StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortbetlikeyakabetrealbahisjokerbetyakabetmasterbettingkulisbetrinabetrealbahisbahiscasinoyakabetrinabetatlasbetroketbetbetkolikaresbetbetlike

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

polobet

casibom giriş

wbahis

Holiganbet

polobet

polobet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

polobet

rokubet

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

grup porno

iptv satın al

jojobet

jojobet giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

artemisbet

rokubet

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

splash

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

meritking güncel giriş

rokubet

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

sonbahis

bahix

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

casivera

online diyetisyen

wbahis

polobet

kralbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betebet

Meritking Giriş

Kavbet

Galabet

jojobet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom giriş

ultrabet

Marsbahis

vbet

piabet

piabellacasino

grandpashabet

grandpashabet

betexper

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

ronabet giriş

milosbet

romabet

padişahbet giriş

jojobet giriş

matbet

matbet giriş

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

betasus

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

Meritking

yakabet resmi adres

wbahis

Casibom

wbahis

wbahis

Agb99

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

beyoğlu escort

betpuan

xgeorgia

sekabet

pusulabet

matbet

imajbet

marsbahis

imajbet

wbahis

grandpashabet

cratosslot

matbet

grandpashabet

casibom

meritking

jojobet giriş

jojobet

betsmove

Slot Mahjong

meritking güncel

jojobet giriş

Betpas

matbet

matbet giriş

sekabet giriş

1xbet

çağlayan escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking

piabellacasino

baywin

piabellacasino

mislibet

bahisvebaihs

nitrobahis

piabellacasino

parmabet

piabellacasino

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet giriş

royalbet

royalbet giriş

polobet

polobet giriş

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

casibom giriş

casibom

mislibet

casinolevant

grandpashabet

marsbahis

kingroyal

dinamobet

betturkey giriş

kingroyal

Google Maps Yorum Satın Al

piabellacasino

padişahbet

betoffice

padişahbet

padişahbet giriş

betpas

asyabahis

holiganbet

betebet

ultrabet

betturkey

casibom

casibom giriş

casibom güncel giriş

tarafbet

casinolevant

galabet

pusulabet

padişahbet

casinolevant

casinolevant

betcio

jojobet

Sweet Bonanza

Sugar Rush 1000 Oyna

spinco

madridbet

madridbet giriş

casinolevant

grandpashabet

meritking

marsbahis

betpipo

meritking

casinolevant

casinolevant

meritking

casinolevant

madridbet

casibom giriş

Sweet Bonanza Oyna

casibom giriş

teosbet

lunabet

Hiltonbet giriş

vdcasino

matbet

kralbet

prizmabet

wbahis

marsbahis

Hacklink panel

Hacklink satın al

marsbahis

bahiscasino

casinowon

enbet

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

meybet

Jojobet giriş

suratbet

süratbet

sonbahis

hilarionbet

vdcasino

betovis

marsbahis

casibom

marsbahis

betplay

imajbet

sekabet

meritking

grandpashabet

marsbahis

vdcasino

timebet

kralbet

casibom

kralbet

casinolevant

meritking

All Smo Tools

matadorbet

ultrabet

kralbet

ఆ కార్పొరేటర్లకు భవిష్యత్తులో పదవులు: కెటిఆర్

ఉప ఎన్నిక సమయంలో కార్పొరేటర్లు అద్భుతంగా పోరాడారు

జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశంలో భూముల అమ్మకంపై నిలదీయాలి

బిఆర్‌ఎస్ కార్పొరేటర్లకు కెటిఆర్ దిశానిర్దేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత నగరంలో ఉన్న కార్పోరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందించారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ కార్పోరేటర్లందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జిహెచ్‌ఎంసి పరిధిలోని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, కార్పొరేటర్లతో కెటిఆర్ సమావేశమయ్యారు.

బల్దియా సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు కెటిఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ కార్పొరేటర్లకు వివిధ అంశాలపైన మార్గదర్శనం చేశారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఎలాంటి అవినీతికి తావులేకుండా పనిచేశారని, కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతంగా సేవలందించారని ప్రశంసించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కార్పొరేటర్లు అద్భుతంగా పోరాడారని అభినందించారు. పరిశ్రమలకు కేటాయించిన వాటితో పాటు హైదరాబాద్‌లో భూముల అమ్మకంపై జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశంలో నిలదీయాలని కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం వైఫల్యంపై నిలదీయాలని సూచించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ అందరినీ గెలిపించుకుంటుందని వారికి కెటిఆర్ భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లకి రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందని కెటిఆర్ తెలిపారు. ఈనెల 29వ తేదీన జరగనున్న దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని కెటిఆర్ కోరారు.

దీక్ష దివాస్ సంబరాలకు సంబంధించి నగరంలో ఏర్పాట్లపై మాజీమంత్రి, ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల తెలంగాణ పోరాటంలో ఎన్ని ప్రయత్నాలు జరిగినా, కెసిఆర్ దీక్ష తర్వాతనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. ఇంతటి గొప్ప ఘట్టాన్ని ప్రజలందరికీ మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఆ దిశగా ఈనెల 29వ తేదీన నగరంలో భారీగా దీక్ష దివాస్‌ను నిర్వహించనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి, జిహెచ్‌ఎంసి పరిధిలోని ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఆ.. డబ్బా ప్రచారం ఇకనైనా ఆపేయండి:హరీష్‌ రావు

మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న డబ్బా ప్రచారం ఆపేయండి

మధ్యాహ్న భోజనం కార్మికులకు వెంటనే పెండిగ్ బిల్లులు చెల్లించాలి

మాజీ మంత్రి హరీష్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామనే డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపేయాలని సిఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అప్పుల పాలయ్యాం మొర్రో అని మొత్తుకుంటున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 13 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మధ్యాహ్న భోజన కార్మికురాలు తమ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన వీడియోను హరీష్‌రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.

గడువు ఇవ్వండి లొంగిపోతాం.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

పార్టీలో చర్చించేదుకు గడువు కోరాం

సోనూ దాదా నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నాం

వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు గడువు కోరిన మావోయిస్టు పార్టీ

అప్పటి వరకు భద్రతా దళాల కూంబింగ్ ఆపాలి

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అనంత్ పేరుతో లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ ఆయుధ విరమణపై కీలక ప్రకటన చేసింది. మహారాష్ట్ర-, మధ్యప్రదేశ్, -ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి జోన్) ప్రతినిధి అనంత్ పేరుతో బహిరంగ లేఖ రాసింది. గడువు ఇస్తే ఆయుధ విరమణ చేస్తామని ప్రకటించింది. అప్పటి వరకు భదత్రా దళాల కూబింగ్ నిలిపివేయాలని కోరింది. ఇంకా లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది.

సిసిఎం సతీష్ దాదా, మరొక సిసిఎం కామ్రేడ్ చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేసింది. ఎంఎంసి(మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్) స్పెషల్ జోనల్ కమిటీ ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నట్లు లేఖలో స్పష్టం చేసింది. తాము ఆయుధాలు విడిచిపెట్టడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సమయం ఇవ్వాలనిఅభ్యర్థించింది. పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని, ఈ నిర్ణయాన్ని అందరితో పంచుకోవడానికి కొంత సమయం పడుతుందని, సహచరులను సంప్రదించి, పార్టీ పద్దతి ప్రకారం ఈ సందేశాన్ని తెలియజేయడానికి సమయం కోరింది.

మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థించింది. సమయం కోరడం వెనుక ఎటువంటి నిగూఢ ఉద్దేశ్యం లేదని, సమాచారం చేరవేసేందుకు ఈ సమయం కోరామని లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మావోయిజం నిర్మూలనకు విధించిన గడువు (మార్చి 31, 2026)లోపే తాము కోరిన సమయం ఉందని, అప్పటి వరకు, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించి, భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని కోరింది.

కాగా, పిఎల్‌జిఏ వారోత్సవాలు నిర్వహించమని, ఈ క్రమంలో రాబోయే పిఎల్‌జిఏ వారంలో ఎటువంటి కార్యకలాపాలను ప్రభుత్వం నిర్వహించకూడదని, ఇన్‌ఫార్మర్ల కార్యకలాపాలను సైతం నిలిపివేయాలని, ఇతర సమాచారం ఆధారంగా దళాలను నియమించకూడదని లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇరువైపులా ఇలాంటి ప్రయత్నాలతో సంభాషించుకోవడానికి మెరుగయిన నిర్ణయం తీసుకోవడానికి సాధ్యమవుతుందని, ఆహ్లాదకరంగా, సానుకూల వాతావరణం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు జోన్‌ల్ కమిటీలు తమ కార్యకలాపాలన్నింటిని నిలిపివేయాలని అనంత్ విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలోని సారాంశాన్ని మీడియా ద్వారా సహచర మావోయిస్టులకు తెలియజేయాలని అనంత్ కోరారు.

ఆయుధ విరమణపై త్వరలోనే తేదీ ప్రకటిస్తాం

ఆయుధ విరమణపై త్వరలోనే తేదీని ప్రకటిస్తామని అనంత్ లేఖలో స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులతో సమావేశం నిర్వహించడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించాలని కోరారు. సమిష్టిగా ఆయుధ విరమణ చేసి ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాల కార్యకలాపాలను నిర్ణీత తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభుత్వం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే ఈ ప్రక్రియ సాధ్యమవుతుందని అనంత్ పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం ప్రభుత్వ ప్రతిస్పందన కోసం వేచి చూస్తామని లేఖలో తెలిపారు. సహచరులు సోను దాదా, సతీష్ దాదా మూడు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి తగిన సమయం ఇవ్వాలని కోరారు.

బిసిలకు అన్యాయం చేస్తే.. రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది: జాజుల

సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో బిసిలకు తీరని అన్యాయం

బిసిలతో చర్చించిన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించాలి

బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

మన తెలంగాణ / హైదరాబాద్: త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి శాస్త్రీయత లేకుండా అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు రిజర్వేషన్లు కేటాయించారని బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అధికారులు చేసిన తప్పిదాలకు బిసిలకు గతం కంటే ప్రస్తుతం జరగబోయే నష్టం ఎక్కువ అని ఆయనన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కాదు కదా ఇప్పుడు ఉన్న బిసి రిజర్వేషన్ల కే రాష్ట్ర ప్రభుత్వం గండికోడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బిసి రిజర్వేషన్లు అతి తక్కువ కేటాయించి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు 18 శాతం నుండి 22 శాతం వరకు బిసి రిజర్వేషన్లు అమలు జరిగితే ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో 16 శాతం నుండి 20 శాతం వరకే రిజర్వేషన్ల ను కేటాయించారని, అనేక డివిజన్లలో మండలాలలో బిసిలకు ఒక్కటి కూడా సర్పంచ్ సీటు రిజర్వు కాలేదని, మండలాల వారీగా చూస్తే ఒక మండలంలో గత ఎన్నికలలో కంటే కనీసం రెండు మూడు గ్రామాల బిసి కోటను తగ్గించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బిసి రిజర్వేషన్ కోటాను తగ్గించి జనరల్ కోట ను పెంచారన్నారు. దీనిని బట్టి బిసిలకు రావలసిన సర్పంచ్ స్థానాలను అగ్రకులాలకు కట్టబెట్టాలని కుట్ర ఇందులో దాగి ఉందని ఆయన ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అన్ని వివరాలను సేకరించి అతి త్వరలోనే సి ఎస్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని, ఆయన న్యాయం చేయకుంటే కోర్టుల ద్వారా పోరాటం చేస్తామని జాజుల హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బిసి మంత్రులు, ప్రజాప్రతినిధులు బిసిలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. 25న మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం, 30న చలో హైదరాబాద్, డిసెంబర్ 8 న చలో ఢిల్లీ కార్యక్రమాలను నిర్వహించి బిసి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

డిసిసిలపై సీనియర్ల రుసరుస

మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల సమరానికి ముందు కాంగ్రెస్ పార్టీలో కుంపటి మొదలైంది. పార్టీ అధిష్టానం ఎంతో ఆచి-తూచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు (డిసిసి)ల ఎంపిక చేపట్టినప్పటికీ సీనియర్లలో తీవ్ర అసంతృప్తులు, గందరగోళానికి దారి తీసింది. జోడు పదవులు ఉండరాదంటూనే ఐదుగురు ఎంఎల్‌ఏలకు, ఒక ఎంఎల్‌ఏ భార్యకూ, ఇరువురు కార్పొరేషన్ల చైర్మన్లకూ డిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్డడంతో అసంతృప్తి జ్వాల ఎగిసి పడింది. పైగా పార్టీలో చాలా జూనియర్లకు, స్థానికంగా గుర్తింపు లేని వారికీ పదవి కట్టబెట్టడంతో పార్టీలో కలకలం చెలరేగింది. డిసిసి అధ్యక్ష పదవుల ఎంపిక పారదర్శకంగా నిర్వహిస్తామని, పైరవీలు చేయరాదని పార్టీ పరిశీలకులు మొదటి నుంచి మీడియా ద్వారా చెబుతున్నా, చివరకు పైరవీలు చేసిన వారికే పట్టం కట్టారంటూ అనేక జిల్లాల్లో నాయకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అధ్యక్ష పదవి ఎంపికలో తీవ్ర పోటీ, వివాదస్పదమైన రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల డిసిసి ఎంపిక ప్రక్రియను పెండింగ్‌లో పెట్టారు. ఇదిలాఉండగా పలు జిల్లాల్లో నాయకుల విమర్శలపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిస్పందిస్తూ బిసిలకు పెద్ద పీట వేశామని, అన్ని వర్గాలకూ సముచిత న్యాయం కల్పించామని వివరించారు.

సిఎం నా గొంతు కోశారు: నల్లగొండలో గుమ్ముల

నల్లగొండ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అనుచరుడు గుమ్మున మోహన్ రెడ్డి డిసిసి అధ్యక్ష పదవి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గొంతు కోశారని ఆయన ఆక్రోశంగా అన్నారు. పార్టీ కోసం తన నిబద్ధత, సేవలను పట్టించుకోకుండా కేవలం మంత్రి కోమటిరెడ్డి అనుచరున్ని అనే మిషతో తనకు పదవి ఇవ్వలేదని ఆయన భగ్గుమన్నారు. వలస వచ్చిన వారినే అందలం ఎక్కిస్తున్నారని గుమ్ముల మోహన్ రెడ్డి మండిపడ్డారు.

యాదాద్రిలో ఒక్కరికే మూడు పదవులా?

యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని బీర్ల ఐలయ్యకు అప్పగించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా ఉన్నారని, ఇప్పుడు డిసిసి అధ్యక్ష పదవి కూడా కట్టబెడితే నలభై ఏళ్ళుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తమ సంగతేమిటని డిసిసి అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన సోత్నక్ ప్రమోద్ కుమార్ ప్రశ్నించారు. తన నిబద్ధతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి ప్రత్యామ్నాయంగా ఏదైనా పదవి ఇస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

కామారెడ్డిలో నేతల కస్సు-బుస్సు

కామారెడ్డి డిసిసి అధ్యక్ష ఎంపికలోనూ తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు డబ్బు-జబ్బు పట్టిందని స్థానిక నాయకులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన మల్లిఖార్జున్‌కు డిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టారని, సదరు వ్యక్తికి నాయకునిగా గుర్తింపు లేదని కాంట్రాక్టర్‌గానే గుర్తింపు ఉందని మండిపడుతున్నారు.

ఎంఎల్‌ఏలకు డిసిసి పీఠం

ఇదిలాఉండగా ఐదుగురు ఎంఎల్‌ఏలకు డిసిసి అధ్యక్ష పదవులు కట్టబెట్టారు. కరీంనగర్‌ః చొప్పదండి ఎంఎల్‌ఏ మేడిపల్లి సత్యం, పెద్దపల్లి ః రామగుండం ఎంఎల్‌ఏ రాజ్ ఠాకూర్, నిర్మల్ ః ఖానాపూర్ ఎంఎల్‌ఏ వెడ్మ బొజ్జు, నాగర్ కర్నూలుః అచ్చంపేట ఎంఎల్‌ఏ వంశీ కృష్ణ

యాదాద్రి భువనగిరి:

ఆలేరు ఎంఎల్‌ఏ బీర్ల ఐలయ్య

క్రిస్టియన్, ఆర్థిక సంస్థ చైర్మన్ కె. దీపక్ జాన్‌ను సికింద్రాబాద్‌కు, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివ సేనా రెడ్డిని వనపర్తి డిసిసి అధ్యక్షునిగా నియమించారు. ఇకపోతే మొత్తం ముప్పై ఆరు మంది డిసిసి అధ్యక్షుల్లో ఐదుగురు మహిళలకు డిసిసి పీఠం దక్కింది. సిద్దిపేటః అంక్షారెడ్డి, కుమురంబీం అసిఫాబాద్‌ః ఆత్రం సుగుణ, భద్రాద్రిః తోటి దేవి ప్రసన్న, జనగామః లకావత్ ధన్వంతి, మహబూబాబాద్‌ః భూక్యా ఉమ. ఇదిలాఉండగా ప్రస్తుతం సిద్దిపేట డిసిసి అధ్యక్షునిగా ఉన్న నర్సారెడ్డి కుమార్తె అంక్షా రెడ్డికి డిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టడం పట్ల కొంత మంది స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ డిసిసిలు ఎందుకు ఆగినట్లు ?

సంగారెడ్డి డిసిసి అధ్యక్ష పదవి నిర్మలా జగ్గారెడ్డికే ద క్కుతుందన్న ప్రచారం జరిగినప్పటికీ ఏ కారణంగా నో నాయకత్వం పెండింగ్‌లో పెట్టింది. రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్ష పదవి పారిజాతకే దక్కుతుందని పార్టీ నాయకులు భావించినా ప్రకటించకుండా పెం డింగ్‌లో పెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినందున అభ్యంతరాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతున్నది.

సామాజిక సమతుల్యత: మహేష్ గౌడ్

ఇదిలాఉండగా డిసిసి అధ్యక్షుల ఎంపికలో సామాజిక సమతుల్యత పాటించామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పదిహేను మంది బిసిలకు, ఐదుగురు ఎస్‌టిలకు, ముగ్గురు ఎస్‌సిలకు డిసిసి పీఠాలు దక్కాయని వివరించారు. 

గొప్పగా సమ్మిట్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పా ట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్ 8,9 తేదీల్లో జ రగనున్న ఈ సమ్మిట్‌కు ప్రపంచ వ్యా ప్తంగా ప్రతినిధులు హాజరవుతారని, వివిధ దేశాల అంబాసిడ ర్లు కూడా పాల్గొనే అవకాశం ఉందని అందువల్ల ఇక్కడికి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రంగారె డ్డి జిల్లా కందుకూరు మండలంలోని ఫ్యూచర్ సిటీ లో జరుగుతున్న తెలంగాణ రైజిం గ్ గ్లోబల్ సమ్మి ట్ ఏర్పాట్లను ఆదివారం మధ్యాహ్నం సిఎం రేవం త్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమ్మిట్‌కు పాస్‌లు లేకుం డా ఎవరు ఎంట్రీ కా వడానికి వీలు లేదని, సమ్మిట్‌కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎం ట్రీ ఇవ్వకూడదని సిఎం ఆదేశించారు. శాఖల వా రీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటుందని ఏర్పాట్లను తాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని సిఎం రేవంత్ చెప్పారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల ని పార్కింగ్‌కు ఇబ్బంది రావొద్దని ఆయన తెలిపారు. బందోబస్తుకు వచ్చే పోలీస్ సిబ్బందికి ఇ బ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, సమ్మిట్‌కు హాజరయ్యే మీడియాకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రభుత్వ విజయాల ఆవిష్కరణ

కాగా, రాష్ట్ర భవిష్యత్ చిత్రపటాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సమ్మిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తవుతు న్న సందర్భంగా రెండు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజు రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, స్కీమ్‌ల వివరాలను ప్రదర్శించనున్నరు. రెండో రోజు తెంలగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్‌కు పారిశ్రామిక వేత్తలు, బడా కంపెనీల ప్రతినిధులు తరలిరానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

రిజర్వేషన్లు ఖరారు

మనతెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి అందజేసిన వెంటనే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై ప్రభు త్వం సమగ్ర మార్గదర్శకాలతో శనివారం జిఒ 46ను ప్రభుత్వం విడుదల చేసి, ఈ రిజర్వేషన్ల జాబితాను జిల్లాల కలెక్టర్లకు పంపించింది. జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో అధికారులు ఆదివారం సాయంత్రం కల్లా పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియను దాదాపు పూర్తి చేశారు. జిఒ 46 మార్గదర్శకాల ప్రకారం జిల్లాల్లో కలెక్టర్లు పంచాయతీల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లను సోమవారం పంచాయతీరాజ్ శాఖకు అందజేయనున్నారు. సోమవారం(నవంబర్ 24) హైకోర్టులో రిజర్వేషన్ల అమలుపై విచారణ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఖరారైన రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించనున్నట్లు తెలిసింది. పంచాయతీల్లో 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు అమలు చేస్తే ఎన్నికలు నిర్వహించుకునేందుకు గతంలో హైకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంగళవారం(నవంబర్ 25) కేబినెట్ సమావేశంలో రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఆదేశాలు, ఇతర అంశాలను ఆమోదించనున్నట్లు సమాచారం. అనంతరం ఈనెల 26న పంచాయతీ ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎస్‌ఇసి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదివారం(నవంబర్ 23) గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రకారం.. ఓటర్ల జాబితాను పరిశీలించి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మళ్లీ ప్రచురించారు. ఓటర్ల జాబితా సవరణ పూర్తయిన నేపథ్యంలో ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల షెడ్యూ ల్ విడుదలయ్యే అవకాశముంది. 31 జిల్లాల్లో 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించి, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా.. గత సెప్టెంబర్ 2న వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదాను ప్రకటించారు.

గ్రామాల్లో ఊపందుకున్న రాజకీయం

రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి.. ఎన్నికల రంగంలోకి దూకేందుకు స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నా రు. జిల్లాల్లో ఆదివారమే రిజర్వేషన్లు ఖరారైన నేపత్యంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఔత్సాహికులు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.దాంతో గ్రామాల్లో మళ్లీ రాజకీయం ఊపందుకుంది. గత కొంతకాలంగా ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో నాయకులు, యువకులు చొరవ చూ పారు. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో గ్రా మాల్లో ఎవరు పోటీలో ఉంటారో దాదాపుగా ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఈనేపథ్యంలో గ్రామంలో ముఖ్య నాయకులను కలుస్తూ వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఆయా పార్టీల్లోని నా యకులు, కార్యకర్తలు, ఏ పార్టీలో సభ్యత్వం లేని వారు కూడా ఆ యా పార్టీల మద్దతు కూడగట్టి పోటీచేయాలనే ఆసక్తితో ఉన్నారు.

ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పార్టీలు

పంచాయతీ ఎన్నికలకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఆయా రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. జిల్లాలవారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా తమ కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా ఆయా పార్టీల నేతలు ప్రణాళికలు సిద్దం చే సుకుంటున్నారు. వీటితోపాటు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సిఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. మరో వైపు ప్రస్తుత సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఈ టూర్‌లో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే అవకాశం ఉందని సమాచారం.

స్మార్ట్‌ఫోన్ ఉంటే.. క్షణాల్లో టికెట్

సాధారణ ప్రయాణీకులకు రైల్వేలు తమ సేవలను మరింత సులభతరం చేశాయి. స్టేషన్‌కు వెళ్ళి జనరల్ టికెట్ల కోసం ఇ ప్పుడు క్యూలైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. టెకెట్‌ల కోసం హైరానా పడాల్సిన అవసరం లేదు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని టికెట్ సహా ఇతర సేవలు స్టేషన్‌కు వెళ్లకుండానే పొందవచ్చు. దీంతో సమయం కూడా ఆదా అవుతుంది. జనరల్ టికెట్ తీసుకోవాలంటే రైల్వే స్టేషన్‌కు వెళ్లి క్యూలైన్‌లో నిలబడి టికెట్ తీసుకోవాల్సిందే. అయితే ఎవరూ లైన్‌లో నిలబడకుండా, రైల్వే స్టేషన్‌కు రాకుండా టికెట్ తీసుకునేలా రైల్వేశాఖ చర్యలు తీసుకుంది.

ఇందు కోసం ప్రత్యేకంగా భారతీయ రైల్వే ‘యూటీఎస్‘ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యూటిఎస్ యాప్ పై ప్రయాణికుల్లో ఇప్పుడిప్పుడే అవగాహన వస్తోంది. దీనిలో టికెట్ కొనుగోలు చేసే క్రమంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో పాటు, యూపిఐలను వినియోగించవచ్చు. దీంతో పాటు ‘ఆర్ – వాలెట్‘ను వినియోగించి టికెట్టు కొనుగోలు చేయవచ్చు. ఈ యాప్‌లో గరిష్ఠంగా రూ. 20 వేల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ యాప్‌ను రోజుకు సుమారు 90 వేల మందికి పైగా వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ యాప్ జనరల్, ప్లాట్ ఫాం, సీజనల్ టికెట్లు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

లేబర్ కోడ్స్ దేశాభివృద్ధికి బాటలు: దత్తాత్రేయ

‘లేబర్ కోడ్స్ దేశాభివృద్ధికి బాటలు వేసే సంస్కరణలు..’ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్‌ను తీసుకుని రావడం పట్ల ఆయన ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని కార్మిక చట్టాల చరిత్రలో ఇది ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు ప్రధాన లేబర్ కోడ్స్‌గా రూపొందించడం గొప్ప విషయమని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరళత, పారదర్శకత, సమర్ధత, కార్మికుల సంక్షేమం దృష్టా తీసుకున్న కీలక నిర్ణయం అని దత్తాత్రేయ తెలిపారు. లేబర్ కోడ్స్ ద్వారా వచ్చిన కీలక మార్పులతో అందరికీ సాంఘిక భద్రత, అసంఘటిత రంగం,

గిగ్ వర్కర్లు, ఫ్లాట్ ఫార్మ్ వర్కర్ల వంటి వర్గాలకు కూడా రక్షణ పొందేలా మారిందని ఆయన వివరించారు. పరిశ్రమలకు సరళీకృత విధానాలు పెట్టుబడులు, ఉత్తత్తి, ఉద్యోగ అవకాశాలు పెరిగేలా వ్యవస్థను రూపొందించారని ఆయన ప్రశంసించారు. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం తదితర అంశాలు ఈ కోడ్ ద్వారా మెరుగైన పద్ధతిలో అమలులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. తాను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో ఈ సంస్కరణలకు సిద్ధమయ్యాయని ఆయన తెలిపారు. చట్టాలు కాగితాలపైనే కాకుండా కార్మికుల జీవితాలలో మార్పు తెచ్చేలా అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు.