150 కోట్లతో దూసుకుపోతున్న ‘మిరాయ్’
సూపర్ హీరో తేజా సజ్జా బాక్సాఫీస్ వద్ద విజయయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన తాజా చిత్రం మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేస్తూ సూపర్హిట్ ట్రాక్పై దూసుకెళ్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సీజన్లోనే పెద్ద హిట్గా నిలిచింది. గట్టి పోటీ మధ్య కూడా మిరాయి అద్భుతంగా కొనసాగుతోంది. ఇటీవలే ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్ దాటిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో కీలక మైలురాయిని అందుకుంది. హనుమాన్ తర్వాత వరుసగా రెండోసారి 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం తేజా సజ్జా కెరీర్కు మైల్ స్టోన్ గా నిలిచింది. రెండు బ్లాక్బస్టర్స్తో వరుస విజయాలు అందుకున్న ఆయన బాక్సాఫీస్ వద్ద డిపెండబుల్ హీరోగా ఎదుగుతున్నారు. రితికా నాయక్ హీరోయిన్గా, మనోజ్ మంచు, శ్రీయా శరణ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాలు, విజువల్ వండర్గా కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. దసరా సెలవులు థియేటర్లలో ప్రేక్షకులను మరింతగా రప్పిస్తుండటంతో మిరాయ్ డ్రీమ్ రన్ విజయవంతంగా కొనసాగనుంది.