గ్రూప్-1 విషయంలో అడుగడుగునా తప్పులు : కవిత
హైదరాబాద్: గ్రూప్-1 విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి కార్యక్రమాలు చేపడుతామని ఎంఎల్సి కవిత తెలిపారు. 15న డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందని తెలియజేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గ్రూప్-1 నియామకాల్లో అవకతవకల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 15 వరకు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపేందుకు రౌండ్ టేబుల్ భేటీ ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్-1 విషయంలో అడుగడుగునా తప్పులు జరిగాయని, ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగాలు రద్దు చేసి మళ్లీ పరీక్ష పెడతారని భావిస్తున్నామని, రౌండ్ టేబుల్ భేటీ తీర్మానాన్ని గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిస్తామన్నారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. విద్యార్థులకు జాగృతి భరోసా ఉంటుందని హామీ ఇస్తున్నామన్నారు.