Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

vaycasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

vaycasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

vaycasino

Atlasbet Giriş

Wbahis

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

Wbahis

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

లొంగుబాటు.. కాకూడదు నగుబాటు

సుమారు అరవై ఏళ్ల క్రితం మన దేశంలో రాజుకున్న నక్సలైట్ల పోరాటానికి తుది ఘడియలను కేంద్ర ప్రభుత్వం రచిస్తున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి మావోయిస్టుల వరుస లొంగుబాట్లు దీనికి సంకేతాలు అనవచ్చు. అయితే వీరి అస్త్ర సన్యాస వార్తలు తెలుగువారిని అమితంగా కలవరపరుస్తున్నాయి. సమాజ మార్పు కోసం సాయుధ పంథాను ఎంచుకున్న ఆ కమ్యూనిస్టు పార్టీలో ముందు వరుసలో తెలుగువారే ఎక్కువ. ప్రత్యేకంగా తెలంగాణకు చెందినవారు నాయకత్వ స్థానంలో ఉండడం మూలాన వారి ప్రతి కదలిక, నిర్ణయం ఇక్కడి ప్రజల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్య పోలీసుల తూటాలకు వారు బలి అవుతున్న తీరుకు క్షోభ పడుతున్న గుండెల సంఖ్య కూడా ఇక్కడ తక్కువేమి ఉండదు. తెలంగాణ జిల్లాల్లో భూస్వాముల దౌర్జన్యాలను కట్టడి చేసి, నక్సలైట్లు తెచ్చిన మార్పును గమనించినవారు, అలా ఉపశమనం పొందినవారు తప్పకుండా వారిని ఇష్టపడతారు, అభిమానిస్తారు. కళాకారులు, రచయితల్లో కూడా వారి వాదాన్ని సమర్థించి, వారి పక్షాన నిలిచేవారు ఎందరో ఉన్నారు. సాధారణంగా నక్సలైట్లలో వీరత్వాన్ని, ప్రాణాన్ని లెక్కచేయనితనాన్ని మాత్రమే చూసిన, వారి నుంచి అవే ఆశించిన వారికి ఇంత భారీ సంఖ్యలో లొంగుబాట్లు జీర్ణం అయ్యే పరిస్థితి లేదు. తాము ఎంతో ఉన్నతంగా భావించిన సమరభేరి ఇలా చప్పబడడంతో వారిని నిరాశపరుస్తోంది.

మెల్లమెల్లగా ప్రభుత్వ బలగాల పైచేయితో మావోయిస్టుల కోట బద్దలవుతుండగా అగ్రనేతల లొంగుబాటుతో వారి శిఖరమే కూలినట్లు, పునాదులే కదిలినట్లుగా జనం భావిస్తున్నారు. కేంద్ర బలగాల దెబ్బకు మావోయిస్టులు బలహీనపడినా, తమ యుద్ధాన్ని కొనసాగిస్తూ ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడిన సందర్భాలే గతంలో కనబడ్డాయి. అయితే సుమారు ఒక ఏడాది క్రితం నుండే వారిలో కొందరికి ప్రభుత్వం ముందు లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచన కలిగిన విషయం ఈ మధ్య బయటపడింది. ఆ లొంగుబాటు ఆలోచన అగ్ర నాయకులకు కలగడమే ఎవరు ఊహించని విషయం. ఇక పోలీసులతో వేగలేం, లక్ష్యాన్ని చేరుకోలేం, తుపాకులు అప్పగించి బతికిపోదాం అనుకొని తమ అనుచరులతో పెద్ద తలలే వంచుకొని బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల ముందు మావోయిస్టులు లొంగిపోయిన విధానం ఎంతో సంకేతాత్మకంగా ఉంది. ఇన్నేళ్లు వారు నమ్మి, ప్రజలను నమ్మించి పోరాడిన సిద్ధాంతాన్ని శత్రువు కాళ్ల దగ్గర సాగిలపరచినట్లుగా అది సాగింది.

లొంగిపోయేవారు తమ ఇష్టానుసారంగా బయటికి వస్తే సరిపోయేది. పోలీసుల ముందుకు వెళ్లి లొంగిపోతామని నిలబడితే చాలు, అంతా వారే చూసుకునేవారు. ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రుల ముందు పెద్ద హంగామాగా ఆయుధాలను అప్పగించి, నవ్వుతూ రాజ్యాంగం ప్రతిని అందుకోవడం ఎన్నో విపరీత అర్థాలకు తావిచ్చింది. పార్టీ ఇచ్చిన తుపాకిని పార్టీకి వాపసు ఇచ్చేసి తమ దారిలో తాము వెళితే అంతా గౌరవప్రదంగానే ఉండేది.పోలీసుల హిట్ లిస్టులో ఉన్నవారు, కేసుల్లో నిందితులు కావాలనుకుంటే లొంగిపోవచ్చు. మిగతావారు పార్టీకి దూరంగా తమ బతుకు తాము బతకవచ్చు. తుపాకీ పట్టినా కేసులు లేనపుడు నేరస్థులు కారు. ఇలా పదుల సంఖ్యలో కొత్త యూనిఫారాల్లో ఆయుధాలతో ప్రభుత్వాల ముందు కవాతు చేయడం చూస్తుంటే ఎలాంటి సిద్ధాంతం లేని బందిపోటు ముఠాలను తలపిస్తోంది. పార్టీని ఎంత బలహీనం చేశామో చూడండి అని ప్రభుత్వం ముందు ప్రదర్శించినట్లుగా వీరి లొంగుబాటు తీరు ఉంది. లొంగిపోయిన ప్రతి చేతికి రాజ్యాంగ ప్రతి వచ్చింది. ఆయుధంతో కన్నా రాజ్యాంగం బాటలో ప్రజలకు మేలు చేయొచ్చు అని వారంతా ఒప్పుకున్నట్లుగా ఆ ప్రహసనం సాగింది. నక్సలైటు ఉద్యమం కన్నా ముందే భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగంలో సూచించినట్లుగా పాలన సాగడం లేదు, అందులో పేర్కొన్న హక్కులు వివిధ జాతులకు, పేదలకు దక్కడం లేదనే విషయం కాలక్రమంగా బయటపడింది. ఇదేం పాలన అని ప్రశ్నించిన గొంతులపై పాలకులు ఉక్కుపాదం మోపారు. పాలకులెవరైనా యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. దొంగదారిలో ఎమర్జెన్సీవచ్చి దేశాన్ని అతలాకుతలం చేసింది.

రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులను కాపాడేందుకు ఉద్యమాలు చేపట్టవలసి వస్తోంది. నేరాలకు శిక్షలను వేసే న్యాయ వ్యవస్థను పక్కనబెట్టి పోలీసులు ప్రభుత్వ అనుమతితో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యా హక్కును అంగడి సరుకు చేశారు. కనీస వేతనాలు శ్రమజీవి చేతికందవు. కార్మిక హక్కులు కాలరాస్తున్నారు. గిరిజనులకున్న అటవీ హక్కులు పారిశ్రామికవేత్తల పాదాక్రాంతం చేస్తున్నారు. చట్టసభల్లో బలమున్న ప్రభుత్వాలు సవరణల పేరిట తమకు అనుకూల మార్పులు చేసుకుంటున్నాయి. మత స్వేచ్ఛపై నిరంతర దాడి జరుగుతోంది. హిందూయేతరులకు దేశంలో రక్షణ కరువైంది. గత పన్నెండేళ్లుగా కేంద్రంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తూ మనుధర్మాన్ని అమలు చేస్తున్నది. హిందూత్వశక్తుల పాలనలో పరమత సహనం కనీస స్థాయికి పడిపోయింది.

రాజ్యాంగం ఇప్పుడు కేవలం ప్రదర్శన కోసం అన్ని పార్టీల హస్తభూషణమైది. ఆచరణలో మాత్రం అందరూ దారి తప్పుతున్నారు. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తే ఆయుధం అవసరమే ఉండదు. ఆయుధాన్ని అప్పగించి రాజ్యాంగాన్ని అందుకొనే పరిస్థితులు దేశంలో లేవు. ఆయుధానికి రాజ్యాంగ ప్రతి ప్రత్యామ్నాయం కాదు.ఇంకా అలాంటి రోజులు రాలేదు. నలభై ఏళ్లుగా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మినవారు ఇప్పుడే కొత్తగా రాజ్యాంగాన్ని చూస్తున్నట్లు, దాని అమలు బ్రహ్మాండంగా జరుగుతున్నట్లు పోజులు పెట్టడం చాల మందికి అసహజంగా కనబడింది. ప్రతి వ్యక్తిపై ఆయన గతకాలపు నడవడిక ఆధారంగా జనానికి ఆయనపై కొన్ని అంచనాలు ఉంటాయి. అవి బెడిసికొట్టినపుడు ఆయనపై గౌరవం తగ్గిపోవడం సహజమే. అందుకే ఈ లొంగుబాట్లపై సామాజిక మాధ్యమాల్లో భిన్న కథనాలు వస్తున్నాయి. రాజ్యాంగ ప్రతిని అందుకున్న మాజీ మావోయిస్టులు బాధ్యతగా దాని అమలుకై కొత్తగా కార్యాచరణ మొదలుపెడితే ఈ లొంగుబాట్లను కూడా హర్షించవచ్చు.

 బద్రి నర్సన్, 94401 28169

బంధుప్రీతికే బీహార్ పార్టీల జై

వంశపారంపర్య రాజకీయాలు ప్రజాస్వామ్య మూలాలను తుప్పు పట్టిస్తాయని రాజకీయ పార్టీల అగ్రనాయకులు పదేపదే చెబుతుంటారు. కానీ బీహార్‌లో చాలా ప్రధాన పార్టీలు తమ సీనియర్ నాయకులకు చెందిన రక్తసంబంధీకులకే ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీకి టికెట్ ఇస్తుండడం విశేషం. అధికార నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డిఎ)లేదా గ్రాండ్ అలయన్స్ (ఇండియా కూటమి) ఏదైనా ఈ ట్రెండ్‌కు మినహాయింపు కాదు. వంశపారంపర్య రాజకీయాలపై పదేపదే విమర్శలు సంధించే బిజెపి కూడా బీహార్‌లో బంధుప్రీతికి తలొగ్గక తప్పడం లేదు. కొడుకులు, కూతుళ్లు, భార్యలు, కోడళ్లు, అల్లుళ్లు, దగ్గరి బంధువులు ఇలా ఎందరో బరిలో ఉన్నారు. ఏ పార్టీ కూడా నైతిక ప్రాధాన్యత, సైద్ధాంతిక నిబద్ధతలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది. బీహార్‌లో గ్రామీణ జనాభా విద్యాస్థాయి చాలా తక్కువగా ఉండడంతో వారసత్వ రాజకీయాల గురించి ఓటర్లు అంతగా పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితి కొనసాగడానికి దోహదమవుతోంది. ఎన్‌డిఎ లోని కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీకి హిందుస్థానీ అవామీ మోర్చా (సెక్యులర్) సంస్థాపకులుగా రాజకీయ ప్రాచుర్యం మంచి పేరుంది.

ఆయన తన కోడలు దీపాకుమారిని ఇమామ్‌గంజ్ స్థానం నుంచి పోటీకి నిలబెట్టారు. ఆమె తల్లి జ్యోతిదేవీ బరాచట్టి స్థానం నుంచి పోటీ చేస్తుండగా, సికంద్రా స్థానంనుంచి జితన్ రామ్‌మాంఝీ అల్లుడు ప్రఫుల్ మాంఝీ బరిలోకి దిగారు. మాజీ ఎంపీ, భూమిహార్ నాయకుడు అరుణ్‌కుమార్ కొడుకు, సోదరుడు, సమీప బంధువులు ఎన్నికల్లో పోటీకి టికెట్లు పొందగలిగారు. అరుణ్‌కుమార్ కొడుకు రితురాజ్ కుమార్ ఘోసి నియోజకవర్గం నుంచి జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయన సోదరుడు అనిల్ కుమార్ , దగ్గరి బంధువు రోమిత్ కుమార్ క్రమంగా తికారీ, అటారీ స్థానాల నుంచి హిందుస్థానీ అవామీ మోర్చా పార్టీ టికెట్ పొందారు. బిజెపి తన విధానాలను విడిచిపెట్టి సంస్థాగత రాజకీయ ప్రముఖులకు చెందిన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇస్తోంది. ఉదాహరణకు టికెట్లు పొందిన వారిలో రాజకీయ అనుభవజ్ఞుడైన, మాజీ ఎంపి శకుని చౌదరి కుమారుడైన బీహార్ డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి ఉన్నారు. శకుని చౌదరి పూర్వపు సమతా పార్టీ సంస్థాగత సభ్యుల్లో ఒకరు.

సామ్రాట్ చౌదరి 15 ఏళ్ల విరామం తరువాత తారాపూర్ నుంచి పోటీకి దిగారు. మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కుమారుడు, మాజీ రైల్వే మంత్రి ఎల్‌ఎన్ మిశ్రా మేనల్లుడు అయిన నితీశ్ మిశ్రాను తిరిగి ఝాంఝర్‌పూర్ నియోజకవర్గం నుంచి బిజెపి పోటీ చేయిస్తోంది. నితీశ్ కుమార్ కేబినెట్‌లో నితీశ్ మిశ్రా మంత్రిగా ఉన్నారు. అదే విధంగా శ్రేయాసి సింగ్ జమూల్ స్థానంనుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె. ఆమె తల్లి పుతుల్ కుమారి బాంకాకు ఎంపిగా ఉన్నారు. గౌరబౌరమ్ స్థానంనుంచి బిజెపి సుజిత్ కుమార్ సింగ్‌కు తిరిగి టికెట్ ఇచ్చింది. ఎమ్‌ఎల్‌ఎ స్వర్ణసింగ్ భర్త సంజీవ్ చౌరాసియా డిఘా నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్ బిజెపి నాయకుడు, మాజీ గవర్నర్ గంగాప్రసాద్ కుమారుడు సంజీవ్ చౌరాసియా. మాజీ ఎమ్‌ఎల్‌ఎ నవీన్ కిషోర్ ప్రసాద్ కుమారుడు నితిన్ నబీన్ బంకిపోర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ విధంగా మరికొందరు బిజెపిలో పోటీకి దిగుతున్నారు.

మాజీ ఎంఎల్‌ఎ, మాజీ ఎంపి సీతారామ్ సింగ్ కుమారుడు రాణా రణ్‌ధీర్ మధుబన్ నుంచి రంగంలో ఉండగా, మాజీ ఎంఎల్‌ఎ భూపేంద్ర సింగ్ కుమారుడు దేవేష్ కాంత్ సింగ్ గొరియాకోథి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎంఎల్‌ఎ సునీల్ పాండే కుమారుడు విశాల్ ప్రశాంత్ తరారీ నుంచి, మాజీ ఎంఎల్‌ఎ రామ్ నరేష్ యాదవ్ కోడలు గాయత్రీ దేవి పరిహార్ నియోజకవర్గంనుంచి పోటీలో ఉన్నారు. అరుణ్‌కుమార్ సింగ్ తండ్రి బ్రిజ్ కిషోర్ సింగ్, తాత యమునా సింగ్ బరూరాజ్ ఎంఎల్‌ఎలుగా పనిచేశారు. జెడి(యు) పార్టీ అభ్యర్థుల జాబితా కూడా దీనికి తీసిపోలేదు. ఎమ్‌ఎల్‌ఎ నీలం దేవీ భర్త అనంత్ సింగ్ మొకమా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపి ఆనంద్‌మోహన్ కుమారుడు చేతన్ ఆనంద్ నబీనగర్ నుంచి, మాజీ మంత్రి మంజువర్మ కుమారుడు అభిషేక్ కుమార్ చెరియా బరియార్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడైన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వం లోని ఎల్‌జెపి (ఆర్‌వి) లో కూడా బంధుత్వాలు వదల్లేదు.

చిరాగ్ పాశ్వాన్ తన మేనల్లుడు సిమంత్ మృణాల్‌కు టికెట్ ఇచ్చారు. ఆయన బావ జముయి ఎంపిగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)అధినేత, రాజ్యసభ సభ్యులు ఉపేంద్ర కుష్వాహా భార్య స్నేహలత ససారం నుంచి పోటీ చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా వంశపారంపర్య రాజకీయాల కేంద్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్‌జెడిలో అనేక మంది రాజకీయ వారసులు కనిపిస్తారు. మాజీ సిఎం లల్లూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వియాదవ్, రఘొపోర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ముఠా నాయకుడు నుంచి రాజకీయ నాయకుడుగా మారిన దివంగత మొహమ్మద్ షహబుద్దీన్ కుమారుడు ఒసామా షాహాబ్‌కు ఆర్‌జెడి రఘునాథ్ పూర్ నుంచి టికెట్ ఇచ్చింది. అలాగే ముఠా నాయకుడు, మాజీ ఎమ్‌ఎల్‌ఎ మున్నా శుక్లా కుమార్తె శివానీ శుక్లా లాల్‌గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు. బ్రిజ్ బిహార్ హత్య కేసులో మున్నాశుక్లా ప్రస్తుతం జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. శివానీ శుక్లా తల్లి మాజీ ఎంఎల్‌ఎ. ఈ విధంగా ఆర్‌జెడి మరికొందరికి టికెట్లు ఇచ్చింది. 

అరకొర ప్రజాస్వామ్యం మాకు అక్కర్లేదు

లడఖ్ ప్రజలు సెప్టెంబర్ 24ను మరచిపోలేరు. ఆగ్రహోదగ్రులైన జనరేషన్ జెడ్ యువకులు స్థానిక బిజెపి కార్యాలయాన్ని దగ్ధం చేస్తున్నప్పుడు పోలీసులు జరిపిన కాల్పులలో మాజీ సైనికుడితో పాటు నలుగురు యువకులు ఆనాడు మరణించారు. నమ్మశక్యం కాని విధంగా నిరసనలకు సంబంధించి ఓ గాంధేయవాది, హింసను వ్యతిరేకించే స్థానిక హీరో సోనమ్ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. 1600 కిలోమీటర్ల దూరంలోని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు పంపారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర వంటి ఆరోపణలతో ఆ అరెస్టు జరిగింది.

లడఖ్ విభిన్నమైన నేపథ్యంగల రెండు మతాలకు ఆలవాలం. బౌద్ధులతో కూడిన లేహ్, మెజారిటీ షియా ముస్లింలు ఉండే కార్గిల్. ఆ రెండు ప్రాంతాలు రాజకీయంగా, సామాజికంగా భిన్నమైన నేపథ్యం కలవే. కానీ, ప్రజాస్వామ్య ఆకాంక్ష వారిని ఏకం చేసింది. లేహ్ అపెక్స్ సంస్థ, కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ తమ విభేదాలను పక్కన పెట్టి ఏకంకావడంతో లడఖ్ రాజకీయాలలో కొత్త చైతన్యం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ (కెడిఎ) నేత సజ్జాద్ హుస్సేన్ కార్గిలి తో హరీందర్ జరిపిన ఇంటర్వ్యూ. 

ప్రశ్న: గతంలో లడఖ్ స్వతంత్ర ప్రతిపత్తి గల హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు 2023లో ఎన్నికలు జరిగాయి. లేహ్ అపెక్స్ సంస్థ వాటిని బాయ్‌కాట్ చేసింది, కెడిఎ పాల్గొన్నది. త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండుసంస్థలు కలిసి పనిచేస్తాయా?

జవాబు: ఈ ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే జరగవలసి ఉంది. వాయిదా పడ్డాయి. ఇప్పటివరకూ ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. ఎన్నికల తేదీని ప్రకటించలేదు. ఈ మధ్య జరిగిన హింసాకాండతో ఎన్నికలు మరింత జాప్యం కావచ్చు. బిజెపి మౌనంగా ఉంది. బిజెపి కేవలం ఎన్నికల్లో పోటీచేసే రాజకీయ పార్టీయే కాదు. కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం యంత్రాంగం దానికి అనుకూలంగా ఉందని ప్రజలకు తెలుసు. కెడిఎకు సంబంధించినంతవరకూ ఎన్నికలు కేవలం రాజకీయ వ్యవహారం కాదు. అది జనవాక్య సేకరణ (రిఫరేండమ్). ఈ ప్రాంతంలో ప్రజలు తన ఆకాంక్షలను ఎలా తోసిపుచ్చారో తమ ఓట్ల ద్వారా చెబుతారు. ఈ సందేశం కౌన్సిల్ ఎన్నికలకే పరిమితంకాదు. పార్లమెంటరీ ఎన్నికల్లోనూ ప్రతిబింబించవచ్చు.

ప్రశ్న: గతంలో కార్గిల్, లేహ్ ఆలోచనలు భిన్నంగా ఉండేవి కదా, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత, లేహ్ ఆ చర్యను స్వాగతించగా, కార్గిల్ వ్యతిరేకించింది. ఏ మార్పు మీ ఇద్దరినీ ఎలా ఏకం చేసింది?

జవాబు: తమ అభిప్రాయాలను ఎవరూ పట్టించుకోరని ప్రజలు గుర్తించినప్పుడు వారు షాక్ తిన్నారు.ఆర్టికల్ 370 రద్దుతో దాని వల్ల గ్యారంటీగా కలిగే రక్షణలు దూరమయ్యాయి. అభద్రతా భావం రెండు వర్గాలను ఏకం చేసింది. లేహ్ అపెక్స్ సంస్థ ప్రజాస్వామ్య పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్లే బాధ్యత వహిస్తోంది. కార్గిల్‌లో డెమోక్రాటిక్ అలయన్స్ చురుగ్గా పని చేస్తోంది. సరైన ప్రాతినిధ్యం లేకపోవడమే సమస్యకు కారణమని ప్రజలు గుర్తించారు. నిరుద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం కొరవడడం వల్ల సమన్వయ కృషి వల్లనే తమ వాదన వినిపించగలమని తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యపరమైన మార్పుకోసం అందరూ ఏకం కావడం అవసరం.

ప్రశ్న: లడఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించడంపై గతంలో లేహ్, కార్గిల్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ విషయంలో విభేదాలు తొలగాయా?

జవాబు: గతంలో మతపరమైన విభేదాలు ఉద్దేశపూర్వకమైన సామాజిక పరిస్థితులవల్ల ఏర్పడినవి. గతంలో ప్రభుత్వాలు ఈ విభేదాలను తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నాయి. హింస ఎప్పుడూ ఆమోదయోగ్యం కాదు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో లేహ్ లోని బౌద్ధ మతస్థులు పార్లమెంటులో కనీసం ఒక బౌద్ధుడు ప్రాతినిధ్యం వహించాలని కోరారు. సమంజసమైన కోర్కే. అలాగే కార్గిల్ నుంచి షియా ముస్లిం కమ్యూనిటీకి ప్రాతినిధ్యం లభించాలని కోరుకున్నారు. దేశంలో నిజమైన షియా ప్రతినిధి లేరు కూడా. అందువల్ల షియా ప్రతినిధి లడఖ్ నుంచి పార్లమెంటుకు వెళ్లాలని కోరుకుంటున్నది. లడఖ్‌కు రెండు పార్లమెంటు సీట్లు, ఒక రాజ్యసభ సీటు కేటాయిస్తే, రెండు కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం లభిస్తుంది.

ప్రశ్న: బిజెపి లేదా ప్రభుత్వం విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? లడఖ్‌కు సంబంధించి వారి ఉద్దేశం ఏమై ఉంటుంది?

జవాబు: వారి చివరి ఎత్తు ఏమిటన్నది ఆందోళన కలిగించడం లేదు. మా న్యాయపరమైన హక్కుల కోసం మేం పోరాటం సాగించేందుకు దృఢచిత్తంతో ఉన్నాం. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలను మాపై రుద్దేయలేదు. లడఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కావాలన్నదే మా నిశ్చితాభిప్రాయం. ఆ డిమాండ్ నెరవేరే వరకూ మేం విశ్రమించం.

ప్రశ్న: గతంలో కార్గిల్‌లో బిజెపి పెద్దగా లేదు. అయినా కౌన్సిల్ ఎన్నికల్లో కాస్త మెరుగ్గా ఓ సీటు గెలుచుకుంది ఎలా?

జవాబు: కార్గిల్‌లో బిజెపి ప్రభావం నిజానికి పరిమితమే. బౌద్ధుల జనాభా ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో వారు సులభంగా మద్దతు పొందుతున్నారు. మొత్తం మీద చూస్తే, లేహ్‌లో వారి బలం గణనీయమైనదే.

ప్రశ్న: సోనం వాంగ్ చుక్‌ను విడుదల చేయాలని జరిగిన హింసాత్మక ఘటనలపై జుడీషియల్ విచారణ చేయాలని మీరు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు ముందస్తు డిమాండ్లు ఇవేనా. ఇదికాక మీ డిమాండ్ ఏమైనా ఉందా?

జవాబు: మా ప్రధాన డిమాండ్ ఒకటే లడఖ్‌కు తమ డిమాండ్ చెప్పే అవకాశం ఇవ్వండి. కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజల గొంతు మూగపోయింది. ఇక్కడి ప్రజలకు రాజకీయ డిమాండ్లు ఏమీ లేవు. అంతా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. కంటి తుడుపు ప్రజాస్వామ్యం కాదు. పూర్తిస్థాయి నిజమైన ప్రజాస్వామ్యం. లడఖ్‌కు పూర్తి స్థాయి రాష్ట్రం హోదా కల్పించాలన్నదే మా డిమాండ్. మాకు రాజ్యాంగపరమైన అన్ని హక్కులు కల్పించండి. అదనంగా ఆరో షెడ్యూల్‌లో మమ్మల్ని చేర్చమని కోరుతున్నాం.

ప్రశ్న: కేంద్ర ప్రభుత్వం ఎన్నికైన అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం హోదా కల్పిస్తే!

జవాబు: వారు అదే చేయవచ్చు. కానీ, దానివల్ల మా పోరాటం ముగిసిపోదు. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం అయినా, పూర్తి అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ కే ఉంటాయి. ప్రజలకు నిర్ణయాధికారం ఉండదు. లడఖ్ మరో ఢిల్లీ కావాలని మేం కోరుకోవడం లేదు. రాజ్యాంగ పరిరక్షణలతో కూడిన ప్రజాస్వామిక సూత్రాలకు అనుగుణంగా నడిచే స్వయం పాలిత రాష్టం హోదా కల్పించాలి. పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తే తప్ప అది నెరవేరదు.

జగ్గారెడ్డి రూటే సపరేటు

వచ్చే పదేళ్లదాకా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోను అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొనడం ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏటా దసరా, శ్రీరామనవమి, మహాశివరాత్రి వేడుకలను జగ్గారెడ్డి వైభవంగా నిర్వహిస్తారు. సంగారెడ్డిలోనే భారీ ఏర్పాట్ల నడుమ అట్టహాసంగా జరిపే ఈ వేడుకలకు వేలాది మంది హాజరవుతారు. అయితే, దసరా, శివరాత్రి వేడుకలకు సభా వేదిక కూడా ఉంటున్నందున ఈరెండు సందర్భాల్లో ఆయన ప్రసంగిస్తారు. ఈసారి కూడా అలాగే దసరా వేడుకల్లో వేలాది మందిని ఉద్దేశించి మాట్లాడారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ ఉద్యమ సమయంలో జగ్గారెడ్డి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. నాటి టిఆర్‌ఎస్‌పై ప్రతి సందర్భంలోనూ ఒంటికాలిపై లేచారు. బిఆర్‌ఎస్ నేతలే కాదు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు ఆయనకు దూరంగా ఉండేవారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు ఫైర్ బ్రాండ్ పేరును కొనసాగించింది. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఉభయ రాష్ట్రాల్లో ఆయనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా తెచ్చిపెట్టింది. అందుకని ఆయన ఎక్కడికి వెళ్లినా.. హంగామా ఉంటుంది. మాజీ సిఎం కెసిఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు, నేటి మంత్రి రాజనర్సింహ, దివంగత బాగారెడ్డి లాంటి నేతలు ఉమ్మడి మెదక్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ జగ్గారెడ్డిది ప్రత్యేక శైలి! సహజంగా రాజకీయ నేతలు ఖద్దరు చొక్కాలు ధరిస్తారు. లేకుంటే, వివిధ రంగుల్లో చొక్కాలు ధరిస్తారు. కానీ, ఎల్లప్పుడూ టీషర్టు ధరించడం ద్వారా ‘మాస్’ ముద్ర వేసుకున్నారు.

తొలుత బిజెపి ద్వారా సంగారెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేసి, ఆ తర్వాత 2004 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎగా సంగారెడ్డి నుంచి గెలుపొందారు. కేంద్ర మాజీ మంత్రి టైగర్ నరేంద్ర ప్రియశిష్యునిగా ఆయన వాగ్ధాటిని పుణికిపుచ్చుకున్నారు. అదే జోష్‌ను గత రెండున్నర దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న తరుణంలో కాంగ్రెస్ సభను ఆయన నిర్వహించారు. కోట్లాది రూపాయల ఖర్చుతో సంగారెడ్డిలో జరిపిన ఈ సభ ద్వారా ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టిలో ఆయనపడ్డారు. ఆ విధంగా ఢిల్లీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 లో మూడోసారి ఎంఎల్‌ఎగా గెలిచిన తర్వాత రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ విధంగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. 2023 ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ కోటాలో మంత్రి పదవి ఖాయమనుకున్న సమయంలో.. ఓటమి పాలయ్యారు. ఆ విధంగా ఆయన దూకుడుకు బ్రేకు పడింది. అయినప్పటికీ అటు రాహుల్ గాంధీ వద్ద ఉన్న పలుకుబడితో, ఇటు రాష్ట్రంలో ఉన్న పార్టీ అవసరాల రీత్యా ఆయన భార్య నిర్మల కు టిజిఐఐసి ఛైర్మన్‌గా నామినేటెడ్ పోస్టు లభించింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పదవి ద్వారా జగ్గారెడ్డికి పార్టీలో ఉన్న ప్రత్యేక గుర్తింపు మరోసారి వెల్లడయింది.

ఈ నేపథ్యంలో తరచుగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల దసరా ఉత్సవాల్లో చేసిన వ్యాఖ్యలు అటు సొంత పార్టీలో, ఇటు విపక్షాల్లో కూడా చర్చకు దారితీశాయి. మరో మూడేళ్ల తర్వాత, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తన భార్య నిర్మల పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. తనకిప్పుడు 59 సంవత్సరాలు అని, పదేళ్ల తర్వాత అంటే 69 సంవత్సరాల వయస్సులో తిరిగి పోటీ చేస్తానని, మధ్యలో తన కోసం సేవ చేసిన తన అనుచరుడు ఆంజనేయులు వస్తే రావచ్చని ఆయనన్నారు. అప్పటి వరకు తాను వీరికి వెంట ఉండి నడిపిస్తానని అన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడం వల్లనే జగ్గారెడ్డి ఇలా అంటున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల నుంచి డిమాండ్ క్రియేట్ చేసేందుకు ఇలా అన్నారని మరికొందరు అంటున్నారు. దీని వెనుక భారీ వ్యూహం ఉన్నదని ఇంకొందరు అంటున్నారు. మూడేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఏమో? ఇంత ముందుగా ప్రకటనలు అవసరమా? అని విపక్షాలు అంటున్నాయి. మూడేళ్ల తర్వాత అయినా… ఇంకా ఎప్పుడైనా… పార్టీ నిర్ణయాన్ని పాటించాల్సిందే కదా…! అలాంటప్పుడు ఈ వ్యాఖ్యల ప్రభావం ఏమీ ఉండదని స్వపక్షంలోని కొందరు భావిస్తున్నారు. పదేళ్ల తర్వాత రాజెవడో… రాకాసి ఎవడో..!? అని అంటున్నారు. ఆయన అనుచరులు మాత్రం కొంత గందరగోళానికి గురవుతున్నారు.

గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు చేసినప్పటికీ ఈ దఫా చేసిన ప్రకటన తన రాజకీయాలకు సంబంధించినది కావడం ప్రత్యేకత సంతరించుకున్నది. మొత్తమ్మీద తన ప్రకటనలు, వ్యాఖ్యానాల ద్వారా నిత్యం జనంలో చర్చలో ఉండడం ద్వారా జగ్గారెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఆయనకు కొన్ని సార్లు నష్టం కలిగించగా, మరికొన్ని సార్లు బలాన్ని పెంచాయి. ఉమ్మడి ఎపి మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి లాంటి ఉద్దండులు ఏలిన సంగారెడ్డి నియోజకవర్గంలో మాత్రం పార్టీలో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని జగ్గారెడ్డి కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ సిఎంలు వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి తోపాటు నేటి రేవంత్‌రెడ్డితో తాను సన్నిహితంగా ఉన్నానని బహిరంగంగానే అంటుంటారు. గెలుపోటములకు సంబంధం లేకుండా తనకంటూ ఒక వర్గాన్ని ఆయన సృష్టించుకున్నారు. నాకు తోచిందే నేను చేస్తాను… ఇంకొకరు చెప్పింది చేయనే చేయను… అని చెప్పడం కూడా ఆయనకే చెల్లింది! అందుకని బిఆర్‌ఎస్ ఆయనపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో సక్సెస్ అయింది. ఈసారి ఏమవుతుందో చూడాలి!.

బండారు యాదగిరి

98489 97083

(ఉమ్మడి మెదక్ బ్యూరో)

మందే ముందు.. అదే పసందు!

‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనము నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు’ అన్నాడు సుమతీ శతకకారుడు ఎప్పుడో. ఈ మాటను ప్రస్తుత మన రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ ఉంటారు. అటువంటి రాజకీయ నాయకులలో అందెవేసిన చెయ్యి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది. రాజకీయాల్లో బాగా రాటుదేలిన వ్యక్తి ఆయన. ఒకటా రెండా.. దాదాపు 50 సంవత్సరాలుగా రాజకీయాల్లోనే మునిగి తేలుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం నుండి దిగిపోయాక ఇంకో మాట మాట్లాడితే తప్పులేదని సుమతీ శతకకారుడే చెప్పాడు కదా అనుకుంటారేమో ఆయన. చరిత్ర రీలు వెనక్కు తిప్పితే చంద్రబాబునాయుడు రాజకీయాల్లో ‘ఎప్పటికామాటలాడి’ అన్నవిధంగా అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో ప్లేటు ఫిరాయించి చెప్పిందొకటి చేసింది ఒకటి అన్నవిధంగా వ్యవహరించిన విషయం జగద్విదితం.

మిగతా విషయాలు ఎలా ఉన్నా మద్యం విషయంలో ఆయన తీసుకున్న యూటర్న్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఒక పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. 201419 కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం విధానానికి సంబంధించి అక్రమాలు జరిగాయంటూ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులో ఆయన బెయిల్ పై ఉన్నారు. 2024లో మళ్ళీ అధికారంలోకి రాగానే వైయస్సార్ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులను, ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను మద్యానికి సంబంధించిన కుంభకోణం జరిగిందనే ఒక కేసు పెట్టి జైలుకు పంపించారు.

ఈ రభస ఇలా జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లో పెద్దయెత్తున కల్తీ మద్యం చలామణిలో ఉన్న విషయాలు బయటపడుతున్నాయి. ఇది కేవలం అక్కసుతో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు కాదు. ఎక్సైజ్ పోలీసులే స్వయానా కేసులు పెడుతున్నారు. ఇలా కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెలరేగిపోతున్నదని, ప్రజారోగ్యం ఆందోళనలో పడిందని, కొందరు మరణించారని తాము సేకరించిన సమాచారంతో కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తే అందులో ఒక మీడియా సంస్థ సంపాదకుడిమీద, ఒకరిద్దరు విలేకరుల మీద ఆధారాలు చూపండని కేసులు పెడుతున్నారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చ అంతా మద్యం చుట్టూ తిరుగుతున్నది. కాబట్టే చంద్రబాబు నాయుడు ఇతర అంశాల్లో కూడా తాను చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ ప్రస్తుతం మద్యం గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. మద్యాన్ని నిషేధించాలని చాలాకాలంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట మద్యాన్ని నిషేధించింది, తమకు పట్టుగల ప్రాంతాల్లో పకడ్బందీగా అమలు చేసింది అప్పటి పీపుల్స్ వార్ పార్టీ.

1994 కు ముందు కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక్క చుక్క మద్యం కూడా అమ్మకుండా పీపుల్స్ వార్ కట్టడి చేస్తే, అప్పటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు జువ్వాడి చొక్కారావు దానికి మద్దతు పలికారు. ఆయన గాంధేయవాది. జీవితాంతం మద్యపానాన్ని వ్యతిరేకించినవారు. అయితే చిత్రంగా విజయభాస్కర రెడ్డి ప్రభుత్వం నక్సలైట్ల మధ్య నిషేధ కార్యక్రమాన్ని తూట్లు పొడిచేందుకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లో పోలీసుల పహరాలో మద్యం అమ్మకాలు సాగించింది. మద్యంనుండి లభించే ఆదాయం అటువంటిది మరి. అప్పుడే ప్రతిపక్షంలో ఉన్న ఎన్టీ రామారావు మద్యనిషేధాన్ని తన ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకొని, గెలిచిన వెంటనే మాట నిలుపుకొని సంపూర్ణ మధ్య నిషేధం విధించారు. ఆరోగ్యరీత్యా వైద్యులు నిర్ణయిస్తే కొద్ది మోతాదులో మద్యం సేవించేందుకు పర్మిట్లను అనుమతించారు. కొన్ని మాసాలకే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మధ్య నిషేధంపట్ల తాను మరింత కఠినంగా ఉంటానని చెప్పుకునేందుకు ఆ హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు. అంతేకాదు, హైదరాబాద్ పాతబస్తీలోని కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక విశాలమైన పార్కులో అప్పటి మద్య నిషేధ శాఖ స్వాధీనపరుచుకున్న అక్రమ మద్యాన్ని తానే రోడ్డు రోలర్ నడిపిస్తూ వాటిని ధ్వంసం చేసి, పత్రికల్లో ఫోటోలు వేయించుకున్నారు. అప్పుడది అవసరం, అందుకే అది చేశారు.

కొద్ది నెలల్లోనే మద్య నిషేధాన్ని సంపూర్ణంగా ఎత్తేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే ఆయన చేసిన తొలి సంతకాలలో బెల్ట్ షాపుల ఎత్తివేత కూడా ప్రధానమైనది. బెల్ట్ షాపులు అధికారికంగా ఏర్పాటు చేసేవి కాదు. వాటిని ఎత్తివేస్తామని ఒక ముఖ్యమంత్రి అధికారికంగా సంతకం చేయడమేమిటి? అది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ బాధ్యత కదా అని ముక్కున వేలేసుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్సైజ్ శాఖ బాధ్యత అక్రమ మద్యం ఉత్పత్తిని నిరోధించడం, కల్తీ మద్యం పంపిణీ ఆపడం, అనధికారికంగా ఏర్పాటయే మద్యం దుకాణాలను అంటే బెల్ట్ షాపులను నిర్మూలించడం. అది అధికారులు సహజంగా చేసుకోవాల్సిన పని. సంతకం అయితే చేసారు కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఏ రీతిలో విచ్చలవిడిగా పెరుగుతూపోయాయో ఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రామానికి వెళ్లి ప్రజలు అడిగినా చెబుతారు. 2019లో ఆయన ఓడిపోయి వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను పాదయాత్ర సందర్భంగా కానీ, ఇతరత్రా కానీ చెప్పిన సంపూర్ణ మద్య నిషేధానికి బాటలు వేస్తూ మద్యం విధానాల్లో పలు మార్పులు తీసుకొచ్చారు. మద్యం విక్రయాలు ప్రైవేట్ వారి చేతుల్లో లేకుండా చేశారు.

దుకాణాల సంఖ్య బాగా తగ్గించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అమ్మకాలు సాగించారు. ప్రభుత్వ కార్యాలయాల పనివేళల మాదిరిగానే అవి ఉదయం తెరిస్తే సాయంత్రం మూసివేసేవారు. అదేవిధంగా, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన బ్రాండ్లనే ఈ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మినా ధరలు మాత్రం బాగా పెంచారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క బెల్టుషాపు కూడా లేకుండా కఠినమైన చర్యలు తీసుకున్నారు. దీనివల్ల నిజానికి ప్రభుత్వ ఆదాయం చాలా తగ్గుతుంది. అయినప్పటికీ ప్రచార సమయంలోగానీ, అంతకు ముందుగానీ తాను చెప్పినట్టు సామాన్య ప్రజలకు మద్యం అందుబాటులో లేకుండా చేసినట్లయితే వారిని తాగుడుకు బానిసలు కాకుండా కాపాడటానికి ప్రయత్నించవచ్చునని ఆయన ప్రభుత్వం సంపూర్ణంగా నమ్మింది. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్తుండిన మాట మద్యం బాటిల్ ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలుంటాయని. ఆచరణలోనూ ఆయన అదే చేసి చూపించారు. కేరళ వంటి మరికొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ మద్యం అమ్మకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతాయి.

వీటితోపాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ప్రతి మద్యం బాటిల్ ను విక్రయించే ముందు వినియోగదారుడి ఎదుటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూపించే పద్ధతిని కూడా ప్రవేశపెట్టింది. ఎందుకంటే ప్రభుత్వం అమ్మే మద్యంలో కల్తీ లేదా అక్రమ మద్యం వస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఆలోచనతో. బాటిళ్లు స్కాన్ కాకపోతే దాన్ని విక్రయించేవారు కాదు. ఆంధ్రప్రదేశ్ లో మద్యపానప్రియులు ఎవరినడిగినా ఈ విషయం చెబుతారు. స్కాన్ తో ఆ మద్యం సీసా ఏ డిస్టిలరీనుండి, ఏ డిపో నుండి వచ్చిందో ఏ షాపునకు అది వెళ్ళిందో, ఆ షాపులోనే విక్రయించారా లేదా అనే విషయాలు స్పష్టంగా తెలిసిపోతాయి. ఇటువంటి పకడ్బందీ ఏర్పాటు కారణంగా కల్తీ, అక్రమ మద్యాన్ని పట్టుకోవడం చాలా సులువు అయ్యేది.

గత ప్రభుత్వంలో మద్యానికి సంబంధించి ఇదంతా జరుగుతున్న సమయంలో నాణ్యత లేని మద్యం తాగి వేలమంది మృతి చెందారంటూ అప్పటి ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ వారు, ఆయనతో స్నేహం చేసిన ఇతర కొన్ని పార్టీలు పెద్దయెత్తున ప్రచారం చేసాయి. ఇవన్నీ అభూతకల్పనలని తేల్చేస్తూ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పార్టీతో కలిసి కూటమిలో భాగస్వామిగా ఉన్న బిజెపి నేతృత్వంలోని కేంద్ర హోమ్ శాఖ 2022- 2023 నివేదికల్లో అక్రమ మద్యం కేసులు గాని, మృతులు గాని ఆంధ్రప్రదేశ్ నమోదు కాలేదని స్పష్టంగా చెప్పింది. ఇదిలాఉంటే 2024 ఎన్నికల ప్రచారంలో 70 ఏళ్ల వయసు దాటిన సీనియర్ రాజకీయవేత్త చంద్రబాబునాయుడు మద్యం విషయంలో జరిపిన ప్రచారం తీరు అందరినీ నిర్ఘాంతపరచకతప్పదు. ‘రోజంతా కష్టపడి అలసట మరచిపోవడానికి రెండు పెగ్గులు తాగాలనుకుంటారు.

ఆ మద్యం మీకు సరైనది అందడం లేదు. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకే అందిస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో ప్రతి బహిరంగసభలో చంద్రబాబు నాయుడు ప్రజలను ఉత్సాహపరిచారు.అనధికారిక అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 90 లక్షలమంది మద్యం సేవించే వాళ్ళు ఉండొచ్చని ఒక లెక్క. ప్రచారం తొలి రోజుల్లో చంద్రబాబునాయుడు పదేపదే మద్యం గురించి ఇలా మాట్లాడుతుంటే ఇంత సీనియర్ నాయకుడు ప్రజలను మద్యం తాగడానికి ప్రోత్సహించడం ఎబ్బెట్టుగా ఉన్నదని, మద్యనిషేధాన్ని నిజాయితీగా నమ్మి, దాని కారణంగా వచ్చే విపరిణామాలను కూడా లెక్కచేయకుండా కచ్చితంగా అమలుపరిచిన ఎన్టీ రామారావు తన ఆరాధ్యదైవం అని చెప్పుకుంటూ ఆయన ఆత్మక్షోభించే విధంగా ఇవేం మాటలు అనుకున్న వాళ్ళకు.. ఇది ఆ 90 లక్షల ఓట్లకు వేస్తున్న గాలమని ఆ తర్వాత అర్థమైంది.

ఆయన ఆశించినట్టే ఇతర అంశాలు కూడా కలిసి వచ్చి అధికారంలోకి రాగానే ప్రచార సమయంలో తాను ప్రజలకు మాట ఇచ్చినట్టుగా సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం కాకుండా ప్రభుత్వం అదుపులోనుండే మద్యం విక్రయాలను ఎత్తేశారు. మద్యం అసలైనదా, నకిలీదా అని తెలుసుకునే క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. ప్రైవేటు మద్యం దుకాణాలకు తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన గత ఏడాదిన్నర కాలంలో 11 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మద్యం అమ్మకాలు జరిగితే, అందులో 48 కోట్ల క్వార్టర్ బాటిళ్లు దాదాపు 5,280 కోట్ల రూపాయల విలువచేసే మద్యం అనధికారిక ఉత్పత్తి, సరఫరా జరిగిందని కడప లోకసభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రకటించారు. దానిమీద ప్రభుత్వంనుంచి ఈనాటివరకు ఎటువంటి వివరణ లేదు. మరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న మద్యం విక్రయాలకు సంబంధించి, వాటిలో కల్తీ జరిగిన విషయంపైన, ఆ కల్తీ మద్యం తాగడం వల్ల మరణాలు కూడా సంభవించాయన్న వార్తలపైన నిజనిర్ధారణకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలను తేలిస్తే బాగుంటుంది.

పలు జిల్లాల్లో యథేచ్ఛగా కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రజారోగ్యానికి నష్టం కలగడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు కూడా గండిపడుతున్నదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలమీద ప్రభుత్వం నిగ్గుతేల్చితే మంచిది. మద్యం కల్తీ జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలు లేకుండా క్యూఆర్ కోడ్‌ను ఎత్తివేశారు. గత కొద్దిరోజులుగా దీనిమీద ఇంత రభస జరిగాక ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అప్రమత్తమై క్యూఆర్ కోడ్ పద్ధతిని మళ్ళీ ప్రవేశపెట్టినట్టు తెలుస్తున్నది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగేపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మద్యం విక్రయాల విలువ భారీగా తగ్గింది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఏటా గత సంవత్సరంతో పోలిస్తే ఓ పదిశాతం వరకు ఎక్సైజ్ రాబడి పెరుగుతూ ఉంటుంది. పశ్చిమగోదావరిలో గత ఏడాదికన్నా ఈ ఏడాది విక్రయాల విలువ నాలుగు శాతం తగ్గగా శ్రీకాకుళం, వైయస్సార్ కడప, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో విక్రయాల విలువ ఒక శాతం కూడా పెరగలేదు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో మూడు శాతం మాత్రమే పెరిగింది. మన్యం, తిరుపతి, బాపట్ల జిల్లాల్లో నాలుగు శాతం మాత్రమే పెరిగినట్టు అందుబాటులో ఉన్న లెక్కలు చెబుతున్నాయి. దీనికి కారణం కల్తీ మద్యం విక్రయాలన్నది స్పష్టం.

ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కూడా ఈ కల్తీ మద్యం మీద చర్చ జరగడం, నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఎక్సైజ్ శాఖ సూచించడం ఆంధ్రప్రదేశ్ లో మద్యానికి సంబంధించిన ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతున్నది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ విషయంలో విచారణ సందర్భంగా ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో పే ర్కొన్నట్టు రాజకీయ నేతల మీద కేసులు ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎల్లవేళలా ప్రత్యర్థి అనేవారు ఉంటారు. అయితే ప్రత్యర్థులు మాట్లాడే మాటలను, చేసే విమర్శలను, తమ దృష్టికి తీసుకువచ్చే అంశాలను ప్రజాక్షేమం దృష్టిలో పెట్టుకొని పట్టించుకుని అవసరమయిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.

నిరుద్యోగ యువత చెవిలో పువ్వులు

‘అంధులకు చూపు కావాలి.. నిరుద్యోగులకు జాబు కావాలి’ ఇది బీహార్‌లో నిరుద్యోగ యువత నుంచి వినిపిస్తున్న నినాదం. ప్రభుత్వ ఉద్యోగం దక్కకుంటే కూరగాయలు అమ్ముకోవడమో లేదా కూలిపనులకు వెళ్లడమో తప్పదన్న నిర్వేదనతో ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లకు యువత ప్రిపేర్ కావడం బీహార్‌లో కనిపించే జీవన చిత్రం. పాట్నా లోని ఎపిజె అబ్దుల్ కలాం సైన్స్ సెంటర్ బయట పరిసరాల్లో ఫుట్‌పాత్‌లపై నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తుండడం నిత్యం కనిపిస్తోంది. ఇప్పటివరకు బీహార్‌లో ఏ ప్రభుత్వమూ నిరుద్యోగ సమస్య నిర్మూలనకు గట్టి ప్రయత్నం చేయలేదనే చెప్పక తప్పదు. కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాయకులు యువ ఓటర్లను ఆకట్టుకోడానికి ఏవో పథకాలను ప్రకటించి అరచేతిలో స్వర్గం చూపిస్తుంటారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఎన్‌డిఎ కూటమి, మరోవైపు విపక్ష నేతలు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వియాదవ్ తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని పదేపదే భరోసా ఇస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు ఎలాంటి గట్టి అవకాశాలు కల్పించని వారు ఎన్నికల్లోనే దీన్ని తెరపైకి తీసుకు రావడం నవ్వు తెప్పిస్తోంది. ఇదంతా ఓట్ల కోసం నిరుద్యోగులకు లేనిపోని భ్రమలు కల్పించి చెవిలో పువ్వులు పెట్టడమే తప్ప మరేమీ కాదు. ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్‌లో చాలామంది యువ ఓటర్లు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే తమకు అత్యంత టాప్ ప్రయారిటీ అని అంగీకరిస్తున్నారు. రాష్ట్రం లోని ఓటర్లలో 22 శాతం మంది అంటే 1.63 కోట్ల ఓటర్లు 18 నుంచి 23 ఏళ్ల వారే. వీరిలో 1.5 కోట్ల మంది 20 ఏళ్ల వయసు దాటిన వారే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో 14 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చుకున్నాక తుది జాబితా విడుదలైంది. ఈ కీలకమైన ఓటర్లను గెలవడానికి పాలనలో ఉన్న నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్‌డిఎ). విపక్ష గ్రాండ్ అలియన్స్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన హామీని పరాకాష్ఠకు తీసుకెళ్తున్నాయి. నితీశ్ కుమార్ ప్రభుత్వం ఇటీవల వివిధ రంగాల్లో నిరుద్యోగులకు లక్షలాది అపాయింట్‌మెంట్ లెటర్లు జారీ చేయడమైందని ప్రకటించింది. దీనికి తోడు భవిష్యత్తులో మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అనేక సందర్భాల్లో హామీ ఇస్తున్నారు.

మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ గత గ్రాండ్ అలియన్స్ ప్రభుత్వకాలంలో తాను డిప్యూటీ సిఎంగా ఉన్నప్పుడు 17 నెలల వ్యవధి లోనే యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించడమైందని, ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం తిరిగి అధికారం లోకి వస్తే ఎన్ని ఉద్యోగాల లభిస్తాయో ఎవరైనా ఊహించవచ్చని ఊరిస్తున్నారు. దీన్ని ఇప్పుడు యువత ప్రశ్నిస్తోంది. ఎన్నికల సమయం లోనే యువత ఉద్యోగాల సమస్య మీకు గుర్తొస్తొందా? ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు చేయలేదు? అన్న ప్రశ్నలు యువతనుంచి ఎదురవుతున్నాయి. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) 2021 22 ప్రకారం బీహార్‌లో నిరుద్యోగ రేటు 5.9 శాతం వరకు ఉంది. జాతీయ సరాసరి నిరుద్యోగ రేటు 4.1 శాతం కన్నా బీహార్‌లోనే నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉండడం గమనార్హం.

అలాగే బీహార్‌లో 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగ రేటు 20.1 శాతం ఉండగా, అదే వయసు వారిలో జాతీయ నిరుద్యోగ సరాసరి రేటు 12.4 శాతం కావడం బట్టి బీహార్‌లో నిరుద్యోగం ఎలా తాండవిస్తోందో తెలుస్తోంది. బీహార్‌లో ఉద్యోగ అవకాశాలు కరవు కావడంతో లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు వలసపోవడం నిత్యదృశ్యమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు దొరక్క ప్రభుత్వేతర అనధికారిక ఉపాధి మార్గాల పైన, స్వయం ఉపాధిపైన, క్యాజువల్ ఉద్యోగాల పైన ఆధారపడి బతుకుతున్నారు. బీహార్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగం సర్వసాధారణం కాగా, అర్బన్ ఏరియాల్లో తమ నైపుణ్యం కన్నా తక్కువ స్థాయి ఉద్యోగాల్లో చేరుతున్నారు. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఒక పనికి అవసరమైన వారి కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్టు కనిపిస్తుంటారు. వ్యవసాయ రంగంలో ఈపరిస్థితి కనిపిస్తుంది.

యువ ఓటర్ల మనోగతం తెలుసుకోడానికి ప్రయత్నించినప్పుడు విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీ అభిమాన నాయకులు లేదా పార్టీ ఎవరికి మీరు ఓటేస్తారని అడగ్గా.. కొంతమంది ప్రతి ఐదేళ్లకు పాలనలో మార్పు తప్పనిసరి అని తమ అభిప్రాయం వెలిబుచ్చగా, మరి కొంతమంది ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కే తమ ప్రాధాన్యమని వెల్లడించారు. మొత్తంమీద రాష్ట్రం కోసం ఆయన బాగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రశాంత్ కిశోర్ బీహార్ యువకుల, ప్రజల వాస్తవ సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారని కొందరు యువకులు అభిప్రాయపడుతున్నారు. యువతలో ఒక వర్గం తేజస్వియాదవ్‌పై మొగ్గు చూపుతోంది. ‘ఆయన యువకుడు, అంతేకాక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తమ లాంటి యువకులకు కొత్తగా ఉద్యోగాలు కల్పించడానికి గట్టిగా ఏదో ఒకటి చేయగల’రని నమ్ముతోంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడిన తరువాత ఎవరైతే అధికారం లోకి వస్తారో వారు ఉద్యోగాల్లో యువతకు ఎక్కువ రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఉందని, నూటికి నూరు శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు దక్కేలా చూడవలసిన బాధ్యత ఉందని యువకుల నుంచి ఏకాభిప్రాయం వస్తోంది. 

చిదంబరం చేసింది పెద్ద సాహసమే!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడి పి. చిదంబరం పెద్ద సాహసమే చేసారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తప్పు నిర్ణయమని, ఆ కారణంగా అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధి తన ప్రాణాలను కోల్పోయారని అన్నారు. ఆయన ఆ మాటలు పరోక్షంగానో, నర్మగర్భంగానో కాదు, సూటిగానే చెప్పారు. ఆ మాటలు సహజంగానే సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పించాయి. వారు తనపై విమర్శలు చేసారు. కాని, అంత తీవ్రమైన వ్యాఖ్యలు సాక్షాత్తూ ఇందిరపై చేసినా, తర్వాత మూడు రోజులలోనూ ఈ వ్యాసం రాసే సమయానికి తనపై ఎటువంటి చర్య తీసుకోకపోవటం గమనించదగ్గది. చిదంబరం లోగడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా కూడా పని చేసిన నాయకుడు. మేధావి గానూ గుర్తింపు ఉన్నది. అందువల్ల ఆయన వ్యాఖ్యలను తేలికగా తీసుకోలేము. ఆయన ఈ నెల 12న, పంజాబ్‌కు పొరుగున గల హిమాచల్‌ప్రదేశ్ పట్టణం కసౌలీలో ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొంటూ, అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం నుంచి సిక్కు తీవ్రవాదులను బయటకు రప్పించేందుకు, ఆ దేవాలయ ప్రాంగణాన్ని స్వాధీన పరచుకునేందుకు ఇతర మార్గాలు ఉండేవని, అందుకు బదులు సైనిక చర్యను చేపట్టడం తప్పు నిర్ణయమని అన్నారు. సైనిక చర్య జరిగింది 1984 జూన్ మొదటి వారంలో కాగా, అదే సంవత్సరం అక్టోబర్ 31న, ఇందిరాగాంధిని ఆమె అంగరక్షకులు అయిన ఇద్దరు సిక్కు జవాన్లు తన అధికారిక నివాసంలోనే కాల్చి హత్య చేసారు.

సైనిక చర్యకు ముందు కాలంలో, అట్లానే ఇందిరాగాంధి హత్య అనంతర కాలంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్ రాష్ట్రం, దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే గాక, ముఖ్యంగా ఉత్తర భారతమంతా అల్లకల్లోమైంది. అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. తదనంతర దాడులలో, అల్లర్లలో వేలాదిమంది పౌరులు, యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఖలిస్థానీ వేర్పాటు ఉద్యమం చాలా కాలం పాటు తీవ్రంగా సాగింది. అదంతా పాకిస్థాన్‌కు గొప్ప అవకాశంగా లభించింది. మొత్తం ప్రపంచంలోని సిక్కులకే గాక, సిక్కు మత గురువులను అమితంగా ఆరాధించే అసంఖ్యాకులైన హిందువులకు కూడా స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య, తదనంతర ‘ఆపరేషను’ పెద్ద మానసికి గాయాన్నే చేసాయి. అప్పటి నుంచి 40 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా పంజాబ్ లోనే గాక, పంజాబీలు పెద్ద సంఖ్యలో నివసించే బ్రిటన్, కెనడా వంటి ఇతర దేశాలలోనూ ఆపరేషన్ బ్లూస్టార్ ప్రభావపు ఛాయలు మిగిలి ఉన్నాయంటే, ఆ తీవ్రతను అర్థం చేసుకోవటం కష్టం కాదు. ఇక్కడ గుర్తించవలసింది ఏమంటే, యథాతథంగా సిక్కు తీవ్రవాదంపై, వేర్పాటువాదులపై మాత్రమే చర్య జరిగి ఉంటే, అది ఎంత కఠినమైనది అయినప్పటికీ ఆ తర్వాత ప్రభావాలు, పరిణామాలు ఈ విధంగా ఉండేవి కావు. కాంగ్రెస్ నాయకుడు చిదంబరం ఈ విధంగా మాట్లాడవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఇంకా అనుకోవాలంటే, బహుశా ఇందిరాగాంధీపై ఆ దాడి కూడా జరిగేది కాదేమో. దీనంతటికి మూలం స్వర్ణ దేవాలయం వంటి వందల ఏళ్ల అత్యంత పవిత్ర కేంద్రంపై సైనిక దాడిలో, తీవ్రవాదులను కాల్చటం అట్లుంచి ఆ నిర్మాణాలకు సైతం నష్టం కలిగించటంలో ఉంది.

వాస్తవానికి ఇదంతా అప్పటి ఆలోచనాపరులు ముందుగా ఊహించలేనటువంటి దేమీ కాదు. స్వర్ణ దేవాలయ చరిత్ర, పవిత్రత మాత్రమే గాక, మొఘలుల ఆక్రమణ కాలం నుంచి స్థానికుల మహా వీరోచిత ప్రతిఘటనా యుద్ధాలు, సిక్కు మతం పుట్టుక, ఆ మతస్థుల నిబద్ధతలు, గురువుల పట్ల సంపూర్ణ విధేయతల చరిత్ర తెలిసిన వారందరూ ఊహించగలదే. బయట అత్యధికులకు తెలియనిది ఏమంటే, సిక్కు మత ఆవిర్భావానికి ముందు ఆ సరిహద్దు ప్రాంతాలన్నింటా ఉండిన హిందూ కుటుంబాలు, సిక్కు గురువుల పిలుపు మేరకు ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో యువకుడిని ఆ మతంలోకి స్వచ్ఛందంగా, సంతోషంగా చేర్చారు. ఆ విధంగా ఎన్నెన్నో కుటుంబాలు హిందూ, సిక్కు మతాలతో కూడిన మిశ్రమ మత కుటుంబాలు అయాయి. బ్లూస్టార్ అనంతరం, ఖలిస్థానీ ఉద్యమం ఇంకా ఉధృతంగా సాగుతుండిన కాంలోనే, ఒక జర్నలిస్టుగా అక్కడి గ్రామాలలో పర్యటించిన నేను, వారి ఇళ్లలో గోడలపై గల కుటుంబపు ఫోటోలలో వారి కుటుంబ సభ్యులు హిందువులు, సిక్కులు కూడా ఉండిన చిత్రాలను చూసి ఆశ్చర్యపోయాను. ఆ విషయమై ప్రశ్నించిన నాకు వారిచ్చిన వివరణను బట్టి, అటువంటి మిశ్రమ మత కుటుంబ సంప్రదాయం గురించి ప్రత్యక్షంగా గమనించాను. ఇటువంటి స్థితి ప్రపంచ మతాలలో మరెక్కడైనా ఉందేమో తెలియదు.

విషయం ఏమంటే, చిదంబరం వివరించకపోవచ్చు గాని, ఆయన అసాధారణమైన వ్యాఖ్యలతో సంబంధం గల ఇటువంటి నేపథ్య విశేషాలు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని నా పర్యటన సమయంలో గ్రామాలు, చిన్న పట్టణాల సామాన్య ప్రజల నుంచి విన్నాను. చూసాను. ఆ విషయాలు ఎంతగా తెలియగలిగితే, ఆపరేషన్ బ్లూస్టార్ తప్పిదం మనకు అంతగా అర్థమవుతుంది. స్వర్ణ దేవాలయాన్ని ప్రభుత్వం స్వాధీన పరచుకునేందుకు సైనిక చర్యకు భిన్నంగా ఇతర పద్ధతులు ఉండెనని చిదంబరం ఒక మాట అన్నారు. ఆ పద్ధతులు ఏమిటో ఆయన వివరించలేదు. కాని ఆ విషయమై, ఆపరేషన్ అనంతరం కాలంలో జాతీయ స్థాయిలోకొన్ని చర్చలు జరిగాయి. యుద్ధ సమయాలలో కోటలను నెలల తరబడి దిగ్బంధించి అన్ని సరఫరాలను నిలిపి వేసిన పద్ధతులు, లోపలి మనుషులు స్పృహ కోల్పోయేట్లు రసాయనిక వాయువులను వదలటం వంటివి వాటిలో కొన్ని. కాని, ఎందువల్లనైతేనేమి ఇందిరాగాంధి ప్రత్యక్ష సైనిక చర్య పద్ధతిని ఎంచుకుని పెద్ద తప్పునే చేసారు. నేను అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని కర్ఫూ మధ్య లోపలకు ప్రవేశించి చూసినపుడు, యథాతథంగా దేవాలయానికి జరిగిని నష్టం లేదు గాని, ఆ చుట్టూ గల ఇతర నిర్మానాలన్నీ దెబ్బ తినటాన్ని గమనించాను. సైనిక చర్య గురించి అక్కడి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యులు, ఇతరత్రా కనిపించిన కొద్ది మంది యువకులు, లంగర్‌లో భక్తులకు ఆహారం అందజేసే సిబ్బంది, తమ గొంతును పెంచకుండా, బరువైన మొహాలతో, చిన్నచిన్న మాటలుగా చెప్పినవి విన్నాను.

చిదంబరం అన్న ‘పెద్ద తప్పు’ ఎంతటి పెద్ద తప్పో అర్థం చేసుకోవటం ఎంతమాత్రం కష్టం కాదు. బ్లూస్టార్‌కు ముందు వెనుకల పరిణామాలను దృష్టిలోకి తీసుకున్నపుడు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. అవి పలుమార్లు చర్చకు వచ్చినవే. అయినా, సందర్భం ఏర్పడింది గనుక రెండు మాటలు క్లుప్తంగా చెప్పుకోవటం అవసరం. పంజాబ్ రాజకీయాలు మొదటి నుంచి అకాలీదళ్, కాంగ్రెస్‌ల చుట్టూ తిరుగుతుండేవి. అకాలీదళ్‌ను దెబ్బతీసేందుకు ఇందిరాగాంధీ, అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్ సలహా ప్రకారం సిక్కులను చీల్చేందుకు సంత్ జర్నేల్ సింగ్ భిండ్రావాలేను ప్రోత్సహించి రాజకీయాలలోకి తెచ్చారు. అదే వ్యక్తి క్రమంగా సిక్కుల హక్కులు, పంజాబ్ హక్కుల పేర మిలిటెంట్‌గా మారి ఏకు మేకయ్యాడు. ఖలిస్థానీ వేర్పాటు ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఇక తర్వాతి పరిణామాలు తెలిసినవే. బ్లూస్టార్ తప్పుకన్న ముందు కాలంలోనే ఇందిరాగాంధీ చేసిన ఒరిజినల్ తప్పు అది. ఇక బ్లూస్టార్ తర్వాత చేసిన తప్పు ఆపరేషన్ ఉడ్‌రోజ్. దీని గురించి బయటి దేశం విన్నది తక్కువ. దాని వల్ల కలిగిన హాని చాలా ఎక్కువ. అది నా పర్యటనలో విస్తారంగా విన్నవిషయం. ఈ కొత్త ఆపరేషన్ కింద భద్రతా బలగాలు పెద్ద ఎత్తున గ్రామాలను చుట్టుముట్టి యువకులను నిర్బంధించటం, హింసించటం సాగించాయి. తీవ్రవాదం అన్నది లేకుండా చేయాలన్నది ఉద్దేశం. కాని అందుకు విరుద్ధంగా జరిగింది. యువకులు భయపడి పాకిస్థాన్‌కు పారిపోవటం, అక్కడ కొద్ది రోజుల శిక్షణతో ఆయుధాలు, డబ్బుతీసుకుని రావటం, హింసా చర్యలకు పాల్పడటం మొదలైంది. ఇది పెద్ద ఎత్తున జరిగింది. సరిహద్దు జిల్లా లైన పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్, అమృత్‌సర్, తరణ్ తారణ్, ఫిరోజ్‌పూర్‌లలోని పలు ప్రాంతాలలో పట్టు సంపాదించి వాటిని విముక్త ప్రాంతాలుగా ప్రకటించారు. అక్కడ కొన్ని చోట్లకు స్వయంగా వెళ్లిన నేను, భద్రతా బలగాల కదలికలు, నియంత్రణ ఎంత పరిమితంగా ఉండిందో గమనించాను.

చివరకు పరిస్థితిని అదుపు చేసేందుకు చాలా కాలం పట్టింది. ఇది బ్లూస్టార్‌కు ముందు, తర్వాతల పరిస్థితులు కాగా, ఇందిరాగాంధి హత్య అనంతరం ముఖ్యంగా ఢిల్లీతోపాటు పలు హిందీ రాష్ట్రాలలో జరిగిన సిక్కు వ్యతిరేక హింసాకాండ తెలిసిందే. అపుడు ఢిల్లీలో నివసిస్తుండిన నేను అటువంటి ఘటనలు అనేకం గమనించాను. ఆ విధంగా, చిదంబరం అన్న ‘పెద్దతప్పు’కు ముందు వెనుకలు చాలానే ఉన్నాయి. ఇవేవీ రహస్యం కాదు. చర్చలు జరగనివీ కాదు. చిదంబరం ఎందువల్ల ఇపుడీ ప్రస్తావన చేసారో తెలియదుగాని, అందుకు ఆయనను ఆక్షేపించిన వారికి కూడా అవి తెలిసిన విషయాలే. అందుకే కావచ్చు వారు విషయాన్ని అంతకన్న ముందుకు తీసుకుపోవటం లేదు. ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా, జాతి అయినా, దేశమైనా ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు గ్రహించటం వల్ల భవిష్యత్తుకు ఉపయోగం ఉంటుంది. కాని దురదృష్టవశాత్తు ఇందిరాగాంధి వెంటనే ప్రధాన మంత్రి స్థానంలోకి వచ్చిన ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ ఏ పాఠాలూ నేర్వలేదు. ఆ వెనుక జరిగిన ఎన్నికలలో, ఒక మహావృక్షం కూలితే భూమి కంపించటం సహజమంటూ సిక్కు వ్యతిరేక హింసాకాండను బాహాటంగా సమర్థించారు. పత్రికల అడ్వర్టయిజ్‌మెంట్లు అంతే సమర్థనా పూర్వకంగా ఇచ్చారు. ఇవి కూడా నేను స్వయంగా విన్నవి, చూసినవి. ఈ ధోరణికి కొనసాగింపా అన్నట్లు, శ్రీలంక వివాదంలో పెద్ద మనిషి మధ్యవర్తి త్వానికి పరిమితం కావటానికి బదులు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపికెఎఫ్) పేరిట సైన్యాన్ని పంపగా, ఆ దళాలు ప్రత్యక్ష చర్యలలో పాల్గొన్నాయి. అది చివరకు రాజీవ్‌కు ప్రాణాంతకమైంది. ఇటువంటి తప్పులు ఇంకా ఉన్నాయి గాని ఆ చర్చకు ఇది సందర్భం కాదు.

టంకశాల అశోక్  

డ్రగ్స్ మాఫియాకు ‘ఈగల్’ కళ్లెం

హైదరాబాద్ మహా నగరాన్ని పట్టిపీడిస్తోన్న ‘మత్తు’ను వదలించేందుకు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. భాగ్యనగరాన్ని డ్రగ్స్ విక్రయాలకు, తయారీకి అడ్దాగా చేసుకున్న మాఫియా భరతం పట్టేందుకు ఉక్కుపాదం మోపుతోంది. నిన్నటివరకు క్రయవిక్రయాలపై దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం… డ్రగ్స్ తయారీ ముఠాలపై కూడా డేగకన్ను పెట్టింది. నగరంలో డ్రగ్స్ ఊసేలేకుండా చేసేందుకు ప్రభుత్వం ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ విక్రయాలు జోరందుకుంటుండటాన్ని సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం ప్రత్యేక పోలీసు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రముఖులు నివసించే ప్రాంతాలనుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డ్రగ్స్ విక్రయాలు కొనసాగడం ప్రభుత్వానికి సవాల్‌గా మారడంతో సరఫరాతో పాటు తయారీ ముఠాల ఆగడాలపై ప్రత్యేక దృష్టిని సారించింది. పబ్‌లు.. వీకెండ్ పార్టీలు, రిసార్టు ఫంక్షన్లపై నిఘా పెట్టింది. పరిశ్రమల పేరిట గుట్టుగా డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాల భరతం పడుతోంది. ఈగల్ టీమ్ ఏర్పాటు చేసిన తరువాత నగరంలో డ్రగ్స్ మాఫియా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నగరంతో పాటు శివార్లలో తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈగల్ టీమ్ ముందుగా నగరంలో క్రయవిక్రయాలు, సరఫరాపైనే దృష్టి సారించగా, మహారాష్ట్ర పోలీసులు నగరంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నాకే అప్రమత్తమైన నగర పోలీసులు దూకుడు పెంచింది.

ముంబయిలో బంగ్లాదేశ్ మహిళ డ్రగ్స్‌తో పట్టుపడగా… విచారణలో చర్లపల్లిలో వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీలో తయారీ వెలుగు చూసింది. సుమారు రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ దందా నగరంలోని చర్లపల్లి కేంద్రంగా సాగుతున్నట్లు… ఇక్కడినుంచే దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు తెలియడంతో నగరవాసులతో పాటు పోలీసులు విస్తుపోవల్సివచ్చింది. ఈ కేసులో రూ. 11.58 కోట్ల ముడి సరకులతో పాటు 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో కేసు బోయిన్‌పల్లిలో బట్టబయలయ్యింది. ఓ తయారీదారుడు స్కూల్ నిర్వహకుడే కావడం విశేషం. తన పాఠశాలలోనే డ్రగ్స్ తయారీ చేస్తూ ఈగల్ టీమ్‌కు దొరికిపోవడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. బోయిన్‌పల్లిలో మేధా స్కూల్‌ను నిర్వహిస్తున్న జయప్రకాష్‌గౌడ్ పాఠశాల రెండో అంతస్థులోనే డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. పాఠశాలలో అల్ఫోజోలుం తయారీ చేసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కల్లు కంపౌండ్‌లకు భారీగా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

పాఠశాలలో డ్రగ్స్ తయారీని సీరియస్‌గా పరిగణించిన అధికార యంత్రాంగం పాఠశాలను సీజ్ చేసి నిందితులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత వారం జీడిమెట్ల సుచిత్ర క్రాస్ రోడ్డు సమీపంలోని ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో గుట్టుగా డ్రగ్స్‌ను తయారీ చేస్తున్నారన్న సమాచారంతో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించి రూ. 72 కోట్ల విలువజేసే ముడిసరుకును స్వాధీనం చేసుకున్నది. ఈ కేసులో నలుగురు నిందితులను కూడా అరెస్టు చేసింది. ఏకంగా ఫ్లాట్‌లోని ఎపిడ్రిన్ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పోలీసు వర్గాలను సైతం నివ్వరపరిచింది. నగరంతోపాటు శివార్లలో ఈగల్ బృందం నిఘాను మరింత ముమ్మరం చేస్తోంది. డ్రగ్స్ విక్రయాలు, తయారీపై ఉక్కుపాదం మోపి… హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఈగల్ టీమ్ పేర్కొంటుంది.

ఎం.వి. శివశంకర్

93953 45694

అసమాన కలం యోధుడు షోయబుల్లా ఖాన్

పెన్నును గన్నుగా మార్చి, అక్షరాలను బుల్లెట్లుగా ప్రయోగించి నిరంకుశ నిజాం పాలనను వణికించిన అక్షర వీరుడు షహీద్ షోయబుల్లా ఖాన్. ప్రజలకోసం కలంపట్టి ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన ఈ మహాధీరుడు జర్నలిజం చరిత్రలో అసమాన స్థానాన్ని సంపాదించాడు. ఆయన జీవితం ఒక కలం యోధుడి ధైర్యానికి, నిబద్ధతకు, త్యాగానికి ప్రతీకగా నిలిచింది. స్వేచ్ఛా భావన, న్యాయం, ప్రజా హక్కులకోసం పోరాటమే ఆయన ఆత్మ స్ఫూర్తి. 1920 అక్టోబర్ 17న ఖమ్మం జిల్లాలోని సుబ్రవేడు గ్రామంలో హబీబుల్లా ఖాన్, లాయహున్నీసా బేగం దంపతులకు షోయబుల్లా ఖాన్ జన్మించాడు. వారి కుటుంబం ఉత్తరప్రదేశ్‌నుంచి నిజాం రాష్ట్రానికి వలసవచ్చి ఇక్కడే స్థిరపడింది. బాల్యంలోనే విద్యా ప్రతిభ, చిత్రకళా నైపుణ్యంతో షోయబ్ పేరు తెచ్చుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంనుంచి బిఎ, జర్నలిజం డిగ్రీలు పూర్తి చేసి, బొంబాయిలో ఇంటర్మీడియట్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. తన కుమారునిలో గాంధీ పోలికలు ఉన్నాయని భావించి తండ్రి షోయబుల్లా గాంధీ అని ప్రేమతో పిలిచేవాడు. ఆ పేరుకు తగ్గట్టే షోయబ్ నిబద్ధత, ధైర్యం, నిజాయితీతో కూడిన మార్గంలో నడిచాడు.

ఆ కాలం తెలంగాణ అగ్నిగోళంలా మండుతున్న సమయం. నిజాం పాలనలో ప్రజలు ఊపిరి పీల్చలేని స్థితి. పత్రికలపై ఉక్కుపాదం. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రాణపణం. అయినా షోయబ్ వెనుకడుగు వేయలేదు. ప్రజాస్వామ్య భావాలతో, జాతీయోద్యమ స్ఫూర్తితో ఆయన జర్నలిజాన్ని తన ఆయుధంగా ఎంచుకున్నాడు. మొదటగా ఉర్దూ పత్రిక ‘తేజ్’ లో ఉప సంపాదకుడిగా పనిచేశాడు. అక్కడే ఆయన కలం అగ్నిజ్వాలలతో రగిలింది. నిజాం ప్రభుత్వ దోపిడీ, రజాకార్ల దౌర్జన్యాలను ఎండగడుతూ నిర్భయంగా రాశాడు. ఫలితంగా ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించింది. ఆ తర్వాత ఆయనకు వేదికగా ‘రయ్యత్’ పత్రిక దొరికింది ముందుముల ముల్కి నర్సింగరావు నిర్వహించిన ఈ పత్రికలో షోయబ్ స్వేచ్ఛా రాతలు ప్రజల్లో చైతన్యం కలిగించాయి. కానీ ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం మూసివేసింది. ప్రజాహక్కుల కోసం సొంత పత్రిక అవసరమని భావించి షోయబుల్లా ఖాన్ భార్య, తల్లి నగలను అమ్మి ‘ఇమ్రోజ్’ పత్రికను స్థాపించాడు.

మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సహకారంతో ఈ పత్రిక 1947 నవంబర్ 17న తొలి సంచిక విడుదల చేసింది. ‘ఇమ్రోజ్’ అంటే ఉర్దూలో ‘ఈ రోజు’. ఈ పేరు వెనుక షోయబ్ సంకల్పం ఉంది ప్రజా స్వేచ్ఛ కోసం పోరాటం నేటి నుంచే ప్రారంభం కావాలి! ‘ఇమ్రోజ్’ సంపాదకీయాలు నిజాం పాలనను వణికించాయి. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావాలనే ఆయన అభిప్రాయం ధైర్యంగా, స్పష్టంగా వ్యక్తమైంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా నిజాం పాలన అంతం కావాలి, హైదరాబాద్ భారతదేశంలో భాగం కావాలి అని ఆయన రాసిన పదాలు ఆ కాలంలో విప్లవ స్ఫూర్తి కలిగించాయి. షోయబ్ రాతలు కేవలం రాజకీయ విమర్శలు కాదు; అవి సామాజిక చైతన్యం కూడా. నిజాం పాలనలో బలహీన స్థితిలో ఉన్న పేద ముస్లిం కుటుంబాల బాధలను, రజాకార్ల దుశ్చర్యలను ఆయన ధైర్యంగా బహిర్గతం చేశాడు. నిజాంకు వ్యతిరేకంగా నిలబడిన ముస్లిం మేధావుల వాణిగా నిలిచాడు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టుల పోరాటాలు -అన్నింటికీ ఆయన పత్రిక వేదిక అయింది. 1948 ఆగస్టు 19న రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ సభలో షోయబ్ చేతులు నరికి వేస్తామని బహిరంగంగా బెదిరించాడు. ఆ బెదిరింపు రెండు రోజులకే వాస్తవమైంది. 1948 ఆగస్టు 21 రాత్రి -కాచిగూడ రైల్వేస్టేషన్ రోడ్‌లోని ‘ఇమ్రోజ్’ కార్యాలయంలో పని ముగించుకుని బావమరిది ఇస్మాయిల్ ఖాన్ తో ఇంటికి వెళ్తున్న షోయబ్‌పై పదిమంది రజాకార్లు దాడి చేశారు. ఆయన కలం పట్టిన కుడిచేయిని నిర్దాక్షిణ్యంగా నరికి, తీవ్ర గాయాలతో ఆయనను నేలకూల్చారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇస్మాయిల్ ఖాన్‌ను కూడా గాయపరిచారు. రక్తమడుగులో పడి కొట్టుమిట్టాడుతున్న షోయబుల్లా ఖాన్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, 1948 ఆగస్టు 22 తెల్లవారుజామున ఆయన ప్రాణాలు విడిచాడు.

నిజాం సర్కారు ఆయన అంతిమ యాత్రను కూడా నిషేధించింది. అయినప్పటికీ ప్రజల ప్రేమ, గౌరవం అణగదీయలేకపోయింది. పోలీసు బందూకుల మధ్య, ప్రజల కన్నీరుతో గోషామహల్ మాలకుంట శ్మశాన వాటికలో షోయబుల్లా ఖాన్ ఖననం జరిగింది. ప్రజా స్వేచ్ఛకోసం, తెలంగాణ చరిత్రలో మానవ హక్కుల స్వరంగా నిలిచిన షహీద్ షోయబుల్లా ఖాన్ జీవితం తెలుగు పత్రికా చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. కలం యోధుడు, సత్యవాది, స్వేచ్ఛా ప్రియుడు -ఆయన కీర్తి కాలాతీతం. ఆయన చెప్పిన ప్రజల హక్కుల కోసం రాయడం నేరం అయితే, ఆ నేరం పునరావృతం చేస్తాను అనే స్ఫూర్తి నేటి పాత్రికేయులకు మార్గదర్శకం. అసమాన కలం యోధుడు షహీద్ షోయబుల్లా ఖాన్ ఒక పత్రికా వీరుడు, ఒక ప్రజాయోధుడు, ఒక అమర త్యాగధనుడు. జర్నలిజం ధైర్యానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన షోయబుల్లా ఖాన్ స్ఫూర్తి ప్రతి పాత్రికేయుని కలంలో వెలుగుతూనే ఉంటుంది.

రామకిష్టయ్య సంగనభట్ల

94405 95494

దీపావళికి ముందే కాలుష్య మేఘాలు

దీపావళి అంటే రంగురంగుల వెలుగుల పండుగ. కన్నుల విందుగా కనిపించే ఈ పండగ ముఖ్యంగా పిల్లలకు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఈ పండగ సందర్భంగా బాణాసంచా కాల్పులతో కోరలుచాచే వాయు కాలుష్యం ప్రజలను తీవ్ర అస్వస్థులుగా చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సిఆర్, హర్యానా ప్రాంతాల్లో ఒకవైపు పంట వ్యర్థాల దగ్ధాలతో వాయు కాలుష్యం పెరుగుతుంటే ఈ దీపావళి వచ్చే సరికి వాయు కాలుష్యం మరింత కమ్ముకుని రావడం ఏటా తీవ్ర సమస్యగా తయారవుతోంది. ఈ ఏడాది దీపావళి ఇంకా రాకముందే ఢిల్లీ తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత అధ్వాన స్థాయిలకు చేరుకోవడం గమనార్హం. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ క్యాస్టింగ్ అండ్ రీసెర్చి నివేదిక ప్రకారం గాలి నాణ్యత స్థాయి బాగా క్షీణించిందని వెల్లడైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యుఐ) 0100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని సూచిక. గాలి నాణ్యత 447 కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. బుధవారం ఉదయానికే ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక 300 పాయింట్లు దాటిందంటే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నోయిడాలో 369, ఘజియాబాద్‌లో 325, ఫరీదాబాద్‌లో 267 పాయింట్లలో వాయు నాణ్యత క్షీణత నమోదైంది. వాయు నాణ్యత సూచిక ప్రకారం బుధవారం ఉదయం ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణత 300 పాయింట్లు దాటింది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం బుధవారం ఉదయం 7 గంటల సమయానికి నోయిడాలో నాణ్యత సూచిక 369 కాగా, ఘజియాబాద్‌లో 320 325 మధ్య నమోదయ్యాయి. గాలిలో కాలుష్య రేణువులు ప్రతి ఘనపు మీటర్ పరిమాణంలో ఏ స్థాయిలో ఉన్నాయో లెక్కగట్టి పరిశీలిస్తేనే కాలుష్య స్థాయి తెలుస్తుంది. దీనిని పర్టిక్యులేట్ మాటర్ అంటే పిఎంగా పరిగణిస్తారు. గత ఏడాది దీపావళి రోజున దేశంలోని అనేక నగరాల్లో అత్యధిక స్థాయిలో కాలుష్య రేణువుల (పిఎం) స్థాయిలు నమోదయ్యాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, లక్నో, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, తదితర ఏడు నగరాల్లో గంటగంటకు కాలుష్య స్థాయిలు పెరిగిపోయాయి. ప్రతి ఘనపు మీటర్ పరిమాణంలో 500 మైక్రోగ్రాముల వంతున కాలుష్య స్థాయిలు దాటిపోయాయి. దీపావళి రోజున, టపాసులు, బాణాసంచాల కాల్పులే ఈ కాలుష్య స్థాయిలు పెరిగిపోవడానికి కారణమైందని పరిశోధకులు వెల్లడించారు. 2016లో పుణెకు చెందిన ది చెస్ట్ రీసెర్చి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా దీపావళి రోజున బాణాసంచా నుంచి వెలువడే పిఎం 2.5 కాలుష్య రేణువుల మొత్తాన్ని కొలవడానికి ప్రయోగాలు నిర్వహించింది.

పాము మాత్ర పటాకుల నుంచి అత్యధిక స్థాయిలో 2.5 మైక్రాన్ల వ్యాసంలో 64,500 పిఎం కాలుష్య రేణువులు విడుదల అవుతున్నాయని వెల్లడించింది. గత ఏడాది ఉత్తరాది నగరాల్లో దీపావళి రోజున కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరిగిపోయాయి. దీపావళి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఈ ప్రభావం కనిపించింది. దీపావళి రోజున ఇతర రకాల కాలుష్య కారకాలు కూడా రికార్డు స్థాయిని అధిగమించాయి. కార్బన్ మోనాక్సైడ్, అట్మాస్ఫియరిక్ అమ్మోనియా, నైట్రస్ ఆక్సైడ్, నైట్రొజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు రికార్డు స్థాయిని దాటడం విశేషం. ఢిల్లీలో సాధారణంగా 80 వరకు కాలుష్య స్థాయిల పరిమితి ఉంటుంది. కానీ గత ఏడాది దీపావళి రోజున 140 వరకు కాలుష్య రేణువుల స్థాయిలు కనిపించాయి. సల్ఫర్‌డైయాక్సైడ్ స్థాయిల ప్రభావంతో గుండె జబ్బుల రోగులు ఆస్పత్రుల్లో అత్యధికంగా చేరవలసి వచ్చింది. వాయు కాలుష్యానికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధం ఉంది. గుండెపోటు, పక్షవాతం, ఇవి కాక మరికొన్ని ప్రమాదకరమైన వ్యాధులకు కూడా దారి తీయవచ్చు. కేవలం వాయు కాలుష్యం వల్లనే 2019 లో దాదాపు 1.67 మిలియన్ మంది అకాల మరణాలకు బలయ్యారని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. ప్రపంచం మొత్తం మీద అత్యంత కాలుష్య 20 నగరాల్లో 14 ఉత్తర భారతం లోనే ఉన్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. వాయు నాణ్యత క్షీణించడం కేవలం ఢిల్లీకే పరిమితం కాదు. ఏటా ముఖ్యంగా శీతాకాలంలో ఇండో గంగాటిక్ మైదాన ప్రాంతంలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయిలో చేరుకోవడం పరిపాటిగా వస్తోంది. ఢిల్లీలో కాలుష్యానికి గత ఏడాది ఆప్ ప్రభుత్వమే కారణమని బిజెపి ఆరోపించింది. ఈ ఏడాది బిజెపి ప్రభుత్వమే ఢిల్లీలో ఉన్నా కాలుష్యం మితిమీరడానికి ఎవరు బాధ్యులు అన్న వివాదం ఎదురవుతోంది. ఢిల్లీ తదితర ప్రాంతాల్లో దీపావళి రోజున బాణాసంచా కాల్పుల విషయంలో సుప్రీం కోర్టు అనేక ఆంక్షలు విధించినా, అనేక అభ్యర్థనలతో చివరకు గ్రీన్ కాకర్స్‌కు అనుమతించింది. ఐదేళ్లపాటు ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. దీపావళిని పురస్కరించుకొని అక్టోబర్ 18 నుంచి 21 వరకు గ్రీన్ కాకర్స్ వెలిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్‌ఐఆర్), నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్( ఎన్‌ఇఇఆర్‌ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజులో రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ బూడిద వాడకుండా, తయారు చేసే బాణాసంచాను గ్రీన్ కాకర్స్‌గా పిలుస్తారు. హానికరమైన రసాయనాలు ఇందులో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30శాతం తక్కువగా ఉంటుంది. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ కాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) అనుమతి ఇచ్చింది. మరి దీని ప్రభావం దీపావళి రోజున ఎలా ఉంటుందో చూడవలసిందే.