StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortbetlikeyakabetrealbahisjokerbetyakabetmasterbettingkulisbetrinabetrealbahisbahiscasinoyakabetrinabetatlasbetroketbetbetkolikaresbetbetlike

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

polobet

casibom giriş

wbahis

Holiganbet

polobet

polobet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

polobet

rokubet

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

grup porno

iptv satın al

jojobet

jojobet giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

artemisbet

rokubet

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

şanscasino

sapanca escort bayan

onwin

meritking güncel giriş

rokubet

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

sonbahis

bahix

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

hilarionbet

online diyetisyen

wbahis

polobet

kralbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betebet

Meritking Giriş

Kavbet

Galabet

jojobet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom giriş

ultrabet

Marsbahis

matbet

holiganbet

vdcasino giriş

perabet

perabet

meritking

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

ronabet giriş

milosbet

romabet

padişahbet giriş

jojobet giriş

matbet

matbet giriş

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

nitrobahis

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

Meritking

yakabet resmi adres

wbahis

Casibom

wbahis

wbahis

Agb99

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

sekabet

pusulabet

vdcasino

imajbet

marsbahis

imajbet

wbahis

grandpashabet

piabet

pusulabet

grandpashabet giriş

casibom

meritking

jojobet

holiganbet

betsmove

Slot Mahjong

meritking güncel

jojobet giriş

Betpas

matbet

matbet giriş

sekabet giriş

1xbet

fatih escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking

piabellacasino

baywin

piabellacasino

mislibet

bahisvebaihs

nitrobahis

piabellacasino

parmabet

piabellacasino

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet giriş

royalbet

royalbet giriş

polobet

polobet giriş

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

casibom giriş

casibom

padişahbet

vdcasino

betasus

berlinbet

suratbet

süratbet

betcio

mislibet

casinolevant

grandpashabet

marsbahis

kingroyal

dinamobet

betturkey giriş

kingroyal

Google Maps Yorum Satın Al

polobet

padişahbet

betoffice

padişahbet

padişahbet giriş

betpas

kralbet

asyabahis

holiganbet

betebet

ultrabet

betturkey

imajbet

matbet

sekabet

casibom

casibom giriş

casibom güncel giriş

vdcasino

tarafbet

pusulabet

meritking

casinolevant

galabet

pusulabet

padişahbet

casinolevant

casinolevant

betcio

jojobet

Sweet Bonanza

Sugar Rush 1000 Oyna

cratosroyalbet

spinco

marsbahis

grandpashabet

madridbet

madridbet giriş

casinolevant

grandpashabet

meritking

marsbahis

betpipo

meritking

casinolevant

casinolevant

meritking

casinolevant

madridbet

casibom giriş

Sweet Bonanza Oyna

casibom giriş

teosbet

lunabet

Hiltonbet giriş

vdcasino

matbet

kralbet

vdcasino

prizmabet

wbahis

betsilin

marsbahis

Hacklink panel

Hacklink satın al

meritking

marsbahis

bahiscasino

casinowon

ఎఫ్‌టిఎల్ ప్లాట్లకు టిడిఆర్?

మన తెలంగాణ/సిటీ బ్యూరో: చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో ప్లాట్లు కొనుగోలుచేసిన వా రికి నష్టం జరుగకుండా కొత్త ప్లాన్‌ను హైడ్రా రూపొందిస్తోంది. ప్రస్తతుం ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలోని ప్లాట్లలో బిల్డింగ్‌లు నిర్మించరాదనీ, అ నుమతులు మంజురు కావనీ, ప్లాట్ల యజమానులకు న్యాయం జరిగేలా చూడాలని నిర్ణయించిన హైడ్రా.. వారికి ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్(టిడిఆర్)లను మంజూరు చేయడం ద్వారా వా రికి మద్దతుగా నిలవాలని ప్లాన్ చేసింది. హైడ్రా పరిధి(ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతం)లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వెబ్‌సైట్ ఆధారంగా 455 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్ల లో ప్లాట్లు చౌకగా వస్తున్నాయని మధ్యతరగతి ప్రజలే అధికంగా కొనుగోలు చేస్తారనీ, వారు ఏండ్లతరబడి చేసిన కష్టం కాస్త బురదపాలు కా వద్దని వారికి టిడిఆర్‌లు ఇవ్వడం ద్వారా ఆదుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించినట్టు సమాచారం. ఈమేరకు జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. వారి కష్టార్జితం నీటిపాలైతే.. వారి కుటుంబాలు ఆర్థికంగా చితికి రోడ్డునపడే అవకాశాలు ఉన్నందున వారి ప్లాట్లకు తగిన ధర పలికేట్టు టీడిఆర్‌లు ఇచ్చేదిశగా హైడ్రా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

ఆరు చెరువుల పునరుద్ద్ధరణ..

గ్రేటర్‌లో ఆరు చెరువులను పునరుద్దరించాలని హైడ్రా నిర్ణయించింది. ఇందులో బతుకమ్మ కుంట (అంబర్‌పేట్), బుమ్రుఖ్ దావాలా (రాజేంద్రనగర్), తమ్మిడి కుంట (ఎన్ కన్వెన్షన్), సున్నం చెరువు (మాదాపూర్), నల్ల చెరువు (కూకట్‌పల్లి), నల్ల/పెద్ద చెరువు (ఉప్పల్)ల కలుషితాన్ని అరికట్టడానికి డీవాటరింగ్, డీసిల్టింగ్, ఇన్‌ఫ్లో చానెళ్లను పునరుద్ధరించడం, మురుగునీటి మార్గాలను నిరోధించడం వంటివి నివారిచడం జరుగుతుంది. ఈపాటికే బతుకమ్మకుంటతో పాటు కూకట్‌పల్లి నల్ల చెరువు పునరుద్దరించడం దాదాపు పూర్తికావచ్చింది.

రాజేంద్రనగర్‌లోని బూమ్రుఖ్‌దౌలా చెరువు పనులు ప్రారంభించింన హైద్రా వీటి ద్వారా నగరంలోని చెరవులకు స్పూర్తిగా నిలపాలని హైడ్రా నిర్ణయించింది. ఈ 6 చెరువుల ఎఫ్‌టీఎల్ లను, బఫర్‌జోన్‌లను గుర్తించడంతో ఆందులో ప్లాట్లున్నాయి. అవి పూర్తిగా తొలగించాల్సి వస్తున్న నేపథ్యంలో ఆ ప్లాట్ల ధరలకు అనుగుణంగా ప్లాట్ల యజమానులకు టిడిఆర్‌లు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించార. ఈమేరకు జీహెచ్‌ఎంసి అధికారులకు లేఖ రాసి ఒప్పించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు హైడ్రా ప్రతిపాదనలను సిద్దం చేసి, సర్కారుకు, జీహెచ్‌ఎంసికి పంపాలని భావిస్తున్నట్లు తెలిసింది.

డబుల్ ధమాకా

చెరువులు, కుంటల పరిరక్షణ చర్యల్లో భాగంగా తొలగించిన, మున్ముందు తొలగించాల్సిన ప్లాట్లకు నగదు పరిహారానికి బదులుగా టీడీఆర్ ఇచ్చే విషయంపై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలతో కలిసి హైడ్రా కసరత్తు చేస్తున్నది. గ్రేటర్ పరిధిలో 185 చెరువులతో పాటు గ్రేటర్ వెలుపల 270 చెరువులు ఉన్నాయి. వీటి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలోని ప్లాట్ల విలువకు రెట్టింపు విలువను కట్టించి అందుకు సమానంగా ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్(టిడిఆర్)లు జీహ్‌చెంసి, హెచ్‌ఎండిఏలతో మంజూరు చేయించనున్నది హైడ్రా. ప్లాటు విలువ మార్కెట్(ప్రభుత్వ) ధర రూ. 10 లక్షలుగా ఉంటే.. ఆ ధరను రెట్టింపుగా రూ. 20 లక్షలుగా టిడిఆర్ బాండ్స్‌ను అందించాలని హైడ్రా నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌ను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. కేవలం ప్రభుత్వ ధరకు అదనంగా అంతే ధర అంటే రెట్టింపు ధర వచ్చేలా టిడిఆర్‌లను మంజూరు చేయాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించి గ్రేటర్, హెచ్‌ఎండిఏల ద్వారా టిడిఆర్‌లు అందించేందుకు హైడ్రా సిద్దమవుతోంది.

మైనారిటీ నేతను అడ్డుకుంటున్నారు

మనతెలంగాణ/హైదరాబాద్: అజారుద్దీన్‌ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోకుండా బిజెపి కుట్రలు చే స్తోందని, అజారుద్దీన్ దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కా లం కెప్టెన్‌గా వ్యవహారించారని, క్రికెట్‌తో దేశానికి ఎంతో సేవ చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనార్టీ నేత అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తీ సుకోవడంతో ఆ రెండు పార్టీలు కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపాయని ఆయన విమర్శించారు. దేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన క్రీడాకారుల్లో అజారుద్దీన్ ఒకరని, అజారుద్దీన్ లాంటి విఖ్యాత క్రీ డాకారుడికి మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తుంటే బి జెపి అడ్డుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. అజారుద్దీన్‌పైన బిజెపి, బిఆర్‌ఎస్ కలిసి కుట్ర చే స్తున్నాయని, బిజెపి, బిఆర్‌ఎస్‌లు తెర వెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత స్పష్టం చేసిందన్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ సహకారంతోనే బిజెపి రాష్టంలో 8 సీట్లు గెలుచుకుందని ఆయన అన్నారు.

గవర్నర్‌పై బిజెపి ఒత్తిడి

జూబ్లీహిల్స్‌లో తమకు గెలిచే అవకాశం లేదని బిజెపి కి తెలుసనీ అందుకే బిఆర్‌ఎస్‌కు లాభం చేయడం కోసం ఆలస్యంగా బలహీనమైన అభ్యర్థిని బిజెపి ప్రకటించిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీలు ఎవరూ బిజెపికి ఓటు వేయరని, జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్‌కు లాభం కలిగించడం కోసమే అజారుద్దీన్‌ను మంత్రి కాకుండా బిజెపి అడ్డుకుంటోందన్నారు. అ జారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్‌పైన బిజెపి ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. గతంలో రాజస్థాన్‌లో ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రి వర్గంలోకి తీసుకుందని, గంగానగర్ జిల్లా కరణ్‌పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పా ల్ సింగ్‌ను డిసెంబర్ 30న రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకుందని, ఆయన ఉప ఎన్నిక అభ్యర్థి అని, మంత్రివర్గంలోకి బిజెపి తీసుకుందన్నారు. ఉపఎన్నికకు 20 రోజుల ముందు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారన్నారు. బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. కేవలం మైనార్టీ అన్న ద్వేషంతోనే బిజెపి నాయకులు అజారుద్దీన్ ప్రమాణస్వీకారాన్ని అడ్డుకుంటున్నారన్నారు. ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకే ఉందని, ప్రమాణ స్వీకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బయట జరుగుతుందని భట్టి పేర్కొన్నారు.

రాజస్థాన్‌లో మీరెలా చేశారు? : పిసిసి చీఫ్

మైనార్టీకి మంత్రి పదవి ఇస్తామంటే బిజెపి అడ్డుకుంటుందని పిసిసి చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపించాలనే లోపాయికారీ ఒప్పందంలో భాగంగా బిజెపి రాజకీయాలు చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లుగా బిజెపి, బిఆర్‌ఎస్ కుమ్మ క్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. క్రీడాకారుడిగా, రాజకీయ నేతగా అజారుద్దీన్ ప్రజలకు సేవలదించారని అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించామని ఆయన తెలిపారు. ఇప్పుడు మైనార్టీకి మంత్రి పదవి ఇస్తామంటే బిజెపి అడ్డుకుంటుందని, మైనార్టీని మంత్రిని చేస్తున్నారన్న అక్కసుతో రాజకీయం చేస్తోందన్నారు. బిజెపి పాలిత రాజస్థాన్‌లో 20 రోజుల్లో ఎన్నికలు ఉండగా సురేంద్ర పాల్‌ను మంత్రిని ఎలా చేశారని, ప్రశ్నించారు. మంత్రిని చేసినా సురేంద్ర పాల్ ఎన్నికల్లో ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు.

మైనార్టీలపై విషం : ఎంపి చామల

బిజెపి, బిఆర్‌ఎస్‌లు మైనార్టీలపై విషం కక్కుతున్నాయని ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించా రు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు పార్టీలు అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుం డా అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని ఆయన అన్నారు. మైనార్టీలు అంటే ఎందుకు అంత కడుపుమంట అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్ లో మైనార్టీ మంత్రి ఉండవద్దా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే మతాల మధ్య చిచ్చు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం కల్ల అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తాము ఓడిపోతే ప్రభుత్వం పడిపోవాలని కెటిఆర్ ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెటిఆర్ మాటలతో కుట్ర, కుతంత్రం అంతా బయటపడిందన్నారు. 

కోడ్ ఉండగా ఎలా ఇస్తారు?

మన తెలంగాణ/హైదరాబాద్: గతంలో అనేక కేసులు ఉ న్న అజారుద్దీన్‌ను మంత్రి వర్గంలోకి ఎలా తీసుకుంటారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సిబిఐ, కోర్టు కేసులు చాలా ఉన్న అజారుద్దీన్‌ను ఎలా మం త్రివర్గంలో చేర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధ్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వరకే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓ డిపోయిన అజారుద్దీన్‌ను ఇప్పుడు హడావుడిగా మంత్రిగా చేయాలని ఎందుకు నిర్ణయించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. గత 22 నెలలుగా మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి కూడా లేరని, నిజంగా మైనారిటీ సంక్షేమంపై శ్రద్ధ ఉంటే ముందే అవకాశం ఇచ్చేవారని అన్నారు. ఇప్పుడు మైనార్టీల ఓట్ల కోసం ఎన్నికల ముందు గుర్తుకొచ్చిందా? అని ఎద్దేవా చేశారు.

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రి పదవిని ఇవ్వడం చట్ట విరుద్ధమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతగా దిగజారిపోయిందని విమర్శించారు. కేవలం మైనారిటీ ఓటర్ల సంతుష్టీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఖబ్రస్తాన్ భూములు, మంత్రి పదవులు తాయిలాలుగా ఉపయోగిస్తోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ ఆదేశాలతో మిలటరీ భూమిని ఖబర్‌స్తాన్‌కు కేటాయించిందని, అలాగే ఎర్రగడ్డలో కూడా ఇల్లీగల్‌గా ఖబర్‌స్తాన్‌కు భూములు కేటాయించారని ధ్వజమెత్తారు.

మజ్లిస్‌కు రక్షణకవచంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు

ఓవైసీ కనపడితే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వంగి వంగి సలాం కొడుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కుహనా లౌకికవాదం, బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ -బీఆర్‌ఎస్ పార్టీలు మజ్లిస్‌కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు పట్టిన చీడ ఎంఐఎం అని కిషన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించిన కిషన్‌రెడ్డి ఎవరి ఒత్తిళ్లతో, ఎవరి సూట్ కేసులకు తలొగ్గి తమ అభ్యర్థిని కాంగ్రెస్‌కు అ ద్దెకు ఇచ్చిందని నిలదీశారు. మంత్రులను బస్తీలకు పంపిం చి, మజ్లిస్ నాయకులు ప్రత్యర్థులపై దాడులు, బెదిరింపుల కు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అలాం టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థులపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.

స్లాటర్ హౌస్‌ల వెనుక ఎంఐఎం నేతలే

రాష్ట్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న పశు వధశాల (స్లాటర్ హౌస్)లు వెనుక ఉన్నది ఎంఐఎం నేతలేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు. స్లాటర్ హౌస్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 39 స్లాటర్ హౌస్‌లపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని అ న్నారు. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో గోవుల అక్రమ రవాణా, గోహత్య, పశుమాంస ఎగుమతి పెద్ద మాఫియా గా మారిందని ఆరోపించారు. ఎంఐఎం పార్టీకి చెందిన బ హదూర్పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, రసూల్పురా కా ర్పొరేటర్ మహ్మద్ ఖాదర్ వంటి వారు రెగ్యులర్‌గా పోలీ సు స్టేషన్లకు వెళ్లి అధికారులను బెదిరించి వాహనాలను విడిపించడం సాధారణంగా మారిందని విమర్శించారు. 

నేడు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం

మనతెలంగాణ/హైదరాబాద్:కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రె స్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యా హ్నం 12.15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణ స్వీ కారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సి ద్ధమైంది. నేడు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ అజారుద్దీన్‌తో మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ దఫా విస్తరణలో కేవలం అజార్‌ను మాత్రమే కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. రే వంత్ మంత్రివర్గంలో మైనార్టీలకు చోటులేదని విమర్శలు చా లా కాలంగా ఉన్నాయి.

దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పద వి ఇవ్వడంతో పాటు అజారుద్దీన్‌కుమంత్రి పదవి కట్టబెట్టి మై నార్టీలను సంతృప్తి పరచడంతో పాటు హైదరాబాద్ జిల్లా నుం చి కేబినెట్లో ప్రాతినిథ్యం కల్పించాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి కాగా, గవర్నర్ కోటాలో అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం పంపించిన దస్త్రం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేస్తే ఆరునెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా నామినేట్ కావాల్సి ఉంటుంది.

మొంథా పంజా

మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వా యుగుండం మొంథా తుఫానుగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురిశాయి. తుఫాను దాటికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతాకులమయింది. పంట పోలాలు చెరువులను తలపించాయి, కల్లాల్లో ధాన్యం నీట మునిగిపోయింది, పలు చోట్ల ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామా సిద్దిపేట యాద్రాది భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఆదిలాబాద్, నిర్మ ల్, మంచిర్యాల, జగిత్యాలతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో ఇళ్లు మునిపోయాయి. కుండపోత వర్షానికి హన్మకొండ బస్‌స్టాండ్ వరద నీటితో చెరువులా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఇంటర్ సిటీ, ఈస్ట్‌కోస్ట్ రైళ్లు నిలిచిపోయాయి. డోర్నాకల్ రైల్వే ట్రాక్‌పై రెండు అడుగుల మేర నీరు చేరడంతో గోల్కోండ ఎక్స్‌ప్రెస్ నిలిపివేసి, ప్రయాణికులను బస్సుల్లో గమ్యస్థానాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఐదు గంటల పాటు మహబూబాబాద్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది.

రైల్వే ట్రాప్‌పై నీరు తగ్గకపోవడంతో తిరిగి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కి వరంగల్‌కు పంపించారు. గుండ్రాతిమడుగు నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కి వరంగల్ పంపిన అధికారులు రైల్వే ట్రాక్‌పై నీటిని తరలించే చర్యలు చేపట్టారు. కాజీపేట-విజయవాడ మార్గం లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హన్మకొండలోని చెన్నారావు పేటలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో వరద నీరు చేరింది. నెక్కొండ, నర్సంపేట ప్రధాన రహదారిలోని పాతముగ్ధుంపురం వద్ద లో లెవల్ వంతెనపై నుంచి నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. పాకాల వా గు పొంగడంతో గార్ల, మద్దివంచ, రామచంద్రాపురం గ్రామాలకు, వట్టివాగు పొంగడంతో కేసముద్రం-గూడురు మద్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం వరగల్ ప్రధాన రహదారిపై భారీగా నిలిచిన వరద నీరు చేరడంతో పోలీసులు ఒక వైపు తాత్కాలికంగా రహాదారిని మూసివేశారు. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోయింది. మొంథా తుఫాను దాటికి ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ప్రవాహాం 19 అడుగులకు చేరడంతో పునరావాస కేంద్రాలు సిద్దం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.

ఖమ్మం జిల్లా నిమ్మవాగులో కొట్టుకుపోయిన లారీ

కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలోని జాన్నారంఅంజనాపురం గ్రామాల మధ్య నిమ్మవాగు పొంగి పొర్లుతుంది. ఈ వాగును డిసిఎం లారీ దాటించే ప్రయత్నం చేయడంతొ వరదలో చిక్కుకుపోయింది. నీటి ప్రవాహానికి మధ్యలోకి వెళ్లిన తరువాత బ్రిడ్జి పిల్లర్‌కు తగిలి లారీ నిలిచిపోయింది. ఈ క్రమంలో బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న స్థానికులు దిగిరావాలని కోరినా డ్రైవర్ మురళి(32) వాహనాన్ని కదిలించే ప్రయత్నం చేశాడు. దీంతో డ్రైవర్‌తో సహా లారీ వరద ఉదృతికి కొట్టుకుపోయింది.

కూసుమంచి మండంలంలోని పాలేరు జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 1,100 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. చింతకాని మండల వ్యాప్తంగా కురిసిన వర్షాలకు నాగులవంచ-పాతర్లపాడు మధ్య బండి రేపు వాడు రహదారిపై వాగు పొంగి ప్రవహిస్తుండటంతొ ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. కారేపల్లి గ్రామంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆర్ అండ్ బి మధ్యలో చిన్న వంతెనపై నీళ్లు ప్రవహిస్తుండటంతో ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోయాయి. కారేపల్లి కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయం సమీపంలో నీరు ప్రవహించడంతో విద్యార్థినిలు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లి, అవుసలికుంట మధ్య కారు దాటుతున్న సమయంలో పక్కకు కొట్టుకుపోయింది. తాడూరు మండలం గోవిందపల్లి వద్ద వాగు దాటుతున్న గొర్రెల మందలోని గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. కలెక్టర్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న కెఎల్‌ఐ కాలువ ఉప్పొంగి ప్రవహిస్తూ వరద నీరుత కలెక్టరేట్ ఆవరణలోకి భారీగా చేరుకుంది. భారీ వర్షానికి నాగర్‌కర్నూల్ జిల్లాలోని డిండి -హాజీపూర్ మధ్య కాజ్ వే కోతకు గు రైంది. దీంతో హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి.

శ్రీ శైలం నుంచి వస్తున్న వాహనదారులు హాజీపూర్ సమీపంలో నిలిచిపోవాల్సి వస్తోంది. అదే విధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు డిండి దగ్గర ఆగాల్సి వచ్చింది. మండలంలోని తీగలపల్లి నుంచి నాగర్‌కర్నూల్‌కి వెళ్లే ప్రధాన రహదారి ఏడుదల జలాశయం కట్టపై బుదర పేరుకుపోయింది. దీం తో మూడు రోజుల నుంచి ఆర్టీసి బస్సులను నిలిపివేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్డండ మండలంలో బైరాపూర్ గ్రామ సమీపంలోని వంతెన పై నుంచి సిమెంట్ పైపుల చుట్టే రక్షణగా ఉన్న మట్టి కోతకు గురికావడంతో వివిధ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చారకొండ మండలం ఎర్రవల్లి, గోక రం గ్రామాల మధ్య రదారిపై వాగు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తుండంటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలంలొ మూడు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కోడేరు-పసుపుల, బావాయిపల్లి-పెద్దకొత్తపల్లి-ఖానాపూర్-సాతాపూర్ గ్రామా ల మధ్య వాగులు పొంగతంతొ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

సూర్యాపేటలో బైక్‌పై వెళుతున్న వ్యక్తిపై చెట్టు కూలి మృతి

సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన కోట లక్ష్మీనారాయణ(45) తానం చర్ల నుండి మద్దిరాలకు తన వ్యవసాయ క్షేత్రాన్ని వెళుతున్న క్రమంలో చందుపట్ల గ్రామ శివారులో కొత్త పాఠశా సమీపంలో ఈదురు గాలికి రోడ్డుపై ప్రయాణిస్తున్న అతనిపై చెట్టుకూలింది దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. జనగామ జిల్లా అంబటిపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అంబటిపల్లి నుండి లింగాలకు ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో కారును వాగు దాటించే ప్రయత్నం చేయడంతో వరద ఉధృతికి కారు కొద్ది దూరం కొట్టుకుపోయి వరద నీటిలో చిక్కుకుంది. దీంతో హుటాహుటిన జెసిబి సహాయంతో కారును, వెంకటరెడ్డిని బయటకు తీసుకువచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో కురుస్తున్న వర్షాలకు గోకారం, చంద్రయాన్‌పల్లి, ఎర్రవల్లి గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించి రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. నాంపల్లి మండలంలోని రాందాస్ తండా వద్ద శేషలేటి వాగు వరద నీటి ప్రవాహ వేగానికి రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించింది.

నల్గొండ జిల్లా దేవరకొండ మడమడకలో గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. దేవర కొండ మండలం కొమ్మేపల్లిలో వరద నీరు పాఠశాలను చుట్టుముట్టడంతో అధికారులు తాడు సహాయంతో సుమారు 500 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. శేషలేటి వాగు వరద నీటి ప్రవాహ వేగం ఆర్ అండ్ బి రోడ్డు కాజ్వే పై నుండి ప్రవాహం కొనసాగుతుండడంతో రహదారికి ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు. చండూరు వైపు నుండి నాంపల్లి ద్వారా హైదరాబాద్ వెళ్లే వాహనాలను మర్రిగూడెం ద్వారా హైదరాబాదు వైపు మళ్ళించారు. నాంపల్లి నుండి కొండమల్లేపల్లి వైపు రాకపోకలకు ఉపయోగించే ఆర్ అండ్ బి రోడ్డు ముష్టిపల్లి కట్టకింద వాగు పై ఉన్న బ్రిడ్జి పై నుండి వరద ప్రవాహం వెళుతుండడంతో నాంపల్లి కొండమల్లేపల్లి మధ్య రాకపోకలు స్తంభించాయి.

137 రైళ్లు పూర్తిగా, ఏడు రైళ్లు పాక్షికంగా రద్దు

మొంథా తుఫాను ధాటికి దక్షిణ మధ్య రైల్లే 137 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, ఏడు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. దీంతో పాటుగా 30 రైళ్లను దారి మళ్లించింది. అనేక రైళ్లను రీ షెడ్యూల్ చేసింది. పలు గూడ్సురైళ్లు స్టేషన్లలోనే నిలిచిపోయాయి.

రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం నమోదు

తుఫాను ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో అత్యధికంగా 31.6 సెం.మీ వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

అలర్ట్‌గా ఉండండి

మన తెలంగాణ/హైదరాబాద్ : వరి కోతల సమయం కావడం, పలుచోట్ల కల్ల్లాల్లో ధాన్యం ఉన్న నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల ను సిఎం రేవంత్ ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రా ల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూ చించారు. మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగ ల్, నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండటం, హైదరాబాద్ సహా ఇత ర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిఎం ఆదేశించారు. మొంథా తుఫాను ప్రభావంపై సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు.

ఈ సందర్భంగా  అధికారులతో సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయని, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లీంచారని, ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. తీవ్ర వర్ష ప్రభావం ఉన్నచోట ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాలని, జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్‌లో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సిఎం ఆదేశించారు.

నగర, పురపాలక, పంచాయతీల పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా

వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సిఎం ఆదేశించారు. నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సిఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సిఎం ఆదేశించారు.

తుఫాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ కారణంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర, పురపాలక, పంచాయతీలకు సంబంధించిన పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సిఎం సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని సిఎం సూచించారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని సిఎం ఆదేశించారు. హైదరాబాద్ లో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

అత్యవసరం అయితే తప్ప అధికారులెవరూ సెలవుపై వెళ్లొద్దు: మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఆర్ అండ్ బి అధికారులు ఫీల్డ్ లెవెల్లో హై అలర్ట్‌గా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ అత్యవసరం అయితే తప్ప అధికారులెవరూ సెలవుపై వెళ్లొద్దని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. మాన్సూన్ సీజన్‌లో ఎలాగైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామో ప్రస్తుతం కూడా అదే స్ఫూర్తితో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పిఆర్ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. కాజ్ వేలు, కల్వర్టులు వద్ద ప్రమాద హెచ్చరికలతో కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి సూచించారు. ఎమర్జెన్సీ అయితేనే ప్రజలు రోడ్లపైకి రావాలని, అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి పొంగులేటి

తుఫాను ప్రభావం నేపథ్యంలో కురుస్తున్న భారీవర్షాలపై బుధవారం రెవెన్యూ, విపత్తుల నిర్వహణ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి మంత్రి పొంగులేటి ఆరా తీశారు. భారీ వర్షాల వల్ల జన జీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి మంత్రి పొంగులేటి సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రాగల 24 గంటల్లో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులతో మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సూచించారు.

అజారుద్దీన్‌కు కేబినెట్‌లో చోటు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉ ప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణ యం తీసుకుంది. ఇంతవరకు మంత్రివర్గంలో మైనార్టీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ స్థానంలో క్రికెట్ మాజీ కెప్టె న్ అజారుద్దీన్‌కు చోటు కల్పించాలని సీఎం నిర్ణయం తీ సుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రివర్గ విస్తరణలో ఆజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాజ్‌భవన్‌కు సమాచారం పంపించినట్టుఅధికార వర్గాల సమాచారం. కాగా ఉప ఎన్నిక జరుగునున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మై నారిటీ ఓటర్లు అధికంగా ఉండటం ఆ వర్గం

ఓ టర్లకు గాలం వేయడానికే అజారుద్దీన్‌కు మం త్రివర్గంలో స్థానం కల్పించాలన్న నిర్ణయానికి కారణమనిరాజకీయవర్గాలు అంచనా వేస్తున్నా యి. ఈ అంశంపై పిసిసి అధ్యక్షుడు బి. మ హేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, మంత్రివర్గంలో మైనారిటీ స్థానం కల్పించాలన్న ఆలోచన ఎప్ప టి నుంచో ఉందని, ఇప్పుడు ఆ అవకాశం అజర్‌కు దక్కబోతుందన్నారు. ఇలా ఉండగా శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో అజారుద్దీన్‌తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలిసింది.

ప్రతిష్టాకరంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా పార్టీ, ప్రభుత్వంపై తన పట్టును నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. ఇప్పటికే పదకొండు మంది మంత్రులను, ఒక ఎంపీని నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు ఇన్‌ఛార్జీలుగా నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ బలంగా ఉందన్న సంకేతాన్ని అధిష్ఠానానికి పంపించడానికి జూబ్లీహిల్స్ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాకరంగా తీసుకున్నట్టు సీఎం సన్నిహిత వర్గాల సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తుండగా,

మరోవైపు పార్టీలో సీఎం వ్యతిరేక వర్గీయులు కూడా అధిష్ఠానానికి తరుచు ఫిర్యాదు చేస్తోన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అటు ప్రతిపక్షానికి, ఇటు స్వపక్షంలో విపక్షానికి ఈ రెండింకి చెక్ పెట్టడానికి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఈ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాకరంగా తీసుకొని ఏ విధంగా గెలిచితీరాలని పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది.ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన జవాబు ఇచ్చినట్లు అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైనా దీని ప్రభావం ఉంటుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది.

అజర్‌నే ఎందుకు?

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కే మంత్రివర్గంలోకి తీసుకోవడానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా మైనారిటీ ఓటర్లు ఉండటమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్త్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గతంలో 2014 మజ్లీస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ ఉప ఎన్నికలో ఆయన్నే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా బరిలోకి దించింది. గతంలో నవీన్ యాదవ్‌తో ఉన్న సంబంధాల నేపథ్యంలో మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు మైనార్టీ వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహత్మక ఎత్తుగడగా నిర్ణయం తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి విజయావకాశాలు మరింత మెరుగు అయినట్టేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ నిర్ణయం వల్ల మంత్రివర్గంలో జిహెచ్‌ఎంసి పరిథిలో ప్రాతినిధ్యం లేదన్న విమర్శకు కూడా చెక్ పెట్టినట్టు అయిందని చెప్పవచ్చు. రెండేళ్ళుగా మంత్రివర్గంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎవరూ లేరు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో హైదరాబాద్ నుంచి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఉన్న సంగతి తెలిసిందే.

సిఎం రేవంత్‌రెడ్డితో అజారుద్దీన్ భేటీ

మైనారిటీ నేతల ధన్యవాదాలు

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. అజర్‌ను శుక్రవారం మంత్రివర్గంలోకి తీసుకోనున్నందున ఆయన ముఖ్యమంత్రిని కలిసి తనకు కల్పిస్తున్న అవకాశానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, ఇంకా పలు ముస్లిం సంస్థల నాయకులూ ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర మంత్రివర్గంలోకి మైనారిటీ వర్గానికి అవకాశం కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

జూబ్లీహిల్స్ లో బిఆర్‌ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చని, మూడేళ్ల వరకు ఎదురుచూడాల్సిన అవసరం ఉం డదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పైసలు ఇస్తే తీసుకోవాలని, కానీ, ఓటు మాత్రం బిఆర్‌ఎస్‌కు వేయాలని ఆయన కోరారు. కత్తి వాళ్లకు ఇ చ్చి యుద్ధం తమను చేయమంటే ఎలా అని కెటిఆర్ ప్రశ్నించారు. కత్తి తమకు ఇవ్వాలని కాంగ్రెస్ తో యుద్ధం చేసే బాధ్యత తమదని కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడు తూ భర్త చనిపోతే భార్యకు బాధ ఉండదా..? మా గంటి సునీతపై కామెంట్ చేయడానికి మంత్రులకు సిగ్గు ఉండాలంటూ కెటిఆర్ ఫైర్ అయ్యారు. వాళ్ల కుటుంబంలో ఎవరైనా చనిపోతే కాంగ్రెస్ నే తలకు బాధ కలగదా అంటూ ఆయన నిలదీశారు. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికే మూడు ఓట్లు ఉన్నాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఓటేయరని తెలిసి దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నార ని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వారి ఓటు కూడా ఎవరో ఒక రు వేసేస్తారన్నారు. మున్నూరు కాపులకు సముచిత గౌరవం, సముచిత ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కెసిఆర్‌దని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్ర భుత్వంలో కరెంటు కూడా సరిగా ఉండట్లేదని కెటిఆర్ విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వా త ఫ్రీ వాటర్ స్కీం కూడా ఎత్తేస్తారని ఒక ఇంటర్వ్యూలో సిఎం రేవంత్ రెడ్డే ఈ విషయాన్ని బయటపెట్టారని కెటిఆర్ తెలిపారు. ఒక్క కొత్త రోడ్డు లేదని, కొత్త బ్రిడ్జి లేదని, కొత్త బిల్డింగ్ కట్టలేదని కెటిఆర్ విమర్శించారు. కానీ, కెసిఆర్ కట్టిన బిల్డింగ్‌లను మాత్రం ప్రారంభిస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే బిసి బిల్లుకు బిఆర్‌ఎస్ కూడా మద్దతు ఇస్తుందని చెప్పామని మాజీ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పొన్నాల లక్ష్మయ్య, వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్, దాస్యం వినయ్ భాస్కర్, శంబీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

రీయింబర్స్‌మెంట్‌పై విజిలెన్స్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అవకతవకలు, అక్రమాలపై చె క్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్ తో ఇప్పటికే పలుమార్లు ఇంజినీరింగ్ కళా శా లలు (వృత్తి విద్యా కళాశాలలు) యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించటం మరో మలుపు తిరిగింది. కళాశాలల నిర్వహణ, నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా? ఇందులో చేరుతున్న విద్యార్థులకు నిబంధనల ప్రకారమే ప్రవేశాలు జరిగాయా? వాటిలో నిబంధనల మేరకు వసతి సౌకర్యాలు ఉన్నాయా? రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అర్హులైనా? తదితర అంశాలపై విచారణ జరిపి నివేదిక

ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ విజిలెన్స్ విచారణకు స హకారం అందించాల్సిందిగా వృత్తి విద్యా శా ఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పోలీసు, విద్యాశాఖ సహకారంతో రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న ప్రైవేటు, వృత్తి విద్యా కళాశాలల సంస్థలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న వృత్తి విద్యా కళాశాలలకు అనుమతి ఉందా? లేదా?, వీటిలో చదువుతున్న విద్యార్థులు అర్హులైనా? వారి అడ్మిషన్స్ నిబంధనల ప్రకారమే జరిగాయా?, ఈ కళాశాలలకు టీచింగ్, నాన్ టీచింగ్ తగినంతగా ఉందా? లేదా? ఈ కళాశాలలకు క్లాస్‌రూంలు, ఫర్నిచర్,

ల్యాబ్స్ తదితర మౌలిక వసతులు నిబంధనలు ప్రకారం కలిగి ఉన్నాయా? లేవా? ఇందులో చదువుకున్న విద్యార్థులు నాణ్యమైన విద్య అందిస్తున్నాయా? లేవా?, విశ్వవిద్యా యాల మార్గదర్శకాలను, ప్రభుత్వ మార్గదర్శకాలను ఈ కళాశాలలు పాటిస్తున్నాయా? లేవా?, ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాజరు శాతం సక్రమంగా ఉందా? లేదా?, ఈ కళాశాలలో ఉన్న అవకతవకలు, అక్రమాలపై ఏమైనా ఫిర్యాదులున్నాయా , అలాగే విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ తనిఖీలకు వెళ్లినప్పుడు వారికి ఎదురైన అనుభవాలను ఈ నివేదికలో పొందుపర్చాల్సిందిగా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. హయ్యర్, స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలు తమ అధికారులను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలకు సహకారం అందించేందుకు పంపాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న కళాశాలల పనితీరుతో పాటు పేద విద్యార్థులకు ఉద్దేశించిన ఫీజులు సక్రమంగా వినియోగమవుతున్నాయా? లేదా? తదతరాంశాలపై వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ ఛానెల్ ప్రారంభం

 నగర ప్రజలకు ఎప్పటికప్పుడు కీలక అప్ డేట్స్ ఇచ్చేందుకు విసి సజ్జనార్ అధికారిక వాట్సాప్ ఛానెల్ ను బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌కు సంబంధించిన మఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు, లేటెస్ట్ అప్ డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు ఈ ఛానెల్ ను ఫాలో కావాలని సిపి సజ్జనార్ ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ సమాచారం పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రజలకు సూచించారు. నెట్టింట జరిగే తప్పుడు ప్రచారాలను నిజం అని భావించి మోసపోకూడదన్నారు. సోషల్ మీడియాతో పాటు డిజిటల్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాల సైతం గణనీయంగా పెరి గాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ముఖ్యంగా AI టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమో? ఏది అబద్దమో? తెలుసుకోలేక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. ఎఐ, డీప్ ఫేక్ లాంటి మోసాలకు ‘సేఫ్ వర్డ్’ తో అడ్డుకట్ట వేసుకోవచ్చని వెల్లడించారు.

డీప్ ఫేక్ మోసాలను ఎదుర్కొనేందుకు ‘సేఫ్ వర్డ్’ ఉపయోగించాలని సజ్జనార్ హైదరాబాదీయులకు సూచించారు. గత కొద్ది కాలంగా ఎఐ సాయంతో సైబర్ కేటుగాళ్లు డీప్ ఫేక్ క్లోనింగ్‌కు పాల్పడుతున్నారని తెలిపారు. మనిషి ఫోటో ద్వారా వారి వీడియోలను తయారు చేసిన, వాటికి వాయిస్ యాడ్ చేస్తున్నారని తెలిపారు. క్లోనింగ్ వీడియోలను చూస్తే ఎవరైనా నిజమైనవే అని నమ్మే అవకాశం ఉంద న్నారు. ప్రజలు టెక్నాలజీని సేఫ్‌గా వాడుకోవాలని సూచించారు. తెలియని విషయాల జోలికి వెళ్లకూడదని, అనవసర లింక్ లను క్లిక్ చేయకూడ న్నారు. హైదరాబాద్‌కు సంబంధించిన సమాచారం కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ ఛానెల్ ను ఉపయోగించుకోవాలన్నారు. దీని ద్వారా అన్ని కీలక అప్ డేట్స్ అందిస్తామని సీపీ సజ్జనార్ పునరుద్ఘాటించారు. కాగా, సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించు కోవ డంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముందుంటారు. ఎక్స్ వేదికగా ఆయా అంశాల గురించి ఆయన స్పందించే విధానం నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా ఆయన ఆర్‌టిసి ఎండిగా ఉన్న సమయంలో బెట్టింగ్ యాప్స్ అరికట్టేందుకు పెద్ద యుద్ధమే చేశారు. ఇందుకోసం ప్రపంచ యాత్రికుడు అన్వేష్ లాంటి వారి సాయం తీసుకున్నారు. వారి ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్‌ను అరికట్టేందుకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలను అలర్ట్ చేసే పలు కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. తప్పుడు ప్రచారాల గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.