉండగా కోయంబత్తూరు, మధురలకు మెట్రోరైలు ప్రాజెక్టులను మంజూరు చేయాలని కొన్నేళ్లుగా తమిళనాడు ప్రభుత్వం కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం కూడా రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య సంఘర్షణకు దారి తీస్తోంది.

తమిళనాడుతోపాటు పశ్చిమబెంగాల్‌లో కూడా ఆరునెలల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, బిజెపికి మధ్య కులాలు, మత విశ్వాసాలు ఢీకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఓట్ల బ్యాంకు కోసం కొత్త లక్షాలు పుట్టుకొస్తున్నాయి. ముఫ్పైయేళ్ల వామపక్ష పార్టీకి, టిఎంసికి కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. మమతాబెనర్జీ ప్రభుత్వంలో అనేక పొరపాట్లు చోటుచేసుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు కుంగిపోతున్నారు. ఉపకులాలు, గూర్ఖాలకు ప్రత్యేక గుర్తింపు, మతం, భాష తదితర అంశాల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు ముస్లిం బెంగాలీలు అంతా చొరబాటుదారులే అన్న కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇవన్నీ ఎలా ఉన్నా బెంగాల్‌లో బిజెపి అత్యద్భుతంగా పురోగమిస్తోంది. 2016లో 10% ఓట్లతో మూడు సీట్లను తెచ్చుకున్న బిజెపి, 2021 నాటికి 30 శాతం ఓట్లతో 77 సీట్లను సాధించగలిగింది. బెంగాల్‌లో అనేక కారణాల వల్ల శాంతిభద్రతలు సమస్యలను సృష్టిస్తున్నాయి. వైద్య విద్యార్థులపై అత్యాచారాలు, కొన్ని వర్గాల గూండాయిజం స్థానిక ప్రజలను వేధిస్తోంది.

ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచుతున్నాయి. దీన్ని నివారించడానికి ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సర్వవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయినా సరే ఘర్షణలతో వ్యవస్థీకృత నేరాలుగా మారిన రాజకీయ హింస, వీటన్నిటితో అస్థిరత నెలకొన్న బెంగాల్‌ను తమకు అనుకూలంగా మలచుకుని లాభపడాలని బిజెపి చూస్తోంది. పార్టీ కార్యకర్తల స్వైరవిహారంతో కొన్ని ఘర్షణలు తలెత్తుతుండడంతో కేంద్రం, రాష్ట్రం పరస్పర ఆరోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. క్షేత్రస్థాయిలో వీటిని నివారించడం, ప్రజలకు భద్రత కల్పించే బాధ్యత తీసుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యమే అయినా సరిగ్గా నెరవేరడం లేదు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు రెండూ కేంద్ర బిజెపిని వ్యతిరేకించేవే. ఈ రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సారూప్యాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా, పారిశ్రామికంగా తమిళనాడు స్థిరపడిన రాష్ట్రం. దాంతో పోలిస్తే పశ్చిమబెంగాల్‌లో పేదరికం ఎక్కువ.పైగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాల ప్రస్తుత ప్రభుత్వాలు కొత్త ఓటర్ల జాబితాల సవరణను వ్యతిరేకిస్తున్నాయి. అలాగే భాషావాదం, మహిళా సంక్షేమంలో ఒకే భావాలు కలిగి ఉంటున్నాయి. తమిళనాడులో మహిళల అక్షరాస్యత 73 శాతం ఉండగా, పశ్చిమబెంగాల్‌లో 71% వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ యంత్రాంగం భయంకర వ్యవస్థగా తయారవ్వడం బిజెపికి ఒక సవాలుగా మారింది. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో ఎత్తిచూపడానికి కమలనాథలు అన్వేషించే పనిలో పడ్డారు. 

సైన్స్, చరిత్ర చెరిపేసే ప్రయత్నం

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పాఠశాల పాఠ్యగ్రంథాల నుంచి సైన్సు, చరిత్రకు సంబంధించి పలు అంశాలను తొలగించింది. నిజానికి అవి చాలా చాలా ముఖ్యమైన అంశాలు. జీవ పరిణామాన్ని విజ్ఞాన శాస్త్ర సిలబస్‌లో లేకుండా చేయడం తాము నమ్మే సృష్టి సిద్ధాంతాన్ని రాబోయే తరాలు నమ్ముతూ ఉండాలనుకోవడం నేటి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ప్రభుత్వ విధానం. అలాగే చరిత్ర పాఠ్యపుస్తకాల నుండి మొత్తానికి మొత్తంగా మొఘలుల పాలనా కాలాన్ని తొలగించడం, వారి విద్వేష పాలసీ విధానానికి అనుగుణంగా చేసిందే! టిప్పు సుల్తాన్ దేశభక్తిని మరుగుపరచడం కూడా అలాంటిదే!! ముస్లింలు, మైనారిటీలు, దళితులంటే వారికున్న ద్వేషభావాన్ని ప్రత్యక్షంగా చూపించడమే! పాఠ్యగ్రంథాల సిలబస్‌లు మార్చుకున్నంత మాత్రాన అసలు చరిత్ర మారదు కదా? చారిత్రక ఆనవాళ్లు తుడిచిపెట్టుకుపోవు కదా? ఆర్కియాలజీ విభాగం వారి రిపోర్టులో, ప్రపంచ వ్యాప్తంగా వందల మంది చరిత్రకారులు రాసిన చరిత్ర గ్రంథాలు మాట్లాడుతూనే ఉంటాయి కదా? ఆయా విషయాల మీద వాస్తవికతకు అద్దం పడుతూ వెలువడిన సినిమాలు, నాటకాలు, ఇతర సృజనాత్మక రచనలు నేటి ప్రభుత్వపు అబద్ధపు ప్రచారాల్ని బట్టబయలు చేస్తూనే ఉంటాయి కదా?

మొఘలుల చరిత్ర ఏదో కొద్ది కాలంది కాదు.. ఈ నేల మీద పరిపాలన సాగిస్తూ, సుమారు నాలుగు శతాబ్దాల పాటు ఇక్కడే పాతుకుపోయింది. అంతేకాదు, ఈ దేశంలో అంతర్భాగమైపోయింది. మొఘలుల తర్వాత వచ్చిన బ్రిటీష్ వారు ఈ దేశాన్ని దోచుకుపోయారు. దోచుకున్నది తీసుకుపోయి బ్రిటన్‌లో పెట్టుకున్నారు. ఉదాహరణకు మన ప్రాంతం నుండి తీసుకుపోయిన కోహినూర్ వజ్రం. బ్రిటీష్ రాణి కిరీటంలో ధగధగా మెరిసింది కదా? మరి మొఘలులు దోచుకున్నదేమిటీ? దోచకుంటే అది వారెక్కడికి తీసుకుపోయారు? అని భావితరాల పౌరులు ప్రశ్నలు సంధించరా? మొట్టమొదట దేశంలోకి ప్రవేశించిన బాబర్ తప్ప, మిగిలిన మొఘల్ చక్రవర్తులందరూ ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి ఇక్కడే కన్నుమూశారు కదా? ఈ దేశపు మట్టిలో మట్టయిపోయారు. భారతీయ జనజీవితంలో ఐక్యమైపోయారు.

సాధారణ శకానికి పూర్వం ఎప్పుడో అశోక చక్రవర్తి పరిపాలించిన సువిశాలమైన భూభాగాన్ని మళ్లీ మొఘలులు ఆక్రమించి సుస్థిరపరిచారు. ఇతర చొరబాటుదారులు దేశంలో చొరబడకుండా అడ్డుకుంటూ శత్రుదుర్భేద్యంగా నిలబడ్డారు. శతాబ్దాలు గడిచిపోతున్నా ప్రపంచ పర్యాటకులు మొఘలుల కట్టడాలను చూడడానికి విపరీతంగా వస్తున్నారు కదా? తాజ్‌మహల్, లాల్‌ఖిలా, హుమయూన్ సమాధి, ఆగ్రా కోట, బులంద్ దర్వాజ వంటివన్నీ యునెస్కో వరల్డ్ హెరిజేట్ స్థలాలుగా గుర్తింపు పొందాయి కదా? కాదంటారా? రోజూ వేల మంది సందర్శకులకు ఆ కట్టడాల నేపథ్యం తెలియనీయకుండా జాగ్రత్త పడతారా? అక్బర్, షాజహాన్‌ల పేర్లు బయటికి రానీయకుండా బిజెపి పాలనలో మోడీ చక్రవర్తి అవి కట్టించాడనీ చెప్పుకుంటారా? చెప్పుకున్నా చెప్పుకుంటారు. ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. వారి అబద్ధపు ప్రచారాలు, ఆర్భాటాలు ఎంత దిగజారుడు స్థాయిలో ఉంటున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం కదా? ఇక, తామే ఎల్లకాలమూ అధికారంలో ఉంటామన్న భ్రమలో నేటి ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుంది. కాల ప్రవాహంలో మార్పు సహజం అని గ్రహించలేకపోతున్నారు. గతంలో హిట్లర్ కూడా ఇలాగే మార్పులు చేయించాడు. మరి ఎల్లకాలమూ అధికారంలో ఉండలేకపోయాడు కదా!

ఇక సైన్స్ పాఠ్యగ్రంథాల నుండి జీవపరిణామ సిద్ధాంతాన్ని తొలగించడం గురించి చూద్దాం. మనిషిగా పుట్టిన ప్రతివాడూ తప్పక తెలుసుకోవాల్సిన అంశం జీవ పరిణామం. ఇది ఏ ఒక్క దేశానికో సంబంధించిన విషయం కాదు. కేవలం జీవశాస్త్రం అభ్యసించే విద్యార్థులు చదువుకునేది కూడా కాదు. ప్రపంచ పౌరులందరూ అధ్యయనం చేయాల్సిన విషయం. అర్థం చేసుకోవాల్సిన విషయం. చదువులేని వారు సైతం చదువుకున్న వారిని అడిగి, సారాంశం తెలుసుకోవాల్సిన విషయం. కొన్ని లక్షల ఏళ్లపాటు కొనసాగిన మానవుడి తొలిదశలు ఏవో, అవి ఎంతెంతగా సంఘర్షిస్తూ వచ్చాయో వాతావరణ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటూ వచ్చాయో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అవగతం చేసుకుంటూ ఎదుగుతూ, పరిణామం చెందుతూ ఇప్పటి ఈ స్థితికి ఎలా చేరుకున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది! ఏకకణ జీవుల నుండి, బహు కణ జీవుల నుండి, వెన్నెముక లేని జంతువుల్లో జరిగిన జీవ పరిణామం తొలి దశ అయితే.. అందులో నుండి వెన్నెముక గల జీవులు చేపలు, ఉభయచరాలు సరీసృపాలు పక్షులు ఆ తర్వాత హొమినిడికి చెందిన వానరాలు, అందులో నుండి తొలి మానవ దశలు రావడం మలిదశ.

ఒకానొక కాలంలో ఎన్నో తొలి మానవ దశలు కలిసి, ఏక కాలంలో ఈ నేల మీద సంచరించాయి. ఆహారం కోసం పోటీపడి కొట్లాడుకున్నాయి. అలా ఆ ఘర్షణల్లో తెలివైన జాతి హోమో సేపియన్ గెలుస్తూ, తన జాతిని కొనసాగించుకుంటూ వచ్చింది. మిగిలిన జాతులన్నీ క్రమంగా అంతరించిపోయాయి. హోమో అనేది మానవ జాతికి సంబంధించిన జీనస్, సేపియన్ అనేది స్పీసీస్. ‘సేపియన్’ అంటే వివేకం గలది అని అర్థం. సేపియన్‌గా ఈ భూమి మీద బతుకుతున్నందుకు ప్రతి ఒక్కరూ తమ వివేచనను ఉపయోగిస్తూ ఉండాలి! అందువల్ల ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలో ఉన్న మానవుడైనా, అతను హోమో సేపియనే అంటే, మనుషులంతా ఒక్కటే అని కదా అర్థం. ఆ రకంగా ప్రతి మనిషీ విశ్వమానవుడే! అనాగరికతను వదిలేస్తూ మనిషి నాగరికుడిగా ఎలా తయారయ్యాడో, మనిషి కేంద్రంగా అతను ఆధునిక, అత్యాధునిక యుగాలను ఎలా నిర్మించుకుంటూ వచ్చాడో తెలుసుకోవాలంటే తప్పదు ప్రతి ఒక్కరూ జీవ పరిణామ శాస్త్రం చదువుకోవాల్సిందే!

దైవ విశ్వాసంలో నిండా మునిగి, ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ లాంటి అంధ విశ్వాసాల్లోనే జీవన సత్యం ఉందనుకునే వారికి జీవ పరిణామం అక్కర లేదు అబద్ధాలు పూర్తిగా నమ్ముతూ, నిజాలకు రుజువులడిగే అతి తెలివిగాళ్లకు నిజమే జీవ పరిణామ శాస్త్రం అక్కర లేదు. ఆత్మ విశ్వాసాన్ని తొక్కిపెట్టి, దైవ విశ్వాసానికి భజనలు చేసే వారికి అవును జీవపరిణామం అక్కర లేదు. జీవ పరిణామ శాస్త్రం హేతువాదానికి మూలం! మానవ వాదానికి మూలం! స్వేచ్ఛాలోచనకు మూలం! విశ్వ దృష్టికి మూలం! జీవ పరిణామమంటే చీకటి లోంచి వెలుగులోకి చేసిన ప్రయాణం! అజ్ఞానం లోంచి జ్ఞానంలోకి చేసిన ప్రయాణం! మనిషి, మనిషి విలువను తెలుసుకోవడానికే, మానవ జీవ పరిణామ గురించి తెలుసుకోవాలి! మరి వీటిలో ఏ ఒక్కటీ గుర్తించలేని వారు, భరించలేనివారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి, వారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాబోయే తరాల్ని నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారు.

ఏ ప్రభుత్వమైనా ముఖ్యంగా చేయాల్సినవి రెండు పనులు. 1. విద్య 2. వైద్యం దేశ ప్రజలకు బాధ్యతతో అందించాలి! వైద్యం సమకాలీన సమాజంలో బతికి ఉన్న పౌరులకు మాత్రమే పని కొస్తుంది. కాని, విద్య రాగల భవిష్యత్ తరాలకు కూడా అందుతూ ఉండేది. సరైన విద్య అందించకుండా ఒక తరాన్ని తయారు చేస్తే, దాని ప్రభావం రాబోయే ఎన్నో తరాల మీద పడుతుంది. ఆలోచించి చూడండి వైద్యం కన్నా విద్య ఎంత ముఖ్యమైందో. వైద్య చాలా అవసరమే. దేశ పౌరులు ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తరాలు ఆరోగ్యంగా పుడతారు. నిజమే! కాని అధిక సంఖ్యలో అజ్ఞానులు పుట్టినందు వల్ల దేశానికి ఏం లాభం? సమాజ గతిని మార్చే జ్ఞానులుకొంత మందైనా తయారు కావాలి కదా? అందుకే ప్రభుత్వాలు హేతుబద్ధమైన విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలి. మనకు నిత్య జీవితంలో అందుబాటులోకి వస్తున్న అనేకానేక వైజ్ఞానిక పరికరాలు ఏ కొద్ది మంది శాస్త్రజ్ఞులో కనుకున్నవి. మరి కొద్ది మంది సాంకేతిక నిపుణులు తయారు చేస్తున్న వీను! అత్యధిక ప్రపంచ జనాభా వాటిని సుఖంగా, సులభంగా వాడుకుంటోంది కదా?

సమాజ గతిని మార్చగల శక్తిసామర్థాలు ఎప్పుడైనా ఏ కొది మందికో ఉంటాయి. ఆ కొద్ది మంది తయారు కావడానికి ప్రభుత్వాలు అన్ని అవకాశాలు కల్పించాలి. అంతేగాని, మెదళ్లు కత్తిరించి, రెక్కలు కత్తిరించి, మాటను కత్తిరించి, ఆలోచనను కత్తిరించి ప్రభుత్వం వివేకవంతుల్ని తయారు చేయలేదు. పాఠ్య పుస్తకాల్లోంచి అవసరమైన విషయాలు తొలగించడమంటే, నిజాల్ని తొక్కి పెట్టడమే. సమాజాన్ని నిస్సత్తుగా మార్చడమే. యువత జ్ఞాన సంపన్నలై ఎక్కడ ప్రశ్నలు సంధిస్తారోనని ఒక రకంగా ప్రస్తుత ప్రభుత్వం భయపడుతున్నట్టుగా ఉంది.

నిజాల్ని దాచిపెట్టి తమ హిందుత్వ ఎజెండాను తెచ్చి, సృష్టి సిద్ధాంతాన్ని బాలబాలికల మెదళ్లలో కుక్కి, రాజ్యాంగాన్ని పక్కకు తోసి, మనుస్మృతిని వాడుకలోకి తేవాలన్నది ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల ఉద్దేశం. ఆ దిశలో వాళ్లు మొదటి నుండి పని చేస్తున్నారు. సమస్యలు ఎదురైనప్పుడు కాళ్ల బేరానికి రావడం వాళ్లకు అలవాటు. బ్రిటీష్ వారికి క్షమాపణలు చెప్పి స్వాతంత్య్రోద్యమంలో ఆనాటి యువతీ యువకులు పాల్గొనకుండా అడ్డుకున్నది వీరే. నెహ్రూ ప్రభుత్వంలో హోం మంత్రి సర్దార్ పటేల్ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తే క్షమాపణలు చెప్పి బయటపడింది వీరే. తమ కార్యకర్తల్నిన విడిపించుకోవడానికి ఇందిరా గాంధీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పి నాటి ఎమర్జన్సీని బలపరిచింది వీరే. ఇప్పుడు మళ్లీ వారే అప్పటి ఎమర్జన్సీని విమర్శిస్తున్నారు. మొఘలులు ముస్లింలు గనక, ఈ దేశంలోని హిందువులంతా వారిని ద్వేషించాలన్నది అధికారంలో ఉన్న అతి పెద్ద రాజకీయ పార్టీ భావిస్తోంది.   

– డాక్టర్. దేవరాజు మహారాజు

నిశ్శబ్దంగా రాలిపోతున్నారు

మన భారతదేశానికి ఊహించని ప్రమాద ఘంటికలు మున్ముందు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఏ దేశానికైనా ప్రధాన ఆర్థిక వనరు మానవ వనరు. అందులోనూ యువతే దేశానికి ప్రధాన ఆర్థిక వనరు. దేశంలో యువత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంతవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ కారణం చేతనే తన దేశంలో యువత సంఖ్యను గణనీయంగా పెంచేందుకు చైనా అధిక సంతానం దేశంగా అక్కడి ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఇలా ప్రతి దేశం యువత సంఖ్య పెంచేందుకు నానాపాట్లు పడుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా మన దేశంలోని వాతావరణం కనిపిస్తోంది. దేశానికి నేడు యువత సంఖ్య బలంగా ఉంది. ఇది సంతోషించదగ్గ పరిణామమైతే ఈ వనరు ఆ కారణంగా చేజారుతోందన్న ఆందోళనకరమైన పరిస్థితి మరోవైపు కనిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. భారత యువతలో ఆత్మహత్యలు పెరుగుదల. భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతున్న ఈ తరుణంలో, ఆ విజయాల వెను దాగిఉన్న ఒక చీకటి సత్యాన్ని మనం తప్పక గుర్తించాలి. అదే భారత యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల సంఖ్య.

సాంకేతిక ప్రగతి, ఆర్థికాభివృద్ధి గురించి మనం ప్రతిరోజూ మాట్లాడుతున్నా మన యువతరం ఎదుర్కొంటున్న భావోద్వేగ పోరాటాల గురించి మాట్లాడటానికి మాత్రం చాలా అరుదుగా సిద్ధమవుతున్నాం. ఈ నిశ్శబ్దం ఇప్పుడు ప్రాణాలను బలిగొంటోంది. భారత ప్రజా ఆరోగ్య ఫౌండేషన్ (పిహెచ్‌ఎఫ్‌ఐ) తాజా నివేదిక అందించిన గణాంకాలు మనల్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. 15 39 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయుల్లో ఆత్మహత్యలు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారుతోంది. ఇది కేవలం ఒక గణాంకం కాదు. ఇది మన సామాజిక వ్యవస్థలోని లోపాలను, కౌన్సిలింగ్ సేవల్లోని అంతరాలను, మానసిక ఆరోగ్యానికి మనం ఇస్తున్న ప్రాధాన్యత లేమిని ఎత్తిచూపుతోంది. మన యువతరం అనేక వైపులనుండి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలు, కొద్దిపాటి ఉద్యోగాలకోసం తీవ్రమైన పోటీ.

ఇవన్నీ యువతపై అపారమైన మానసిక భారాన్ని మోపుతున్నాయి. వైఫల్యంపై ఉన్న సామాజిక తీర్పు, భయం వారిని మరింత కృంగదీస్తోంది. తమ పిల్లలు డాక్టర్లు లేదా ఇంజినీర్లు కావాలన్న తల్లిదండ్రుల అంచనాలు, వాటిని చేరుకోలేకపోతున్నామన్న భావన యువతలో ఆందోళనను పెంచుతోంది. సోషల్ మీడియాలో ఇతరుల ‘పరిపూర్ణమైన’ జీవితాలు, విజయాలు చూసి, తమ జీవితాలు అంత గొప్పగా లేవని భావించడం, నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వంటివి యువతలో తీవ్ర నిరాశ, ఒంటరితనాన్ని పెంచిపోషిస్తున్నాయి. దురదృష్టవశాత్తు సమాజంలో మానసిక సమస్యలు అంటే ‘బలహీనత’ అనే అపోహ ఉంది. ‘మనసు బాగోలేదని’ చెబితే సమాజం చిన్నచూపు చూస్తుందనే భయంతో చాలామంది యువకులు సహాయం అడగడానికి సంకోచిస్తున్నారు. ఈ ఆలస్యమే ప్రాణాలను తీస్తోంది. కేవలం అవగాహన ప్రచారాలు సరిపోవు.

మనకు ఇప్పుడు అత్యవసరం వ్యవస్థాత్మక మార్పులు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అకడమిక్ విజయాలకే కాకుండా, భావోద్వేగ ఎదుగుదలకు, ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పడానికి ప్రత్యేకమైన తరగతులు, సెమినార్లు నిర్వహించాలి. ప్రతి విద్యా సంస్థలో అనుభవజ్ఞులైన, సులభంగా అందుబాటులో ఉండే కౌన్సిలర్‌లు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి వుంది. ఉద్యోగ స్థలాల్లో మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెరుగైన పని వాతావరణాన్ని సృష్టించాలి. ఉద్యోగులకు గోప్యతతో కూడిన కౌన్సిలింగ్ సేవలు అందించాలి. ఉద్యోగులు విరామం తీసుకోవడానికి, వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడానికి ప్రోత్సహించాలి. కౌన్సిలింగ్, థెరపీ వంటి సేవలు శారీరక చికిత్సల మాదిరిగానే సాధారణంగా, ఆర్థికంగా అందుబాటులో ఉండాలి. గ్రామీణ ప్రాంతాలకు కూడా మానసిక ఆరోగ్య నిపుణుల సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వారి భారాన్ని పంచుకోవాలి, వారికి అవసరమైన మద్దతును అందించాలి. మానసిక ఆరోగ్యం ఐచ్ఛికం కాదు, అత్యవసరం. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మనం అందరం ఒక్కటిగా నిలవాలి.

– సయ్యద్ నిసార్ అహ్మద్

– 7801019343

గ్రంథాలు జ్ఞాన సుగంధాలు

ఒక్క అడుగు ఎన్నో అడుగులకు ప్రేరణ ఇచ్చి గమ్యానికి చేరుస్తుంది. ఒక్క అక్షరం జ్ఞాన సౌధానికి పునాది వేసి, ప్రపంచాన్ని మారుస్తుంది. మేధస్సుకు పదును పెట్టి, మనసును స్పృశింప చేస్తే అక్షరం ఆయుధమవుతుంది. అక్షరంతో మొదలైన ప్రయత్నం పుస్తకంగా పరివర్తన చెందుతుంది. గొంతు నుండి ధ్వనించే ప్రతీ పదం మదిని స్పృశించి, మస్థకాన్ని కదిలించే, అక్షరాల అమ్ముల పొదినుండి జారిపడిన పదునైన శరం పుస్తకం. అక్షరం భగభగ మండే అగ్నిగోళం. నిన్న మరచిన నేటికి విలువ లేదు. నేడు లేనిదే రేపన్నది అబద్ధం. కోయిల కమ్మని పాటను మరచి బిత్తర చూపులు చూస్తుంటే, పక్షులు కిలకిల రావాలను మరచి మౌనముద్రలో దాగుంటే, గలగల పారే సెలయేరు ప్రహహించనని భీష్మించుకు కూర్చుంటే తారలు తేజస్సును విడిచి, ఆకసంలో మబ్బుల చాటున దాగుంటే, అక్షరం నిదురబోతే చైతన్యం సమాధికే అంకితమవుతుంది. అక్షరం గర్జించాలి. పుస్తకంగా మారాలి. అవనిపై అన్యాయాన్ని ప్రశ్నించాలి. విద్య అజ్ఞానంపై సంధించిన వజ్రాయుధమైతే, అజ్ఞాన గాఢాంధకారాన్ని తొలగించే అక్షర హారం పుస్తకం. అక్షరజ్ఞానం, పుస్తక జ్ఞానం లేని మానవ జన్మ నిరర్థకం. దైవం కొలువున్న ప్రదేశం దేవాలయమైతే, జ్ఞాన జ్యోతిని వెలిగించే గ్రంథాలకు ఇలలో నెలవైన నిజమైన దేవాలయం.

దేశ స్వాతంత్య్రోద్యమంలోను, సాంఘిక దురాచారాల నుండి మేల్కొలపడం లోను, తెలంగాణలో ఒకప్పటి నిజాం నిరంకుశ పాలన వలన నెలకొన్న అస్థవ్యస్థ పరిస్థితులనుండి కాపాడి, ప్రజలను జాగృత పరచడంలోను గ్రంథాలయోద్యమం పాత్ర అనిర్వచనీయం. ఎంతో మంది అభ్యుదయవాదులు, సంఘసంస్కర్తలు గ్రంథాలయోద్యమంలో పాల్గొని గ్రంథాలయాల స్థాపనకు విశేష కృషి చేసారు. అయ్యంకి వెంకట రమణయ్య తెలుగు వారికి సుపరిచితం. గ్రంథాలయాల ద్వారా ప్రజల్లో సామాజిక స్పృహ కలిగించాలనే ఉద్దేశంతో అవిశ్రాంత కృషి చేసి, గ్రంథాలయోద్యమ పితామహుడిగా పేరొంది, ఆచంద్రతారార్కమైన ఖ్యాతి నార్జించిన ‘అయ్యంకి’ జనహృదయాల్లో పెల్లుబికిన చైతన్య స్రవంతి. ఆంధ్రప్రదేశ్‌లో 1886వ సంవత్సరంలో విశాఖ పట్టణంలో స్థాపించిన పౌర గ్రంథాలయం తొలి గ్రంథాలయంగా పిలవబడుతున్నది. అయితే అంతకు ముందు కూడా అనేక గ్రంథాలయాలు స్థాపించబడినట్టు గ్రంథాలయ చరిత్ర విశదీకరిస్తున్నది. గ్రంథాలయం అయ్యంకి మానస పుత్రిక. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ 1914 లో ఏర్పడింది. వేటపాలెంలో ఏర్పడిన సారస్వత నికేతనం గ్రంథాలయం ప్రాచీన గ్రంథాలయాల్లో ఒకటి.

కేరళలోని ‘త్రివేండ్రం పబ్లిక్ లైబ్రరీ’ ని ఇండియాలో మొదటి లైబ్రరీగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో 1872లో సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రంథాలయం ప్రాచీన గ్రంథాలయంగా పేరుగాంచింది. కొమర్రాజు లక్ష్మణరావు కూడా గ్రంథాలయ ఉద్యమానికి విశేషమైన కృషి చేసాడు. తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి, తెలంగాణ గొంతు ‘కాళోజీ’ గ్రంథాలయోద్యమంలో ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించాడు. అనేక ఉద్యమాల ప్రభావంతో అప్పటి నల్గొండలో ఆంధ్ర సరస్వతీ గ్రంథ నిలయం, వరంగల్‌లో ఆంధ్ర భాషా నిలయం ఏర్పడ్డాయి. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం ఆలస్యంగా ప్రారంభమైనా తర్వాత క్రమంలో అత్యంత క్రియాశీలకంగా మారింది. హైదరాబాద్‌లోని కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఒక పురాతన గ్రంథాలయం. గ్రంథాలలోనే నిజమైన విజ్ఞానం నిగూఢమై ఉన్నది. మన ఆలోచనా సామర్థ్యం పెరగడానికి పుస్తకపఠనమే నిజమైన మిత్రుడు. వర్తమానంలో జరుగుతున్న ప్రాపంచిక సంఘటనలు, గతంలో జరిగిన వాస్తవ సంఘటనలను గ్రంథస్థం చేసి, రాబోయే తరాలకు అందించడమే చరిత్ర.

చరిత్ర అనేది బ్రహ్మపదార్ధమేమీ కాదు. చరిత్ర అంటే వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా విశదీకరిస్తూ అక్షర రూపమిస్తూ గ్రంథస్థం చేయడమే. గతంలో చాలామంది కవులు తమ మస్థిష్కంలో మెదిలే ఆలోచనలకు, కల్పనలకు అలంకారాలను జోడిస్తూ హృదయానికి హత్తుకునేటట్టు వివిధ రూపాల్లో తమకున్న ప్రతిభావ్యుత్పత్తులతో జన రంజకమైన రచనలు చేసేవారు. తమ మేధస్సుకు పదును పెట్టి ఆణిముత్యాల వంటి కథాకథనంతో పద్య, గద్య, శిల్ప, చిత్ర, కావ్యరూపాల్లో నాటి సృజనాత్మక శిల్పకారులు, చిత్రకారులు, కవులు విజ్ఙానాన్ని నిక్షిప్తం చేసేవారు. నాటి రచనలు, పద్య, గద్య రచనలు, కావ్యాలు ఎన్ని తరాలకైనా తరగని ఆస్తి. అందుకే మన ప్రాచీనకాలానికి చెందిన గ్రంథాలు ఈనాటీకీ పండిత పామరుల చేత కొనియాడబడుతూ, విశేష జనాదరణ పొందుతున్నాయి. బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. కాలాను గుణంగా మార్పులు రావడం సహజం. మారిన పరిస్థితులకనుగుణంగా సమాజం కూడా అదే నిష్పత్తిలో పరివర్తన చెందుతున్నది. కాలానుగుణంగా వస్తున్న మార్పుల ఫలితంగా పుస్తకాల స్థానాన్ని కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు ఆక్రమిస్తున్నాయి. చదువుకోకుండా ఆటపాటలతో అల్లరి చేసే విద్యార్థులను ఉద్దేశించి మన పెద్దలు ‘పుస్తకం హస్తభూషణం’ కారాదు అనేవారు.

ఇది గతకాలపు మాట. చరవాణి నేటి తరానికి హస్తభూషణమై వర్ధిల్లుతున్నది. అసలు పుస్తకమే కనుమరుగైపోయే రోజులు దాపురించాయి. సాంకేతిక విజ్ఞానం కొత్తపుంతలు తొక్కిన నేపథ్యంలో గ్రంథపఠనం ప్రాధాన్యత కోల్పోయింది. ప్రతీ ఒక్కరూ పుస్తకాలను చదవాలని, విజ్ఞాన సముపార్జన ద్వారానే మానసిక వికాసం కలుగుతుందని, సమాజ పురోభివృద్ధి పుస్తకపఠనం ద్వారానే సాధ్యమవుతుందని ఎంతో మంది విజ్ఞులు ఒక అవగాహనకు వచ్చి, అందరికీ పుస్తకాలు అందుబాటులో ఉండాలని, అందుకోసం స్వాతం త్య్ర పోరాటం తరహాలో ఉద్యమించారు. వారి పోరాట ఫలితమే గ్రంథాలయాల ఆవిర్భావం. గ్రంథాలయాల ఆవిర్భావం కోసం గ్రంథాలయోద్యమం జరిగింది. నాటి గ్రంథాలయోద్యమం తీవ్రస్థాయిలో జరిగింది. అయ్యంకి వెంకట రమణయ్యను భారతీయ గ్రంథాలయోద్యమ రూపశిల్పిగా చరిత్ర పేర్కొంటున్నది. ఇండియన్ లైబ్రరీ అసోషియేషన్ ఆవిర్భవించడానికి, జాతీయస్థాయి సమావేశాలకు అది వేదిక కావడానికి ఆద్యుడు అయ్యంకి వెంకట రమణయ్య, కొమర్రాజు లక్ష్మణరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, వెలగా వెంకటప్పయ్య, పాతూరి నాగభూషణం, బెల్లంకొండ నాగేశ్వరరావు వంటి మహనీయులెందరో గ్రంథాలయోద్యమానికి నాయకత్వం వహించారు.

దేశం నలుమూలలా అనేక గ్రంథాలయాలను స్థాపించి సామాన్యులందరికీ విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశమే గ్రంథాలయ వారోత్సవాలకు నాంది పలికింది. అయితే విజ్ఞాన భాండాగారాలుగా విలసిల్లిన గ్రంథాలయాల్లో పాఠకుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతున్నది. మరో గ్రంథాలయోద్యమం ప్రారంభం కావలసిన అవసరం ఏర్పడింది. చరవాణి పుస్తక స్థానాన్ని ఆక్రమించింది. మన ఆలోచనలకు పదునుపెట్టి, మానసిక వికాసం కలిగించిన గ్రంథాలయాలు వెలవెలబోతున్నాయి. మన మేధస్సును హరించి, మన ఆలోచనలకు తావులేని మరబొమ్మలుగా తయారు చేస్తున్న సాంకేతిక పరికరాలకు కొంతవరకు విశ్రాంతినిచ్చి, పుస్తక పఠనానికి గవాక్షాలు తెరవాలి. గ్రంథాలయాలు మన పురాతనమైన వెలకట్టలేని ఆస్తిపాస్తులు. వాటిని కాపాడుకోవాలి. పుస్తక పఠనంపై నేటి విద్యార్థికి ఆసక్తిని కలిగించాలి.మనోవికాసానికి గ్రంథాలయాలే ఆలవాలం. పుస్తక పఠనమే మన ఆలోచనా నేత్రాల సక్రమ వీక్షణకు సవ్యమైన మార్గం. అజ్ఞానానికి నిజమైన ఔషధం విలువైన పుస్తకం. గ్రంథాలయ వారోత్సవాల స్ఫూర్తి గ్రంథాలయాల ఆవశ్యకతకు దోహదం చేయాలి. ప్రతీ గ్రామంలో ప్రతీ పాఠశాలలో గ్రంథాలయాలుండాలి. ప్రభుత్వాలు గ్రంథాలయాలకు విలువైన పుస్తకాలను, అన్ని దిన, వార, పక్ష, మాస పత్రికలను అందుబాటులో ఉంచాలి. పుస్తకమే సమస్త విజ్ఞాన సంపదగా పాఠకులు భావించాలి.

బయటకు వచ్చే వారి ప్రణాళిక?

అడవులలోని నక్సలైట్లు విడతలు విడతలుగా మైదాన ప్రాంతంలోకి రావటం మొదలైంది. ఆ విధంగా ఇప్పటికే వచ్చిన వివిధ స్థాయిల నాయకులు, దళ సభ్యులు కొన్ని వందల మంది ఉన్నారు. అడవులలో ఇంకా మిగిలిన వారి సంఖ్య ఎంతైనదీ నిర్దిష్టంగా తెలియదు. ఇదంతా మధ్య భారత ప్రాంతపు విషయం. ఇది కాకుండా తూర్పు రాష్ట్రాలకు వెళ్లే కొద్దీ పరిస్థితులు ఏమిటన్న వార్తలు లేవు. దేశం లో నక్సలైట్లను లేదా నక్సలిజాన్ని 2026 మార్చి చివరి నాటికి పూర్తిగా తుడిచి పెట్టగలమన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా గడువుకు ఇంకా సరిగా అయిదు నెలల గడువుంది. ఆ ప్రకారం ఆయన ప్రకటన నెరవేరుతుందా లేదా అనేది అట్లుంచి, ఈలోగా నక్సలైట్లు ఏమి చేయవచ్చునన్నది ఒక ప్రశ్న అవుతున్నది. ఇదే పద్ధతిలో మరింతమంది బయటకు రాచ్చునా? అందరూ రాగలరా? కొందరు వచ్చి కొందరు మిగులుతారా? అనే విషయాల గురించి వేచి చూడవలసిందే గాని, ముందుగా ఎవరూ చెప్పలేరు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి విప్లవోద్యమాల దశలను గమనించినపుడు ఇది అర్థమవుతుంది. మరొక కీలకమైన ప్రశ్న నక్సలైట్లును అంతం చేసినా ఆ భావజాలం పోతుందా అన్నది.

ఆ విషయం అట్లుంచితే, ఇక్కడ ప్రస్తుతం బయటకు వస్తున్న వారి సంఖ్య మొత్తంగా కలిపి పెద్దదే. వారి భవిష్యత్తు ప్రణాళిక ఏమి కావచ్చును? బయటకు రావటం లోగడ కూడా జరిగింది. కాని ఒకటీ అరగా. అందువల్ల వారేమి చేయవచ్చుననే ప్రశ్న రాలేదు. తమ వ్యక్తిగత స్థాయిలోనో, కుటుంబపరంగానో తప్ప. ఎవరి పద్ధతిలో వారు స్థిరపడిపోయారు. బయట చట్టబద్ధంగా పని చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలలో చేరిన వారు ఉన్నారు. కొందరు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వంటి పార్టీలలో చేరారు. బిజెపి గురించి తెలియదు. ఈసారి సంఖ్య వందలలో ఉండటం, కొందరు ముఖ్యులు కూడా కావటం వల్ల ఈ ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. మీరు కూడా ఇంతకు ముందటి వారి వలెనే వ్యవహరించవచ్చునా? లేక అందుకు భిన్నంగా ఏమైనా చేయవచ్చునా? పౌరహక్కుల సంఘం బాధ్యడొకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాళ్లు బయటకు వస్తున్నారు గాని ఏం చేసేదీ చెప్పటం లేదన్నారు. ఆ మాటను ఆయన వారిని సవాలు చేయటం, వారి ‘నిజ స్వరూప’మని తాను భావించే దానిని ‘బహిరంగ’ పరచటం అనే ధోరణిలో అన్నట్లు అర్థమవుతున్నది. తమ దృక్కోణం నుంచి అది సరైన ధోరణే కావచ్చు. కాని యథాతథంగా చూసినపుడు, వారు అప్పుడప్పుడే బయటకు వస్తున్నారు. తక్షణం చేయదలచిందేమిటో నిర్ణయించుకుని ఉంటారు. భవిష్యత్ కార్యక్రమం అనేది సీరియస్‌గా జరగవలసిన చర్చ. అడవులలో ఎక్కడైక్కడనో ఉండినవారు ఒక చోటికి చేరి, ఈ ప్రశ్నపై రోజుల తరబడి చర్చించే అవకాశం వారికి ఉంటుందనుకోవటం అవాస్తవికం. ఇదే మాటను సూక్ష్మమైన రూపంలో ఆ నాయకులూ చెప్పారు. ఇప్పుడే గదా బయటకు వస్తున్నాము, ఏమి చేయాలో అందరం కలిసి మాట్లాడుకుంటాము అన్నారు వారు. ఏమి మాట్లాడి, ఏమి చేయవచ్చునన్నది మనం వేచి చూడవలసిన విషయం.

ఇన్నిన్ని మాటలు చెప్పుకుని కూడా చివరకు, బయటకు వచ్చే వారి ప్రణాళిక ఏమిటని చర్చించటం ఆశ్చర్యంగా తోచవచ్చు. అవును, కొన్ని కారణాలవల్ల ఇది చర్చించదగినదే. ఇందులోని ఉద్దేశం మాత్రం పౌరహక్కుల బాధ్యుని వంటిది కాదు. కేవలం కొన్ని విషయాలను అర్థం చేసుకోవటమే. పైన అనుకున్నట్లు, గతంలో వలెగాక ఈసారి పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు. వారు చెప్తున్నది మౌలికంగా తమ సిద్ధాంతాన్ని మాత్రం మార్చుకోలేదని, ప్రజల కోసం వారి మధ్య ఉండి పని చేస్తూనే ఉంటామని. తమ పోరాట రూపం మాత్రమే మారుతున్నదని, ప్రభుత్వ బలగాలను ఎదుర్కొనగల శక్తి తమ పార్టీకి లోపించిన స్థితి వల్లనే ఉద్యమాన్ని విరమించాలా, ఆయుధాలు వదలాలా అనే చర్చకు కొంతకాలం క్రితమే ఆరంభం జరిగింది తప్ప, యథాతథంగా అంతకు ముందు అటువంటి చర్చ ఏమీ లేదని. ఇతరత్రా కూడా పార్టీలో, ఉద్యమంలో గతం నుంచి ఉండిన లోపాల కారణంగానే పరిస్థితి ఇంత వరకు పరిణమించిందని. మాటలు సరిగా ఇవే కాకపోవచ్చుగాని, భావం మాత్రం ఇదే.

ఇటువంటి పరిస్థితుల మధ్య అంతిమంగా వీరు ఇక ముందు, తమ సిద్ధాంతాల ప్రకారం, మైదాన రాజకీయ, క్షేత్రంలో సామాజిక క్షేత్రంలో ఏమి చేయగలరనుకోవాలి? ఎందుకోసం, ఎటువంటి అవకాశాలు ఉండవచ్ఛు? అటువంటి ప్రశ్నలపై ఇది ఒక స్థూలమైన చర్చ మాత్రమే. బయటకు వచ్చిన విప్లవకారులు తమంతట తాము ఏదైనా చేయదలిస్తే ముందుగా తోచేది స్వయంగా ఒక పార్టీ ఏర్పాటు చేయటం. ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థలోకి ప్రవేశించినందున, తమ సిద్ధాంతాలను మేళవిస్తూ అందుకు అనుగుణమైన పార్టీ మేనిఫెస్టో తయారీ. పార్టీ యంత్రాంగం. తెలంగాణ అంతటా సంస్థ విస్తరణ, ఎన్నికలలో పోటీలు. ఈ మొత్తం అన్నింటిలోనూ, తాము అంటున్న తమ సైద్ధాంతిక విశ్వాసాల ప్రతిఫలన. తమ మేనిఫెస్టో గాని, ఆచరణ గాని ఇపుడున్న అన్ని రకాల పార్టీలకు కొట్టవచ్చినంత భిన్నంగా ఉంటేనే ప్రజల దృష్టిని ఆకర్షించగలదు. సదరు ఆకర్షణ కొనసాగేది ఏ విధంగా అన్నది వేరే ప్రశ్న.

పార్టీ పెట్టడమే నిర్ణయం అయిన పక్షంలో ఇంతకూ తమ పార్టీలో చేరగల వారెవరు? అడవిలోని దళ సభ్యులలో అధికులు అక్కడి ఆదివాసులే అయినందున తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడే అవకాశమే ఎక్కువ. మైదాన ప్రాంతాలలోని పేదలు, దళితులు, గిరిజనులు, బిసిలు, మైనారిటీలు, యువకుల ఆలోచనలు, ఆకాంక్షలు ఒకప్పటివలె వామపక్ష భావజాలానికి సన్నిహితమైన రీతిలో లేవు. వారంతా వివిధ మధ్యేమార్గ పార్టీలు, అవి తమ అధికారం ద్వారా సమకూర్చగలవనుకునే అవకాశాలు, నిజమైన ఉద్యమాలంటూ అవసరం లేని పద్ధతులు, సంక్షేమ పథకాల సౌలభ్యాల మార్గంలోకి మళ్లిపోయారు. అటు నుంచి వెనుదిరగటం ఎంత మాత్రం తేలిక కాని దశ వచ్చి వేసింది. ఆ పరిస్థితుల మధ్య ఈ వర్గాల ప్రజలకు ఇపుడున్న సిపిఐ, సిపిఎం పట్లనే నమ్మకం పోయి వాటిలో చేరటం లేదు. ఇంకా చెప్పాలంటే విప్లవ పార్టీలలో చేరటమూ తగ్గిపోయింది. అటువంటి వాతావరణంలో కొత్తగా వచ్చే వామపక్ష పార్టీలోకి చేరికలు తేలిక కాదు. అంతేకాదు. పైన పేర్కొన్న సామాజిక వర్గాలకు చెందిన వారే నాయకులుగా ఎదిగి వస్తూ తమ సెక్షనల్ అజెండాలను ముందుకు తీసుకుపో జూస్తున్నారు. ఇవి ఏవీ కొత్త పార్టీకి అనుకూలించేవి కావు.

పార్టీల నిర్వహణ విపరీతమైన ఖర్చుతో కూడుకున్నదిగా మారటం మరొక సమస్య. ఆ స్థాయిలో నిధులు సమకూరటం ఒక కొత్త వామపక్షానికి అసాధ్యం. నిధుల సమస్య గురించి ఇప్పటికే గల వామపక్షాలు కూడా మాట్లాడుతుంటాయి. డబ్బు కూడా ఒక ఆధారమనుకుంటే అవేమి వామపక్షాలనే ప్రశ్న రావచ్చు. వివిధ పరిస్థితుల వల్ల అదొక వాస్తవంగా మారిన సంగతి నిజం. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. తప్పించుకోగలమనటం శుష్క ఆదర్శవాదమవుతుంది. మన రాజకీయాలు, ప్రజా స్వామ్యం కూడా పేట్రనైజేషన్ (పోషకులు పోషితులు) స్థితిలోకి మారిపోయాయి. ఉన్న కమ్యూనిస్టులే పెద్ద పార్టీల ఎదుట పోషితులుగా నిలుస్తున్నారు. ఇక ప్రజల మాట చెప్పనక్కర లేదు. చివరగా చెప్పాలంటే, సమాజంలో ఆదర్శవాదం గణనీయంగా తగ్గిపోయి వస్తువాదం, వినిమయవాదం, వ్యక్తివాదం పెరుగుతున్నాయి. వీటి ప్రభావాలు కుటుంబ సంబంధాలపైన సైతం పడుతున్నాయి. ఈ విధమైన పరిణామాలు అన్నీ కూడా వామపక్ష రాజకీయాలకు అనుకూలమైనవి కావు.

మరొక పద్ధతి ఒక పార్టీ అంటూ ప్రారంభించి, ఇతర వామపక్ష పార్టీలతో కలిసి ఆ విధంగా ఉమ్మడి శక్తితో సమాజంలో ఒక వాతావణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించటం. ఇతర వామపక్షాలలో కొందరికి ఇటువంటి ఆలోచనలు ఉన్నట్లున్నాయి. సూత్ర రీత్యా ఇది మంచి ఆలోచనే కావచ్చు. కాని అందులోనూ సమస్యలుంటాయి. ఆ రెండు పార్టీలకు తమలోతమకే కుదరటం లేదు. కారణాలు అనేకం. ఆ రెండింటి మధ్య మూడవ పార్టీకి చోటు అనుమానమే. ఈ మూడవది తమకు పోటీదారు అనుకునే అవకాశమే ఎక్కువ. ఎందుకంటే వారికి అసలు వామపక్ష స్పృహ, లక్షాలు నిలిచిలేనపుడు, ఇతరులను కలుపుకొని కమ్యూనిస్టు అజెండాను ముందుకు తీసుకుపోయే ఉద్దేశం ఎట్లా కలుగుతుంది? ఈ పరిస్థితులను బట్టి మిగిలేది ఎవరితో వీలైతే వారితో పొత్తు కుదురుకోవటం, ఇక కాదంటే, లోగడ కొందరు మాజీ విప్లవ కారులు చేసినట్లు ఎవరికి తోచిన పార్టీలో వారు చేరటం. అంతటితో సమాధానపడటం. బయటకు వస్తున్న వారు అందుకు చెప్తున్న కారణాలలో ఒకటి ఆరోగ్య సమస్యలు. పెద్ద నాయకులంతా వయసు మీరిన వారే. ఈ రెండు అంశాలు ఉన్నపుడు వారు కొత్త పార్టీ స్థాపన, అందుకోసం పని చేయట మనే నిరంతర శారీరక, మేధోశ్రమను తీసుకోగలరా? బయటకు వచ్చినా పోలీసుల నిఘా వెన్నాడుతూనే ఉంటుంది గనుక ఆ చికాకులను తట్టుకోగలరా? వారికి ఇప్పటికీ తమ సిద్ధాంతంపట్ల అదే కట్టుబాటు నిలిచి ఉన్నా తేలిక కాదు. ఈ చర్చ అంతటి ఉద్దేశం ఒక తఫాను అనంతర పరిస్థితిలోని ఒక కోణాన్ని మాత్రం అర్థం చేసుకునే ప్రయత్నమే.

టంకశాల అశోక్  

ధనికులకు దాతృత్వం ఓ ఫ్యాషన్

ముందూ వెనుకా చూడకుండా సంపాదనే లక్ష్యంగా జీవితంలో చాలా భాగం గడిపిన తర్వాత చాలా మంది ధనవంతులకు జీవన విశ్రాంత సమయంలో కొత్త ఆశలు పుట్టుకొస్తాయి. వందల కోట్ల ఆస్తి ఉన్నా ఎక్కడా తన గురించి ప్రస్తావనే రావడం లేదేమీ అనే బెంగ మొదలవుతుంది. ఎలాగైనా తమ పేరు గొప్పగా మారుమోగిపోవాలనే దుగ్ద వారిని నిలువనీయదు. ఎంత ఖర్చు అయినా పర్వా లేదు, తన పేరు నలుగురిలో నానాలి. యూ ఆర్ గ్రేట్ అని పొగడాలి. అందరిలో మంచి పేరు రావాలంటే సామాజిక సేవనే తగిన తోవ. ఆస్తిపరుడనే పేరు ఎలాగూ ఉంది, దానితోపాటు మంచివాడు, దయామయుడు, కరుణా హృదయుడు అనే ప్రచారం కావాలి. పుట్టినరోజు లాంటి పండుగల రోజున పేదలకు అన్న, వస్త్రదానాలు చేయాలి. అనాథాశ్రమాలకు వెళ్లి పిల్లలకు పండ్లు, స్వీట్లు పంచాలి. పత్రికల వారిని సాదరంగా ఆహ్వానించి ఆ వార్తలకు ప్రాధాన్యత తెచ్చుకోవాలి. సాహిత్యం, సంగీతం లాంటి లలిత కళలపై ఇష్టం, అభిమానం ఉన్నాయని చెబితే సాంస్కృతిక సంఘాలు వదిలిపెట్టవు. వారి కార్యక్రమాలకు స్పాన్సర్‌గా ఉంటే వ్యక్తిగత గౌరవంతో పాటు కోరినంత ప్రచారం లభిస్తుంది. అడగక ముందే కళాబంధు, డాక్టరేట్ అనే గౌరవాలు పేరు ముందు జత కడతాయి.

టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో గొప్పలు చెప్పుకోవడానికి కాలు కదిలించి సభలు, సమావేశాలకు వెళ్లే అవసరమే లేదు. ఇంటికే ఓ యూట్యూబర్‌ను రప్పించుకొని గంట వీడియో చేస్తే చాలు, చూసేవారి గుండెల్లో కొంతైనా చోటు లభిస్తుంది. మరో యూట్యూబర్‌తో మరో ముచ్చట. పాలు అమ్మి, పూలు అమ్మి.. కష్టపడి ఇంతవాడినైనానని అలా పెయిడ్ వీడియోలలో ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు. ధనం కన్నా గుణమే గొప్పదని, డబ్బుతో అన్నింటిని కొనలేమని కొత్తగా తెలుసుకున్నట్లు ప్రజలకు ఉపదేశం చేయొచ్చు. ప్రయివేటు ప్రాక్టీస్ ద్వారా కోట్లు గడించిన డాక్టర్లు ఆరోగ్య సూత్రాల పేరిట తమ జీవితంలోని విశేషాలను ఏకరువు పెడతారు. ప్రైవేటు విద్యా వ్యాపారం చేసి తరతరాలకు సరిపడే ఆస్తిని కూడబెట్టినవారు తాము దేశానికి ఎందరో ఇంజనీర్లను అందించామని గర్వంగా చెప్పుకుంటారు. ఫార్మా రంగంలో ఉంటే మందుల తయారీ ద్వారా కోట్లాది మందికి ప్రాణభిక్ష పెట్టామని చెప్తారు. కానీ వ్యర్థ రసాయనాలు నాలాల్లోకి వదిలి సర్వం విషతుల్యం చేస్తున్న విషయం దాచి పెడతారు. కనీస వేతన చట్టాన్ని కాలరాసిన పారిశ్రామికవేత్తలు కార్మికులను కన్నబిడ్డల్లా చేసుకున్నానని మన చెవుల్లో పువ్వులు పెట్టవచ్చు.

ప్రజల రక్తమాంసాలను పీల్చడానికి ప్రైవేటు విద్య, వైద్యం అనేవి పదునైన కోరలున్న వ్యాపార జాగిలాలు. వాటిలో కోట్లు కొల్లగొడుతూ ప్రజలకు గొప్ప మేలు చేస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు చేతి వైద్యం చేసేవారు తప్ప మెడిసిన్ చదివిన వారందరు ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసేవారు. జనాభా పెరిగి సర్కారు దవాఖానాలు సరిపోక ప్రైవేటు హాస్పిటళ్లు మొదలయ్యాయి. అలా సేవ పేరుతో వైద్య వృత్తి నిలువు దోపిడీకి సెంటర్ అయింది. కాలక్రమంగా మెడిసిన్ చదవడమే సొంత ప్రాక్టీస్ కోసం అన్నట్లు మారిపోయింది. వీలయినంత త్వరగా ఓ భారీ భవంతి కట్టేసి కార్పొరేట్ స్థాయికి మారిపోవాలనేదే నేటి డాక్టర్ల కల. వృత్తిలో పైకెదగడం మంచిదే కానీ, ఎదగడమే లక్ష్యంగా జనాన్ని మోసం చేయకూడదు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టకూడదు. వృత్తి నైతికతకు భంగం రానీయవద్దు. వీటిని పాటిస్తే గుట్టలుగా ధనం పేరుకుపోయి అవకాశమే లేదు. చాలా చోట్ల యాభై, వంద రూపాయల ఫీజుతో నలభై, యాభై ఏళ్లుగా ప్రాక్టీస్‌చేస్తున్న డాక్టర్లు ఉన్నారు. వారికి వృత్తి ధర్మం తప్ప ప్రచారం అక్కరలేదు. అదీ నిజమైన జీవన సాఫల్యం. అయితే వీరివైపు ప్రభుత్వాలు కన్నెత్తి చూడవు. నగరాల్లోని ఖరీదైన ప్రాంతాల్లో తమ కార్పొరేట్ వైద్యశాలలు విస్తరిస్తున్న డాక్టర్ల మెడలో పద్మ పతకాలు అలరిస్తుంటాయి. ప్రభుత్వాలు, పత్రికలు, సంస్థలు అన్ని ఈ ఢాంబిక జీవితానికే గుర్తింపునిస్తున్నాయి.

అడ్డంగా సంపాదించాక మీడియా ముందుకొచ్చి తాము పనివాళ్లను సర్వెంట్స్ అని కాకుండా హెల్పర్స్ అని గౌరవంగా పిలుస్తామని అంటారు. పక్కన కూచున్న వారి పిల్లలు తమకు డాడీ పేదలను ప్రేమించడం నేర్పారని సుద్దులు చెబుతారు. డ్రైవర్ కూతురు పెళ్ళికి వెళ్ళినామనే మాటను ఎన్నో మెట్లు దిగామన్నట్లు ఘనంగా చెబుతారు. పనివాళ్ల పిల్లల చదువుల బాధ్యత తమదే అంటారు. ఇవన్నీ చెబుతారు కాని తులతూగే ధనరాశులు ఎలా కూడబెట్టారో చెప్పరు. పన్ను ఎగ్గొట్టడానికి ఎన్ని దొంగ దారులు వెదికారో బయటపెట్టరు. ఉద్యోగుల జీతభత్యాల పెంపు విషయంలో వీరెంత కఠినంగా ఉంటారో ఆ పని వాళ్లకే తెలుసు. నెలకు లక్ష తీసుకుంటున్నట్లు సంతకం పెట్టి అందులో సగమైనా చేతికందని శ్రమజీవులు వీరి హాస్పిటల్, కాలేజీల్లో ఎందరో ఉంటారు. ఒక పత్రికాధిపతి, ఒక మహానటుడు తమ పనివారలకు అయిదు రూపాయలు పెంచడానికి కూడా గింజుకొనేవారట. వారి కీర్తిప్రతిష్ఠల ధగధగల ముందు ఇవి కానరావు. నిజాయితీగా సంపాదించి, అందులోంచి ఎంత మేరకు దానం చేస్తున్నావన్నది మాత్రమే దాతృత్వానికి కొలబద్దగా నిలుస్తుంది. చార్మినార్ దగ్గర ఓ చిరు వ్యాపారి రోజూ యాభై మందికి రొట్టెలు పంచిపెడతారట. నల్గొండలో ఓ రిటైర్డ్ టీచర్ తన సొమ్మునంతా ఓ లైబ్రరీ కోసం వెచ్చించారట. ఓ వృద్ధురాలు కోట్లు విలువ చేసే తమ ఇంటిని ప్రభుత్వానికి రాసిచ్చారట. ఇలాంటి త్యాగాలు ఎక్కడో లోపలి పేజీల్లో చిన్న వార్తగా వస్తాయి. వీరిది కేవలం దాతృత్వం కాదు, మహా మానవత్వం. నలుగురికి సాయపడడంలో వీరిది ఫ్యాషన్ కాదు పాషన్, జీవన కాంక్ష.

బద్రి నర్సన్, 94401 28169

ఆరు నూరైనా లద్దాఖ్‌ను ఆరో షెడ్యూల్లో చేర్చాల్సిందే!

లద్దాఖ్ -2019లో జమ్మూకశ్మీర్ నుంచి విడిపోయి, ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం అయిన ప్రదేశం. ఈ మధ్య లద్దాఖ్‌లో హింసాకాండ, నలుగురు యువ నిరసన కారుల మృతి, ఈ ప్రాంతంలో