మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్రెడ్డి ఢిల్లీ లో పలువురు కేంద్రమంత్రులతో మంగళవారం భేటీ అ య్యారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారికి ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక శా ఖ మంత్రి నిర్మలా సీతారామన్కు భేటీ అయిన సిఎం రే వంత్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాని కి సేకరించే రుణాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితిని మినహాయించాలని కోరారు. దీంతోపాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణలో కేంద్రీయ విద్యాలయాలు, నవోద య విద్యాలయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా సిఎం రేవంత్రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పార్లమెంట్లోని ఆమె ఛాంబర్ లో భేటీ అయి విద్యారంగం కోసం తాము తీసుకుంటు న్న చర్యలకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రా ష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందు కు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 105 శాసనసభ ని యోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటె డ్ స్కూళ్ల ప్రాధాన్యతను తెలియజేశారు. 5 నుంచి 12 తరగతుల వరకు ఉం డే ఒక్కో యంగ్ ఇం డి యా ఇంటిగ్రేటెడ్ స్కూ ళ్లలో 2,560 మంది విద్యార్థులు ఉంటారని,
మొత్తంగా 105 పాఠశాలల్లో 2.70 లక్షల మంది విద్యార్థులకు ప్ర త్యక్షంగా నాణ్యమైన విద్యాబోధన లభిస్తుందని సిఎం వివరించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు స మీప ప్రభుత్వ పాఠశాలలకు విద్యా హబ్లుగా ఉండడంతో లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆధునిక వసతులు, లేబొరేటరీలు, స్టేడియాలతో నిర్మించే 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుందని కేంద్ర మంత్రికి సిఎం తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. మొత్తంగా రాష్ట్రంలో విద్యా రంగం సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.30వేల కోట్లు వెచ్చించనున్నట్లు నిర్మలా సీతారామన్కు తెలిపారు. ఈ నిధుల సమీకరణకు తాము ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్పిసి) ఏర్పాటు చేయనున్నట్టు సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. దాని ద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. విద్యా రంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు.
యంగ్ ఇండియా స్కూళ్ల వివరాలను అందచేయండి
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, తెలంగాణలో విద్యా రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చూపుతున్న చొరవను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల మోడల్ బాగుందని, దీనికి సంబంధించిన డిపిఆర్ను అందజేయాలని కేంద్రమంత్రి సిఎం రేవంత్కు సూచించారు.
ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని గుర్తించాం..
హైదరాబాద్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ను మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సిఎం తెలిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పార్లమెంట్లోని ఆయన ఛాంబర్లో ముఖ్యమంత్రి మంగళవారం భేటీ అయ్యారు. దేశంలో 19 రాష్ట్రాల్లో, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎంలు ఉన్నాయని, తెలంగాణలోనూ ఐఐఎం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించామని సిఎం కేంద్ర మంత్రితో తెలిపారు. ఐఐఎం తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయడంతో పాటు అవసరమైన వసతులు కల్పనకు తాము సిద్ధంగా ఉన్నట్లు సిఎం తెలిపారు.
9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేయండి
దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీ ఉందని, అనుకూల వాతావరణం, భిన్న రంగాల ప్రముఖులను అందజేసిన చరిత్ర హైదరాబాద్కు ఉందని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేస్తే అది తెలంగాణలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లల అవకాశాలను మెరుగుపర్చుతుందని సిఎం అన్నారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూతనంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అవసరం ఉందని సిఎం అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్,
నిర్మల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సిఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిఎం రేవంత్ కేంద్ర మంత్రితో తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మందాడి అనిల్ కుమార్, ఎంపి సురేశ్ షెట్కార్, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపి జితేందర్ రెడ్డి, పాల్గొన్నారు.