ankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escort

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Restbet

Restbet giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Restbet

Restbet giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom

bahislion

Marsbahis

1xbet

vbet

olabahis

betmoon

betmoon

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

sekabet

sekabet

vdcasino giriş

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

matbet

bets10

pusulabet

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

meritking

1xbet

padişahbet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

milanobet

gallerbahis

galabet

betkolik

betticket

suratbet

süratbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

betasus

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

betlike

vdcasino

ultrabet

tlcasino

galabet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

casinoas

berlinbet

dinamobet

artemisbet

casinolevant

enbet

madridbet

vdcasino

sonbahis

casibom

betturkey

సిఎం ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం : దానం

హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి రాజీ నామా ప్రస్తావన ఇంకా రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. తనకు ఎన్నికలు కొత్త కాదు అని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్, నారాయణగూడలో రూ.1.40 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ, రోడ్ల పనలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అనర్హత వేటు అంశంపై దానం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం అని తెలియజేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని,11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర ఉందని దానం పేర్కొన్నారు. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, రేవంత్ రెడ్డి మరో పదేళ్లు సిఎం కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని దానం నాగేందర్ స్పష్టం చేశారు.  

రేవంత్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం : దానం

హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి రాజీ నామా ప్రస్తావన ఇంకా రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. తనకు ఎన్నికలు కొత్త కాదు అని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్, నారాయణగూడలో రూ.1.40 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ, రోడ్ల పనలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అనర్హత వేటు అంశంపై దానం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం అని తెలియజేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని,11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర ఉందని దానం పేర్కొన్నారు. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, రేవంత్ రెడ్డి మరో పదేళ్లు సిఎం కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని దానం నాగేందర్ స్పష్టం చేశారు.  

వెండితెరకు పైరసీ చీడ

పైరసీ పెనుభూతంగా మారి భారతీయ సినీ పరిశ్రమను కబళిస్తోంది. వందల కోట్లు పెట్టుబడి పెట్టి, వందలాది మంది టెక్నీషియన్లతో కొన్ని నెలలపాటు తీసే సినిమా, థియేటర్లలో విడుదలైన రెండు మూడు గంటల్లోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతోంది. హాలీవుడ్ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తదితర పేర్లతో పిలుచుకునే భారతీయ సినీ పరిశ్రమే ప్రపంచంలో అతి పెద్దది. ఇక్కడ రూపొందిస్తున్న సినిమాలు అమెరికా, జర్మనీ, చైనా, జపాన్ వంటి దేశాల్లో అమోఘమైన ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే, పైరసీ మహమ్మారి కారణంగా భారతీయ చిత్ర పరిశ్రమకు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఎర్నెస్ట్-యంగ్ సంస్థలు ఆ మధ్య సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో భారతీయ సినీ పరిశ్రమకు పైరసీ కారణంగా 2023వ సంవత్సరంలో ఒనగూడిన నష్టం అక్షరాలా 22,400 కోట్ల రూపాయలని తేలింది. ఇటీవల ఓ భారీ తెలుగు చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే ఆర్‌టిసి బస్సులో ప్రసారమైన సంఘటన పైరసీ పెనుభూతం గ్రామీణ స్థాయికి సైతం ఎంతలా పాకిందో తెలియజెప్పడానికి ఉదాహరణ.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత కొన్ని నెలల్లో అనేకమంది పైరసీదారుల ఆటకట్టించారు.అందులో చెప్పుకోదగినది తాజాగా ఐ బొమ్మ పేరిట సాగుతున్న పైరసీదారుణ్ని కటకటాల వెనక్కి నెట్టడం. కరేబియన్ దీవుల్లో తిష్టవేసుకు కూర్చుని, వచ్చిన సినిమాను వచ్చినట్లుగా పైరసీ చేసి, ఆన్‌లైన్‌లో పెడుతున్న ఐ బొమ్మ నిర్వాహకుడు విద్యాధికుడు. ఇంజినీరింగ్, ఎంబిఎ పట్టాలు తీసుకుని, రెండు కంపెనీలకు సిఇఒగా పనిచేసిన ఈ ప్రబుద్ధుడు ఈజీ మనీకి ఆశపడి, సినిమాల పైరసీకి శ్రీకారం చుట్టడం ఆశ్చర్యం గొలిపే విషయం. వందకు పైగా డొమైన్లతో, ప్రాక్సీ సర్వర్ల ద్వారా వేలాది సినిమాలను ఇతను పైరసీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఔపోసన పట్టిన ఇలాంటివారు తమ తెలివితేటలను అక్రమార్జనకు వినియోగిస్తున్నారు. నిర్మాతలు లేదా పంపిణీదారులనుంచి థియేటర్లకు చేరే సినిమా ‘కీ’ని బగ్ హంటింగ్, బర్ఫ్ స్యూట్ వంటి టెక్నాలజీల సాయంతో కాజేస్తున్నట్లు ఆ మధ్య బీహార్ కు చెందిన ఓ పైరసీదారు వెల్లడించడం ఐటి నిపుణులను సైతం ఆశ్చర్యానికి లోను చేసింది.

పైరసీదారులకు మూడేళ్ల కారాగారం, సినిమా నిర్మాణ వ్యయంలో ఐదు శాతం జరిమానా విధించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించినా పైరసీదారులకు ముకుతాడు పడకపోవడానికి కారణం.. విదేశాలనుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారతీయ చట్టాలకు దొరకకుండా తప్పించుకుంటూ ఉండటమే. ‘మమ్మల్ని మీరేం చేయలేరు’ అంటూ ఐ బొమ్మ నిర్వాహకుడు అంత ధైర్యంగా మన పోలీసులకు సవాల్ విసరడం వెనుక విదేశాలలో ఉన్న తనను ఏమీ చేయలేరనే ధైర్యమే కారణం. అతను హైదరాబాద్‌కు రాకపోయి ఉంటే, మన పోలీసులు పట్టుకోగలిగేవారేనా అనేది ప్రశ్నార్థకం. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రపంచ దేశాల మధ్య సయోధ్య కొరవడటం వల్లే ఇలాంటి పైరసీదారులు పేట్రేగిపోతున్నారు. తమ వెబ్‌సైట్లకు గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చే ప్రకటనలే వీరికి కాసులు కురిపిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లలో సినిమాలు చూస్తున్న అమాయక జనం, ఇలాంటి యాప్‌ల ప్రభావానికి లోనవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలడం మరింత ఆందోళన కలిగించే అంశం.

ఒకరిద్దరి అరెస్టులతో పైరసీ పెనుభూతం మటుమాయమవుతుందని భావించడం హాస్యాస్పదం. పైరసీ సినిమాలకు ప్రేక్షకాదరణ ఎందుకుంటోందని సినీ పరిశ్రమ పెద్దలు ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయమిది. ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో నెలకు 35 లక్షలమంది పైరసీ సినిమాలు చూస్తున్నారంటే అందుకు కారణమేమిటి? పేదవాడికి అందుబాటులో ఉండే వినోద సాధనం సినిమా. ప్రస్తుత పరిస్థితుల్లో అది అందని ద్రాక్షగా మారుతోంది. రిలీజైన రోజే సినిమా చూడాలంటే నలుగురు సభ్యులుగల కుటుంబం పదిహేను వందలనుంచి రెండువేల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక థియేటర్‌లో తినుబండారాల ధరల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పైరసీని అరికట్టడం గురించి తలలుబద్దలు కొట్టుకుంటున్న సినీపెద్దలు చిత్ర నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడంతోపాటు, టికెట్ రేట్లు సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉంచితే సెల్ ఫోన్‌లో పైరసీ సినిమా చూసే బదులు సగటు మనిషి వెండితెరపై సలక్షణంగా సిసలైన సినిమానే చూస్తాడనడంలో సందేహం అక్కర్లేదు. 

ప్రతిపక్షాలకు ‘బీహార్’ పాఠాలు

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ఓ రాష్ట్రానికి సంబంధించిన ఫలితం మాత్రమే కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి ఇది రాజకీయపరంగా మొదటి పెద్ద షాక్. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, ఇతర రాష్ట్రాలలో జరగనున్న కీలకమైన ఎన్నికలకు ముందు ఎన్‌డిఎ కూటమి మనోధైర్యాన్ని పెంచే తీర్పు. ఎన్నికల ఫలితాలు.. సంఖ్యలే సుస్పష్టం చేశాయి. బిజెపి, జెడి(యు), ఎల్‌జెపి (రామ్ విలాస్) నేతృ-త్వంలో ఎన్‌డిఎ, బీహార్‌లోని 243 సీట్లలో దాదాపు 202 సీట్లు అంటే.. మూడింట రెండు వంతులకు పైగా సీట్లు గెలిచింది. బిజెపి ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. నితీశ్ కుమార్ తన సత్తా చాటి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని స్థానాన్ని నిలుపుకున్నాడు.

కాంగ్రెస్, ఆర్‌జెడి, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్ లేదా ఇండియా కూటమి చిన్నగా కుంచించుకుపోయింది. కనీసం 40 స్థానాలు కూడా దాటలేక చతికిలబడింది. ఈ ఎన్నికల వ్యవస్థను తీవ్రంగా విమర్శించిన వారిలో ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఒకరు. పోలింగ్‌కు చాలా ముందుగానే, బీహార్‌లో ఓటర్లజాబితా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (సర్) దాదాపు 47 లక్షల మందిని, ముఖ్యంగా 16 లక్షల మంది మహిళలను తొలగించిందని, లింగ నిష్పత్తిని దెబ్బతీసిందని, ఓటు హక్కు కోల్పోవడంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తిందని యోగేంద్ర యాదవ్ సుప్రీం కోర్టును హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యానాలు, ఇంటర్వ్యూలలో ఆయన మూడు అంశాలను ప్రస్తావించారు.

1, ఎన్‌డిఎకు గల నిర్మాణాత్మక ప్రయోజనం

ప్రస్తుతం ఎన్‌డిఎ గతంలో కంటే విస్తృతమై సామాజిక పరంగా చక్కటి సంకీర్ణాన్ని కలిగి ఉంది. అగ్రకులాలు, ఒబిసిల నుంచి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎన్‌డిఎ వైపే ఉన్నారు. యాదవులు, ముస్లింలు ఆర్‌జెడికి సాంప్రదాయ పునాదిగా ఉన్నా, వామపక్షాలు వెంట ఉన్నా, ప్రతిపక్ష కూటమి తన పరిధిని విస్తరించుకోలేపోయింది.

2. రాజకీయ సాంకేతికతతో ఓటర్ల జాబితా సవరణ

యాదవ్, ఇతర కార్యకర్తలు సర్ ను జాబితా ప్రక్షాళనగా కాకుండా, ముస్లింలు, మహిళలను ప్రభావితం చేసేందుకు చేపట్టిన ప్రక్రియగా చూశారు. ప్రతిపక్షం వైపు మొగ్గుచూపే అంశాలను పట్టించుకోలేదు.

3. సంస్థాగతమైన అసమానతలు

ఎన్‌డిఎకు చెందిన బూత్ స్థాయి యంత్రాంగం, ఐటి మద్దతులో సాగిన ప్రచారం, సందేశాలు పంపడంలో అనుసరించిన క్రమశిక్షణ ఇండియా కూటమి ప్రయత్నాలు కచ్చితంగా గండికొట్టాయి. ఈ ఎన్నికలలో ఓ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఛత్ పండుగ సమయం కావడంతో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఓటు వేయడానికి తిరిగి వచ్చారు. అనేక నియోజకవర్గాలలో రికార్డుస్థాయి ఓటింగ్ నమోదు కావడానికి వారు తిరిగి రావడమే కారణమని వ్యాఖ్యాతలు గమనించారు. ఏళ్లుగా వలసలు బీహార్ దుస్థితికి అద్దంగా నిలిచాయి. 2025 లో వలసదారుల ఆలోచన మారింది. వారు కుటుంబాలను కలవడానికే కాక, రాజకీయ సృ్పహతో ఓట్లు వేసేందుకు తిరిగి వస్తున్నారు. ఇంతకీ వారు ఎవరికి ఓటు వేసి ఉంటారన్నడే మిలియన్ డాలర్ల ప్రశ్న.

బిజెపి పాలిత అసోం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ కొద్ది ఏళ్లుగా ఒకే మాట అంటున్నారు. రాహుల్ గాంధీ ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే, బిజెపి ఓట్లు అంత ఎక్కువ పెరుగుతాయి అని. అసోంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే మాట చెప్పారు. రాహుల్ గాంధీ ఎన్నికలకు సంబంధించినంత వరకూ గుదిబండగా మారారని అంటున్నారు. బీహార్ ఫలితం చూస్తే ఇది పాక్షిక సత్యం కూడా. ఈ మధ్య అనేక రాష్ట్రాల ఎన్నికలలో హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, ఇప్పుడు బీహార్‌లలో రాహుల్ భారీగా ప్రచారం చేసిన నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు లేదా ఇండియా బ్లాక్‌కు తగిన ఫలితాలు లభించలేదన్నది నిజం.

అయితే బీహార్‌లో ఎన్‌డిఎ భారీ విజయానికి రాహుల్ గాంధీకి ఆపాదించడం సులభం. కానీ, ఆ విజయానికి కారణం, శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలపై నితీశ్ కుమార్ ఆలోచన, స్థానికంగా ఆయనపై ఉన్న నమ్మకం, సంక్షేమ పథకాల ద్వారా మహిళల్లో మోడీకి ఉన్న ఆకర్షణ, అటు కులాల సెంటిమెంట్‌ను, ఇటు సంక్షేమ పథకాలను సమతూకం చేస్తూ ఎన్నికల వ్యూహంపై ఎన్‌డిఎ ఆధారపడి ఉంది.

బలమైన నాయకత్వం లోపం

తటస్థ ఓటర్లకు ఉన్న ఏకైక ప్రశ్న. రాహులా, మోడీయా అని కాదు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రతి రాష్ట్రంలోనూ స్థిరమైన, బలమైన నాయకత్వాన్ని అందించగలవా అన్నదే. బీహార్‌లో నితీశ్ కుమార్‌కు ప్రత్యామ్నాయంగా బలమైన నాయకత్వం అందించలేమని వారే నిరూపించుకున్నారు. విశ్లేషాత్మకంగా చూస్తే బిజెపి విజయాలకు రాహుల్ అసమర్థత కారణం కాదు. ప్రతిపక్షాల అస్తవ్యస్త పరిస్థితి. అధికార పార్టీ క్రమశిక్షణ అసలు కారణం. ముందుకు సాగాలంటే.. ప్రతిపక్షాలు వ్యూహాలను సమీక్షించుకోవాలి. బీహార్ ఓటమి ప్రతిపక్షాలకు ఓ గుణపాఠం. బిజెపి వ్యతిరేక భావన, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తాయని, ఎన్‌డిఎను చిత్తుగా ఓడిస్తాయన్న భ్రమలు మానుకోవాలి. వారి ఆలోచన మారాలి. వ్యూహాలను తిరిగి సమీక్షించుకోవాలి. పలు రాష్ట్రాల ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉంది. ప్రత్యేక వ్యూహ రచనకు పూనుకోవాలి. అన్ని రాష్ట్రాలలోనూ ఒకే మూస ధోరణి పనిచేయదు.

ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని తిరిగి కల్పించాలి

ప్రతిపక్షాలు ఎన్నికల సమగ్రతను చట్టపరమైన సాంకేతిక సమస్యగా కాక, ప్రధాన రాజకీయ సమస్యగా పరిగణించాలి. ఓడిపోయినప్పుడు అభ్యంతరాలను వ్యక్తం చేయడం కాకుండా, ఓటర్ల జాబితాలో తొలగింపులు, తప్పిపోయిన ఓటర్లు బూత్‌స్థాయి అవకతవకలను క్రమబద్ధంగా నమోదు చేయడంతోపాటు, ఓటర్ల జాబీతాలో వారి పేర్లను తనిఖీ చేసి పునరుద్ధరించడానికి పౌరులకు సహాయపడే విధంగా గ్రూస్ రూట్ ప్రచారాలు చేపట్టాలి. ఎన్నికల కమిషనర్ల నియామకం, ఇసి జవాబుదారీతనంలో సంస్కరణల కోసం ఓ స్పష్టమైన జాతీయ స్థాయి ప్రచారం సాగించాలి. మేం గెలిచినప్పుడు మాత్రమే ఇవిఎంలను గౌరవిస్తాం అన్న ధోరణికు స్వస్తి చెప్పాలి.

కేడర్ కేంద్రీకృత రాజకీయాలకు మారాలి

బిజెపి విజయానికి కారణం మోడీయో, నితీశ్ కుమారో, బిశ్వశర్మనో కాదు. బూత్ స్థాయి వ్యూహాన్ని అమలు చేయగల లక్షలాది మంది కార్యకర్తలు కూడా. ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో హడావుడి చేయడం కాకుండా ఎన్నికల సీజన్‌కు మించి స్పష్టమైన కేడర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా యువత, మహిళలు, వలసదారులతో బలమైన కేడర్ ఏర్పాటు చేసుకోవాలి. బిజెపికి దీటుగా దూకుడుగా డిజిటల్ సాధనాలను వాడుకోండి. పారదర్శకంగా, సమస్యల పరిష్కారానికి తోవచూపే సందేశాలతో ఆకట్టుకోండి. ఒకప్పుడు అగ్రవర్ణాలకే పరిమితమైన బిజెపి యాదవేతర ఒబిసిలు, దళితులు, మహిళా లబ్ధిదారులతోపాటు మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకుని తన కూటమిని విసృ్తతం చేసుకుంది. ప్రతిపక్ష మండల్ ఫార్ములాకే పరిమితం కాకుండా, సామాజిక న్యాయంపై మొగ్గు చూపాలి. ఉద్యోగాలు, సామాజిక భద్రత, ఆరోగ్యం, విద్య వంటి స్పష్టమైన ఆర్థిక ఎజెండాతో ఆకట్టుకోవాలి. ఎన్‌డిఎ నుంచి ప్రస్తుతం సంక్షేమం, గుర్తింపు మాత్రమే పొందుతున్న అసంఘటిత కార్మికులు, వలసదారులు, యువతను ఈవ్యూహం ఆకర్షిస్తుంది.

నితీశ్ కుమార్ స్థానిక ఇమేజ్, మోడీ జాతీయ స్థాయి బ్రాండ్ బీహార్‌లో ఓ అపూర్వ విజయాన్ని అందించాయి. ప్రతిపక్షాలకు సంబంధించినంతవరకూ బెంగాల్‌లో మమతా బెనర్జీయే కీలకమైన నేతగా కొనసాగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు, ఆమెను బలహీనపరచాలనుకుంటున్నారా లేక విభేదాలు మరచి ఆమెతో కలిసి పనిచేయాలనుకుంటున్నారా అన్నది నిర్ణయించుకోవాలి. అసోంలో తరుణ్ గొగోయ్ తర్వాత ఓ శూన్యత ఏర్పడింది. సాంసృ్కతిక రంగంలో జుబీన్ లాగ ప్రతిపక్షంలో ఏ నాయకుడికీ అంతటి గౌరవం లేదు. తరుణ్ గొగోయ్ కొడుకు గౌరవ్ గొగోయ్ అసోంలో, జాతీయ రాజకీయాల్లో శక్తివంతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఎదుగుతున్నా, విద్యార్థి ఉద్యమాలు, పౌరసమాజం, చిన్న పార్టీలను ఏకంచేసి, ప్రాంతీయ నాయకుల రెండో శ్రేణి నిర్మాణం చాలా అవసరం. కేరళలో ఇప్పటికే పినరయి విజయన్, శశిథరూర్ వంటి ప్రాంతీయ నాయకులు ఉన్నారు. ఇండియా కూటమి జాతీయ స్థాయిలో విస్తరించాలంటే మరింత సమన్వయం అవసరం. నైతిక ఆగ్రహం, సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేయడం లేదా చివరిక్షణంలో సీట్ల సద్దుబాటు వల్ల ఎన్‌డిఎను ఓడించలేమన్నది ప్రతిపక్షాలకు బీహార్ నేర్పిన పాఠం. సంస్థాగతంగా బలపడడం, తెలివిగా సంకీర్ణాలు ఏర్పాటు, న్యాయం, అభివృద్ధి అజెండాతో ముందుకు సాగితేనే ప్రతిపక్షాలకు, ఇండియా కూటమికి భవిష్యత్తు. 

– గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్)

– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు

‘మఫ్తీ పోలీస్’ వచ్చేస్తున్నాడు

యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘మఫ్తీ పోలీస్’ చిత్రాన్ని నిర్మాత జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్.ఆర్ట్ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించారు. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబర్ 21న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అర్జున్ ఇంటెన్స్ లుక్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. ఇప్పటికే విడుదలైన టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఈ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

‘సర్’ సాఫీగా జరిగేనా?

హర్యానాలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 25 లక్షల నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చారని లోక్‌సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ బయటపెట్టడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోని ఓటర్ల జాబితాలన్నీ డూప్లికేట్, నకిలీ, మృతులైన ఓటర్లతో నిండి ఉన్నాయని ఆయన ఆరోపించారు. నకిలీ ఓటర్లను ఎలా జాబితాలో చేర్చగలరో కూడా ఆయన వెల్లడించారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో అర్హులైన 6000 మంది ఓటర్లను జాబితా నుంచి ఎలా తొలగించారో గత సెప్టెంబర్ 18న కూడా రాహుల్ లొసుగులు బయటపెట్టడం సంచలనం కలిగించింది. ఓటరుగా ఎవరైనా నమోదు అయితే ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు మరెవరైనా తమ నంబరు ఉపయోగించి అసలు వ్యక్తికి తెలియకుండా ఫారం 8 ఉపయోగించి మార్చివేయవచ్చు. ఇవన్నీ విపక్షనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 18న బయటపెట్టిన ఐదురోజుల తరువాత ఎన్నికల కమిషన్ రాహుల్ ఆరోపణలన్నీ తోసిపుచ్చింది. ఆధార్ అనుసంధానిత మొబైల్ నంబరును చాటుమాటుగా ఉపయోగించకుండా మార్చింది.

ఇది స్వాగతించవలసిన చర్యే అయినప్పటికీ, ఎలాంటి పత్రికా ప్రకటన లేదా చర్చ లేకుండానే జరిగింది. అంటే ఓటర్ జాబితాల నిర్వహణలో ఉన్న విపరీతమైన లోపాలను ఎన్నికల కమిషన్ స్పష్టంగా, అవ్యక్తంగా అంగీకరించినట్టే అయింది. ఈ లోపాలే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ఆస్కారం కలిగిస్తున్నాయి. ప్రత్యేక ఓటరు గుర్తింపు నంబర్లు లోపించడం ఓటరు వివరాలను ఎవరైనా మార్చివేయడానికి వీలవుతుంది. ఇలాంటి ప్రాథమిక వ్యవస్థాపరమైన లోపాలను డేటాబేస్‌లో కనీస జ్ఞానం లేని టీనేజి ఇంజినీర్లు ఎవరూ చేయలేరు. దీనిబట్టి డేటాబేస్ నిర్వహణలో ఎన్నికల కమిషన్ ఘోరమైన అసమర్థతలో ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యమైన డేటాబేస్‌తో ఉండాల్సిన ఓటరు జాబితాలు ఈ విధంగా ఉండడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. దేశం లోని ఓటరు జాబితాలు అత్యంత సమర్థులైన నిపుణులు, ప్రక్రియలతో ప్రక్షాళన, నిర్వహణ కావలసిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో దేశం లోని రాష్ట్రాల్లో ఓటరు జాబితాలను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి, లోపరహితం కావడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను చేపట్టడానికి సిద్ధం కావడం స్వాగతించవలసిందే. కానీ మొదటి సారి గందరగోళ పర్చిన అదే అధికారులకు, అదే ప్రక్రియ కింద ఈ బృహత్తర బాధ్యతలను అప్పగించవచ్చా? చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశాల్లో పక్షపాత వైఖరి బట్టబయలవుతోంది.

ఈ పరిస్థితుల్లో నమ్మకం, సమర్థత లోపించిన ఎన్నికల కమిషన్ తన స్వంత ప్రక్రియలు, నిబంధనలతో దేశమంతా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను నిర్వహించడానికి ముందుకు రావడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌కు ప్రత్యామ్నాయం ఈ జాబితాల ప్రక్షాళన ప్రతి అంశం లోనూ అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయడం తప్పనిసరి. అంతేతప్ప ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేయడం సరికాదు. మొదటిది బీహార్ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టకూడదు. అక్కడ అక్రమ వలసదారులను తొలగిస్తున్నామని తప్పుడు కారణాలు చూపించి అసలైన ఓటర్లను దురుద్దేశంతో జాబితాల నుంచి తొలగించేశారు. రెండో ముఖ్య అంశం ఓటరు జాబితా ఎలాంటి లోపం లేకుండా స్వచ్ఛంగా నిర్ధారించడానికి ఆధార్ కార్డు అన్నది ప్రాథమికం, మౌలికం.

కానీ ఆధార్ కార్డును ఉపయోగించడంపై ఎన్నికల కమిషన్ గందరగోళాన్ని సృష్టించింది. పౌరసత్వానికి ఇది రుజువు కాదని వాదించి ఆధార్ కార్డును ఆధారం లేకుండా పక్కన పెట్టేసింది. ఇది నిజం. ఆధార్ కార్డు ఉన్న ప్రతివారూ ఓటరు కావలసిన అవసరం లేదు. కానీ ప్రతి ఓటరు తప్పనిసరిగా ఆధార్ కార్డున్న వారే అన్నది వాస్తవం. ఆధార్ లింకు కలిగిన నకలు ఓటరు జాబితా లోంచి డూప్లికేట్లను, నకిలీలను, మృతులను సమర్ధంగా తొలగించివేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డూప్లికేట్లు, నకిలీలు, ఇతర లోపాలను సవరించవచ్చు. ఈ ప్రక్రియతో ప్రతి ఓటరుకు ఓటరు గుర్తింపు కార్డు ఇవ్వవచ్చు. దీన్ని ఎవరూ మార్చలేరు. కానీ ఈ ప్రక్రియ ఏదీ చేయకుండా ఎన్నికల కమిషన్ అసలైన ఓటర్ల పేర్లను బీహార్‌లో కొన్ని లక్షల వరకు తొలగించి వేసింది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తనకుతాను సాంకేతికంగా తనకేమీ పరిజ్ఞానం లేదని నిరూపించుకోవడమే కాక, ఇష్టానుసారం దుర్మార్గంగా వ్యవహరించింది.

మూడవ అంశం.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకుని వారంతట వారే సమర్పించాలని లేదా కేంద్రాల్లో వాటిని స్వీకరించడం సరైన పనికాదు. ఇంటింటికీ వెళ్లి అసలైన ఓటర్లను తనిఖీ చేసి, ధ్రువపత్రాల ఆధారంగా నమోదు చేయాలి. ఎన్నికల కమిషన్ తమ వద్దకు ఓటర్లను రమ్మన కూడదు. ఓటర్ల వద్దకే ఎన్నికల అధికారులు వెళ్లి వివరాలు నమోదు చేయాలి. కానీ బీహార్‌లో ఇదేమీ జరగలేదు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణలో జనాభా గణన అధికారులు రెండు నెలల వ్యవధిలో ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి 3.5 కోట్ల మంది జనాభా వివరాలను పూర్తిగా సేకరించగలిగారు. ఎన్నికల కమిషన్ కూడా ఇలాంటి ఆదర్శనీయమైన పద్ధతి అనుసరించడం ఏకైక మార్గం. బీహార్‌లో నెల రెండు నెలల వ్యవధిలో హడావిడిగా చేసినట్టు కాకుండా నిదానంగా సక్రమ పద్ధతిలో చేస్తున్నారన్న నమ్మకం ఎన్నికల కమిషన్‌పై కలుగుతుంది.

కశ్మీర్‌పై బిజెపి వక్రీకరణలు

కశ్మీర్ గురించి, పాక్ ఆక్రమిత కశ్శీర్ గురించి బిజెపి తరచు కొన్ని ఆలోచనలు వ్యక్తపరుస్తుంటుంది. కశ్మీర్ గురించి అనేవి, ఆ విషయమై మొదటి ప్రధానమంత్రి నెహ్రూ తప్పు చేసారని. పిఒకె గురించి అనేది ఆ ప్రాంతాన్ని ఎప్పటికైనా స్వాధీనపరచుకోగలమని. ఈ రెండు మాటలు కూడా సగటు భారతీయుని దేశభక్తి భావనలకు అనుగుణమైనవి. ఆ విషయం దృష్టిలో ఉంచుకుంటూనే కొన్ని మాటలు చెప్పుకోవటం అవసరం. అవి వాస్తవిక దృష్టితో కూడినవి. ముందుగా పిఒకె సంగతి చూద్ధాము. దేశ విభజన సమయంలో అప్పటి కశ్మీర్ రాజు హరిసింగ్ తన రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు పలు ప్రయత్నాల తర్వాత అంగీకరించారు. ఆ ప్రక్రియ సాంకేతికంగా పూర్తియింది. కాని వాస్తవ స్థితిని చూసినపుడు, కశ్మీర్‌లో కొంత భాగం పాకిస్థాన్ ఆక్రమణకు గురై ఇప్పటికీ వారి అధీనంలోనే ఉంది. ఈ భాగం, ఆ భాగం అని గాక మొత్తం కశ్మీర్ ప్రశ్నపై రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఏమీ తేలలేదు. భారత సైన్యం తూర్పు పాకిస్థాన్‌ను విడదీసి అక్కడి పాకిస్థాన్ సైన్యాన్ని పెద్ద సంఖ్యలో బందీగా పట్టుకున్నపుడు, పిఒకెను మనకు వదలుకున్నట్లయితేనే ఆ బందీలను వదలగలమనే షరతు విధించవలసిందనే అభిప్రాయం ఒకటుంది. ఎందుకైతేనేమి అది జరగలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం, కశ్మీర్ సరిహద్దు వివాద పరిష్కారంపై చర్చలు జరిగాయి గాని, పిఒకెను సైనికంగా స్వాధీన పరచుకోవడమనే అంశం అజెండా పైకి రాలేదు.

బిజెపి, ముఖ్యంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ అధికారానికి వచ్చినప్పటి నుంచి పిఒకె స్వాధీనం ప్రస్తావనలు వస్తున్నాయి. ఎప్పటికైనా ఆ పని చేస్తామంటున్నారు. ఆయన నాయకత్వాన గత ప్రధాని వాజపేయికి మించి తీవ్ర జాతీయవాద వైఖరిని అవలంబిస్తున్నందున అటువంటి ప్రస్తావనలు సహజమనాలి. ఆ ధోరణికి అనుగుణంగానే ఆయన ప్రభుత్వం, కశ్మీర్ వివాదమంటూ అసలు ఏమీ లేదని, దానిపై పాకిస్థాన్‌తో చర్చించవలసింది కూడా ఏమీ లేదని, చర్చించటమంటూ ఉంటే వారు పిఒకెను మనకు వశపరచటం గురించి మాత్రమేనని అంటూ వస్తున్నది. అందుకు పొడిగింపుగా మాట్లాడుతూ, మనమే ఒక రోజు ఆ భూభాగాన్ని స్వాధీనపరచుకోగలమని చెప్తున్నది.

దీనంతటిలోని సాంకేతికతలను అట్లుంచితే, ఆచరణకు సంబంధించిన ప్రశ్నలు కొన్నింటిని గమనించవలసి ఉంటుంది. ఆ విధమైన ఆక్రమణ సాధ్యమా అన్నది ఒక ప్రశ్న కాగా, ఒకవేళ ఆక్రమించినా దానిని అధీనంలో ఉంచుకుని నియంత్రించగలరా అన్నది మరొక ప్రశ్న. యుద్ధాలు, ఆక్రమణలు, నియంత్రణలు అనే మూడు కూడా ఆషామాషీ విషయాలు కావు. అందువల్ల ఆవేశంతోగాక జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. మొదట యుద్ధం మాట చూస్తే, పాకిస్థాన్ కన్న ఇండియా చాలా శక్తివంతమైనదని వేరే చెప్పనక్కరలేదు. కాని ఇరువురికి అణ్వస్త్రాలు ఉండటం విస్మరించలేనిది. పాకిస్థాన్ ‘నూక్లియర్ విధానం’ ప్రకారం, తమ భూభాగానికి, భౌగోళిక సమగ్రతకు ముప్పు ఏర్పడినట్లయితే అణ్వస్త్రాలు ఉపయోగిస్తారు. ఆ పని నిజంగా జరుగుతుందా అనేది వేరే విషయం. కాని, జరగదని కూడా ఎవరూ హామీ ఇవ్వలేరు. ఒకసారి తూర్పు పాకిస్థాన్‌ను కోల్పోయిన తర్వాత, మరొక భూభాగాన్ని పోగొట్టుకునేందుకు సిద్ధపడటం తేలిక కాదు. అందువల్ల, పిఒకెను స్వాధీనపరచుకునే లక్షంతోనే యుద్ధమన్నది తేలిక కాదు. ఆ స్థాయి యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా జోక్యమన్నది సరేసరి.

పిఒకె స్వాధీనం జరుగుతుందని వాదన కోసం ఒప్పుకుంటే, అపుడు నియంత్రణ ప్రశ్న ముందుకు వస్తుంది. స్వాధీనం తక్షణం జరిగేది కాగా, నియంత్రణ దీర్ఘకాలికం. అందులోని సాధకబాధకాలేమిటి? కశ్మీర్ లోయ భూభాగం 15 వేల చదరపు కిలోమీటర్లకు పైగా ఉంది. పిఒకె వైశాల్యం అంతకు రెట్టింపు కన్న ఎక్కువ. జనాభా ఇక్కడ సుమారు కోటీ 80 లక్షల కాగా, అక్కడ దాదాపు 55 లక్షలు. వీరంతా ముస్లింలే. ఇటు వైపు భూభాగం ఏ విధంగానైతే కొండలు, లోయలు, నదులతో సంక్లిష్టమైనదో, అటువైపుది బహుశా అంతకన్న సంక్లిష్టమైనది. ఇటువైపు గలవారికి మన పట్ల ప్రేమ, విధేయత అన్నవి లేవనుకుంటే, వారికీ లేవు. వీరు నిరసనలకు, తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనుకుంటే, అటువైపు వారు అందుకు తోడవుతారు. అటువైపు వారికి పాకిస్థాన్ పట్ల కొంత నిరసన ఉండవచ్చు. దాని అర్థ్ధం ఇండియాను ప్రేమిస్తున్నారని కాదు. వీరూవారు కలిస్తే కశ్మీరీ జాతి మొత్తంగా స్వతంత్ర భావనలు బలపడి, రెండు దేశాలతో సంబంధం లేని విధంగా స్వతంత్ర కశ్మీర్ ఆలోచనలు తలెత్తగల అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇంత మాత్రమే కాదు.

ఒకసారి మ్యాప్‌ను చూడండి. రెండు కశ్మీర్‌లను ఆనుకుని ఉత్తరాన, పడమరన అఫ్ఘానిస్థాన్‌తోపాటు మధ్య ఆసియా ముస్లిం దేశాలు విస్తరించి ఉన్నాయి. వాటన్నింటా ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థలున్నాయి. లోగడ ఒక దశలో ఆ సంస్థలు కొన్ని కశ్మీర్‌ను ఇండియా నుంచి విముక్తం చేయగలమని ప్రకటించి అక్కడి సంస్థలకు ఆయుధాలు, నిధులు, శిక్షణలు కూడా ఇచ్చాయి. మధ్య ఆసియాలోని ఇస్లామిస్ట్ తీవ్రవాదం కొన్ని దశాబ్దాలుగా అంతులేకుండా పెచ్చరిల్లుతూనే ఉంది. సమయానుసారంగా ఆ ధోరణులకు ఆ ప్రాంతపు దేశాలలోపాటు, తమ వ్యూహాత్మక క్రీడల కోసం అగ్రరాజ్యాలూ ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నాయి. ఈ వివరాలన్నింటిని లెక్కలోకి తీసుకుంటూ ఇపుడు ఆలోచించండి, పిఒకె స్వాధీనం ఒకవేళ సాధ్యం అనుకున్నా, ఎంతవరకు వాంఛనీయం? అందులోని లాభనష్టాలేమిటి? ఇప్పటికే కశ్మీర్‌లో మన బలగాలు కొన్ని లక్షలు మోహరించి ఉన్నట్లు అంచనా. పిఒకె స్వాధీనం తర్వాత మరెన్ని మోహరింపులు అవసరం కావచ్చు? ఎంతకాలం? అట్లయినా పిఒకె శాశ్వతంగా భారతదేశంలో ఉండిపోగలదనే హామీ ఉంటుందా?

రెండవది, కశ్మీర్ విషయమై నెహ్రూ తప్పు చేసారనేది. ఈ మాటను ప్రధాని మోడీ అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఆయన ‘ఐక్యతా విగ్రహం’ వద్ద ప్రసంగిస్తూ మరో మారు అన్నారు. కశ్మీర్ సంస్థానం మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలన్నది పటేల్ ఆకాంక్ష కాగా, అందుకు నెహ్రూ అడ్డుపడ్డారని ఆరోపించారు మోడీ. దేశ ప్రజలపై గాంధీజీ, నెహ్రూల ప్రభావం ఇప్పటికీ తగినంత ఉన్నందున, దానిని దెబ్బ తీస్తూపోతే ఆ మేరకు తమ ప్రభావం ఇంకా వ్యాపిస్తుందన్నది సంఘ్ పరివార్, బిజెపిల వ్యూహం. అందుకోసం ఆ ఇరువురిపై రకరకాలగా ఆరోపణలు, విమర్శలు తరచు చేస్తూ వస్తున్నారు. గాంధీజీపై విమర్శల పట్ల వ్యతిరేకత పెరుగుతుండటంలో ఆయనను పక్కన ఉంచి, నెహ్రూపై ఆరోపణలు పెంచుతున్నారు. గాంధీజీ, నెహ్రూలు విమర్శలకు అతీతులని కాదు. కాని ఆరోపణలు, విమర్శలు ఎవరు ఎవరిపై చేసినా అందుకు ఆధారాలుండాలి. ఆ విధంగా చూసినపుడు కశ్మీర్ విషయమై నెహ్రూ, పటేల్ పాత్రలు తెలుపు, నలుపు పద్ధతిలో గిరిగీసినట్లేమీ లేవు. పటేల్ జీవిత చరిత్రను, రికార్డులు, వ్యక్తిగత లేఖలు, ఇంటర్వూల ఆధారంగా అతి సమగ్రంగా రచించిన వాడు, గాంధీజీ మనుమడైన రాజ్‌మోహన్ గాంధీ. ఆయన తను పేర్కొన్న ప్రతి అంశానికి ఆధారాలను ఉదహరించారు. వాటిని గమనించినపుడు ప్రధాని మోడీ వాదనలు పరిశీలనకు నిలవవు. కేవలం నెహ్రూను కించపరచి, దేశ ప్రజల దృష్టిలో తన విలువను తగ్గించి, బిజెపి భావజాలానికి అనుకూలుడని తాము భావించే పటేల్‌ను పైకెత్తటం కోసం ఆ విధంగా మాట్లాడుతున్నట్లు అర్థమవుతుంది. కశ్మీర్ తోపాటు గల దేశ విభజన విషయంలోనూ నెహ్రూ, పటేల్ వైఖరుల గురించి వారు ఇదే విధంగా ప్రచారాలు చేస్తున్నారు.

ఉదాహరణకు పటేల వ్యక్తిగత కార్యదర్శి, సన్నిహిత సలహాదారు అయిన వి. పి. మెనన్ రాసిన ‘ద ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా’, వి. శంకర్ రచన ‘మై రెమిని సెన్సెస్ ఆఫ్ సర్దార్ పటేల్’ వంటి గ్రంథాలను చదివితే కశ్మీర్‌పట్ల ఎవరి వైఖరి ఏమైనదీ స్పష్టమవుతుంది. ముస్లింలు ఆధిక్యతలో గల కశ్మీర్ విషయమై పటేల్ ఆసక్తి చూపకపోవటం దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం లభించిన తర్వాత కూడా 1947 సెప్టెంబర్ 13 వరకు కొనసాగింది. ఆయన ఆ రోజు రక్షణ మంత్రి బల్ దేవ్ సింగ్‌కు లేఖ రాస్తూ, “ఒకవేళ (కశ్మీర్) వేరే డొమినియన్ (పాకిస్థాన్ అని భావం) లో చేరదలచుకుంటే” ఆ వాస్తవిక స్థితిని తాను గుర్తించగలనని చెప్పారు. తర్వాత అదే రోజు మధ్యాహ్నం, జునాగఢ్ విలీనాన్ని పాకిస్థాన్ అంగీకరించిన తర్వాతనే పటేల్ వైఖరి మారింది. జునాగఢ్ సంస్థాన పాలకుడు ముస్లిం, అక్కడి ప్రజలు మెజారిటీ హిందువులు. అటువంటి సంస్థానం పాకిస్థాన్‌లో విలీనమైనపుడు, హిందూ పాలకుడు, మెజారిటీ ప్రజలు ముస్లింలు అయిన కశ్మీర్‌ను ఇండియాలో ఎందుకు విలీనం చేసుకోరాదన్న నిర్ణయాన్ని పటేల్ అపుడు మాత్రమే తీసుకున్నారు. ఇందుకు భిన్నంగా, తమ పూర్వీకుల జన్మభూమి అయిన ఆ సుందర దేశాన్ని వదలుకోవటం నెహ్రూకు ఎప్పుడూ ఆమోదయోగ్యం కాలేదు. తన మిత్రుడైన షేక్ అబ్దుల్లా తోడ్పాటుతో కశ్మీర్ విలీనానికే నిరంతరం ప్రయత్నించారు. అందువల్ల, ఇటువంటి పలు పరిణామాలను విస్మరిస్తూ ప్రస్తుత రాజుకీయాల కోసం చరిత్రను వక్రీకరించటం తగిన పనికాదు.

టంకశాల అశోక్