క్రీడలు,తాజా వార్తలు
Auto Added by WPeMatico
తొలి భారత మహిళా క్రికెటర్ గా దీప్తి శర్మ రికార్డు..
శ్రీలంక ఒటమి.. వన్డే ప్రపంచకప్లో బోణి కొట్టిన భారత్
పాక్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాం: తిలక్ వర్మ
మన తెలంగాణ/హైదరాబాద్: ఆసియాకప్ టోర్నమెంట్ ఫైనల్లో అసాధారణ బ్యాటింగ్తో భారత్కు ట్రోఫీని అందించిన స్టార్ ఆటగాడు తిలక్వర్మ మంగళవారం హైదరాబాద్లో సందడి చేశాడు. అతను తన చిన్ననాటి కోచింగ్ సెంటర్ లింగంపల్లిలోని లేగల గ్రౌండ్ను సందర్శించాడు. అనంతరం అక్కడ విలేకరులతో ముచ్చటించిన తిలక్ వర్మ ఆసియాకప్ గురించి పలు విషయాలు వెల్లడించాడు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నాడు. ఇలాంటి స్థితిలో ఆసియాకప్లో దాయాదిల మధ్య జరిగిన మ్యాచుల్లో ఘర్షణ వాతావరణం స్పష్టంగా కనిపించిందన్నాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల పిల్ల చేష్టలకు తాము విజయంతో జవాబిచ్చామన్నాడు. పాక్ క్రికెటర్లు కవ్వింపు చర్యలకు పాల్పడిన తాము భయపడలేదన్నాడు. వారికి తాము బ్యాట్తో గట్టి సమాధానం ఇచ్చామన్నాడు. పాక్తో జరిగిన ఫైనల్లో తాము ఒక దశలో ఒత్తిడికి గురయ్యమన్నాడు. కీలక సమయంలో మూడు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడి నెలకొందన్నాడు. దీన్ని అసరగా తీసుకున్న పాక్ ఆటగాళ్లు పిల్లచేష్టలకు దిగారన్నాడు. వారు భారీ ఎత్తున స్లెడ్జింగ్కు దిగారని, అయినా తాము మాత్రం ఉద్రేకాని గురికాలేదన్నాడు. వారు ఎంత రెచ్చగొట్టిన తాను మాత్రం బ్యాటింగ్పైనే దృష్టి పెట్టానని వెల్లడించాడు. అనవసరంగా ఆవేశానికి గురై..చెత్త షాట్ ఆడితే వికెట్ కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నాడు. దీంతో తాము సంయమనం పాటించి ముందుకు సాగామన్నాడు. చివరికి విజయం సాధించి పాకిస్థాన్కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చామని తిలక్ పేర్కొన్నాడు. తన కెరీర్లో పాక్పై ఆడిన ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమైందన్నాడు. ఇది చిరకాలం తీపి జ్ఞాపకంగా ఉండిపోతుందన్నాడు.
ఒకే ఓవర్ లో 3 వికెట్లు కోల్పోయిన భారత్
మహిళల వన్డే ప్రపంచకప్… రెండో వికెట్ కోల్పోయిన భారత్
నేటి నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్.. భారత్-శ్రీలంక మధ్య తొలి పోరు
అందుకే ఆసియా కప్ ట్రోఫీ తీసుకోలేదు
దుబాయ్: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాక్పై టీమిండియా గెలిచి కప్ను కైవసం చేసుకుంది. ఆసియా కప్లో మూడుసార్లు పాక్పై భారత్ విజయం సాధించింది. ట్రోఫీ ప్రజెంటేషన్, మెడల్స్ స్వీకరించే కార్యక్రమం దాదాపుగా గంటన్నర పాటు ఆలస్యం జరిగింది. ట్రోఫీని, మెడల్స్ తీసుకోవడానికి భారత ఆటగాళ్లు అంగీకరించలేదు. ఎసిసి అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ పాక్ చెందిన వ్వక్తి కావడంతో టీమిండియా సభ్యులు తీసుకోలేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు వేరే అతిథుల నుంచి తీసుకున్నారు. అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ మీడియాతో మాట్లాడారు. అసలైన ట్రోఫీలు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాయని, 14 మంది క్రికెటర్లు, సహాయక సిబ్బందే నిజమైన ట్రోఫీలు అని తెలిపారు. తాము గెలిచిన తరువాత సంబరాలు చేసుకోవడానికి గంటన్నర పాటు వేచి ఉన్నాయని, ఛాంపియన్ ట్రోఫీ బ్యానర్ తీసుకరావడంలో ఆలస్యమైందని పేర్కొన్నారు. తాను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఛాంపియన్గా నిలిచిన జట్టు ట్రోఫీ అందుకోలేదన్నారు. నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదని ఎవరి నుంచి ఆదేశాలు రాలేదని తెలియజేశారు. ఆసియా కప్లో ఇప్పటివరకూ తనకు వచ్చి మ్యాచ్ ఫీజు ఇండియా సైన్యం కోసం ఇస్తున్నానని సూర్య ప్రకటించారు.
మైదానంలో ఆపరేషన్ సిందూరు కనిపించింది: మోడీ
దుబాయ్: ఆసియా కప్లో 2025లో భారత్ ఛాంపియన్గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పోరులో పాక్పై 5 వికెట్ల తేడా విజయం సాధించింది. తిలక్ వర్మ(69), శివం ధూబె(33) బ్యాట్తో రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్షాన్ని అందుకుంది. అంతకుముందు గింగిరాలు తిరిగే బంతులతో కుల్దీప్(4/30) పాక్ను తిప్పేయగా.. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్లు పాక్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. క్రికెట్ మైదానంలో కూడా ఆపరేషన్ సిందూరు కనిపించిందని పిఎం నరేంద్ర మోడీ ప్రశంసించారు. ప్రధాని తన ట్విట్టర్లో పోస్టు చేశారు. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒకటే ఫలితం వచ్చిందన్నారు. ఆసియాక్ కప్ ఫైనల్లో పాక్పై ఇండియా గెలిచిందని, టీమిండియా క్రికెటర్లకు అభినందనలు అంటూ పోస్టు చేశారు.
ఆసియాక్ కప్ ఫైనల్లో పాక్పై ఇండియా గెలిచిందని, టీమిండియా క్రికెటర్లకు అభినందనలు అంటూ పోస్టు చేశా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఆసియాక్ కప్లో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా భారత జట్టు తన అధిపత్యాని ప్రదర్శించిందని ముర్మూ ప్రశంసించారు. ఫైనల్ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక వర్మ తెలంగాణ గొప్ప పేరు తీసుకొచ్చారని సిఎం రేవంత్ కొనియాడారు. అద్భుతమైన టీమ్ వర్క్, డెడికేషన్, ఆత్మవిశ్వాసంతో పాక్పై విజయం సాధించారని చంద్రబాబు మెచ్చుకున్నారు.