ankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escort

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

రాగాల వాగ్దేవి రావు బాలసరస్వతి

పట్టుకుచ్చుల లాంటి రెక్కలు విప్పి పైకెగరడమే పాట లక్షణం. భావమెంత బరువైనా వినేవారి గుండెల్లోకి సులువుగా దూసుకెళ్ళి కదిలించటం దాని స్వభావం. అది భావగీతమైనా, లలితగీతమైనా, జానపదమైనా, సినిమా పాటైనా, విన్న వెంటనే అందులోని భావం శ్రోతకి స్ఫురించి, పులకింపజేయడం పాట నైజం. చిన్నమాటలతో పెద్దభావాన్ని చెప్పడం పాట కుండాల్సిన ముఖ్యమైన నేర్పు. ఒకటీ రెండు కఠినమైన పదాలు కవి వాడాల్సి వచ్చినా, వాటికి బాణీ కూర్చేవారు సంగీతంలోకి వొది గేలా మలుస్తారు. అప్పుడది మెత్తగా శ్రోతకి చేరుతుంది. 1920ల తర్వాత భావకవిత్యోద్యమం వల్ల కవులందరూ అన్ని ప్రక్రియలకంటే పాట (గేయం) రచించడానికి ఉత్సా హంగా ముందుకురికారు. పద్యాలు, పద్యకావ్యాలు, నాట కాలు… ఏది వ్రాయాలని వ్రాస్తున్నా, తోచినప్పుడు ఒక పాట కూడా వ్రాస్తూ వచ్చారు. పాటంటూ వ్రాస్తే దానికి బాణీ కూర్చుకుని పాడే గాయకులు కావాలి. పాట పాడితేనే అందం… ఉత్తినే పాటలోని మాటలు చదివితే తృప్తిగా ఉండదు… అందమూ రాదు. ఒక పక్క రేడియో, మరొక పక్క గ్రామఫోను, ఇంకొక పక్క సినిమా తెలుగు పాటకి గొప్ప ఆలంబనాలయ్యాయి. ఆ సమయంలోనే గొప్ప ప్రతిభావంతులైన గాయనీగాయకులు పాటలు పాడేందుకు ముందుకొచ్చి తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టారు.

గ్రామఫోను కంపెనీవారు అప్పటికే క్లాసికల్ సంగీతం రికార్డులుగా తీసుకొచ్చి, సంగీత ప్రియులకు వీనులవిందు చేస్తున్నారు. వారే లలిత(భావ)గీతాలను రికార్డులుగా తీసుకురావడం మొదలు పెట్టారు. అప్పట్లోనే రావు బాలసరస్వతీదేవి పాటల ప్రపంచంలోకి అడుగు పెట్టారు. 1928, ఆగస్ట్టు 28న పార్థసారథి, విశాలాక్షి దంపతులకు మద్రాసులో అపురూపంగా జన్మించింది అందాల బాలసరస్వతీదేవి. ఆ తర్వాతవారు గుంటూరులో ఉండేవారట. నాన్నగారు పార్థసారథికి ఒక సినిమా థియేటర్ ఉండేదట. తల్లి విశాలాక్షి గొప్ప సంగీతజ్ఞురాలు. ఆమెకి సంగీతమన్నా, పాటలన్నా పట్టరాని మక్కువ. అందుకే ఇంటి నిండా సంగీతమయంగా, ఎన్నో గ్రాముఫోను రికార్డులు, వాటిలోని సంగీతం ముఖరితమవుతుండగా పెరిగిన బాల సరస్వతి తనూ పాడటం మొదలు పెట్టారు. గ్రామ ఫోను రికార్డుల్లో కపిలవాయి రామనాథశాస్త్రి, స్థానం నరసింహారావు లాంటి గొప్పగొప్ప వాళ్ళు పాడిన పాటలామెకి అవలీలగా వచ్చేసేవి. ఆమె వాటిని గొంతెత్తి హాయిగా పాడేవారు. మూడునాలుగేళ్ళ వయసు చిన్నారిగా బాలసరస్వతి నాటకానికి వెళ్ళి మామూలుగా తల్లి ఒళ్లో కూర్చున్నారు.

రంగస్థలం మీద రామనాథశాస్త్రి పాట మొదలుపెట్టగానే హాలంతా పాటతో మారుమోగడం మొదలైంది. ఒళ్ళో కూర్చున్న బాలసరస్వతి తనూ వెళ్ళి పాట పాడుతానని మారంచేయడం మొదలుపెట్టింది. ఆమెను సముదాయిం చడం ఆ తల్లి వల్ల కాలేదు. ఇంతలో విషయం తెలుసుకున్న రామనాథశాస్త్రి స్వయంగా వేదిక దిగివచ్చి, బాలసరస్వతిని ఎత్తుకుని తీసుకువెళ్ళి ‘పాడమ్మా పాడు’ అన్నారు. ఆమె వెంటనే జంకూ గొంకూ లేకుండా ‘నమస్తే ప్రాణనాథా’ అంటూ, అంతక్రితమే ఆయన పాడిన పాటనే మొదలుపెట్టి అత్యంత అద్భుతంగా పాడేసరికి అందరూ ఆశ్చర్యంతో ముగ్ధులై విన్నారు. ఆయన ఆ చిన్నారిని ఆశీర్వదించి, ‘ఈ పసిపాప గొప్ప గాయని అవుతుంది’ అంటూ దీవించారు. 1935లో ఆమెకు బాలనటిగా ‘సతీ అనసూయ’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘ధృవ విజయం’, ‘బాల యోగిని’, ‘భక్త తుకారాం’ మొదలైన చిత్రాలలో నటించారు. ‘భక్త కుచేల’లో కృష్ణుడిగా చేసి గొప్పపేరు పొందడమే కాకుండా, ఆమె పాడటంలోని ప్రత్యేకతను అందరూ గుర్తించేలా చేశారు. ఆ తర్వాత సాలూరి రాజేశ్వరరావుగారితో కలిసి ‘ఇల్లాలు’ చిత్రంలో నటించారు. ఏడేళ్ళ వయసుకే గ్రామఫోను రికార్డిచ్చిన బాలసరస్వతీ దేవి కేవలం పదిహేనేళ్ళ వయసులోపునే పదమూడు సినిమాల్లో నటించి పాడారు. అదీకాక లలిత సంగీతం తెలుగు నాట వెల్లివిరుస్తున్న తరుణంలో భావగీతాలు పాడటంలో ఒక ప్రత్యేకతను సాధించారు. అప్పట్లో రాజేశ్వరరావుగారితో కలిసి ఆమె పాడిన ఈ పాటలు ఇప్పటికీ నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉన్నాయి.

‘పాట పాడుమా కృష్ణా – పలుకు తేనెలొలుకునటుల’

‘కలగంటి కలగంటి – కమల రేకుల’ వంటి ఈ రెండు పాటలు శ్రీసాలూరి వారితో కలిసి పాడారు రేడియోలో. కానీ ఈ పాటలు హెచ్.ఎమ్.వి కంపెనీ రికార్డు తీసుకొచ్చినప్పుడు రాజేశ్వరరావుగారు ఒక్కరు మాత్రమే పాడారు. అవి ఎంతో ప్రజాదరణ పొందాయి. అయితే లలితగీతాలు పాడుతూనే ఆమె సినిమా పాటకీ ఒక ప్రత్యేకతని చేకూర్చారు. రావు బాలసరస్వతీదేవి మరొకరికి తన గళాన్నిచ్చిన మొట్టమొదటి తెలుగు నేపథ్యగాయని (ప్లేబాక్ సింగర్). 1943లో శ్రీరేణుకా ప్రొడక్షన్స్‌వారు ‘భాగ్యలక్ష్మి’ చిత్రం నిర్మించారు. అందులో హీరోయిన్ కమలా కొట్నీస్, ఆ సినిమాకి సంగీతం భీమవరపు నరసింహారావు (బిఎన్ ఆర్) ఆ సినిమా కోసం -‘తిన్నెమీద చిన్నోడ వన్నెకాడా/ తేనె తుట్టిలాంటి ఓ చిన్నవాడా’ అనే సముద్రాల రాఘవాచార్య రచన మొట్టమొదటి సారిగా నేపథ్య గీతంగా రికార్డు చేశారు. ఆ పాటను రావు బాలసరస్వతీదేవి పాడి, మొట్టమొదటి నేపధ్యగానానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఆమె ఎన్నో పాటలు సినిమాలకి పాడుతూనే ఉన్నారు. ఆమె పదహారో ఏట ఆమెని హార్స్ రేస్ గ్రౌండ్లో కోలంకి రాజావారు చూశారు. రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దర్’ అయిన ఆ కోలంక జమీందారు ఆమెని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

ఆమెకి పదహారేళ్ళు, ఆయనకి నలభై ఏళ్ళు. అలాగని మొదటి వివాహమూ కాదు. విశాలాక్షిగారికి తన కూతురికి పెళ్ళికుదరడం ఎంతో ఆనందం కలిగించింది. పార్థసారధిగారికి కళలయందు ఎంత ఇష్టం ఉన్నా, ఆ గొప్ప సంబంధం, కోరుండి, ఎదురొచ్చేసరికి ఆయనా ఆనందపడ్డారు. బాలసరస్వతికి పెద్ద ఆలోచించుకునే శక్తీలేదు. అవకాశమూ లేదు. 1944లో (సుమారుగా) పెళ్ళయితే కొంతకాలం ఆమె సినిమాల్లో పాటలు పాడారు. కానీ ఎన్నో ఆంక్షల మధ్య, పరువు పరదాల చాటున మగ్గుతూనే మద్రాసు వచ్చి పాటలు పాడుతూండేవారుట. అంతవరకు స్వేచ్ఛగా రాత్రీ, పగలూ షూటింగ్లు, రికార్డింగులు చేసి, జనాల మధ్య గొప్ప ఆకర్షణతో, కీర్తి ప్రతిష్టలతో, ధనార్జనతో మసులుకున్న బాలసరస్వతీదేవి ఒక్కసారి బందిఖానాలో పడిపోయినట్లు, ఊపిరాడనట్లు బాధపడ్డారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘దేవదాసు’ సినిమా ఎంత ఉన్నత స్థానంలో ఉంటుందో, సంగీతం కూడా అంత ఉన్నత స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా బాలసరస్వతీ దేవి పాడిన మూడు పాటలూ ఆణిముత్యాలై నిలిచాయి. సి.ఆర్. సుబ్బరామనికి శాశ్వత కీర్తిని ఆర్జించి పెట్టిందీ ‘దేవదాసు’ సినిమా. సినీరంగంలోకి ప్రవేశించినప్పుడు లలితగీతాలు, కొన్ని సినిమా పాటలు సాలూరి రాజేశ్వరరావుగారితో పాడినా, ఆ తర్వాత కాలంలో ఆమె ఆయన సంగీత దర్శకత్వంలో పాటలు పాడినట్లు కనిపించదు.

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రసిద్ధులైన సంగీత దర్శకులు బి.ఎన్.ఆర్. (భీమవరపు నరసింహారావు), గాలిపెంచెల నరసింహారావు, అద్దేపల్లి రామారావు, సి.ఆర్. సుబ్బరామన్, పెండ్యాల నాగేశ్వర రావు, సాలూరి హనుమంతరావు, రమేష్ నాయుడు, టి.వి. రాజు, ఘంటసాల వెంకటేశ్వరరావు, కె.వి. మహదేవన్, ఎమ్.ఎస్. విశ్వనాథన్, రజని… ఇలా ఇలా ఎందరెందరో ఆ గాత్రం మీద మోజుతో, ఇష్టంతో పాటలు పాడించారు. సుమారు ఇరవై సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత రావు బాలసరస్వతీదేవి బయట ప్రపంచంలోకి మళ్ళీ అడుగుపెట్టారు. రాజాగారి మరణం తర్వాత ఆమె మళ్ళీ సంగీతం వైపు దృష్టి పెట్టారు. ఏ భోగభాగ్యాలు, హోదాలు, ఆస్తిపాస్తులు ఆశించి ఆమె కఠోర నిర్ణయం తీసుకున్నారో అవి ఆమెకి పెద్దగా లభించనేలేదు. రాచరిక వ్యవస్థలోని మోసాలు, దగాలు ఆమె చవిచూసారు. ఇద్దరు పిల్లలతో ఆమె నిరాడంబరంగా బయటకొచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశంలోని సంగీతాభిమానులందరూ ఆమెని సాదరంగా ఆహ్వానించారు. కొంత వయసు మీద పడినా ఆమె చక్కగా పాడగలుగు తూండటం వల్ల సంగీత దర్శకులు రమేష్ నాయుడుగారు ఆమెని ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో పాడించి గౌరవించారు.

తరువాత ఆమె సి. నారాయణరెడ్డిగారు రచించిన మీరా భజన్లు, రమేష్ నాయుడు సంగీతంలో పాడి, క్యాసెట్ విడుదల చేశారు. ఆమె సినిమా రంగంలోకి మళ్ళీ ప్రవేశించే నాటికి సినిమా పాట స్వరూప స్వభావాలు చాలా మారిపోయాయి. కాలానుగుణంగా ఆమె చేత పాడించేవీలు కూడా తగ్గిపోయింది. రావు బాలసరస్వతీదేవి ఆనాటి నుంచీ పరిశ్రమలోనే ఉండి ఉంటే మరికొన్ని మంచి పాటలు పాడగలిగే వారేమో గానీ, మధ్యలో ఖాళీ వల్ల, పూర్వస్థితిని చేరుకోవడం కష్టమే అయింది. ఆ సమయంలోనే ఆమె పాడిన పాటలన్నీ క్యాసెట్లుగా వచ్చాయి. ఆమె అభిమానులందరూ మళ్ళీ ఆమె గాత్రం విని ఆనందించారు. అయితే అప్పట్లో ఆర్థికంగా కూడా బాగా లేకపోవడం, పిల్లలు చిన్నవారు కావడం, రాజావారి ద్వారా ఆమె కొచ్చిన ఆస్తి చిక్కులు తీసుకురావడం ఆమెని బాధించాయి. అయినా ఆమె ధైర్యంగా నిలబడ్డారు. ఆమె బొంబాయిలో వసంత్ దేశాయ్ దగ్గర కొన్నాళ్ళు శిక్షణ పొందారు. సున్నితంగా పాడే విధానం, మెత్తని కంఠ స్వరం, స్పష్టంగా పలికే కళలు, సాహిత్యాన్ని భావంతో పలికే తీరు అక్కడి సంగీత దర్శకుల్ని ఆకర్షించాయి. నౌషాద్ సంగీత దర్శకత్వంలో తయారవుతున్న ‘ఉడన్ ఖటోలా’ తమిళ వర్షన్‌లో పాటలు పాడేందుకు బాలసరస్వతి కంఠాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆమెని బొంబాయి పిలిపించుకుని రెండు పాటలు రికార్డు చేశారు. హిందీలో లతామంగేష్కర్ పాడిన పాటలు తమిళంలో ఈమె పాడటం కొంత సంచలనాన్ని సృష్టించింది -ఆమె పాడిన పాటలు అంతా మెచ్చుకున్నారు. ఆ తర్వాతేం జరిగిందోగానీ మిగిలిన పాటలు రికార్డు కాలేదు. ఆ తర్వాత ఆమె పాడలేదు.

 ఇంద్రగంటి జానకీబాల

(రచన మాసపత్రిక సౌజన్యంతో)

తీరని మానసిక ఆరోగ్య సంక్షోభం

కోచింగ్ సెంటర్ల హబ్‌గా పేరు పొందిన రాజస్థాన్‌లోని కోటలో విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం సంచలనం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లో యువదంపతులు తమ నాలుగునెలల పసివాడికి విషం ఇచ్చి తరువాత ఆత్మహత్య చేసుకోవడం హృదయ విదారక సంఘటన. వారి సూసైడ్ నోట్‌లో తమ ఇల్లు, కారు అమ్మి అప్పులు తీర్చాలని రాశారు. ఈ వైపరీత్యాలను వ్యక్తిగతంగా పరిశీలిస్తే ఈ విషాదాంతాలు దేశంలోని సంక్షోభాన్ని తెరపైకి తీసుకొస్తాయి. ఈ భయంకరమైన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షోభం గ్రామాలు, నగరాలు, పాఠశాల తరగతులు, బోర్డు రూమ్స్, పొలాలు, ఇళ్ల వరకు వ్యాపించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో యాక్సిడెంటల్ డెత్స్, సూసైడ్స్ ఇన్ ఇండియా (ఎడిఎస్‌ఐ) 2023 నివేదిక ప్రకారం దేశంలో 1,71,418 ఆత్మహత్యలు సంభవించాయి.

అంతకు ముందటి సంవత్సరం కన్నా 0.38 శాతం ఎక్కువ పెరిగాయి. అండమాన్, నికోబార్‌దీవులు, సిక్కిం, కేరళలలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉండగా, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 40 శాతం కన్నా ఎక్కువగా ఆత్మహత్యల మరణాలు సంభవించాయి. గ్రామీణ భారతం కన్నా నగరాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇది నగరజీవితంలో ఒత్తిళ్లను ప్రతిబింబిస్తోంది. ఆత్మహత్యలకు బలైన వారిలో 72.8% పురుషులు ఉండటం లింగ ఆధారిత ఆర్థిక, సామాజిక ఒత్తిడిని వెల్లడిస్తుంది. ఆత్మహత్యల్లో 31.9% కుటుంబ సమస్యలే కారణం అవుతుండగా, రోగాల బారినపడి అస్వస్థులు కావడం వల్ల 19%, మాదకద్రవ్యాలకు (డ్రగ్స్) బానిసై 7% మంది, ప్రేమ సంబంధాలు, వివాహాల సమస్యలతో 10% మంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. 2023 లో సంభవించిన మొత్తం ఆత్మహత్యల్లో దాదాపు 6.3% అంటే 10,786 మంది రైతుల ఆత్మహత్యలే. వీటిలో ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటకల్లోనే రైతుల ఆత్మహత్యలు జరిగాయి. 2014 నుంచి ఈ వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉండడంతో 1,00,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 1995 2015 మధ్య దాదాపు 2,96,000 కేసులు అప్పుల పాలవ్వడం, పంటలు దెబ్బతినడం, మార్కెట్ షాక్, వ్యవస్థాపరమైన నిర్లక్షం వల్లనే సంభవించాయి.

ఇళ్ల యజమానులు, సంరక్షకుల మరణాల సంగతి కూడా బయటపడకపోయినా పరిస్థితి అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మనస్తాపానికి, వైవాహిక సమస్యలకు, గృహహింసకు గురవుతున్నారు. ఈ సమస్యలు అధికారిక గణాంకాల్లో ఇవి స్పష్టం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే మనలో ఒకరికి ఒక సామాన్య ఉదయం అకస్మాత్తుగా మనుగడ బరువు భరించలేనంతగా అనిపించింది. అనారోగ్యం లేదా అలసట వల్ల కాదు. కానీ ప్రతి చిన్న పనికి తిమ్మిరి భావన అంటే అలసత్వం కనిపిస్తోంది. తమ పని పురోగతిలో ఉంది. కనిపించే సంక్షోభం లేదు. అయినప్పటికీ భరించలేనంత భారం అనిపిస్తోంది. అటువంటి నిశ్శబ్ద భయాందోళన క్షణంలో ఎవరితోనో మాట్లాడడం కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ప్లాట్‌ఫారమ్‌ను చేరువకావడం సురక్షితం అనిపిస్తోంది. మనుషులకు చేరువ అవడం కన్నా టెక్నాలజీ ఎందుకు అందుబాటులో ఉంది? అది ఒక బాధాకరమైన సత్యం లెక్కలేనంతమంది భారతీయులు ఆల్గోరిథమ్స్‌ను నమ్ముతున్నారు ఎందుకంటే వారికి వేరే ఎవరూ లేరు. ఇది సాంకేతిక వైఫల్యం కాదు, మానవ వైఫల్యం. దాదాపు 230 మిలియన్ మంది భారతీయులు మానసిక రుగ్మతలతో అల్లాడుతున్నారు.

మానసిక కుంగుబాటు, ఆందోళననుంచి మానసిక రుగ్మత, డ్రగ్స్‌కు బానిసవ్వడం వరకు పట్టిపీడిస్తున్నాయి. ప్రతి ఐదుగురిలో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నా సామాజిక కళంకం, తలకు మించిన ఖర్చు, వైద్య నిపుణుల తీవ్ర కొరత కారణంగా అధికారిక లేదా వృత్తిపరమైన సంరక్షణ ఉండడం లేదు. ఈ విధంగా వ్యక్తి తన జీవిత కాలంలో కుంగుబాటుకు గురయ్యే పరిస్థితి 10.6% వరకు ఉండగా, నిర్దిష్ట చికిత్సల మధ్య అంతరం అంటే చికిత్స సరిగ్గా అందని సమయాలు 70% నుంచి 92% వరకు ఉంటోంది. ఆత్మహత్యల అధికారిక గణాంకాలు స్థిరంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నా, ప్రతి లక్షమందిలో 16.3% ఆత్మహత్యల మరణాలు భారతదేశ అత్యధిక మానసిక ఆరోగ్య భారాన్ని తెలియజేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వెల్లడించింది. ఈ సంఖ్యల వెనుక యువ యూనివర్శిటీ విద్యార్థిని తాను జీవించడానికి అనర్హురాలునంటూ సూసైడ్ నోట్‌రాసి బ్రిడ్జిపైనుంచి కిందకు దూకేయడం వంటి నిశ్శబ్ద నిరాశామయమైన గాథలున్నాయి. అనర్హురాలిని లేదా అనర్హుడను అన్న మాట హాస్టళ్లు, ఆఫీసుల్లో ఆత్మహత్యల నోట్‌ల్లో ప్రతిధ్వనించడం నిశ్శబ్ద నిరాశామయ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది.

భారత మానసిక ఆరోగ్య వ్యవస్థలో అప్రమత్తత అవసరం. ప్రతి లక్షమంది జనాభాకు ముగ్గురు సైకియాట్రిస్టులు తప్పనిసరి కాగా, కనీసం 1.7 మంది సైకియాట్రిస్టులైనా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుండగా, భారత్‌లో కేవలం 0.75 మంది మాత్రమే సైకియాట్రిస్టులు ఉండడం చూస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుస్తుంది. అలాగే నర్సులు, సైకాలజిస్టులు, సోషల్ వర్కర్లు కూడా చాలా తక్కువగా ఉంటున్నారు. కాలేజీలు, స్కూళ్లలో వేలాదిమంది విద్యార్థులకు ‘కౌన్సెలింగ్’ ఇవ్వడానికి పార్ట్‌టైమ్ టీచర్ అరుదుగా ఉంటుంటారు. యూనివర్శిటీలు, కోచింగ్ హబ్‌ల్లో కౌన్సెలింగ్ ఇచ్చేవారు నామమాత్రం. వారిని నియమించడానికి సరిగ్గా నిధులు కూడా ఉండవు. కాగితం మీద మాత్రం, చట్టాలు చాలా ప్రగతిదాయకంగా ఉంటాయి. ఆత్మహత్యల నేరరహితానికి, మానసిక ఆరోగ్యం హామీ ఇవ్వడానికి 2017 లో మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అమలులోకి తెచ్చినా ఆత్మహత్యల మరణాలను 10% వరకైనా తగ్గించాలని 2022 లో నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ లక్షంగా పెట్టుకున్నప్పటికీ ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి.

పాఠశాలల ఆధారంగా సైకొలాజికల్ సపోర్టు స్కీమ్ ‘మనోదర్పణ్’ అమలులోకి తెచ్చినప్పటికీ చాలా అచేతనంగా మిగిలిపోయింది. ఇవికాక 47 పోస్ట్‌గ్రాడ్యుయేట్ సైకియాట్రీ విభాగాలు, 25 ఎక్స్‌సెలెన్స్ (శ్రేష్ఠత) సెంటర్లు మంజూరైనా, సిబ్బంది నియామకం, వేతనాల చెల్లింపు, శిక్షణ సమస్యల అంతరాలు అలాగే కొనసాగుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి ప్రత్యేకించి రూ. 270 కోట్ల బడ్జెట్ కేటాయించినా, అధిక శాతం ఏమాత్రం ఖర్చు కాకుండా ఉండిపోయింది. విధానాలు శుష్క వాగ్దానాలుగా మిగిలిపోయాయి. ఈ రోజు కొన్ని కోట్లమంది భారతీయులు చాట్‌జిపిటి వంటి కృత్రిమమేధ (ఎఐ) సాధనాల వినియోగంలో నిమగ్నమవుతున్నారు. ఇది నమ్మకం వల్ల కాదు ఒంటరితనం వల్లనే. ఈ ఎఐ ప్లాట్‌ఫారమ్‌ను జోక్యం, గోప్యత హామీలు లేకపోయినా సంక్షోభమైనా, అనేక మంది యువ వినియోగదారులు చికిత్స అందించే వైద్యునిగా లేదా జీవిత తోడుగా పరిగణిస్తున్నారని ది ఓపెన్ ఎఐ సిఇఒ సామ్ ఆల్ట్‌మన్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఎఐ సహకరిస్తుంది. కానీ క్రమబద్ధీకరణ లేకుంటే ఈ రిస్కులు వాస్తవానికి, మానవ భద్రతకు ప్రమాదకరమైన ప్రత్యామ్నాయంగా పరిణమిస్తాయి.

భారతదేశం మానసిక ఆరోగ్యాన్ని తరువాతి ఆలోచనగా కాకుండా అత్యవసరమైనదిగా గుర్తించాలి. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి అంతర మంత్రిత్వ టాస్క్‌ఫోర్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అది ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మహిళా శిశుసంక్షేమం రంగాలకు విస్తరించాలి. స్వయం ప్రతిపత్తిగల, స్వతంత్ర నిధుల కేటాయింపు వ్యవస్థగా స్పష్టమైన జవాబుదారీతనంతో నిర్వహించాలి. ఐదేళ్లలో ప్రతి లక్షమందికి కనీసం ముగ్గురు నుంచి ఐదుగురు వరకు మానసిక ఆరోగ్య వైద్య నిపుణులు ఉండేలా నియామకం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో నియామకమైన వైద్యనిపుణులకు శిక్షణ పొడిగించి, స్కాలర్‌షిప్‌లు, రాయితీలు కల్పించాలి. కౌన్సెలింగ్‌ను స్వచ్ఛంద సంస్థలా కాకుండా ప్రజామౌలిక సదుపాయంగా పరిగణించాలి. ప్రతిస్కూలు, కాలేజీ, జిల్లా ఆసుపత్రి, వ్యవసాయ విభాగాల్లో పూర్తికాల శిక్షణ కౌన్సెలర్ ఉండాలి. ప్రతివారితో ప్రత్యక్ష అనుబంధం ఉండాలి. భారత్ తప్పనిసరిగా అత్యవసరంగా డిజిటల్ మెంటల్ హెల్త్ పర్యావరణ వ్యవస్థను క్రమబద్ధం చేయాలి. భావోద్వేగ సహాయ యాప్స్, ఎఐ సాధనాలు గోప్యతా రిస్కులను బహిర్గతం చేయాలి. పటిష్టమైన, నైతిక, చట్టపరమైన, నిబంధనల చట్రం ఉంటేకానీ, ఆ సాధనాలు నాణ్యమైన మానవ భద్రతను కల్పించలేవు.  

ఆకలి విముక్త ప్రపంచం కోసం..

ఆహారం మనిషి జీవితానికి ప్రాణాధారం. ప్రాచీన కాలంలో ఆహారం అంటే జీవనవిధానం, ఆరోగ్యం, సంస్కృతి, ఆధ్యాత్మికత అన్ని కలసిన సమగ్ర దృక్కోణం. కానీ నేడు ఆహారలేమి, పోషకాహార లోపం, శూన్యపుటాకలి, ఆకలివిపత్తు, ఆహారపు వృథా అనేవి ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆహార సమస్యలు. ప్రపంచ వ్యాప్తంగా 78 కోట్లమంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని 190 కోట్ల మందికి సురక్షితమైన పోషకాహారం అందుబాటులో లేదని, 14 కోట్ల మంది పిల్లలు పోషకాహర లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. మన దేశంలో కల్తీ ఆహారం కారణంగా ప్రతి ఏటా 10 కోట్ల మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందులో 70 వేల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల పేర్కొంది. అందరికీ ఆహారం లక్ష్యసాధన కోసం ఐక్యరాజ్యసమితి ఆహార- వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) వ్యవస్థాపక దినం 1945 అక్టోబర్ 16వ తేదీని ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవంగా జరపాలని యుఎన్‌ఒ సభ్యదేశాలు నిర్ణయించాయి. 1981లో మొదటిసారిగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం.

2024 లో మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరికీ ఆహారపు హక్కు అనే నినాదంతో జరుపుకున్నాం. ఈ సంవత్సరం ‘మంచి ఆహారం మెరుగైన భవిష్యత్తు కోసం చేయిచేయి కలుపుదాం’ అనే ఇతివృత్తంతో వరల్డ్ ఫుడ్ ఫోరం- 2025 సమావేశాలు అక్టోబర్ 10- 17 తేదిలలో ఇటలీలోని రోమ్ నగరంలో జరుగుతున్నవి. ఇందులో బెటర్ ఫుడ్- బెటర్ ఫ్యూచర్ లక్ష్య సాధనకు బెటర్ ప్రొడక్షన్ బెటర్ న్యూట్రిషన్ బెటర్ ఎన్విరాన్‌మెంట్, బెటర్ లైఫ్ అను నాలుగు శాఖల ద్వారా ఆహార వ్యవస్థలను మెరుగుపరచవచ్చునని పేర్కొన్నారు. ఆహారం కేవలం అవసరం మాత్రమే కాదు ప్రతి వ్యక్తి హక్కు అని ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో ఆహారోత్పత్తి కంటే జనాభా పెరుగుదల అధికంగా ఉండే అవకాశం ఉంది. త్వరితగతిన మారుతున్న వాతావరణ సామాజిక ఆర్థిక అసమతుల్యతల వల్ల, భూతాపం, వరదలు, ఉక్రెయిన్ రష్యా వంటి యుద్ధాలు, ఎల్‌నినో- లానినా పరిస్థితులు జీవవైవిధ్యనష్టం, ఆహారపు గొలుసుల విచ్ఛిన్నం వంటి కారణాలతో సమీప కాలంలో అనూహ్య రీతిలో ఆహారసమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మన దేశంలో గత కొన్నేళ్లుగా రుతుపవనాలు సహకరించటం వల్ల ఆహారదినుసుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. 2021 -22 లో 316 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంచనాలను అధిగమించింది. అలాగే నూనెగింజలు, పప్పుధాన్యాలు ఉద్యానవన ఉత్పత్తులు కూడా పెరిగాయి. పంటల ఉత్పత్తి పెంపుకు కేంద్రప్రభుత్వం మిల్లెట్స్‌మిషన్, పల్స్‌రెవల్యూషన్ పిఎం కిసాన్, పిఎం పోషణ్, పిఎం గరీబ్ అన్నయోజన వంటి పథకాలను బలోపేతం చేసి 2030 నాటికి ఆహారోత్పత్తి 20% పెంపు లక్ష్యంగా పెట్టుకొని ఆరోగ్యవంతమైన, సుస్థిరమైన, స్వావలంబన భారతదేశం దిశగా ముందుకు సాగుతోంది. ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించటానికి జాతీయ ఆహార భద్రతా చట్టం -2013ను తెచ్చింది. ఆహార లభ్యత ఆహార అందుబాటు ఆహార వినియోగం, ఆహార స్థిరత్వం అను నాలుగు అంశాలు ఈ చట్టంలోని ముఖ్యఅంశాలు. దేశజనాభాలో మూడింట రెండువంతుల మందిని ఈ చట్టం పరిధిలోకి తీసుకవచ్చింది. రాష్ట్రంలోనూ 2017లో తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి రాష్ట్ర జనాభాలో 75% గ్రామీణ జనాభాను, 50% పట్టణ జనాభాను ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చింది.

స్థూలంగా ఈ చర్యల వల్ల దేశంలో ఆహార భద్రత బాగా మెరుగుపడింది. భారతీయుల ఆహారపు అలవాట్లు అత్యంత ఉత్తమమైనవని ప్రపంచ దేశాలు భారత్‌ను అనుసరిస్తే 2050 నాటికీ పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని మన ఆహార వియోగం తీరు గురించి ఇటీవల వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్‌కు చెందిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ -2024 అభిప్రాయపడటం గమనార్హం. వ్యవసాయంలో అధునాతన సాంకేతికతలను వినియోగించాలి. ఆహార నిల్వకు కోల్డ్ స్టోరేజ్, సరఫరా చక్రంను బలోపేతం చేయాలి. చెట్ల పెంపకం వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. ఆహార వ్యర్థం ఆహార వృథాలను అరికట్టాలి. ధనవంతులు ఆహారాన్ని వృథా చేయకుండా పేదవారితో పంచుకోవటం ద్వారా ఆకలితో ఉన్నవారి సంఖ్యను తగ్గించవచ్చును. ఆహారాన్ని జాగ్రత్తగా వినియోగించడం, అంగీకరించడం, గౌరవించడం అత్యంత అవసరం.

భారత రవీందర్, 99125 36316

శాంతి ‘సూత్రం’ తెగిపోకూడదు

ఇజ్రాయెల్ హమాస్ హోరాహోరీగా యుద్ధం సాగించినా రెండువైపులా అపార నష్టమే జరిగింది. గాజాలో కొన్ని వేలమంది నిర్వాసితులు కాగా, వారికి ఎలాంటి మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ అడ్డుపడడం ప్రపంచ దేశాల్లో ఆ దేశం అప్రతిష్టను మూటగట్టుకుంది. ఎట్టకేలకు గాజా యుద్ధం పరిసమాప్తం ఆశాజనకమైన కాలంగా వేడుకలతో సామూహిక ఉపశమనం కలిగిస్తుంది. పెల్లుబికిన ఆనందం రక్తసిక్తమైన సంఘటనలను మసక జ్ఞాపకంగా మారుస్తుంది. కానీ కొందరు తిరిగి అలాంటి సంఘటనలను తిరిగి చూడాలనుకుంటుండడం ఉన్మాదమే. సమాజాలు ప్రశాంతమైన రోజుల వైపు సాగుతూ తమ శక్తియుక్తులను పునర్నిర్మాణం, ప్రణాళికల కల్పన, చక్కని భవిష్యత్‌కోసం కలలు కనడానికి బదులు అసలు ఘర్షణలకు దారితీసిన కారణాలను తరచు మరిచిపోతుంటారు. శాంతి ‘సూత్రం’ తెగిపోకూడదని కోరుకుంటున్నారు. అయినప్పటికీ పశ్చిమాసియాలో ఆనందం అనుభవించే కాలాలు బహుస్వల్పం. రాజనీతిజ్ఞులు ఎన్ని హామీలు గుప్పించినా ప్రజాసంక్షేమం దిగులుగానే సాగుతుంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య బలవంతంగా ఒప్పందం కుదిర్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాలో రెండేళ్ల మారణకాండకు ఫుల్‌స్టాప్ పెట్టించగలిగినా, ట్రంప్‌తో సహితం ఏ దేశాధ్యక్షుడు ఈ రీజియన్ రక్తసిక్త స్వభావాన్ని ఇంకా మార్చలేకపోతున్నారు.

ప్రపంచం లోనే అత్యంత పాశవిక ఉగ్రవాద సంస్థల కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది ఇజ్రాయెల్ బందీలు స్వదేశానికి తిరిగి రావడం యుద్ధం ముగింపునకు సంకేతం కావచ్చు. కానీ తరువాతి కౌంట్‌డౌన్‌కు సిద్ధమవుతున్నట్టు సులభంగా గుర్తించవచ్చు. ట్రంప్ శాంతి మంత్రం కేవలం కాల్పుల విరమణపైనే దృష్టిపెట్టింది. ఇది అమెరికా, అరబ్ దేశాలు, ఐరోపా నాయకుల రాజకీయ నిర్ణయ సహకారంతోనే సాధ్యమైంది. హింసాత్మక, అణచివేత పాలననుంచి హమాస్‌ను దూరం చేయాలన్న పటిష్టమైన నిబద్ధత లేకుంటే పశ్చిమాసియా మళ్లీ సాయుధ సంఘర్షణను త్వరలో ఎదుర్కొనే దుర్భర పరిస్థితి ఏర్పడక తప్పదు. హమాస్ డిఎన్‌ఎ ఎల్లప్పుడు ఉగ్రవాదం, హింసలతో కలుషితమవుతూ ఉంటుంది. 2023 అక్టోబర్ 7 తరువాత రెండేళ్ల పాటు సాగిన యుద్ధం ద్వారా స్పష్టంగా తెలిసిందేమిటంటే గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్లను అదుపులో ఉంచి నియంత్రించడానికి సాయుధీకరణ తప్ప వేరే మార్గం లేదని హమాస్‌కు తెలిసిన సత్యం. హమాస్‌ను నిరాయుధీకరణ చేసి, గాజాలో పాలనా కేంద్రాలనుంచి తొలగింప చేయాలన్న నిబంధన, చర్చించడానికి వీలులేని పరిస్థితులే ట్రంప్ శాంతి ప్రణాళిక విజయవంతానికి అత్యంత కీలకం. రానున్న రోజుల్లో యుద్ధ జ్వాలలు తగ్గుముఖం పట్టిపోయినా, హమాస్‌ను అధికార శక్తులనుంచి తొలగించడం, వారి సాయుధ సైనికులు సామాన్య పౌరులుగా మారిపోవడమే ట్రంప్ ప్రణాళికకు అసలు అగ్నిపరీక్ష.

గత రెండేళ్ల కాలం జరిగిన సంఘటనల బట్టి గతంలో కంటే ఇప్పుడు విస్తృత ప్రాంతీయ భద్రతా చట్టం తక్షణ అవసరం మరింత ఎక్కువగా ఉంది. పాలస్తీనా స్వతంత్ర దేశంగా తిరిగి అవతరించే ప్రతిపాదన అపరిష్కృతంగా మిగిలిపోయినప్పటికీ, రెండు దేశాల ఉనికిని ఇజ్రాయెల్‌చే ఒప్పించగలరన్న నమ్మకం ఉగ్రవాద సంస్థలకు లేకపోయినప్పటికీ, ఇజ్రాయెల్, అరబ్ దేశాల పరస్పర ప్రయోజనాలే ప్రాధాన్యంగా తెరపైకి వచ్చాయి. పశ్చిమాసియాలో పూర్తిగా సాధారణ పరిస్థితి ఏర్పడుతుందా లేదా అన్న సందేహంతో ఇజ్రాయెల్ కొట్టుమిట్టాడుతోంది. పాలస్తీనా సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఇజ్రాయెల్‌తో అధికారికంగా దౌత్యసంబంధాలను ఏర్పర్చుకునేది లేదని సౌదీ అరేబియా సీనియర్ అధికార వర్గాలు బహిరంగంగా స్పష్టం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకు పాలస్తీనియన్ సమస్యతో తమకు తాము దూరంగా ఉన్న సౌదీలు, రెండేళ్లుగా సాగిన రక్తపాతాన్ని విస్మరించలేదు. ట్రంప్, నెతన్యాహు వీరిద్దరూ వ్యక్తిగతంగా ఎంతో సన్నిహితంగా వ్యవహరిస్తూ ఇజ్రాయెల్ బందీలను విడిపించడం లోను, యుద్ధాన్ని ముగింప చేయడం లోను తమ రాజకీయ వ్యూహంతో విజయం సాధించగలిగారు.

ఈ చర్య వీరిద్దరికీ రాజకీయంగా ఎంతో ప్రయోజనం కలిగించింది. ఇజ్రాయెల్ బందీలు స్వదేశానికి తిరిగి రావడానికి ముందు కూడా రానున్న ఎన్నికలకు సంబంధించి నెతన్యాహు జనాదరణ పదిశాతం పాయింట్లు ఎక్కువగానే సాధించింది. ఇజ్రాయెల్‌లో ట్రంప్ పర్యటించిన తరువాత ఈ ఆదరణ మరింత పెరుగుతుందని భావించడంలో తప్పులేదు. ఇదే ప్రధాన రాజకీయ అజెండాగా ఇజ్రాయెల్ ఎన్నికల్లో చోటుచేసుకోవచ్చు. ఇప్పటివరకు నెతన్యాహుకు అండదండలు అందించడానికి ట్రంప్ దృఢంగా కట్టుబడి ఉన్నారు. తన పదవీకాలంలో ఆయనకు ఏదైనా ఎంతవరకైనా సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఎన్నికలు అనుకున్న గడువుకు ముందే నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వం చెక్కుచెదరకుండా ఉంది. యుద్ధం పరిసమాప్తి అయినా, దాదాపు 2000 మంది పాలస్తీనా ఖైదీలు విడుదలైనా, నెతన్యాహును వ్యతిరేకిస్తున్న ఉదార మితవాద పార్టీ లు, రాజకీయ నిష్ణాతుల హెచ్చరికలు ఏమీ చేయలేకపోవచ్చు. నెతన్యాహు భాగస్వాములు చెప్పుకోదగిన సైద్ధాంతిక సానుకూలతను ప్రదర్శిస్తుండటం, నెతన్యాహు లెక్కలేనన్ని రాజకీయ పాచికల ఎత్తుగడలను వేయడానికి వీలు కల్పిస్తోంది. కానీ పశ్చిమాసియాలో ఎంత జాగ్రత్తగా సమతూక రాజకీయ చతురతను ప్రదర్శించినా, రాత్రికి రాత్రే తారుమారు కావచ్చని చరిత్ర చెబుతోంది. శాంతి పునరుద్ధరణ హామీ మళ్లీ సుదూర పేలుళ్ల ప్రతిధ్వనిగా మారిపోయే ప్రమాదం లేకపోలేదు. 

కుల వివక్షకు ఇది పరాకాష్ట

2047 నాటికి అభివృద్ధిలో భారత్‌ను ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచాలనే ‘వికసిత్ భారత్’ అంటూ నిత్యం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాం. ఇప్పటికే ఆర్థికంగా నాలుగో స్థానానికి చేరుకున్నామని, త్వరలో మూడో స్థానంకు చేరుకోబోతున్నామని భావిస్తున్నాం. అయితే కుల వివక్ష, ముఖ్యంగా అణగారిన ప్రజలపట్ల ఈసడింపు, వేధింపులకు మాత్రం అంతులేకుండా పోతున్నది. ఎంతమందిని మొక్కుబడిగా ఉన్నత పదవులకు తీసుకొచ్చినా, రాజ్యాంగపరంగా ఎన్ని రక్షణలు కల్పిస్తున్నా అత్యున్నత స్థాయిలో ఉన్నవారు సైతం ఎటువంటి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందో హర్యానాలో సీనియర్ ఐపిఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య స్పష్టం చేస్తున్నది. అటువంటి సీనియర్ అధికారి ఆత్మహత్య చేసుకుంటే, వెంటనే ఎందుకు చేసుకున్నానో వివరించిన 8- పేజీల నోట్ లభించినా దాని ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తగు చర్యలు చేపట్టేందుకు రోజుల తరబడి ప్రభుత్వం సంశయిస్తూ ఉందంటే మన వ్యవస్థలో వివక్ష ఎంత లోతుగా పాతుకు పోయిందో వెల్లడవుతున్నది.

కేవలం పూరన్ కుమార్ భార్య అమ్నీత్ పి కుమార్ ఓ సీనియర్ ఐఎఎస్ అధికారిని కావడం, కీలక నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తగు చర్యలు తీసుకోవాలని సాహసంతో పట్టుబట్టడంతో కొంతవరకైనా ప్రభుత్వం కదిలి రావాల్సి వచ్చింది. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో ఓ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైతే 24 గంటల లోగా, ఆ రాష్ట్ర ఉన్నత పోలీసు అధికారులకన్నా ముందుగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మజుందార్ అక్కడకు చేరుకొని, దర్యాప్తుపై ఆరాతీసారు. కానీ, పూరన్ కుమార్ విషయంలో జాతీయ ఎస్‌టి కమిషన్ వారం రోజులలోగా ఓ నివేదిక పంపమని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు లేఖలు రాసి ఊరుకుంది. హక్కుల సంఘాలు అధికార పక్షాల ప్రచార విభాగాలుగా ఏ విధంగా దిగజారుతున్నాయో ఇటువంటి ఘటనలు వెల్లడి చేస్తున్నాయి. సూసైడ్ నోట్ చూస్తే గత ఐదేళ్లుగా కేవలం కులం కారణంగా ఏ విధంగా వేధింపులు ఎదుర్కొంటున్నారో, మానసిక వ్యథకు గురిచేసారో వెల్లడవుతుంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గాని, వ్యవస్థలు గాని జోక్యం చేసుకొనే ప్రయత్నం చేయలేదంటే దేశంలో ఎటువంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అర్థం అవుతుంది.

‘ఐపిఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం చాలా తీవ్రమైన అంశం. దాదాపు 14-15 మంది పోలీసు ఉన్నతాధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం చూస్తేనే కేసు తీవ్రత అర్థమవుతోంది’ అంటూ పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఆందోళన వ్యక్తం చేశారు. అయినా, ఎఫ్‌ఐఆర్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు అత్యున్నత స్థాయిలో జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. దళితులు, గిరిజనులకు రాజ్యాంగపరమైన ఉన్నత స్థానాలను కల్పిస్తున్నా, రాజ్యాంగం కల్పిస్తున్న అవకాశాల కారణంగా వారు ప్రభుత్వంలో ఉన్నత పదవులకు చేరుకుంటున్నప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారని అనేక ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. డా. బిఆర్ అంబేద్కర్ వంటి వారు అటువంటి వివక్ష, వేధింపులకు తిరగబడి పోరాటం చేసినా, అనేకమంది బలవుతూ వస్తున్నారు. దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నుండి, బిజెపి జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటువంటి వేధింపులకు గురయ్యారు. ఉన్నత పదవులు / స్థానాలు లభించినా స్వతంత్రంగా వ్యవహరింపలేని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. చివరకు వారిని కలిసేందుకు ఎవ్వరైనా వస్తే కీలకమైన ప్రభుత్వంలోని పెద్దల అనుమతి తప్పనిసరి అవుతుంది.

రాజకీయంగా నాడు అత్యంత శక్తివంతమైన నేతగా పేరొందిన ఇందిరా గాంధీ స్వయంగా ఎంపిక చేసి దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఆధిపత్యం వహిస్తున్న పెత్తందారీ వర్గం ఆయనకు అడుగడుగునా అడ్డుతగిలింది. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఢిల్లీకి చేరవేసి అప్రతిష్ఠకు గురిచేసే విఫల ప్రయత్నం చేసింది. నాడు ఆయనను ఆ పదవి నుండి దించేవరకు విశ్రమించనని శపథం చేసి కాసు బ్రహ్మానందరెడ్డి విజయం పొందారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ పట్టుబట్టి జనరల్ సీటు అయిన కర్నూల్ నుండి లోక్‌సభ అభ్యర్థిగా నిలబెడితే కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రతిష్ఠగా తీసుకొని ఓడించారు. కాంగ్రెస్ అధ్యక్షునిగా చేసినా నిలదొక్కుకోనీయలేదు. అయితే పాలన సామర్థ్యంలో తెలుగు రాష్ట్రాలను పాలించిన ఏ ముఖ్యమంత్రికీ సంజీవయ్య తీసిపోరని అందరికీ తెలిసిందే. అదే విధంగా బంగారు లక్ష్మణ్‌ను బిజెపి అధ్యక్షునిగా నాటి ప్రధాని వాజపేయి ఎంపిక చేస్తే మిగిలిన వారు తట్టుకోలేకపోయారు. ఓ కుట్రపూరితంగా ఆయనపై అవినీతి మరక చల్లి పదవి నుండి తొలగించారు. ఈ మొత్తం వ్యవహారంపై తెహల్కాకు ఓ ప్రముఖ బిజెపి నేత ఆర్థిక సహాయం చేయడం గమనార్హం. రికార్డు చేసిన టేపులో రక్షణ శాఖలో తనకు ఎవ్వరో తెలియదని, ఎటువంటి పనులు చేయలేనని లక్ష్మణ్ స్పష్టంగా చెప్పినట్లు వినిపిస్తుంది.

ఇందులో కేసు ఏముందని ప్రశ్నించిన న్యాయమూర్తే ఆయనకు నాలుగేళ్లు శిక్ష విధించారు. అయితే, నాటి రక్షణ మంత్రి అధికార నివాసంలోనే రక్షణ ఒప్పందాల గురించి బేరాలు ఆడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న జయ జైట్ల్ వంటి వారిని కనీసం అరెస్ట్ కూడా చేయకపోవడం గమనార్హం. జైలులో తగిన వైద్య సదుపాయం లేకపోవడంతో అనారోగ్యానికి గురైతే కనీసం ఆయనను గాని, ఆయన కుటుంబ సభ్యులను గాని పరామర్శించే ప్రయత్నం నాటి ప్రముఖ బిజెపి నాయకులు ఎవ్వరూ చేయలేదు. కేవలం నాటి పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మారు పేరుతో జైలుకు వెళ్లి పరామర్శించారు. కానీ అనారోగ్యంతో ఆయన మృతి చెందగానే హైదరాబాద్‌కు వచ్చిన అగ్రనేతలు ఆయనను ఓ మహోన్నత దళిత నేత అంటూ పొగడ్తలు కురిపించారు.

బిజెపి అధ్యక్షునిగా నితిన్ గడ్కరీ రెండోసారి కొనసాగితే తమ ఆటలు సాగవని భయంతో కొందరు ప్రముఖులు నాటి యుపిఎ ప్రభుత్వంతో చేతులు కలిపి, ఆదాయ పన్ను నోటీసులు ఆయన కంపెనీలకు ఇప్పిస్తే, వెంటనే ఓ ప్రముఖుడితో విచారణ జరిపించి ఆయనకు ‘క్లీన్ చిట్’ ఇప్పించారు. కానీ అటువంటి అండదండలు బంగారు లక్ష్మణ్‌కు ఎందుకు లభించలేదు?

గిరిజనుల అభ్యున్నతి కోసం జీవితం మొత్తం ఎన్నో పోరాటాలు చేసి, ప్రత్యేక రాష్ట్రం సాధించిన శిబూ సొరేన్‌ను పివి నరసింహారావు ప్రభుత్వం కాపాడేందుకు రూ. 50 లక్షలు ఇస్తే, ఆ డబ్బు దాచుకోవాలని తెలియక అమాయకంగా బ్యాంకులో వేసుకొని జైలు శిక్ష అనుభవించారు. కానీ ఆరుగురు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారని నిర్దిష్టమైన సాక్ష్యాలతో మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి శాంతిభూషణ్ పిటిషన్ దాఖలు చేస్తే, ఆయన చనిపోయి చాలాకాలమైనా ఇప్పటి వరకూ దానిపై విచారించే ప్రయత్నం చేయడం లేదు. దళితులు, గిరిజనులు అనగానే వారంతా రిజర్వేషన్ల ద్వారా వచ్చారని, ప్రతిభ లేనివారని, అవినీతిపరులని హేళనగా మాట్లాడటం అలవాటుగా మారింది. అయితే, దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల నాయకత్వంలో, ఆధిపత్యంలోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలలో సైతం వారే కీలక పదవులలో ఉంటున్నారు. అయితే ప్రపంచంలోని దారుణమైన అవినీతి ప్రభుత్వాలలో ఒకటిగా భారత్ ఎందుకు అపఖ్యాతి మూటగట్టుకుంటున్నది? అందుకు ఎవ్వరు బాధ్యులు?

ఉన్నత విద్యాసంస్థల్లో సైతం ఇటువంటి వివక్ష దశాబ్దాలుగా కొనసాగుతున్నది. చివరకు మెస్‌లలో వారి పక్కన కూర్చొని భోజనం చేసేందుకు సైతం వెనకాడే ధోరణులను మనం చూడవచ్చు. అసలు కేంద్ర విద్యా సంస్థలలో, ప్రభుత్వ విభాగాలలో వారికోసం ఉద్దేశించిన సీట్లు, ఉద్యోగాలను ఉద్దేశపూర్వకంగా భర్తీ చేయకుండా వారి అవకాశాలను కుట్రపూరితంగా వమ్ముచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిద్ధాంతాల గురించి ఘనంగా మాట్లాడే ఓ నాయకుడు వాజపేయి ప్రభుత్వ హయాంలో రాజస్థాన్‌కు చెందిన ఒక ఎస్‌సి నేతను రాజ్యసభకు పంపితే, ఆయనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్‌ను ఆక్రమించుకొని, చివరకు పనివారుండే గదిలో ఉండేందుకు కూడా ఆ ఎంపికి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని అప్పట్లో రవివార్ అనే ఆంగ్ల వారపత్రిక కవర్ పేజీ కథనంతో ప్రముఖంగా ప్రచురిస్తే బిజెపి సర్దుబాటు ప్రయత్నం చేసింది. ఆ విధంగా వేధించిన నేత ఆ తర్వాత రాజ్యసభకు కూడా వెళ్లారు.

అసలు కులం, మతాలను గుర్తింపమని చెప్పుకొనే వామపక్షాలతో ఇప్పటివరకు ఈ వర్గాలకు చెందిన వారికి నాయకత్వ స్థాయికి అవకాశం ఇచ్చారా? చివరకు పిడబ్ల్యుజిలో సైతం కెజి సత్యమూర్తి వంటి వారు ఈ విషయమై చర్చలు లేవనెత్తారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. పలు సందర్భాలలో వాస్తవం కావచ్చు. అనేక మంది దొంగ కుల సర్టిఫికెట్‌లతో ఈ రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతూ, అత్యున్నత స్థానాలకు వెళ్లగలుగుతున్నారు కూడా. రిజర్వేషన్ ప్రయోజనాలు కేవలం అత్యంత అల్పమైన శాతం ప్రజలే పొందుతున్నారు. ఆ పేరుతో వారిపట్ల ద్వేషభావం పెంచుకోవడం నేరం కాగలదు. అసలు ఈ రిజర్వేషన్లు ఏ విధంగా అమలవుతున్నాయో ఇప్పటి వరకు సమీక్ష చేసి ప్రయత్నం, సాహసం ఎవ్వరూ చేయడం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు అడ్డువస్తున్నాయి. మరోవంక, ఈ వర్గాలకు చెందినవారు గ్రామాల నుండి అత్యున్నత స్థాయిల వరకు నిత్యం వేధింపులు, వివక్షలకు గురవుతున్నారు.

బలమైన చట్టాలు ఉన్నప్పటికీ, వెంటనే ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి విషయంలోనే వెల్లడైతే ఇక సాధారణుల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఈ వర్గాల ప్రజలు హింసకు, వివక్షకు గురైన సందర్భాలలో వెంటనే వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం లేదు. ప్రతిపక్షాలు సైతం ఓ రాజకీయ అవకాశంగా భావిస్తున్నాయి. కనీసం మీడియా వారిని స్వేచ్ఛగా అటువంటి ప్రదేశాలకు వెళ్లే అవకాశం పలు సందర్భాలలో ఉండటం లేదు. అటువంటి ప్రయత్నాలు చేసి పలువురు అరెస్టుకు గురైన సందర్భాలు సైతం ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లకు సైతం ఇటువంటి దారుణమైన పరిస్థితులు దేశంలో కొనసాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, వ్యవస్థలు అందుకు బాధ్యత వహించాల్సిన సంస్థలు కారణమని చెప్పాల్సిందే.

చలసాని నరేంద్ర

98495 69050

యంగ్ ఇండియా కలనెరవేరేనా?

ఉస్మానియా యూనివర్శిటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 200 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రూ. 40 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయిన సందర్భంలో కూడా 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కడతాం 2.70 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది, కనుక నిధులు విడుదల చేయమని కోరారు. అరవింద్ కేజ్రీవాల్ మూడు సార్లు పాఠశాలలు మూలంగానే ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తానని అన్నారు. మంచిదే, యంగ్ ఇండియా పాఠశాలల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలగనడంలో తప్పులేదు! కలలు సాకారం కావడానికి ఉన్న పునాది ఏమిటి అనేదే అసలు ప్రశ్న? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఆలోచన తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రట బుర్ర వెంకటేశం బుర్రలోనుంచి వచ్చిన సమగ్ర పాఠశాల విధానం. ఇప్పటికే జిల్లా కేంద్రాల వరకు విస్తరించిన కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో లక్షల రూపాయల్లో ఫీజులు వసూలుచేస్తున్న ప్రైవేటు పాఠశాలలకు ప్రత్యామ్నాయ ఆలోచన ఆయనచేసి ఉండవచ్చును,తప్పులేదు! పదేపదే పాలకులు ఈ పాఠశాలల గురించి మాట్లడడం వలన ప్రభుత్వ ప్రాధాన్యత చెప్పకనే చెప్పినట్లైంది.

28 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం కోసం 2024 ఏప్రియల్‌లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వాటిస్థితి ఇప్పుడు ఏమిటి? ప్రభుత్వం చెబుతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల అసలు స్వరూపం ఏమిటి? ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల స్థలం, 2560 మంది విద్యార్థులు, 124 మంది ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు నిర్మించాలి. ఒక్కో పాఠశాల నిర్మాణం కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చొప్పున 200 పాఠశాలల నిర్మాణం కోసం రూ. 40 వేల కోట్లు నిధులు సమీకరించాలి. 5 వేల ఎకరాల స్థలం సేకరణ చేయాలి. 24,800 మంది ఉపాధ్యాయులను కొత్తగా రిక్రూట్‌మెంట్ చేసుకోవాలి. వేలకోట్ల రూపాయలతో తరగతి గదులు నిర్మించాలి. ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యమంత్రి కలమొత్తం సాకారం అయితే, రాష్ట్రంలో 5 లక్షలమంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలుతో నాణ్యమైన ఉచిత విద్య అందుతుంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 27 లక్షల 69 వేల మంది విద్యార్థుల్లో మిగతా 22 లక్షల విద్యార్థుల భవితవ్యం ఏమవుతుంది? ఇక ఈ ఐదు లక్షల మంది విద్యార్థులు ఎక్కడనుండి వస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాల లో నుండే కదా? అంటే ఉన్న బడుల నమోదును, ఉనికిని దెబ్బ తీసి, దివాలాతీయించడమే కదా! ఇక ఇప్పటికే రాష్ట్రంలో 30,022 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు సరాసరి ఎకరం స్థలం వేసుకున్నా 30 వేల ఎకరాల విలువైన భూములు, గత 20 ఏళ్ళుగా సర్వశిక్షా అభియాన్ నిర్మించిన 2 లక్షల కోట్ల విలువైన తరగతి గదులు, 2 లక్షల 7 వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు.

ఏటా వేతనాలకు రూ. 18 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ బడుల మనుగడ, భవిష్యత్తు, ఉనికి ఏమిటి? ఇప్పటికే ప్రభుత్వ బడులకు ఇన్నివేల ఎకరాలు ప్రభుత్వ స్థలాలు ఉండగా, మరో 5 వేల ఎకరాల పంట భూములు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల కోసం సేకరించడం అవసరమా? ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో పిల్లలు లేనిచోట బోధనా సిబ్బంది ఉండడం, పిల్లలు ఉన్న చోట మౌలిక సౌకర్యాలు, బోధనా సిబ్బంది లేకపోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో అసమతౌల్య నిర్వాహణ అనేది ఎంతో బోధనాశక్తిని వృథా చేస్తున్నది. కాలక్రమంలో అనేక ప్రభుత్వబడులు మూతపడి ఉండడం, మరికొన్ని మూత దశకు చేరుకోవడం చూస్తున్నాము. ఇట్లాంటి స్థితిలో ఇప్పటికే ఏడాదిన్నర కాలంలో రెండు విద్యా కమిషన్‌లను ప్రభుత్వం నియమించింది. మాజీ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి అధ్యక్షతన నియమించిన తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్రం అంతా పర్యటించి, అనేకమంది విద్యారంగం ప్రముఖుల అభిప్రాయాలు సేకరించి ఒక నివేదిక ఇచ్చింది. ఉన్న ప్రభుత్వ బడుల స్థానంలో మండలానికి నాలుగు తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, బడులు లేని క్యాచ్‌మెంట్ ఏరియా నుండి ఉచిత రవాణా సౌకర్యం పాఠశాల వరకు కల్పించాలని, ఒక్కో మండలానికి రూ. 50 కోట్లు చొప్పున, ప్రతి ఏటా వంద మండలాలకు రూ. 5 వేల కోట్లు వెరసి ఆరు సంవత్సరాలలో 634 మండలాల్లో ప్రభుత్వ బడుల పూర్తి సంస్కరణకు రూ. 31,700 కోట్లు ఆర్థిక ప్రణాళిక కూడా ఇచ్చింది.

కానీ, ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో ఒక్క పైసా విద్యా సంస్కరణ కోసం కేటాయించలేదు. సరికదా! ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం వీటి గురించి ఎక్కడా మాట్లాడడం లేదు? అంటే, కమిషన్ సిఫార్సులు చెత్తబుట్టకు పరిమితం చేసినట్లే గదా? గత పదేళ్ళలో కెసిఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు పట్టించుకోకుండా ఒక వెయ్యి రెసిడెన్షియల్ స్కూళ్ల్లను స్థాపించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల నమోదును దారుణంగా దెబ్బతీసింది. ఆయా రెసిడెన్సియల్ పాఠశాలలు దివాలా తీసిన ఇంజనీరింగ్ కళాశాలల్లో అద్దె భవనాల్లో కునారిల్లుతున్నాయి. ఇప్పటికీ వాటి ప్రణాళిక లోపం వలన ఆయా రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు బయటపడడం, కొన్ని కూలిపోయిన సంఘటనలు వెలుగు చూశాయి. పదేళ్ళ తర్వాత కెసిఆర్ విద్యా ప్రణాళిక వల్ల విద్యా ప్రమాణాలు స్థాయి దేశంలో 31వ రాష్ట్రంగా తెలంగాణ స్థిరపడింది. పరోక్షంగా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ఈ అనాలోచిత రెసిడెన్షియల్ వ్యవస్థ వలన మరింత దెబ్బతిని ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో కార్పొరేట్ సంస్థలు విచ్చలవిడిగా పాఠశాలలు ఏర్పాటు చేసి ఒకటో తరగతికే రూ. రెండు లక్షల ఫీజులు ఏ విద్యా హక్కు చట్టం ప్రకారం వసూలు చేస్తున్నారో? చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు పాఠశాల వ్యవస్థ ఫీజులు నియంత్రణ గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడున్న అవసరాల స్థాయికి ప్రభుత్వ విద్యావ్యవస్థలో ప్రణాళిక రూపొందించాలి. అందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ వనరులు వాడుకోవడం, సద్వినియోగం దిశగా ఆలోచన చేయడం ప్రభుత్వం ముందు ఉన్న తక్షణ కర్తవ్యం.

సిఎం రేవంత్‌రెడ్డి ప్రపంచస్థాయి నాణ్యమైన ఉచిత విద్య ప్రజలకు అందచేయాలనే ఆలోచనకు రావడం చాలా గొప్ప విషయం, ఆశయం, ఆలోచన, ఆయన కల అభినందనీయమే! కానీ, కలను సాకారం చేయడంలోనే పాలకుల నైపుణ్యం ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్క రోజులోనో, ఏడాదిలోనో నెరవేరే లక్ష్యం కాదు! సుదీర్ఘ ప్రణాళిక, చిత్తశుద్ధితో కూడిన కృషి, పట్టుదల అవసరం. ప్రభుత్వ ఆలోచనలు ఆచరణీయమైన ప్రణాళిక దిశగా తెలంగాణ విద్యా వ్యవస్థ మంచి సంస్కరణ దిశగా కొనసాగాలని ఆశిద్దాం.


ఎన్.తిర్మల్ 94418 64514

ప్రతిభా నైపుణ్యాలే ప్రధానం

ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యలో ఉంది. భారతదేశాన్ని 21వ శతాబ్దపు విజ్ఞానశక్తిగా మారుస్తానని కలలు కనిన మహానుభావుడు డా. అబ్దుల్ కలాం. డాక్టర్. ఎపిజె అబ్దుల్ కలాం ఒక ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త రాష్ట్రపతి. ఇస్రో, డిఆర్‌డిఒ సంస్థల్లో ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు. భారతదేశానికి స్వదేశీ మిసైళ్ళ తయారీలో మార్గదర్శకుడు కావడంతో ‘మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా’ అని పిలిచేవారు. 2002 నుండి 2007 వరకు 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయన ప్రజలతో మమేకమై పని చేసినందున ‘పీపుల్స్ ప్రెసిడెంట్’ అనే పేరు పొందారు. భారతరత్న (1997) భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం, అలాగే పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. భారతదేశ 11వ రాష్ట్రపతి, ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త, అంకితభావంతో కూడిన విద్యావేత్త డా. ఎపిజె అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం.

ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన అంశంపై మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. డిగ్రీ పట్టాలు సరే.. ప్రతిభ, నైపుణ్యాలు ఏవి? బిఎ, బిఎస్‌సి, బిటెక్, ఎంసిఎ ఇవన్నీ విద్యార్హతల గుర్తింపులు మాత్రమే. వాటిని సంపాదించడం ఒక గొప్ప విషయం.కానీ సమాజంలో ఉద్యోగ అవకాశాలు దక్కాలంటే, ఆ పనిని చేయగల నైపుణ్యం ఉండాలి. ఉద్యోగాలు డిగ్రీని కాదు, పనితీరును చూస్తాయి. ఈ సందర్భంగా మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. డిగ్రీ పట్టాలు జీవిత విజయం కోసం ఒక మెట్టు మాత్రమే. కానీ నిజమైన ఎదుగుదల కోసం ప్రతిభ, నైపుణ్యాలు అవసరం.డిగ్రీ అంటే ఏమిటి? డిగ్రీ ఒక విద్యార్థి విద్యా ప్రయాణానికి గుర్తింపు. కానీ ఉద్యోగాలు, పరిశ్రమలు, సమాజం కోరుకునేది అభ్యాసంలో నేర్చుకున్న పాఠాల కంటే కూడా వాటిని ఆచరణలో పెట్టే సామర్థ్యం. అంటే, ప్రతిభ, నైపుణ్యాలు. ప్రాక్టికల్ నాలెడ్జ్. విద్యా ప్రమాణం కన్నా పనితీరు ముఖ్యం. ప్రతిభ అంటే ఏమిటి? ప్రతిభ అంటే పుస్తకాల్లో చదివిన విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు. ప్రతిభ అంటే ఆలోచించగలగటం, సృజనాత్మకంగా వ్యవహరించడం, కొత్త దారులు వెతకడం, నేర్చుకున్నది జీవితంలో ఉపయోగించగలగడం. ఇటీవల విడుదలైన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం మన పట్టభద్రుల్లో 51% మంది మాత్రమే ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉన్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే 8.25% మంది మాత్రమే చదువుకున్న విషయాలకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా వారంతా విద్యార్హతలతో సంబంధంలేని పనుల్లో స్థిరపడుతున్నారు. కంఫర్ట్ జోన్ చూసుకుంటూ కడుపులోని చల్లకదలకుండా ఉద్యోగాలను నెట్టుకొద్దామనేవారికి ఈనాటి పోటీ ప్రపంచం లో నిలబడలేరు.

టెక్నాలజీ వేగంగా మారుతున్నది. విద్యార్థులు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నూతన నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందే, లేనట్లయితే ఉద్యోగ మార్కెట్‌లో వెనుకబడిపోతారు. ప్రస్తుతం దేశంలో ఉద్యోగ సమస్య ఒక తీవ్రమైన సమస్యగా మారింది. కొందరు యువకులు కేవలం విద్యా పట్టాలు పొందడం ద్వారా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మార్కెట్‌లో నైపుణ్యాల లేకపోవడం వల్ల అవకాశాలు తగ్గిపోతున్నాయి. దేశంలో పౌరాభివృద్ధి, పరిశ్రమల వృద్ధి పరిమితంగా ఉండటంతో ఉద్యోగాలు సరిపోకపోవడం. యువతకు కావలసిన నైపుణ్యాలు నేర్పించే కార్యాచరణలు తక్కువగా ఉంటాయి.విజయానికి అవసరమైన నైపుణ్యాలు ఏమిటంటే అవి సాంకేతిక నైపుణ్యాలు (Technical Skills): కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ టూల్స్ ఉపయోగం, డేటా అనాలిసిస్, ప్రోగ్రామింగ్, డిజైన్, మృదు నైపుణ్యాలు (Soft Skills): కమ్యూనికేషన్ (మాట్లాడటం, వినటం) సమయ పాలన, టీమ్ వర్క్, లీడర్ షిప్ స్కిల్స్, సృజనాత్మకత, సమస్య పరిష్కరణ: కొత్త ఆలోచనలు, సమస్యలకు తక్షణ పరిష్కారాలు వెతకగలగటం. అభ్యాస సామర్థ్యం (Adaptability): మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నేర్చుకోవటం. ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణ: శ్రమ, క్రమశిక్షణతో ముందుకెళ్లే ధైర్యం. డా. కలాం నోట మాటలు ‘Learning gives creativity, Creativity leadsto thinking, Thinking provides know ledge, Knowledge makes you great’ అని కలాం చెప్పారు. వారు స్పష్టంగా చెప్పారు విద్య అంటే మార్కులు మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిని విలువైనవాడిగా మార్చే మార్గం. ఫ్యాషన్‌తో చదివినప్పుడే ఏ కోర్స్ అయినా వంటపడుతుంది. మన కాళ్ళపై మనం నిలబడడానికి అది తోడ్పడుతుంది, ప్యాకేజీ పైనే దృష్టి పెట్టి కోర్సులో చేరేవారు మనస్ఫూర్తిగా చదవలేరు, మనసుపెట్టి ఉద్యోగాలు చేయలేరు.

ఈ రోజుల్లో అన్నింటికీ డబ్బే మూలమైపోయింది. ఫలితంగా చదువు కెరియర్‌లో కూడా ఆసక్తి ఉన్న రంగాలను వదిలేసి డబ్బు బాగా వస్తుందనుకున్న రంగాల్ని ఎంచుకుంటున్నారు. అకాడమిక్ చదువులతో సంబంధం లేకుండా నిపుణత సృజనాత్మకతలపై దృష్టి పెట్టే వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకు వెళతారు, అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. నైపుణ్యమున్న వ్యక్తులు అనతి కాలములోనే ఎంచుకున్న రంగాల్లో తమదైన ముద్రను వేయగలుగుతారు. ఈ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని నేటి యువత అబ్దుల్ కలాం స్ఫూర్తిని, అతని రచనల ప్రేరణ ద్వారా ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే నేను పొందిన డిగ్రీ నా ప్రతిభకు నిదర్శనమా? నేను సమాజానికి ఏమైనా ఇవ్వగలనా? నాకు ఉన్న నైపుణ్యాలు నన్ను జీవితంలో విజయవంతుడిని చేస్తాయా? కలాం మాకు ఇచ్చిన మార్గదర్శనం ఒక గొప్ప ఆస్తి. ఆయన బాటలో నడిచే ప్రతి విద్యార్థి, పటిష్టమైన వ్యక్తిగా ఎదగడం ఖాయం. నేడు మన భారతదేశానికి కావాల్సింది ప్రతిభ, నైపుణ్యాలతో, సృజనాత్మకత, చురుకుదనం కనబరిచే యువతరం.    

కోమల్ల ఇంద్రసేనారెడ్డి

98493 75829

వైద్యం.. కార్పొరేట్లకు నైవేద్యం

ఇటీవలే హైదరాబాదులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించడానికి వచ్చిన జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజిత్ సేథ్ వైద్య విద్యారంగం బాగుపడాలంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్ షిప్ (పిపిపి) పద్ధతిలోనే సాధ్యమని ప్రకటించారు. వైద్య విద్యను ప్రైవేటు రంగానికి అప్పగించవలసిన అవసరాన్ని ఆయన మరింత వివరిస్తూ గుజరాత్ రాష్ట్రంలో బ్రౌన్ ఫీల్డ్ మెడికల్ కళాశాల విధానాన్ని గొప్ప ప్రయోగంగా అభివర్ణించారు. ప్రైవేటుపరం అంటే ప్రతికూల స్పందన వస్తుంది కాబట్టి దానికి పెట్టిన ముద్దు పేరే పిపిపి. సౌకర్యాల లేమితో కునారిల్లుతున్న ప్రభుత్వ రంగంలోని జిల్లా ఆస్పత్రులను ఈ గుజరాత్ అనుభవం ఎంత మెరుగుపరిచిందో చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు సంస్థల యాజమాన్యాల్లోకి వెళ్లి ఎంత గొప్ప వైద్య విద్యా నిలయాలుగా భాసిల్లుతున్నాయో కూడా వివరించారు. డాక్టర్ అభిజిత్ సేథ్ ప్రసంగం ఆసాంతం వింటే ఆయన పార్లమెంట్ చట్టం చేస్తే ఏర్పడిన సంస్థలలో ఒకటైన జాతీయ వైద్య కమిషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నారో లేక ప్రైవేట్ వ్యాపారుల సంస్థల కార్పొరేట్ ఏజెంట్ల ప్రతినిధిగా మాట్లాడుతున్నారో అర్థం కాదు.

ఆస్పత్రుల అజమాయిషీని చేపట్టడంవల్ల ఫలానా ప్రైవేట్ సంస్థలకు లాభార్జన కంటే సమాజంలో గుర్తింపు ఎక్కువగా వస్తుందని, ఆ ప్రైవేటు సంస్థల సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత) నిధులు సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఎంతో ఉపకరిస్తుందని సేథ్ హితబోధ చేశారు. అంతేకాదు, డాక్టర్ సేథ్ మరో గొప్ప సూచన కూడా చేశారు. వైద్యరంగంలోని సీనియర్ రిటైర్డ్ అధ్యాపకులు జాతీయస్థాయిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి సంస్థల సహకారంతో వైద్య విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దవచ్చునని చెప్పారు.1956లో పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఏర్పాటైన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ దాదాపు 63 ఏళ్ల తర్వాత రద్దయి, దాని స్థానంలో పార్లమెంటు బిల్లు రూపంలో ఆమోదించిన అనంతరం ఈ జాతీయ మెడికల్ కమిషన్ ఏర్పాటు అయింది. దానికి అధ్యక్షుడిగా ఉన్న అభిజిత్ సేథ్ ఇటీవల హైదరాబాద్ వచ్చి, వైద్య విద్యను పిపిపి రూపంలో ప్రైవేటుపరం చేసే విషయమై ఇటువంటి చిలక పలుకులు పలికారు. ఆయన సూచిస్తున్న విధంగా జరిగితే ఈ దేశంలో వైద్యరంగం మొత్తంగా ప్రైవేటుపరం అవుతుంది.

ప్రైవేట్ సంస్థలు సమర్ధవంతంగా నిర్వహిస్తాయా, ప్రభుత్వ రంగంలోకంటే వైద్య విద్య గాని, ప్రజలకు హక్కుగా అందాల్సిన వైద్యంగానీ గొప్పగా ఉంటాయా అన్నది ఎవరు కచ్చితంగా చెప్పలేరు. గుజరాత్ బ్రౌన్ ఫీల్డ్ వైద్య కళాశాల విధానం అంతటా సక్రమంగా అమలు కావాలని రూల్ ఏమీ లేదు కదా. ఆయన సూచనలు హాస్యాస్పదమే కాకుండా ప్రమాదకరంగా కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆరోగ్య హక్కును స్పష్టంగా పేర్కొనక పోయినప్పటికీ, సుప్రీం కోర్టు దీనిని ఆర్టికల్ 21 కింద (జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ) ప్రాథమిక హక్కుగా పేర్కొంటోంది. దీని ప్రకారం ఒక మనిషికి స్వేచ్ఛగా పరిశుభ్రమైన వాతావరణంలో వైద్య సంరక్షణ సౌకర్యాలతో, గౌరవప్రదంగా జీవించే వెసులుబాటు ఈ చట్టం ప్రకారం సంక్రమిస్తోంది. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే బాధ్యత రాజ్యం మీదే ఉంటుందని ఆర్టికల్ 47లోని ఆదేశిక సూత్రాల్లో రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది కూడా. పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఏర్పడిన సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డాక్టర్ అభిజిత్ సేథ్ మరి రాజ్యాంగాన్ని చదువుకోలేదా? సుప్రీం కోర్టు నిర్వచనాలు ఆయన దృష్టికి రాలేదా? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది వైద్యుల సంఘం.

అదేమీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వ సంస్థ కాదు. ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులను అటువంటి సంస్థలు చేయాలని, పదవీ విరమణ చేసిన అధ్యాపకులు ఒక జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరడం హాస్యాస్పదమే కాక వైద్య విద్యారంగానికి, ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరమైందని కూడా చెప్పాల్సిందే.ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఈ పిపిపి పద్ధతిని అనుసరించాలని తహతహలాడిపోతున్న తరుణంలో, ఆ ప్రయత్నాలు ప్రారంభించి ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్న సమయంలో డాక్టర్ అభిజిత్ సేథ్ వంటివారు చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాల అసమర్ధతను బట్టబయలు చేస్తాయి.వాటిని సమర్థించే విధంగా ప్రతిపాదనలు తీసుకురావడం దుర్మార్గం. మిగతా విషయాలు ఎలా ఉన్నా విద్య, వైద్యం ఈ రెండు రంగాలు ప్రభుత్వ అధీనంలోనే ఉండి ఈ దేశంలోని ప్రతి మనిషికి అవి సమానంగా అందే విధంగా చూడటం ఒక రాజ్యాంగపరమైన బాధ్యత అన్న విషయం డాక్టర్ అభిజిత్ సేథ్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా మర్చిపోతున్నారు.

16 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన, 47 ఏళ్ల రాజకీయ అనుభవం గల చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైద్య కళాశాలలన్నిటిని పిపిపి పద్ధతిన ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడానికి సంకల్పించారు, అదే పనిలో ఉన్నారు కూడా. గుజరాత్ బ్రౌన్ ఫీల్డ్ మెడికల్ కళాశాల విధానం అలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వైద్య విద్యను ప్రైవేటురంగానికి అప్పగించాలన్న ఆలోచన చేయడం అనవసరమైంది.వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గడచిన ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగంలో 17 వైద్య కళాశాలలు నిర్మించేందుకు 7,800 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు జరిగింది. వాటిలో ఏడు కళాశాలల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడం కూడా ప్రారంభం అయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అయిదు కళాశాలల నిర్మాణం పూర్తయితే గతేడాది చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఇంకొక రెండు పూర్తయ్యాయి. మిగతా పది కళాశాలల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నది. ఈ 17 కళాశాలల్లో వైద్య విద్యతోపాటు టీచింగ్ ఆసుపత్రులు, నర్సింగ్ కళాశాలలు కూడా ఉంటాయి. ప్రభుత్వాలనేవి పార్టీలతో సంబంధం లేకుండా కొనసాగాలనే స్పృహ అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు నాయుడికి ఇంకొకరు కలిగించవలసిన అవసరం లేదు కదా.

ప్రైవేటు రంగంలో వైద్య కళాశాలల నిర్వాకం ఎలా ఉంటుందో మనం అనేకమార్లు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. అంతెందుకు, ఇప్పుడు వైద్యరంగాన్ని పిపిపి పేరిట ప్రైవేటుపరం చెయ్యాలని ఉవ్విళ్ళూరుతున్న చంద్రబాబునాయుడు నాయకత్వంలోనే వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రైవేటు రంగంలో అనుమతి ఇవ్వకూడదని చేసిన ఉద్యమం కారణంగా నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊడిన సంగతి ఎలా మరిచిపోయారు? అప్పటికీ, ఇప్పటికీ ఏం మారింది? ఇప్పుడు వీటన్నిటిని పిపిపి పేరిట ఎందుకు ప్రైవేటుపరం చేయదలుచుకున్నారు?జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ కళాశాలల నిర్మాణానికి కావలసిన స్థలాలను ప్రైవేటు భూములను కూడా సేకరించి ప్రారంభించారు. వాటన్నిటికీ ఇప్పుడు ఏడాదికి ఎకరానికి 100 రూపాయల చొప్పున లీజుకు ప్రైవేటుసంస్థలకు అప్పగించాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయించడం ఎంత విచిత్రం. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం చెబుతున్నారంటే ఈ వైద్య కళాశాలలన్నీ మనకే అంటే ప్రభుత్వానికే ఉంటాయని, అయితే 66 సంవత్సరాల అనంత అని ప్రజలను సముదాయిస్తున్నారు. 66ఏళ్ల తర్వాత ఎవరు ఏమిటో ఎవరికి తెలుసు? పైగా ఇవాళ భారతదేశంలో ప్రైవేటు రంగంలో ఆసుపత్రులు నడుపుతున్న కార్పొరేట్ శక్తులు వైద్య సేవల పేరిట ప్రజలను ఎంతగా పీడిస్తున్నది విజ్ఞులైన అభిజిత్ సేథ్‌కు కానీ, చంద్రబాబు నాయుడుకు గానీ చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు వైద్య విద్యను కూడా ప్రైవేటు వారికి అప్పగించేసి చేతులు దులుపుకుంటే ప్రభుత్వాలు ఇంకా ఏం చేద్దామని? ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేది తమ బాగోగులు చూసుకోమని కదా. ఇలా ఒక్కటొక్కటిగా ప్రైవేటువారికి అప్పగించేస్తే ఇంక ప్రభుత్వాలు దేనికి?అప్పుడెప్పుడో, మన చిన్నప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ అని ఇచ్చిన నినాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోని ప్రభుత్వం మరో విధంగా అమలు చేయాలని ఆలోచన చేస్తున్నది. తన తొలి రాజకీయ గురువు అయిన ఇందిరాగాంధీ గరీబీ హటావ్ అంటే చంద్రబాబు నాయుడు దాన్ని ఇంగ్లీషులో ‘జీరో పావర్టీ’ అంటున్నారు. ఇక్కడ ఆయన ఇంకొక పీ చేర్చి ‘పీ ఫోర్’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేస్తామని చెప్తున్నారు. పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్ షిప్ అన్నమాట. వివరంగా చెప్పుకుంటే సంపన్నులు ముందుకొచ్చి ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు తోడుగా నిలిచి, మద్దతు అందించి మార్గనిర్దేశం చేయడం ఆయన లక్ష్యం. ప్రతి కుటుంబానికి వారి అవసరాలకు తగిన విధంగా అధునాతన మార్గాల సహాయం అందించి, ప్రతి కుటుంబం ఎదిగి ఉమ్మడిగా అభివృద్ధి చెందే విధంగా భవిష్యత్తు నిర్మించేందుకు జరిగే కృషి ఇది అని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం చెబుతోంది. ఇలా పేదలకు చేయూతనందించే ఈ సంపన్నులను ‘మార్గదర్శకులు’ అంటారు. సహాయం అందుకోబోయే పేద కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’ అంటారు.

ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికే 14,495 మంది మార్గదర్శకులు 9,62,943 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అంటే దాదాపు 40 లక్షలమంది పేద ప్రజల జీవితాలు పూర్తిగా సుఖమయం అయినట్టే మనం భావించాలి. ప్రజల్ని మాయచేసి పబ్బం గడుపుకోవడం అంటే ఇదేనేమో. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు చేయాల్సిన పనుల్లో పేదరికం నిర్మూలన, ప్రతి పౌరుడికి విద్య, వైద్యం విషయంలో గల ప్రాథమిక హక్కును కాపాడే బాధ్యత ముఖ్యమైనవి. వాటిని రాజకీయ పక్షాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది.

విజయ నిర్ణేతలు మహిళా ఓటర్లే

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో రాజకీయ పార్టీలు ప్రత్యేకించి మహిళలను ఆకర్షించడానికి అనేక ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. అక్టోబర్ 3న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకం కింద దాదాపు 25 లక్షల మంది మహిళలకు వారి బ్యాంకు అకౌంట్లలో రూ. 10 వేలు వంతున జమ చేశారు. అంతకు ముందు సెప్టెంబర్ 26న ఇదే పథకం కింద 75 లక్షల మంది మహిళలకు రూ. 7500 కోట్లు జమ చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ విధమైన పోకడ ఇతర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనిపించవచ్చు. గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం నిదానంగా పెరుగుతోన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ నిర్ణేతలు మహిళలవుతారా? ఇంటాబయటా చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్న మహిళలకు ఈ ప్రయోజనాలతో ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇది వారికి మరింత గౌరవం, స్వేచ్ఛ, భద్రతను కలిగిస్తాయి. కానీ అదే సమయంలో లబ్ధిదారులుగా వారికి చేరువైన ఈ మార్గం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి.

సంబంధిత మహిళల రాజకీయ నియోజకవర్గంలో ‘రాజకీయేతర వ్యవస్థ’ను నిర్మించడానికి నిరంతరం ప్రయత్నం జరుగుతోంది. ఇది మహిళలను చురుకైన పౌరులుగా కాకుండా అంతగా ప్రాముఖ్యత లేని ఉత్త పాత్రధారులుగా ఉంచుతుంది. ఈ పథకాలు కూడా మహిళలను చెల్లెమ్మలు, అక్కలుగా సంబోధిస్తున్నాయి. ప్రధాన పోటీదారులు, విధానపరమైన నిర్ణయం తీసుకునేవారు సోదరులు, పురుషులు అయినప్పుడు ఈ పథకాల్లో మహిళలను చెల్లెమ్మలుగా అభివర్ణించడం వారిని దూరంగా ఉంచే ఆలోచన కోసమే. ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములుగా మహిళా ఓటర్లు కీలకపాత్ర వహించడం సానుకూల పరిణామం. ఇప్పుడు మేనిఫెస్టోలన్నీ మహిళా ఓటర్లకే అంకితమవుతున్నాయి. ఇదివరకెన్నడూ లేనివిధంగా ఈ ప్రమాణాలన్నీ మహిళలకు సహాయ పడుతున్నాయి. కేవలం నగదు పథకాలే కాదు. 2000 సంవత్సరం మొదటి భాగంలో నితీశ్‌కుమార్ పాఠశాల బాలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఇది కొన్నేళ్ల పాటు మహిళలపై విశేష ప్రభావాన్ని చూపించింది. మహిళలకు టాయిలెట్లు ఎక్కువ సంఖ్యలో నిర్మించే ప్రయత్నాలపై ఇదివరకెన్నడూ లేనివిధంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇవి సరైన దిశలో సాగుతున్న ప్రయత్నాలు. అయితే మహిళలు కోరుకునేవన్నీ ఉచితాలే అని భావించే ప్రమాదం ఉంది. రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కోసమే మహిళలకు ఈ పథకాలను ప్రకటించకుండా దీన్ని అంతర్గతీకరించే అవసరం ఉంది.

తమిళనాడు లోని ఊర్మిళ తొగై స్కీమ్, మధ్యప్రదేశ్ లోని లాడ్లీ బహనా యోజన, మహారాష్ట్ర లోని లడ్‌కీ బహిన్ యోజన, తదితర పథకాలు స్వల్ప, మధ్యాదాయ మహిళా ఓటర్లకు ప్రత్యక్షంగా నగదు అందించాయి. మధ్యప్రదేశ్ లోని లాడ్లీ బహనా యోజన స్కీమ్ శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మేలు చేసింది. అలాగే మహారాష్ట్ర లోని లడ్‌కీ బహిన్ యోజన బిజెపి సంకీర్ణానికి ఎంతో లబ్ధి చేకూర్చింది. అయితే ఈ పథకాలు సవ్యంగా అమలు కావాలి. ఎన్నికలకు నెలరోజులు ముందుగా ఈ ఉచిత హామీల పథకాలను ప్రకటించగానే సరిపోదు, లబ్ధిదారులకు అవి చేరువ కావాలి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీర్ భండార్ పథకం లేదా మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బెహనా పథకం పరిశీలిస్తే కొన్ని షరతులతో వీటిని అమలు లోకి తీసుకొచ్చారు. ఈ పథకాల లబ్ధిదారులైన మహిళా ఓటర్లు కనీసం 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇవన్నీ తల్లిదండ్రులు తమ బాలికలను చదివించడానికి దోహదం చేసే రాయితీలు. జాతీయ ఎన్నికల అధ్యయనంలో భాగంగా చేపట్టిన కొన్ని సర్వేలు ఏ పార్టీకైనా విజయాన్ని నిర్ణయించేది మహిళా ఓటర్లే అని స్పష్టం చేశాయి. ముఖ్యంగా బిజెపికి ఈ అంశం చాలా ముఖ్యం. వాస్తవానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో సిద్ధాంతాలపై కాకుండా ప్రత్యక్ష అనుభవపూర్వక పరిశోధనల్లో గెలుపు కూటమికి పురుషులతో పోల్చుకుంటే మహిళా ఓటర్లు అంతగా ఓటు వేయలేదని తేలింది. కాంగ్రెస్‌తో పోల్చుకుంటే బిజెపి ఓటర్లలో చారిత్రకంగా లింగ వ్యత్యాసం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రాంతీయ స్థాయిలో ఇలాంటి అంతరానికి భిన్నంగా మహిళలు ఓటు వేయడం గమనార్హం.

ఈ ఉచిత పథకాలు అమలు విధానం కూడా కీలకపాత్ర వహిస్తుంది. మహారాష్ట్రలో ఎన్నికలైన తరువాత ఉచిత పథకాల అమలు అస్తవ్యస్తమైంది. లబ్ధిదారుల ఎంపికలో స్క్రూటినీ పెరిగింది. ఈ పథకాన్నా లేక పెన్షన్ పథకాన్నా దేన్ని ఎంచుకోవాలో మహిళలు తెలియక తికమకపడ్డారు. అంతేకాదు లబ్ధిదారులైన మహిళలు డబ్బును స్వతంత్రంగా వినియోగిస్తున్నారా లేదా అన్న పరిశీలన జరుగుతోంది. ఇవన్నీ క్రమంగా సర్దుకోబడవచ్చు. బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కసరత్తులో ఓటర్ల జాబితానుంచి పురుషులు కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ శాతం తొలగించబడ్డారు. ఈ పరిస్థితుల్లో మహిళా ఓటర్లను పార్టీలు ఎలా ఆకట్టుకుంటాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. ఓటర్ల జాబితా తయారైన ప్రతిసారి మహిళలు ఇలాంటి చిక్కుల్నే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వీరి డాక్యుమెంటేషన్ బలహీనం. అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కసరత్తులో కూడా మహిళలు సంఘర్షణకు గురయ్యారు. కొంతమంది పెళ్లి చేసుకుని అసోంకు వచ్చారు. కానీ తాము ఎక్కడనుంచి వచ్చామో నిరూపించలేకపోయారు. రాజకీయ పార్టీలు ఇలాంటి చిక్కులను విడదీసి వారిని ముందుకు తీసుకురావడం చాలా ముఖ్య కర్తవ్యం. పురుషుల్లా మహిళలు కూడా భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. అలాంటప్పుడు వారి ఓటు హక్కును కొల్లగొట్టడం అన్యాయమే అవుతుంది. 

ఈ కులవివక్ష ఇంకెన్నాళ్లు?

‘సమాన న్యాయాన్ని సూత్రీకరించడం వేరు, అమలు పరచడం వేరు. సమాన న్యాయ సూత్రం అనేది దానిని అమలు పరిచే ప్రజా పరిపాలన విభాగాల (civil services) స్వభావం, లక్షణం మీద ఆధారపడి ఉంటుంది. సివిల్ సర్వీస్ అధికారుల, విభాగాలు పాత వ్యవస్థను మద్దతుగా ఉండి, నూతన వ్యవస్థాపనకు వ్యతిరేకంలో ఉంటే, నూతన వ్యవస్థ ఏర్పడటం అసాధ్యం. నూతన వ్యవస్థ ఏర్పడాలంటే పరిపాలన విభాగాలు (సివిల్ సర్వీసెస్) సానుకూల దృక్పథం, ఆలోచన, ఆచరణ అత్యవసరం. దురదృష్టవశాత్తు బ్రిటిష్ ప్రభుత్వం సమానత్వ సూత్రానికి అనుకూలంగా లేని వారికి, పైగా అటువంటి విషయాలు పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న వారికే సివిల్ సరీస్‌ల ద్వారాలు తెరిచిపెట్టింది.అందువల్ల భారతదేశం బ్రిటిష్ వారి పాలనలో ఉన్నా హిందువుల నిర్వహణలోనే ఉన్నది. పాత వ్యవస్థను కొనసాగించడానికే హిందూ సమాజం తన వంతు పాత్ర నిర్వర్తించినట్లే, ప్రభుత్వంలోని హిందూ ఉద్యోగులు కూడా తమ వంతు పాత్ర నిర్వర్తిసున్నారు. ఈ రెండూ కలిసి పాతుకుపోయి ఉన్న కుల వ్యవస్థను సురక్షితం చేస్తున్నాయి’ బాబాసాహెబ్ అంబేద్కర్ తన అధ్యయనంలో తేల్చి చెప్పిన విషయమిది.

బాబాసాహెబ్ అంబేద్కర్ తన అనుభంలో పేర్కొన్న అంశాలు నేటికీ కళ్ళకు కట్టినట్లు వాస్తవ చిత్రంలో ఉన్నాయి. కులం, హిందూ మతం, అంటరానితనంపై సదీర్ఘంగా రాసిన అయిదవ సంపుటంలోని ఈ వాక్యాలు హర్యానా పోలీస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలను తాత్వికంగా వివరిస్తుంది. అదే సంపుటిలో మరొకచోట అస్పృశ్యత, దాని స్థితిని వివరిస్తూ ‘ఒకసారి అస్పృశ్యుడిగా జన్మిస్తే అతడు ఎప్పుడు అస్పృశ్యుడే. ఒక వ్యక్తి గుణగణాలలో ఎటువంటి ప్రమేయం లేదు. ఒక అస్పృశ్యుడు నైతికంగా, మాససికంగా ఎంతటి ఉన్నతుడైనా అతడు తన కంటే అల్పుడైన స్పృశ్యుని కంటే ఎప్పటికీ తక్కువ వాడే” ఇది కూడా ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్ళు, రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్ళు కానీ కులవ్యవస్థ రాజ్యాంగం రాసినా మను సిద్ధాంతాలే ఇంకా అమలులో ఉన్నాయి. పైగా అవి రూపం మార్చుకొని చాలా దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నాయి.

పూరన్ కుమార్ తెలుగువారు. దళితుడు. ఎంతో కష్టపడి ఉన్నత చదువుల్లో చదివి, పోటీ పరీక్షలు రాసి ఇండియన్ పోలీస్ సర్వీసు (ఐపిఎస్) గా ఉద్యోగంలో చేరాడు. అయితే అ పోస్టింగ్‌లో చేరిన కొన్ని సంవత్సరాలకే ఆయననకు వేధింపులు మొదలయ్యాయి. అందరిలాగా ఆయనకు రావాల్సిన ప్రమోషన్లు రాలేదు. సర్వీసులో ఉంటే ఇతర అధికారులకు లాగానే రావాల్సిన సౌకర్యాలు అందలేదు. దీనికి ఆయన మౌనంగా ఉండలేదు. ప్రశ్నించారు. అది తన హక్కుగా భావించారు. అయితే దానితో సమస్య పరిష్కారం కాకపోగా, వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. చివరకు ఒక తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నం జరిగింది. దీని గురించి ఉన్నతాధికారి అయినా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను, సంబంధిత తన కన్న కింది స్థాయి అధికారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తే ఫలితం లేదు. గత కొన్నేళ్ళుగా పూరన్ కుమార్ చేస్తున్న హక్కుల పోరాటం ఆయనకు అవినీతిని అంటగట్టే కుట్ర దాకా వెళ్ళింది. ఈ విషయాన్ని తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ రాసిన నోట్‌లో ఉన్నాయి.

అంతేకాకుండా ఆయన భార్య అమ్నిత్ కుమార్ తన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నారు. అంతే కాకుండా, గత కొంత కాలంగా తన భర్తను వేధిస్తున్నారనే విషయాన్ని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అమ్నిత్ కుమార్ సాధారణ గృహిణి కాదు. ఆమె కూడా హర్యానా ప్రభుత్వంలో ఐఎఎస్ అధికారిణి. ఈ ఫిర్యాదు ఫలితం ఏమి ఉండబోతున్నదీ? దానిపైన ఆధారపడి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే విషయాలమీద నాకు ఆసక్తి లేదు. ఎందుకంటే ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పినట్టే కుల వ్యవస్థ, అధికార వర్గం, మతం అన్నీ కలిసి ఉన్నాయి. ఇందులో అందరూ భాగస్వాములే. పోలీసులు, న్యాయస్థానాలన్నీ అటువంటి విషయాల పట్ల చాలా ఏకాభిప్రాయంలో ఉంటాయి. పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారకులైన వారెవ్వరు శిక్షలకు గురికారు. వారిని చాలా మర్యాదగా ఈ సమాజం కాపాడుకుంటుంది. ప్రస్తుతం ఏవో ఆందోళనలు, ఊరడింపులు జరుగుతాయి. అమ్నిత్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్న డిజిపి, రోహతక్ ఎస్‌పిలను తాత్కాలికంగా పదవుల నుంచి తప్పిస్తారు. విచారణ పేరుతో కొంతకాలం కాలయాపన చేస్తారు. ఆ తర్వాత ఏదో విధంగా దానిని చాలా నిశ్శబ్దంగా వినపడకుండా చేస్తారు.

అయితే కులం పేరుతో అంటరానివారిగా తనను వేధించిన అధికారుల ఇక ఎంత మాత్రం నేను భరిచలేనని తాను చివరగా రాశారు. ఒక వ్యక్తి అది కూడా ఒక సీనియర్ పోలీస్ అధికారి అటువంటి నిర్ణయానికి రావడం వెనుక ఎంతటి మనోవేదన ఉండి ఉంటుంది. ఇప్పుడు స్పందిస్తున్న ప్రభుత్వాలు గతంలో తాను చేసిన ఫిర్యాదులకు స్పందించి ఉంటే, ఆయన ఫిర్యాదుల నిజనిజాలు తేల్చి, ఒకవేళ ఆయన చెప్పింది సత్యమైతే దానిని పరిష్కారం చేసి ఉంటే పూరన్ కుమార్ ఆత్మహత్య జరిగి ఉండేది కాదు. అధికార, రాజకీయ పెద్దలు పూరన్ కుమార్‌ను ఒక అంటరాని వాడిగానే చూశారు. ఆయన తన ఎనిమిది పేజీల నోట్‌లో వివరించినట్లు ఒక పద్ధతి ప్రకారం వేధించారు. అంతే కాకుండా ఆయనను చివరికు ఒక అవినీతిపరుడిగా ముద్రవేసే కుట్ర చేశారు. అది పూరన్ కుమార్‌ను ఆత్మహత్య నిర్ణయం తీసుకునేటట్టు చేసింది. పూరన్ కుమార్‌కు జరిగిన కుల దురహంకార వేధింపులు వ్యక్తికి పరిమితమైనవి కావు. గత కొన్నేళ్ళగా ఎంతోమంది దళిత వర్గానికి, ఆదివాసీ తెగలకు చెందిన అధికారులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారు. కేరళ నుంచి కశ్మీర్ దాకా, అసోం నుంచి గుజరాత్ దాకా అన్ని రాష్ట్రాల్లో ఈ వేధింపుల పర్వం కొనసాగుతున్నదే.

2016 లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఐఎఎస్ అధికారులు రమేష్‌త్‌దె, శశికర్ణవత్‌లు తమను కులం ఆధారంగా వేధిస్తున్నారని బహిరంగంగా తమ వేదనను వ్యక్తం చేశారు. ఎస్‌సి కమిషన్‌లో తమ విజ్ఞప్తిని కూడా పంపించారు. రాజస్థాన్‌కు చెందిన ఒక ఐఎఎస్ అధికారి కులవివక్షను ఎదుర్కోలేక ఇస్లాం మతంలోకి మారిపోయాడు. పది సంవత్సరాలు క్రితం ఉమ్‌రావు అనే ఐఎఎస్ అధికారి మతం మార్చుకుని ఉమ్ రావు ఖాన్‌గా మారారు. ఇది అప్పట్లో చర్చనీయాంశమైనది కూడా. తమిళనాడు చెందిన దళిత ఐఎఎస్ ఆఫీసర్ తనను వివక్షకు గురిచేస్తున్నారని తన నిరసనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇటు వంటి ఘటనలు లేకపోలేదు. తెలంగాణకు చెందిన ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి కూడా వివక్షకు గురైనట్టు బహిరంగంగానే ప్రకటించారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇటీవల మరొక కొత్త వేధింపులు మొదలయ్యాయి. అన్ని రకాల అర్హతలున్నా ప్రమోషన్లు ఇవ్వకపోవడం, ప్రధానమైన విభాగాలు అప్పజెప్పికపోవడంతో పాటు తమ అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం నుండి లభించే Empanelment లో కూడా వారికి స్థానం ఇవ్వకపోవడం తరచుగా జరుగుతున్నది.

కేంద్రంలో, చాలా రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రాధాన్యత లేని విభాగాలు ఇచ్చి అవమానించడం పరిపాటైపోయింది. ఎక్కడైనా అవినీతి జరిగితే మొదటగా ఎస్‌సి, ఎస్‌టి అధికారులనే బలి చేస్తున్నారు. మిగతా కులాల అధికారులు ఏదో విధంగా నేరాల నుంచి తప్పించుకో గలుగుతున్నారు. ఇది చాలా విచారకరమైన వాతావరణం. కిందిస్థాయి ఉద్యోగుల విషయమైతే చెప్పాల్సిన పని లేదు. ప్రతి శాఖలో వారికి వేధింపులు, అవమానాలే బోనస్‌లు. ఎంత నిజాయితీగా ఉన్నా, ఏదో ఒక సమయంలో వారిని అవినీతి చట్రంలోకి లాగుతున్నారు.

అందుకే కుల వివక్ష ఒక రకమైన వేధింపు అయితే, ఎస్‌సి వర్గానికి చెందిన అభ్యర్థులు మరింత వివక్షకు అవమానాలకు గురవుతున్నారు. దీనికి పరిష్కారం ఎప్పుడు? ఎట్లా జరుగుతుంది అనే ప్రశ్నలకు జవాబు వెదకాలి. ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా ఏర్పడుతున్నాయి. ప్రజలు అందరూ ఓట్లు వేసి భారత రాజ్యాంగంలోని సూత్రాలకు అనుగుణంగా పాలించాలని ప్రభుత్వాధినేతలకు అధికారం ఇస్తున్నారు. కానీ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాల పెద్దలు రాజ్యాంగాన్ని అమలు చేయడం మీద కన్న రాజకీయ ప్రయోజనాలనే ప్రధానమైనవిగా భావిస్తున్నారు. ఇది మారాలి. అన్ని వర్గాలను, కులాలను సమానమైన దృష్టిలో చూడాలి. కానీ దానికి ఎక్కడా అవకాశం కనిపించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాల్సిందే. 

మల్లేపల్లి లక్ష్మయ్య