StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortbahiscasinobahiscasino girişmasterbettingmasterbetting girişwinxbetwinxbet girişkalebetkalebet girişbetlikekalebetmasterbettingrinabettrendbetrealbahislivebahislordbahispashagaminghazbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

jojobet

Streameast

onwin

ataköy escort

ultrabet

ultrabet

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

polobet

casibom giriş

Betoffice

Holiganbet

polobet

polobet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

polobet

rokubet

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

grup porno

iptv satın al

jojobet

jojobet giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

artemisbet

rokubet

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

meritking güncel giriş

rokubet

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

sonbahis

bahix

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

hilarionbet

online diyetisyen

Betoffice

polobet

kralbet

palacebet

deneme bonusu

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

matbet

Meritking Giriş

Kavbet

Galabet

jojobet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom giriş

ultrabet

Marsbahis

vbet

holiganbet

betmoon

perabet

perabet

piabellacasino

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

ronabet giriş

milosbet

romabet

padişahbet giriş

vaycasino

pusulabet

pusulabet giriş

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

nitrobahis

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

Meritking Giriş

yakabet resmi adres

Betoffice

Casibom

Betoffice

Betoffice

Agb99

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

sekabet

pusulabet

vdcasino

imajbet

marsbahis

imajbet

Betoffice

grandpashabet

piabet

pusulabet

grandpashabet giriş

casibom güncel giriş

meritking

jojobet

holiganbet

betsmove

Slot Mahjong

meritking güncel

jojobet giriş

Betpas

holiganbet

holiganbet giriş

sweet bonanza oyna

1xbet

fatih escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking

piabellacasino

starzbet

piabellacasino

mislibet

bahisvebaihs

nitrobahis

milosbet

parmabet

piabellacasino

odeonbet

odeonbet

coinbar

coinbar

odeonbet giriş

coinbar giriş

royalbet

royalbet giriş

polobet

polobet giriş

marsbahis

casibom

bahiscasino

vdcasino

sekabet güncel giriş

casibom giriş

casibom

izmir escort

vdcasino

padişahbet

vdcasino

betovis

betasus

berlinbet

casinowon

suratbet

süratbet

betcio

parmabet

sekabet

casinolevant

betticket

marsbahis

marsbahis

marsbahis

casinowon

grandpashabet

marsbahis

kingroyal

dinamobet

betturkey giriş

kingroyal

Google Maps Yorum Satın Al

polobet

casivera

enbet

sonbahis

padişahbet

kralbet

betoffice

padişahbet

padişahbet giriş

betpas

kralbet

asyabahis

holiganbet

betebet

ultrabet

betturkey

imajbet

matbet

sekabet

casibom

casibom giriş

casibom güncel giriş

vdcasino

tarafbet

pusulabet

meritking

casinolevant

galabet

hiltonbet

royalbet

yakabet

pusulabet

padişahbet

casinolevant

casinolevant

vdcasino

betcio

jojobet

Sugar Rush 1000

bahiscasino

bahiscasino giriş

masterbetting

masterbetting giriş

winxbet

winxbet giriş

Sugar Rush 1000 Oyna

Sugar Rush

cratosroyalbet

kalebet

kalebet giriş

spinco

kralbet

marsbahis

grandpashabet

madridbet

madridbet giriş

casinolevant

grandpashabet

meritking

marsbahis

betpipo

meritking

casinolevant

kralbet

casinolevant

meritking

casinolevant

madridbet

‘హిల్ట్’ ఆపండి

మన తెలంగాణ/హైదరాబాద్: ‘హిల్ట్’ పాలసీ పే రిట రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ‘తెర’ లేపినందున, వెంటనే ‘హిల్ట్’ను నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా బిజెపి రాష్ట్ర నాయకులు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్వర్యంలో పార్టీ నా యకులు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. గతంలో హైదరాబాద్‌లో పరిశ్రమలకు కేటాయించిన విలువైన భూములను ‘హైదరాబా ద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ (హిల్ట్) పేరిట రియల్ ఎస్టేట్ భూములకు కేటాయించే ప్రయత్నం చేస్తున్నదని రాంచందర రావు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించారు. కాబట్టి దీనిని నిలి పి వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా ఆయన గవర్నర్‌ను కోరారు. అనంత రం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని సుమారు తొమ్మిది వేల ఎకరాల విలువైన పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ‘హిల్ట్’ పాలసీతో అవినీతికి దారి తీస్తుందని ఆరోపించారు.

ఎస్‌ఆర్‌వో రేట్లలో ముప్పై శాతం మాత్రమే చెల్లించి భూములను మార్చుకునే విధానం వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాసంపదను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ విధానం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని, రైతులకూ తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిల్ట్ పాలసీ ద్వారా ప్రభుత్వం ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తున్నదని గవర్నర్‌కు వివరించామని ఆయన తెలిపారు. గతంలో పరిశ్రమలకు ప్రభుత్వం తక్కువ ధరలకు కేటాయించి, ప్రోత్సహించిందని ఆయన చెప్పారు. కాగా ఇప్పటి మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే, సబ్-రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌వో) రేట్లు అసలు మార్కెట్ విలువలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. ఇటీవల హైదరాబాద్ పరిసరాల్లో ఒక సంస్థ ఒక్క ఎకరాన్ని నూటా యభై కోట్ల రూపాయల వరకు కొనుగోలు చేసిందంటే ఇలా భూములు నిజమైన మార్కెట్ ధరల ఆకాశాన్ని తాకుతున్న సమయంలో హిల్ట్ పాలసీ ప్రకారం పరిశ్రమల భూములను కేవలం ఎస్‌ఆర్‌వో రేట్లలో ముప్పై శాతం మాత్రమే చెల్లించి కన్వర్ట్ చేసుకునే అనుమతి ఇవ్వడం అనుమానాలకు దారి తీస్తోందని రాంచందర్ రావు అన్నారు.

చల్లారిన పత్తి చిచ్చు

మన తెలంగాణ/హైదరాబాద్: పత్తి కొనుగోళ్ల లో సిసిఐ విధించిన నిబంధనలతో ఏర్పడిన ప్రతిష్టంభనలు ఎట్టకేలకు తొలగాయిని రా ష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. సిసిఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విధించిన కొత్త నిబంధనల కారణంగా కొనుగోళ్లకు అనుమతులు లభించని జి న్నింగ్ మిల్లులలో కొనుగోళ్లు ప్రారంభించేందుకు సిసిఐతో జరిపిన చర్చలు ఫలించాయన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ నోటిఫై చేసిన మొత్తం 330 జిన్నింగ్ మిల్లుల్లో సోమవారం నుండి పత్తి కొనుగోళ్లు చురుగ్గా కొనసాగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. సిసిఐ కొత్త నిబంధనల కా రణంగా అనుమతులు లభించకపోవడంతో జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ గతంలో సమ్మెకు దిగింది. దీనివల్ల రైతులు తాము పండించిన పత్తిని అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి తుమ్మల స్వయంగా చొరవ చూపారు. ఆయన కేం ద్ర మంత్రులతో పాటు సిసిఐ సిఎండితో ప్రత్యేక చొరవ తీసుకుని వివరణాత్మక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సానుకూల స్పందన రావడంతో, 330 మిల్లుల్లో కొనుగోళ్లకు అనుమతులు లభించాయి. సమస్య పరిష్కారంలో మంత్రి తుమ్మల చూపిన వేగవంతమైన చర్యలకు, చొరవకు జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులకు, మిల్లుల కార్మికులకు ఉపశమనం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సిసిఐ రాష్ట్రంలో రూ. 3,201 కోట్లతో మొత్తం 4.03 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించిందని మంత్రి తుమ్మల వెల్లడించారు.

‘మహా’నగరం ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపారు. జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీల వి లీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్, అర్బన్ డవలప్ మెంట్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. జీహెచ్‌ఎంసీలో 7 ము న్సిపల్ కార్పొరేషన్లు, 20మున్సిపాలిటీలను వి లీనం చేయాలని ఈ నెల 25న జరిగిన మం త్రివర్గ సమావేశంలో ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతోపాటు విలీనం అంశాన్ని ఈ నెల 25న జరిగిన జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించారు. కాగా దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభు త్వం నుంచి గవర్నర్‌కు ఆర్డినెన్స్‌ను పంపించడంతో ఆయన ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ ఫైల్ లోక్ భవన్ నుంచి న్యాయ శాఖకు వ చ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌కు సం బంధించిన గెజిట్ విడుదల చేయనుంది. విలీ న పక్రియలో భాగంగా 27 మున్సిపాలిటీల ఆ స్తులను హ్యాండ్ ఓవర్, వంటి అంశాలను గు ర్తించి గెజిట్‌లో ప్రభుత్వం వివరిస్తుందని అధికార వర్గాల సమాచారం. 

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నిరంజన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరులో తట్ట మన్ను తీయలే, చూసుకోని ముర్వ చెప్పుకుని ఏడ్వ అన్నట్లుంది పాలమూరు పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చేసింది ఏం లేదని అన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. శంకుస్థాపనలు తప్ప రెండేళ్లలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలకు ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించయారు. పదేళ్లలో కేసీఆర్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3.48 లక్షల కోట్లు తద్వారా చేసిన అభివృద్ధి, గణాంకాలు కండ్ల ముందు ఉన్నాయని చెప్పారు. కేవలం రెండేళ్లలో కార్పోరేషన్ రుణాలు కాకుండానే రూ.2.50 లక్షల కోట్లు అప్పుచేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంజన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారు, అభివృద్ధి పనులు పక్కనపెట్టారని, రైతులను గాలికి వదిలి పంటలను వాటి కర్మానికి వదిలేశారని మండిపడ్డారు. బోనస్ అని బోగస్ మాటలు చెప్పి బ్రోకర్ల అవతారం ఎత్తారని అన్నారు. తెలంగాణ రైజింగ్ అంటూ అప్పులు తెస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ రెవెన్యూ 25 శాతం వరకు పెరిగిందని, అయితే కాంగ్రెస్ పాలన పుణ్యాన ఈ ఏడాది – 0.76 శాతానికి పడిపోయిందని విమర్శించారు. అడ్డగోలు అప్పులు చేసి అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తూ రైజింగ్ అంటూ పొంకనాలు కొట్టడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.

క్యూర్…ప్యూర్…రేర్

 తెలంగాణ భవిష్యత్‌కు మూడంచెల అభివృద్ధి విజన్

 4 లక్షల మందితో ప్రజాభిప్రాయ సేకరణ

 ఐఎస్‌బి, నీతి ఆయోగ్ సంస్థల సహకారంలో డాక్యుమెంట్ రూపకల్పన

 విజన్..స్ట్రాటజీ ప్రాతిపదికన భవిష్యత్ ప్రణాళిక

 రోడ్‌మ్యాప్ సిద్ధం..జాతికి పాలసీ అంకితం

 ప్రజాభవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు

 ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేలా విజన్ డాక్యుమెంట్ తయారీ

 2034 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం

 2047 నాటికి 3 ట్రిలియన్ల డాలర్ల ఎకనమీ లక్షం

 దేశంలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచేలా ప్రణాళిక

 రోల్‌మోడల్‌గా చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియా

 డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు –

 డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్ విడుదల

 తెలంగాణ రైజింగ్ 2047లో పాలసీ డాక్యుమెంట్‌ను ప్రకటిస్తాం

 విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి 2047కు సంబంధించి మూడంచెల ప్రణాళికను రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం కొత్తగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ( క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) గా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్టు చెప్పారు. ఆదివారం సాయంత్రం సచివాలయంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎం మంత్రివర్గ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడు అంశాలతో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను తయారు చేస్తున్నామన్నారు. పాలసీ/స్ట్రాటజీ ప్రాతిపదికన ఈ డాక్యుమెంట్‌ను రూపొందించామని చెప్పారు. రాష్ట్రాన్ని సమగ్ర సమీకృత అభివృద్ధి దిశగా పయనింపచేసి ఆదాయం పెంచి పేదలకు పంచడమే లక్షంగా బలమైన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తయారు చేస్తున్నామని వివరించారు.

ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి పారదర్శక పాలసీలు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పాలసీలకు పెరాలసిస్ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. విజన్ డాక్యుమెంట్‌లో లక్షలాది మందిని భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 4 రకాలుగా స్థానిక సంస్థల పాలన జరిగేదని,. దీంతో తెలంగాణను 3 విభాగాలుగా విభజించుకున్నట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలపై ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం ఓఆర్‌ఆర్ వరకు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా , ఓఆర్‌ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు పెరీ అర్బన్ రీజియన్ ఎకనామీగా, త్రిబుల్ ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ రీజియన్‌గా మూడంచెల వ్యవస్థగా అభివృద్ధి పరచనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా నెట్ జీరో సిటీ, కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చాలని ఆయన పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్‌లో సంక్షోభాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద (క్యూర్) : వాహనాల కాలుష్యం తగ్గించడం, నెట్ జీరో సిటీగా కాలుష్య రహిత నగరంగా మార్చాలంటే క్యూర్ చేయాల్సిందే అని రేవంత్ రెడ్డి చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్‌లో పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్‌లో సంక్షోభాలను అధిగమించేలా 2170 చదరపు సర్వీస్ సెక్టార్‌గా మారుస్తున్నామని చెప్పారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను బయటలకు తరలించడంతోపాటు కుంటలు, నాలాలను ప్రక్షాళన చేయడం ద్వారా మెట్రో విస్తరణ, మూసీ రివర్ డెవలప్‌మెంట్ పై ప్రణాళిక తయారు చేసుకున్నామన్నారు. 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్లును 360 కిలోమీటర్లతో రెండో మణిహారంగా తయారు చేసుకుంటున్నాం

పెరీ అర్బన్ రీజియన్ ఎకనామీ (ప్యూర్) : భారత్ ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ ఇలా పెరీ అర్బన్ రీజియన్ అకానమీ తయారవుతోందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అమరావతి నుంచి చెన్నై వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, బుల్లెట్ రైళ్ల ద్వారా రవాణాను సులభతరం చేస్తున్నామని చెప్పారు. మచిలీపట్నం పోర్టుకు కూడా కనెక్టివిటీ తీసుకువస్తున్నామని, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మరింత అభివృద్ధి చెందుతామన్నారు. అదనంగా నాలుగు ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి తీసుకురానున్నామని, సులభతరమైన రవాణా కోసం వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలో కొత్త విమానాశ్రయాలు నిర్మాణం కానున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి బుల్లెట్ రైళ్లు తీసుకువస్తున్నామని, వస్తువుల రవాణాకు సముద్ర మార్గం అవసరం కావడంతో మచిలీపట్నంకు గ్రీన్‌ఫీల్డ్ డెడికేటెడ్ హైవే నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని, పెరీ అర్బన్ మాన్యుఫాక్చరింగ్ జోన్ లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచనున్నట్లు వివరించారు.

రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ రీజియన్ (రేర్) :

వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్షం చేయకుండా రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ రీజియన్ తీసుకురానున్నట్లు చెప్పారు. అగ్రికల్చర్ పార్కులు, పండ్లు, కూరగాయల పరిశ్రమలతో పాటు మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం అని, సేంద్రీయ వ్యవసాయ భూములు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మూడు రకాల వ్యవస్థలను, ప్రణాళికలను క్రోడీకరించి విజన్ డాక్యుమెంట్ తీసుకురానున్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని, ఆదాయం పెంచి పేదలకు పంచేలా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌లో జవహర్‌లాల్ నెహ్రూ తీసుకువచ్చిన పాలసీల ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ముందున్నామన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించలేకున్నామని, ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

విద్య తండాలకు కూడా చేరినా సాంకేతిక పరమైన, నాణ్యమైన విద్యను ఇవ్వాలని చూస్తున్నామన్నారు. సింగిల్ టీచర్ స్కూల్ నుంచి మహానగరం వరకు విద్యావ్యవస్థలో ప్రణాళికలు తీసుకువచ్చి నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాం. తద్వారా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామని స్పష్టం చేశారు. దేశం వందేళ్ల ఉత్సవాలు జరుపుకునేలాగా భవిష్యత్‌లో తెలంగాణలో 10 శాతానికి పెరిగేలా ఫ్యూచరిస్టిక్ పాలసీ రూపొందింమన్నారు. దార్శనికతే భవిష్యత్ ప్రణాళికలు అని, తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ అందించాలని నిర్ణయించామని, ఉత్సవాల్లో అతిధులకు భవిష్యత్ ప్రణాళికలు వివరిస్తామన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రజాభవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. తమకు రోల్ మోడల్ చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, సింగపూర్ అని, వాటినే ఆదర్శంగా తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు తమకు పోటీ కాదని, ప్రపంచ దేశాలతో పోటీ పడనున్నామని, వారితో పోటీ పడి ఆయా దేశాలనుంచి పెట్టుబడులను ఆకర్షిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌కు కేంద్రం అంగీకారం :

హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కోసం కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని అన్నారు. హైవేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపొందించడమే తమ లక్షమన్నారు. అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ ప్రణాళికగా మార్చుకుని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అందించాలన్న ఆలోచనతో భవిష్యత్ కోసం పారదర్శకమైన పాలసీలు తీసుకువచ్చి జాతికి అంకితం చేయబోతున్నామని చెప్పారు. ఇందుకుగాను ప్రపంచ దేశాల్లో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణులను, మన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్ర భవిష్యత్‌కు నష్టం జరగకుండా విజన్ డాక్యుమెంట్‌లో లక్షలాదిమందిని భాగస్వాములను చేశామని వివరించారు. ఐఎస్‌బి, నీతి ఆయోగ్ సహకారం తీసుకుని పాలసీ డాక్యుమెంట్‌ను తయారు చేస్తున్నామని, చాలా నిశితంగా ప్రతి అంశాన్ని విశ్లేషించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌కు మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్డు ఉందని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. గతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండడంతో అభివృద్ధిలో అనేక సమస్యలు ఎదురయ్యాయని, వీటన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావడం ద్వారా కొత్త నగరం నిర్మాణమవుతుందని స్పష్టం చేశారు.

ఇదీ ప్రభుత్వ కార్యాచరణ

* నేడు, రేపు రైజింగ్ విజన్ డాక్యుంట్‌పై మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.

* 2వ తేదీ రాత్రికి నివేదక సమర్పించాలి.

* 3,4 తేదీల్లో అన్ని శాఖలు ఇచ్చిన నివేదికలను సీఎస్, స్పెషల్ సీఎం, సిఎంఓ అధికారులు పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి తుది ప్రతి సిద్ధం చేయాలి.

* 6వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలి.

* అన్ని విభాగాల అధికారులు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం పూర్తి సమయం కేటాయించాలి

* గ్లోబల్ సదస్సు ఏర్పాట్ల నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలి.

వేలం వెర్రి.. ఆశావహులకు కొర్రీ

సర్పంచి పోస్టు ఏకగ్రీవాల కోసం భారీగా ఖర్చు

ఓటు హక్కుతో దక్కాల్సిన పదవులను వేలం పాట ద్వారా దక్కించుకునేందుకు కొందరు అభ్యర్థుల ప్రయత్నాలు

గ్రామ పెద్దలు, కుల సంఘాల నేతలతో మద్దతుతో ముందుగానే కుదుర్చుకుంటున్న ఒప్పందాలు

ఆ మేరకు ఒక్కరే నామినేషన్లు దాఖలు

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన

నిబంధనలు పాటిస్తేనే ఏకగ్రీవం చెల్లబాటు

మార్గదర్శకాలు జారీ చేసిన ఎస్‌ఇసి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఓటు హక్కుతో రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన సర్పంచి పదవులను కొందరు వేలం పాట ద్వారా సొంతం చేసుకుంటున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేసేందుకు బడా రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామపంచాయతీల్లో సర్పంచి పీఠాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకునేందుకు పలువురు అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లోకి వెళితే అనవసరంగా భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసుకోవాల్సి రావడంతో పాటు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తామన్న గ్యారంటీ ఉండదు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకుల మద్దతుతో సర్పంచి పదవికి ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. పలు గ్రామాలలో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుని కేవలం ఒక్కరే నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది.

సిద్దిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్, రాయిపోల్, వర్గల్ మండలాల్లోని కొన్ని గ్రామాలలో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు కేవలం ఒక్కరే నామపత్రాలు దాఖలు చేసినట్లు సమాచారం. ఏకగ్రీవం కోసం రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. హత్నూర మండలంలోని రెండు తండాల్లో ఏకంగా ఎన్నికలు లేకుండానే పదవులు దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామంలో సర్పంచి పదవి కోసం రూ.కోటి వరకు వెచ్చిస్తానని ఓ వ్యక్తి ప్రకటించినట్లు ప్రచారం జరిగింది. నవాబుపేట మండలం దొడ్డిపల్లి సర్పంచి, ఉప సర్పంచి పదలను ఏకగ్రీవం చేశారు.జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి సర్పంచి పదవిని ఓ సీడ్ ఆర్గనైజర్‌కు రూ.90 లక్షలకు, ఇదే మండలం గోర్లాఖాన్‌దొడ్డిలో రూ.57 లక్షలకు, అలాగే లింగాపురం గ్రామంలో రూ.34 లక్షలకు వేలంలో పదవులను ఏకగ్రీవం చేసుకున్నారు.

గద్వాల మండలం కొండపల్లిలో రూ.60 లక్షలకు ఓ సీడ్ ఆర్గనైజర్ వేలంతో పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే నల్లదేవునిపల్లి (కుర్వపల్లి)లో రూ.45 లక్షలకు ఒకరు కైవసం చేసుకోగా, రూ.15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిస్తోంది. మల్దకల్ మండలం సద్దలోనిపల్లి సర్పంచి పదవిని రూ.42 లక్షలకు ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. వీరాపురంలో రూ.50 లక్షలకు వేలం పాడుకున్నట్లు సమాచారం. మరోవైపు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగ్గూడెం వాసులు తమ గ్రామ సర్పంచి పదవిని రూ.20 లక్షలకు వేలం పాడిన వ్యక్తికి అప్పగించాలని నిర్ణయించారు. ఇక్కడ పూర్తిగా ఎస్‌టి లంబాడీ తెగకు చెందిన వారు నివాసం ఉంటున్నారు. నల్గొండ జిల్లా బంగారిగడ్డ గ్రామ పంచాయతీకి 11 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, గ్రామస్థులందరూ గ్రామాభివృద్ధే ధ్యేయంగా భావించి ఏకగ్రీవం చేసేందుకు ఆదివారం గ్రామంలో చర్చించారు. గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయం, గ్రామ అభివృద్ధి కోసం తాము సిద్ధంగా ఉన్నామని నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులు తెలిపారు. దీనికి గ్రామస్థులందరూ వేలం నిర్వహించగా, మహ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి రూ.73 లక్షలతో గ్రామాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి సర్పంచ్ పదవికి కైవసం చేసుకున్నారు.

దీనికి అభ్యర్థులందరూ అంగీకారం తెలుపుతూ దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంటామంటూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లె సర్పంచ్ ఏకగ్రీవం అయ్యింది. ఎస్‌సి కేటగిరీకి రిజర్వ్ అయిన కొండారెడ్డిపల్లె సర్పంచ్ పదవికి 15 మంది పోటీ పడగా,గ్రామ పెద్దలు సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. గ్రామ పెద్దలు 15 మందిలో ఒకరి పేరును ప్రకటించారు. ఈ ఏకగ్రీవాలను నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.

రిజర్వేషన్ల మార్పుతో తగ్గిన బలమైన అభ్యర్థులు

పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎంఎల్‌ఎ పోరు కంటే పల్లెపోరునే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. గ్రామంలో సర్పంచి పదవి అంటేనే అందరూ ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఆ సర్పంచి పీఠం కోసం అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉంటుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికలకు ముందు నుంచే ఊళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వారి సొంత డబ్బులతో చేస్తుంటారు. మరికొంత మంది సర్పంచి పదవి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కొందరు ఆస్తులను, భార్యల పుస్తెల తాడులను కూడా తాకట్టు పెట్టి సర్పంచి పీఠం కోసం పోటీ చేస్తారు. అయితే కొన్ని గ్రామాలలో మాత్రం కొంతమంది అభ్యర్థులు గ్రామానికి ఇన్ని డబ్బులు ఇస్తాము అని చెప్పి ఏకగ్రీవం చేసుకుంటుంటున్నారు. అయితే చాలా గ్రామాల్లో సర్పంచి స్థానాలకు ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్ అభ్యర్థులకు అనుకూలంగా రాకపోవడంతో పోటీ చేయాలని భావించిన బలమైన అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో ఆశావహులు తగ్గడంతో ప్రధానంగా పలు గ్రామాల్లో ప్రధాన పార్టీల నుంచి బలమైన అభ్యర్థులే కనిపించడం లేదు. దీంతో స్వతంత్య్ర అభ్యర్థుల వైపు రాజకీయ పార్టీల చూపు మళ్లింది. స్థానిక కార్యకర్తల బలంతో గెలిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

అభ్యంతరాలు లేకుంటేనే ఏకగ్రీవాలకు ఆమోదం : ఎస్‌ఇసి మార్గదర్శకాలు

పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఇసి) దృష్టి సారించింది. ఏకగ్రీవ ఎన్నికల విషయంలోజిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, ఎంపిడిఒలకు సూచనలు చేస్తూ ఎస్‌ఇసి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. వేలంపాట, బెదిరింపులకు పాల్పడితే అలాంటి ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని ఎస్‌ఇసి స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ (ఎన్నికల నిర్వహణ) చట్టం -2018లోని 15వ నిబంధన ప్రకారం.. ఒక స్థానంలో పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే, గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి.. ఒక్కరే పోటీలో ఉండడం, ఇతర అభ్యర్థులను భయపెట్టడం లేదా మోసానికి పాల్పడడం వంటివి జరగకుంటేనే ఏకగ్రీవంగా ప్రకటించాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడానికి ముందు, రిటర్నింగ్ అధికారి నిబంధనలు పాటించారా.. లేదా..? అనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపింది. ఏకగ్రీవాల ప్రకటన కోసం జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షక విభాగాలను నియమించాలని పేర్కొంది.

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 211 ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో జరిగే వేలంపాట, ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర దుశ్చర్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక పర్యవేక్షక విభాగాల ద్వారా స్వీకరించాలని తెలిపింది. సర్పంచ్, వార్డు స్థానానికి ఏకగ్రీవమైతే అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు అభ్యర్థులతో ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని మార్గదర్శకాలలో పేర్కొంది. అదేసమయంలో పోటీలో ఉన్న ఒకే ఒక్క అభ్యర్థి నుంచి కూడా తాను ప్రత్యర్థుల ఉపసంహరణ కోసం ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని, వేలంపాటలో పాల్గొనలేదని ధ్రువీకరించే పత్రాన్ని తీసుకోవాలని తెలిపింది.

అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారణకు వస్తే.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నిర్దేశిత నమూనాలో ఎన్నిక పత్రాన్ని అందజేయాలని పేర్కొంది. ప్రత్యేక పర్యవేక్షక విభాగం నుంచి వచ్చిన నివేదికలను జిల్లా కలెక్టర్ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ధ్రువీకరించి, వాటిపై ఫిర్యాదులు, అభ్యంతరాలు లేకుంటేనే ఏకగ్రీవాన్ని ఆమోదించాలని తెలిపింది. అదే సమయంలో ఈ ఫలితం సమాచారంతో ఓ నివేదికను రూపొందించి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలని పేర్కొంది. గ్రామంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు గుర్తిస్తే.. ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని రద్దు చేయాలని మార్గదర్శకాల్లో తెలిపింది. 

నేటి నుంచి సిఎం జిల్లా పర్యటన

* 7న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంబరాల్లో పాల్గొననున్న సీఎం

* 10, 11, 12 తేదీల్లో లక్షల మంది ప్రజలు సందర్శించేలా ఏర్పాట్లు

* విలేకర్ల సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ డిసెంబర్ 8,9 తేదీల్లో జరగనున్న తరుణంలో ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుంచే రాష్ట్రవ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు ఉత్సవాలను ప్రారంభించుకుని మొదలు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 1న (సోమవారం) మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో, 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో , 3 న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో, 4 న ఆదిలాబాద్‌లో , 5న వరంగల్ జిల్లా నర్సంపేటలో, 6న నల్గొండ జిల్లా దేవర కొండలో ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లో జరిగే అన్ని ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారని, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు సంబరాల్లో పాల్గొంటారని చెప్పారు.7 న హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా వ్యవస్థకు సంబంధించిన కార్యక్రమాలను ప్రకటిస్తారని చెప్పారు. 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో రెండేళ్లలో ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, రాష్ట్ర సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తామని చెప్పారు. 9న భవిష్యత్‌లో తెలంగాణ 2047 రైజింగ్ తెలంగాణ కోసం ప్రణాళికలు, పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం, ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నామో విజన్ డాక్యుమెంట్ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సమ్మిట్‌కు రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు దేశంలోని ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని, విజయాలను సాధించిన వ్యక్తులను, ప్రపంచంలో కూడా అత్యున్నత విజయాలను సాధించిన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామన్నారు. 2047 నాటికి ఇది మా విజన్ అని ప్రకటిస్తామని, ఇక్కడ ఎలాంటి మౌలికవసతులు కల్పిస్తున్నామో వివరిస్తామన్నారు. 10, 11, 12 తేదీల్లో లక్షల మంది రాష్ట్ర ప్రజలు సందర్శించేలా స్టాల్స్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన 13న క్రీడాకారుడు లియోనల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొంటారన్నారు. ఈ వేడుకల్లో అందరం భాగస్వాములవుదామని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 

‘అదితి’కి ఆతిథ్యం

* సమగ్ర రోడ్ మ్యాప్‌ను రూపొందించండి

* అధికారులకు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం

* ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి రూ. వెయ్యి కోట్లతో అదితి అమలు

* రసాయనాలు, ఆహార ప్రాసెసింగ్, వస్త్రాలు వంటి ఇతర క్లస్టర్లకు విస్తరించాలని కేంద్రానికి విజ్ఞప్తి

* ఎంఎస్‌ఎంఈ రంగాలను ఆర్ధికంగా బలోపేతం చేయడంలో అదితి గేమ్ ఛేంజర్

* జాతీయస్థాయిలో రోల్ మోడల్‌గా మార్చడానికి తెలంగాణ సమగ్ర రోడ్‌మ్యాప్

మెదక్ లోని ఫార్మా పరిశ్రమను ఎంచుకున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీధర్‌బాబు

మన తెలంగాణ / హైదరాబాద్: అదితి పథకం కింద ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయడానికి సమగ్ర రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈలకు నిజమైన గేమ్-ఛేంజర్లుగా మారగలవని మంత్రి పేర్కొన్నారు. అదితి పథకాన్ని ప్రోత్సహించడంపై విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బీఈఈ, ఈఈఎస్‌ఎల్ మీడియా సలహాదారు ఏ చంద్ర శేఖర రెడ్డి తయారుచేసిన ప్రత్యేక నివేదికను ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతది పథకం ఎంఎస్‌ఎంలకు ఒక వరమని ప్రశంసించారు. తెలంగాణలోని అదనపు ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లకు అదితి ప్రయోజనాలను విస్తరించాలని మంత్రి కోరారు. ముఖ్యంగా వీటిలో రసాయనాలు, ఆహార ప్రాసెసింగ్, స్టీల్ రీ-రోలింగ్, ఇతర రంగాలకు ఆర్థిక, పర్యావరణ లాభాలను కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో తెలంగాణ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ త్మ కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లను ఇంధన సామర్థ్యంతో కూడినవిగా చేయడం కేవలం తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా ఉత్పాదకతను పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేస్తుందని చెప్పిన ఆయన స్థిరమైన అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని చెప్పారు. అదితి అమలులో తెలంగాణ జాతీయ రోల్ మోడల్‌గా మారాలని తాము కోరుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

2035 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్షం:

ఈ లక్ష్యాన్ని సాధించడానికి, రాష్ట్రం జాతీయ స్థాయిలో బీఈఈ, ఈఈఎస్‌ఎల్, విద్యుత్, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలులు రాష్ట్ర స్థాయిలో ఇంధన శాఖ కింద టీఎస్ రెడ్‌కో తో కలిసి పనిచేస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. 2035 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా మార్చడానికి అన్ని వాటాదారులూ కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన వనరుల అమలు, గ్లోబల్ స్టాండర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్‌లో 24/7 విద్యుత్ సరఫరా అందించడం ఈ భారీ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వివరించారు. తెలంగాణ వేగవంతమైన పారిశ్రామిక పురోగతిని ఆయన మరింతగా హైలైట్ చేశారు. రాష్ట్రం కేవలం 18 నెలల్లో రూ. 3.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని, ఇది చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని తెలిపారు. హైదరాబాద్ ఇప్పుడు ఆర్ అండ్ డీ, ఏఐ, డేటా సెంటర్ పెట్టుబడులలో దేశంలోని టాప్ మూడు పట్టణ ఎఫ్‌డీఐ గమ్యస్థానాలలో ఒకటిగా ఉందన్నారు.

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈ వెన్నెముక :

లక్షలాది మందికి ఉపాధి కల్పించే, నూతన ఆవిష్కరణలను తీసుకువచ్చే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రంగం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ఈ రంగాన్ని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన ‘అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎన్జ్రీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (అదితి)కు పూర్తి మద్దతును అందించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మద్దతుతో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) అమలు చేస్తున్న ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వేగంగా ఊపందుకుంది. నేషనల్ అదితి సిరీస్‌లో భాగంగా తెలంగాణ ఈ పథకాన్ని అధికారికంగా స్వాగతించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందే మొదటి క్లస్టర్లలో ఒకటిగా మెదక్ జిల్లాలోని ఫార్మా పరిశ్రమను ఎంచుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి బీఈఈ కృతజ్ఞతలు తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలి : బీఈఈ కార్యదర్శి మిలింద్ డియోర్

దేశ వ్యాప్తంగా అదితి పథకం యొక్క ప్రయోజనాలను అమితంగా పెంచడమే లక్షంగా పనిచేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని కోరుతున్నామని బీఈఈ కార్యదర్శి మిలింద్ డియోర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలు ఈ పథకం యొక్క ప్రయోజనాలను పెంచుకునేలా ఈ ఏడాది రూ. వెయ్యి కోట్ల నిధిని కేటాయించామన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని వినియోగించుకోవాలని కోరారు. ఇది ఎంఎస్‌ఎంఈ రంగంలో ఇంధన సామర్థ్యంతోపాటు పోటీతత్వాన్ని పెంపొందిస్తుందన్నారు. ఫార్మా పరిశ్రమలో గణనీయమైన సామర్థ్యం కారణంగా తెలంగాణలోని మెదక్ జిల్లా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.

అదితి పథకంలో పరిశ్రమలకు ఎండ్-టు-ఎండ్ మద్దతు ఉంటుంద్న్నారు. ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్స్ (ఐజీఈఏ), వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు (డీపీఆర్‌లు), ఫైనాన్సింగ్ సహాయం, పర్యవేక్షణ – ధృవీకరణ (ఎం అండ్ వీ) వంటి సహకారాలతో సహా మొత్తం రూ. 9 వేల కోట్లకు పైగా భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నామన్నారు. అదితి పథకం యొక్క విజయం ఆయా రాష్ట్రాల పటిష్ట అమలుపై ఆధారపడి ఉంటుందని డియోర్ అన్నారు. ఎంఎస్‌ఎంఈలు ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం, పర్యావరణ బాధ్యతాయుతంగా మారడానికి ఎస్‌డీఏలు ఈ పథకాన్ని చేరుకోవడం, హ్యాండ్‌హోల్డింగ్ చేయడం, స్కేలింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అదితి కార్యక్రమం ప్రస్తుతం 60 పారిశ్రామిక క్లస్టర్లు, 14 శకి ్త-ఇంటెన్సివ్ రంగాల్లో పనిచేస్తోందని తెలిపారు. వీటిలో వస్త్రాలు, ఫౌండ్రీలు, ఆహార ప్రాసెసింగ్ వంటివి ఉన్నాయన్నారు. ఈ రంగాల్లో నిర్దేశించుకున్న ఫలితాలను సాధించడానికి దశల వారీగా క్లస్టర్-నిర్దిష్ట అమలు నమూనాను అనుసరిస్తున్నాయని తెలిపారు.

గజ గజ.. చలికి వణుకుతున్న రాష్ట్రం

భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

దిత్వా తుఫాన్ ప్రభావంతో చలిగాలులు

మన తెలంగాణ/హైదరాబాద్: గత కొన్ని రోజులుగా చలికి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్నం తేడా లేకుండా గజ గజా వణికిపోతుంది. చాలా ప్రాంతాల్లో ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. అయితే దిత్వా తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన చలి గాలులు వీస్తాయని అంచనా వేసింది. దిత్వా తుఫానుతో డిసెంబర్ తొలి వారంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో వర్షాలు కురిసినా చలి తీవ్రత తగ్గే సూచనలు కనిపించడం లేదని, తీవ్రమయిన చలిగాలులు వీచే ఆవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాల్లో 9 నుంచి 11 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. చలి ప్రభావం వల్ల వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు, వ్యాధులతో బాధ పడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని, మధ్యాహ్నం సమయంలోనే ఊర్ల ప్రయాణాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. చలితోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఆదివారం ఉదయం వరకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తొమ్మిది జిల్లాల్లో 12 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా మన్యం గ్రామాల్లో మధ్యాహ్నాం 12 అయినా చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్‌లోనూ మూడ రోజులపాటు రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీలుగా నమోదవుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో 10.3, కామారెడ్డిలో 10.8, నిజామాబాద్‌లో 10.9, నిర్మల్‌లో 11, సంగారెడ్డిలో 11.2, వికారాబాద్‌లో 12.4, రాజన్న సిరిసిల్ల, జగిత్యాలలో 12.5, సిద్దిపేట, మెదక్‌లో 13, మంచిర్యాలో 13.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లిలో 14.1, రామచంద్రాపురం, పఠాన్ చెరులో 14.4, రాజేంద్రనగర్‌లో 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.

పలు జిల్లాలకు వర్ష సూచన

దిత్వా తుఫాన్ ప్రభావం రాష్ట్రంలో పలు జిల్లాలపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 2 నుంచి 5 వరకు రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చలి, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. అధిక వర్షాలతో నేలలు చిత్తడిగా మారి గాలిలోని తేమశాతం పెరగటం, ఉత్తర భారతదేశం నుంచి చలి గాలులు వీస్తుండటం, వాతావరణ మార్పుల ప్రభావంతో నవంబరు మాసంలో సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా డిసెంబరు నెలలో చలి అధికంగా ఉంటుందని, ప్రస్తుతం నవంబరు నెల నుంచే చలి పంజా విసరుతోందని చెపుతున్నారు. ఈ క్రమంలో రాబోయే మూడు రోజులు చలిగాలులు అధికంగా వీచే అవకాశందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

రెండో దశ పంచాయతీకి నామినేషన్లు షురూ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 3,242, వార్డు స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనున్నాయి. ఈ నెల 2 వరకు అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు సమర్పింవచ్చు. ఈ నెల 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 6 వరకు ఉపసంహరణ గడువు ఉంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు.

డిసెంబర్ 14వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచి ఫలితాలు వెల్లడిస్తారు. తొలి విడత నామినేషన్ల గడువు శనివారం ముగియగా, చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 17,940, వార్డు స్థానాలకు 70,596 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు మొత్తం 25,654 నామినేషన్లు దాఖలు కాగా, 37,440 వార్డు స్థానాలకు మొత్తం 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి.