సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం
ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో సూర్యకాంత్ తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం స్వీకారం చేయించారు. 53వ ప్రధాన న్యాయమూర్తి గా 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడుతున్న తొలి హర్యానా వాసిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు హాజరయ్యారు. సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 53వ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.