jokerbetyakabetbetkolikankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escort

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Restbet

Restbet giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

Meritking Giriş

meritking

meritking

Meritking Giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

ultrabet giriş

pusulabet

ultrabet giriş

jojobet giriş

Meritking - Meritking

Meritking

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

galabet giriş

galabet giriş

Hacklink Panel

Hacklink

ultrabet

galabet

Streameast

Hacklink

vaycasino

casibom giriş

markajbet

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet giriş

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

marsbahis giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

meybet

piabellacasino

piabellacasino

parmabet

parmabet

parmabet

yakabet

casibom

meybet

online diyetisyen

markajbet

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Meritking

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom

ultrabet

Marsbahis

meritking

coinbar

piabellacasino

superbetin

superbetin

vdcasino

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinodior

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

markajbet

Atlasbet Giriş

markajbet

betwoon

Situs Judi Bola

Agb99

betsmove

parmabet

ultrabet

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

marsbahis

sekabet

matbet

imajbet

grandpashabet

markajbet

grandpashabet

piabet

jojobet

pusulabet

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

sweet bonanza siteleri

casibom

yakabet

1xbet

fatih escort

milanobet

gallerbahis

galabet

betkolik

betticket

süratbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

casinoroyal

sekabet

jojobet

joybet

wbahis

kingroyal

kingroyal

vdcasino

ultrabet

tlcasino

galabet

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

dinamobet

artemisbet

casinolevant

enbet

madridbet

vdcasino

sonbahis

casibom

betturkey

atlasbet

tarafbet

ultrabet

madridbet giriş

betasus

holiganbet

bahiscasino

jokerbet

kingroyal

hilarionbet

matbet

marsbahis

vdcasino

sekabet

bahsegel

yakabet

grandpashabet

meritking

pusulabet

betpuan

kralbet

casibom

casibom giriş

betkolik

casibom güncel giriş

betovis

dinamobet

marsbahis

grandpashabet

vdcasino

sahabet

onwin

casibom

holiganbet

marsbahis

casibom

ccasinolevant

రాజ్యాంగమా.. నీకు సెల్యూట్

అణగారిన వర్గాలనుండి వచ్చినవారు రాష్ట్రపతి వంటి అత్యున్నత స్థానాన్ని అధిరోహించగలుగుతున్నారంటే అది కేవలం రాజ్యాంగ చలువేనని, మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతంలో జన్మించి దేశ న్యాయ వ్యవస్థలోని అత్యున్నత స్థాయికి ఎదిగిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అనడాన్ని బట్టి రాజ్యాంగ ప్రాముఖ్యత మనకు అవగతం అవుతుంది. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో దోపిడీకి గురియై అస్తవ్యస్తమైన ఈ భారతదేశం స్వాతంత్య్రానంతరం ఏకతాటిపై నడిపించడానికి రాజ్యాంగం కీలకభూమిక వహించింది. దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించి స్వీకరించారు. అనంతరం 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే రాజ్యాంగం పుట్టిన నవంబర్ 26ని గుర్తు పెట్టుకోవాలని ఆలోచన 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్.ఎం. సింగ్వికి వచ్చింది. దీంతో నవంబర్ 26ను న్యాయవాద దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ భారత ప్రభుత్వం 2015లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించింది. అప్పటినుంచి నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

రాజ్యాంగ దినోత్సవం రోజున పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. చిన్నప్పటినుంచి అంబేద్కర్ కష్టపడి ఎలా చదువుకున్నారో ఈ రోజుల్లో చాలామందికి తెలియదు. అందువల్ల ఆ అంశాలను విద్యార్థులు, ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకొని ఈ ఏడాది నవంబర్ 26 కు 76ఏళ్లు పూర్తవుతోంది. ఎన్నో సంవత్సరాల నాగరికత కలిగిన భారతదేశానికి ఏడున్నర దశాబ్దాలు పెద్ద విషయం కాదు. కానీ పరాయి పాలననుంచి విముక్తి పొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా, ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మనకు ఎంతో గర్వకారణం. ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారని తెలిసిన తర్వాత రాజ్యాంగ రచనకు సన్నాహాలు జరిగాయి. ఇందుకోసం రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. ఇందులో 15 మంది మహిళలతోపాటు 299 మందిని సభ్యులుగా నియమించారు. తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. రాజ్యాంగ పరిషత్‌కు డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షునిగా, రచనా కమిటీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సారధ్యంలో ఏర్పడింది. కమిటీలో ఆరుగురు సభ్యులున్నారు. కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. 299 మంది సభ్యులు ఉండగా తుది ప్రతి మీద మాత్రం 284 మంది సంతకం చేశారు. 1947 నవంబర్ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించింది.

1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం లభించింది. అయితే 1930 జనవరి 26ను కాంగ్రెస్ భారతదేశానికి పూర్ణ స్వరాజ్ దివస్‌గా తీర్మానించింది. జనవరి 26వ తేదీకి చిరస్థాయి కీర్తి అందించుటకుగాను 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. గత 76 సంవత్సరాలుగా దేశాన్ని అఖండంగా ఉంచటం రాజ్యాంగం సాధించిన ఘనవిజయం. విచ్ఛిన్నకరశక్తులు లౌకిక ఐక్యతను చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ వారు కృతకృత్యులు కాలేకపోవడం ఒక ప్రగతి. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండటం శుభపరిణామం. సాంఘిక, ఆర్థిక, సమానత్వం లేకుండా రాజకీయ సమానత్వం సాధించలేమని, జాతి నిర్మాణంలో సమాజంలోని అన్ని వర్గాలు పాల్గొనాలన్న అంశం ఆధారంగా రాజకీయ సమానత్వం సాధించాలన్నదే బి.ఆర్ అంబేద్కర్ ఆకాంక్ష. భారత ప్రజలమైన మేము అంటూ రాసుకున్న రాజ్యాంగం ఏదో కొన్ని నియమ నిబంధనల పుస్తకం కాదు. స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సమున్నత విలువలతో ప్రజల ఆశలు ఆశయాలకు ప్రతిరూపంగా ఉంటూ, ఆసేతుహిమాచలం, ఆబాలగోపాలం సమైక్యంగా పురోగమించాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని మున్ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత భారత పౌరులమైన మన అందరిదీ.

ములక సురేష్, 94413 27666

ఫెడరలిజం ఇక ప్రశ్నార్థకమేనా?

భారతదేశంలో సమాఖ్యవాదం ఏమేరకు మనుగడ సాగిస్తుంది. మార్పులేకుండా కొనసాగుతుందా. సహకార స్ఫూర్తి క్రమంగా చనిపోతుందా అన్నదే నేటి ప్రశ్న. సుప్రీంకోర్టు 2023 శర్మ కమిటీ తీర్పుతో మొదలై 2024, 2025లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై ఇచ్చిన తీర్పులలో కేంద్రం అధికారాలు అనంత స్థితిస్థాపకత (ఇన్ఫినిటి ఎలాస్టిసిటీ)- అన్నపదం వాడింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో జస్టిస్ (రిటైర్డ్) బి.ఆర్. మెహతా తీవ్ర పదజాలంతో రాసిన వ్యాసంలో ఆ తీర్పులలో కోర్టు సాంప్రదాయ సిద్ధాంతాలను విడిచి పెట్టి ఆక్రమణ కొత్త ప్రమాణాలకు అనుకూలంగా వ్యవహరించిందన్నారు. ఇది దాదాపు ఏ పాలనా రంగంలోనైనా జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసినట్లే. రాజ్యాంగం రాష్ట్రాలకు స్పష్టంగా కేటాయించిన రంగాలలో కూడా కేంద్రానికి శాశ్వతంగా, తిరుగులేని ఆధిపత్యాన్ని స్పష్టంగా ఆమోదించడం ఇబ్బందికరమైన అంశమే. ఈ న్యాయపరమైన మార్పు ఆందోళన కలిగిస్తుంది. ఇది అకస్మాత్తుగా జరిగిన పరిణామం కాదు. దశాబ్దాలుగా సాగుతున్న పరిణామాలకు పరాకాష్ట. గతంలో కాంగ్రెస్ అయినా, నేడు బిజెపి అయినా కేంద్రంలో అధికారం చేపట్టిన ఏ పార్టీ కూడా నిజమైన ఫెడరలిజం అనుసరిస్తూ, సుఖంగా ఉండలేదు.

ప్రతి పార్టీ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరల్ ప్రాథమిక విలువగా కాక, ఇబ్బందికరంగానే భావించాయి. కేంద్రప్రభుత్వాల పెత్తనం చెలాయింపు కొత్తకాదు. రిపబ్లిక్ గా అవతరించిన తొలి దశాబ్దాలనుంచి ఆర్టికల్ 356ను తరచు పక్షపాత ధోరణితో కేంద్రప్రభుత్వం వాడుకుంది. తమను ధిక్కరించిన రాష్ట్రప్రభుత్వాలను కూల్చివేసేందుకు, రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆర్టికల్ 356ను ఆయుధంగా ప్రయోగించింది. కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టి రామారావు, కర్ణాటకలో ఎస్‌ఆర్‌బొమ్మై సర్కార్‌లను రాత్రికిరాత్రి తొలగింపులే ఇందుకు ఉదాహరణ. ఎమర్జెన్సీ హయంలో 42వ రాజ్యాంగ సవరణతో మరింత దూకుడుగా వ్యవహరించింది. విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చడంతోపాటు పలు రంగాలపై కేంద్రం ఆధిపత్యం విస్తరించింది. ముఖ్యమంత్రులు నిజానికి ప్రణాళికా సంఘం ఫీల్డ్ ఆఫీసర్ల స్థాయికి దిగజారారు. కేంద్రం రూపొందించిన కేంద్రం స్పాన్సర్ చేసిన పథకాలనే అమలు చేయాల్సి వచ్చింది. కేంద్రం నిబంధనల ప్రకారమే నిధులు సమకూరుతాయి.

1990వ దశకం, 2000 దశకంలో సంకీర్ణ ప్రభుత్వాల పెరుగుదలతో ఫెడరలిజం పునరుజ్జీవనం జరుగుతుందన్న భ్రమ కల్పించింది. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం, జ్యోతిబసు, లాలూప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఎన్‌టి రామారావు, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, నవీన్‌పట్నాయక్ వంటి నాయకుల రాకతో కేంద్రంతో బేరసారాలు ఆడే శక్తివచ్చింది. కేంద్ర -రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడానికి సర్కారియా, పుంచి కమిషన్లు చక్కటి సిఫార్సులు చేశాయి. అయినా ఆ కాలంలోనూ ఆర్థిక సమాఖ్యవాదం క్షీణించింది. సర్వీస్ టాక్స్, తర్వాత జిఎస్‌టి, రాష్ట్రాల స్వతంత్ర ఆదాయ అధికారాలను క్రమంగా తగ్గించాయి. కేంద్రం అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేకుండా జిఎస్‌టి కౌన్సిల్‌లో ఓటింగ్ వ్యవస్థతో కేంద్రానికి పూర్తి ఆధిపత్యం వచ్చేసింది. 2014లో కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రీకరణ వేగం పుంజుకుంది. ఆర్టికల్ 360 రద్దు, జమ్మూకశ్మీర్‌ను, దాని అసెంబ్లీ అనుమతి లేకుండా రెండు రాష్ట్రాలుగా చేయడం రాజ్యాంగాన్ని తూట్ల పొడవడమే.

ఎన్నికైన ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ నియంత్రణలోకి ఉంచే ఢిల్లీ ఎన్‌సిటి సవరణ చట్టం పెడరల్ విధానం సూచించిన సరిహద్దులను ఏకపక్షంగా చెరిపి, తిరగరాయడానికి కేంద్రం కొత్త సంసిద్ధతను సూచిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల విషయంలో కేంద్రం చొరబాట్లు పెరిగాయి. మూడు వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ మార్కెట్‌లో దూసుకొచ్చింది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన కార్మిక కోడ్‌లు కార్మిక నియంత్రణలో పెద్దఎత్తున పనిచేస్తున్నాయి. నీట్ ప్రవేశపెట్టడం, వివిధ విద్యా సంస్కరణలు రాష్ట్రాల పరిధిని దాటవేశాయి. కొవిడ్19 మేనేజిమెంట్ సాకుతో ప్రజారోగ్యంలో కేంద్రం ఆధిపత్యం మరింత పెరిగింది. ప్రతిపాదిత విద్యుత్(సవరణ)బిల్లు, ముసాయిదా ప్రసారబిల్లుతో కేంద్రం చొరబాటు మరింత విస్తరించే ప్రమాదం ఉంది.

ఆర్థిక నియంత్రణ మరో శక్తివంతమైన కేంద్రీకరణ సాధనంగా మారింది. కేంద్రం అందించే పథకాలకు నిధులు ఇప్పుడు 8, 9,- 10 లేదా 100 నిష్పత్తులలో పనిచేస్తున్నాయి. ఈ దెబ్బతో కేంద్రం రాష్ట్రాలను కేవలం పథకాలను అమలు చేసే ఏజెన్సీల స్థాయికి దిగజార్చింది. జిఎస్‌టిలో వాటా చెల్లింపులు పదేపదే ఆలస్యం కావడంతో రాష్ట్రాలు కనీసం జీతాలు చెల్లింపు, ఇతర బాధ్యతల నిర్వహణకు కూడా భారీగా రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆఫ్- బడ్జెట్ రుణాలు మాత్రం ఆర్థికలోటు లెక్కలనుంచి మినహాయింపబడడం విశేషం. ఈ విషయం లో రాష్ట్రాలపై పర్యవేక్షణ పెరిగింది. అప్పడప్పుడు జరిమానాలు కూడా తప్పడం లేదు. రాష్ట్రాలలో గవర్నర్లను రాజకీయంగా ఆయుధాలుగా మార్చడం పెడరలిజానికి మరో పెద్ద విఘాతం.

అసెంబ్లీలు ఆమోదించిన, కేబినెట్ సిఫార్సు చేసిన బిల్లులను గవర్నర్లు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి నిర్ణయించకుండా పెండింగ్‌లో పెట్టడం నిత్యకృత్యంగా మారింది. తమిళనాడులో దాదాపు పది బిల్లులను గవర్నర్ మూడేళ్లపాటు ఆమోదించకుండా తొక్కిపెట్టారు.సుప్రీంకోర్టు బలవంతం చేస్తూ నిర్ణయం తీసుకునే వరకూ ఈ ఉదంతం సాగింది. పంజాబ్ గవర్నర్ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు నిరాకరించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రలలోనూ గవర్నర్లు వ్యవహరించిన తీరువల్ల దీర్ఘకాలిక ప్రతిష్టంభనలు తప్పలేదు. గవర్నర్లు తమ ఇష్టానుసారం బిల్లులను రాష్ట్రపతికి రిజర్వు చేసుకోవచ్చునని ఇటీవల సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు బొమ్మై కేసులో తీర్పు సందర్భంగా మూసివేసిన అధికార దుర్వినియోగం తలుపులు తిరిగి తెరిచినట్లు కనిపిస్తోంది.

ఇక కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు చెప్పనవసరం లేదు. కేంద్రంతో ఘర్షణకు దిగే ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులపై తలచినంతనే.. అన్నట్లు దాడులు చేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అరెస్ట్‌లు, మనీష్ సిసోడియా, సత్యేంత్ర జైన్ వంటి వారిని సుదీర్ఘకాలం పాటు జైలులో ఉంచడంతో.. అసమ్మతిని సహించరని, దానిని నేరంగా పరిగణించే వాతావరణం ఏర్పడిందని తేటతెల్లమైంది. రాష్ట్రాల అనుమతి లేకుండా కేంద్రం ఐఎఎస్ లేదా ఐపిఎస్ అధికారులను రీకాల్ చేయడానికి వీలు కల్పించే అఖిల భారత సర్వీస్ నిబంధనల మార్పు ప్రతిపాదన పాలనా యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వం పట్టును మరింత బలోపేతం చేస్తుంది. ఒకప్పుడు ఫెడరల్ వ్యవస్థకు కాపలాదారుగా ఉన్న న్యాయవ్యవస్థ ఇప్పుడు ఈ దిగజారిన పరిస్థితులను అరికట్టేందుకు ఇష్టపడడం లేదు. ఆ విషయంలో న్యాయవ్యవస్థ సామర్థ్యం దశాబ్దాలుగా తగ్గింది. ఒకప్పుడు ఎస్‌ఆర్ బొమ్మై, రామేశ్వర్ ప్రసాద్ వంటి కేసుల్లో బలమైన తీర్పులు, 2018 ఎన్‌సిటీ ఢిల్లీ తీర్పు కేంద్రం అధికారాలను మితిమీరి వినియోగానికి వ్యతిరేకంగా బలమైన రక్షణ కవచాలు అందించాయి. అయితే ఈ మధ్య సుప్రీంకోర్టు స్వరం మారిపోయింది. ఆర్టికల్ 370పై జరిగిన విచారణలు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణను సమర్థించే మొగ్గును సూచిస్తున్నాయి. ఢిల్లీ సర్వీసుల తీర్పు, తమిళనాడు గవర్నర్ కేసులోని పరిశీలనలు, బొమ్మై తీర్పునకు ముందు శకాన్ని గుర్తుచేసే విసృ్తత కేంద్ర ఆధిపత్య సిద్ధాంతాన్ని పునరుజ్జీవింప జేస్తున్నాయి. అనంతమైన స్థితిస్థాపకత అనే భావన ఒక హెచ్చరికగా కాక, రాజ్యాంగ వాస్తవికతగా మారే ప్రమాదం ఉంది.

భారతదేశపు ఫెడరల్ వ్యవస్థ ఒక రాజీ. ఓ గిఫ్ట్ కాదు. నెహ్రూ, పటేల్ వంటి కేంద్రీకరణ వాదులు, మద్రాస్, బెంగాల్, ఇతర రాచరిక రాష్ట్రాలనుంచి బలమైన ప్రాంతాల స్వరాల మధ్య జరిగిన చర్చలలో ఆవిర్భవించి వ్యవస్థ. రాజకీయ చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే, కేంద్రానికి రాష్టాలు అవసరమైనప్పుడు లేదా రాష్ట్రాలపై ఆధారపడాల్సి న పరిస్థితి తలెత్తినప్పుడే సమాఖ్యపరమైన సమతుల్యతలు పునరుద్ధరించబడతాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, ఫెడరల్ వ్యవస్థను ఎవరు కాపాడతారు? ఏ జాతీయ పార్టీ కూడా నిజంగా ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి కొనసాగాలని కోరుకోవడం లేదని రికార్డులు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం పెత్తనం కేంద్రీకృతమైంది. ప్రస్తుతం బిజెపి మరింత ఆత్యాధునికంగా రాజకీయ క్రమశిక్షణతో పెత్తనాన్ని కేంద్రీకృతం చేసుకుంటున్నది. ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడే ఫెడరలిజాన్ని సమర్థిస్తాయి. ఇక పౌర సమాజం మీడియా సమాఖ్యవాదాన్ని సంక్షేమ పంపిణీ, పోలీసింగ్, స్కూళ్లలో పాఠ్యాంశాలు, మార్కెట్ వ్యవస్థలు, సాంసృ్కతిక హక్కుగా కాక, రాజ్యాంగ ఆలోచనగా పరిగణిస్తాయి. సమాఖ్య విధానం మనుగడ సాధించాలంటే, సాధారణ పౌరులే శ్రద్ధ వహించాలి.

తమిళులు తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి ఎంత విలువ ఇస్తారో, ఉత్తరప్రదేశ్ లోని ఓటర్లు తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి అంతే విలువ ఇవ్వాలి. కేంద్రం రూపొందించిన వ్యవసాయ విధానం తమ అవసరాలను ప్రతిబింబించకపోవచ్చునని బీహార్ రైతులు గ్రహించాలి. అసోం వాసులు తమ సంసృ్కతి, భూమి, భాష, విద్యపై స్థానిక నియంత్రణ కేంద్రం ఇస్తున్న తాయిలం కాదనీ, రాజ్యాంగబద్ధమైన హక్కు అని అర్థం చేసుకోవాలి. భారతదేశం నేడు ఒక కీలకమైన దశలో ఉంది. మనం కో ఆపరేటివ్ ఫెడరలిజం నుంచి సమ్మతితో కూడిన సమాఖ్యవాదానికి మారాం. మనం కేంద్రం లాగుతున్న వైపు కదులుతున్నాం. న్యాయవ్యవస్థ అనంత స్థితి స్థాపకత వంటి సిద్ధాంతంతో కేంద్రానికి తోడ్పడుతోంది. అందరికీ ఆమోదయోగ్యమైన ఫెడరల్ వ్యవస్థ పరిఢవిల్లాలని రాజ్యాంగ సభ కోరింది. అదే సమయంలో సభ వ్యక్తం చేసిన ఆందోళననే జస్టిస్ మెహతా హెచ్చరిక ప్రతిధ్వనిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ సంపూర్ణ నియంత్రణనే కోరుకుంటున్నప్పుడు.. పిల్లి మెడ లో గంటకట్టేది ఎవరు? భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ వ్యవస్థపై సమాధానం బాధాకరంగానే కన్పిస్తోంది. కేంద్రం దీనిని పట్టించుకోవడం లేదు. ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాలంటే, దానిని సుప్రీంకోర్టో, రాష్ట్ర అసెంబ్లీలు మాత్రమే కాదు 140 కోట్ల మంది ప్రజల రాజకీయ చైతన్యం తోడవ్వాలి.

– గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)

– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు

ఎఐ మంచి, చెడు

జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) అనేది కొత్త డేటాను సృష్టించగల అత్యాధునికి పరిజ్ఞానం. అంతర్జాతీయ స్థాయిలో ఎఐ టెక్నాలజీకి గణనీయమైన ప్రాచుర్యం కొనసాగుతున్న తరుణంలో భారతదేశం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్సీని వినియోగించుకోవడంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రతికూల ప్రభావాలను నివారించుకుంటూ… ఎఐ ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి సిద్ధపడాలి. రాకెట్ కంటే పదిరెట్ల వేగంతో పుంజుకుంటున్న ఆర్ట్టిఫిషియల్ టెక్నాలజీలో మంచి చెడులను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేటురంగ సంస్థల నిర్వహణ, ఉద్యోగుల భద్రతపై నిశితంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే భారత్ తన ఆధిపత్యాన్ని ఒక్కో రంగంలో చేజిక్కించుకుంటూ.. శతృదేశాల నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. అదే సమయంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలోనూ ఆచితూచి అడుగులు వేయకపోతే.. తప్పులో కాలేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం.

ఆవస్యకత ఎంతో ఉంది. అయితే.. ఈ ఎఐ టెక్నాలజీ మంచికి దారి తీస్తుందా? చెడును దరికి చేరుస్తుందా? అనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది! ఈ రోజు ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పాదకపై అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏఐ వాడకంలో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, వినియోగదారుల అభ్యర్థనలకు ప్రతిస్పందనగా టెక్స్, ఇమేజ్‌లు, కోడ్లను రూపొందించడానికి ఈ టెక్నాలజీని సాధారణంగా ఉపయోగిస్తారు. అయితే రోజురోజుకూ విస్తృతమైన వాడకం పెరగడంతో పాటు ఎఐ సంస్థల ఏర్పాటుకు, టెన్నాలజీని దత్తత తీసుకోవడానికి ప్రపంచ దేశాలు ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ఆయా దేశాల సామర్థ్యాలను టెన్నాలజీతో అలంకరిస్తున్నాయి.ఈ విషయం కాస్తంత విస్మయానికి, ఆందోళనకు దారితీసింది. ఓపెన్ ఎఐ (ఓపెన్ ఎఐ) ఛాట్ జిపిటి (ChatGPT), చాట్సాట్ మేధస్సును ఇప్పుడున్న జనరేషన్ ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎఐ టెన్నాలజీ అనేది క్రమేణా అతిపెద్ద ఉత్పాదక సామర్థ్యం కలిగిన టెక్నాలజీ సంస్థగా అడుగులు వేస్తోంది.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఈ టెక్నాలజీ డేటా సెట్లపై శిక్షణ పొందిన న్యూరల్ నెటవర్కర్ల మద్దతుతో, తగినంత కంప్యూటింగ్ పవర్‌తో కూడిన ఎఐ మోడల్స్, కొత్త యాంటీబయాటిక్, మిశ్రమాలను కనుగొనడంలో ముందుంది. అలాగే ప్రస్తుత అత్యాధునికకాలంలో అన్నితరాల వారికి పసందైన వినోదాన్ని అందించడం కోసం వినూత్న రీతిలో, వినోదంతోపాటు సాంస్కృతిక కార్యకలాపాలను రూపొందించి ప్రశంసలు అందుకుంటోంది. అయితే చాలా సామాన్యమైన టాస్క్‌ల కోసం మంచి చేయడానికి ఉపయోగించారు. కానీ డేటాను తప్పుగా మార్చే సామర్థ్యంతో ఇది చాలా కంపెనీల వారి దృష్టిని ఆకర్షించింది. వాస్తవికతను విశ్వసనీయంగా ప్రతిబింబించే డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడంలో కొన్ని సందర్భాలలో సమాజంలోని చెడును విస్తరింపజేయడానికి కొంతమంది వినియోగించడం బాధాకరం. ఎఐతో రూపొందించే కథనాలు, స్కిట్స్, మినీ వీడియో క్లిప్లింగ్స్‌తో సమాజంపై దుష్ప్రభావం పెడేలా ఉంటున్నాయన్న విమర్శలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపించడం దురదృష్టకరం.

ఈ నేపథ్యంలో చెడు -విశ్వాసలపై ప్రభావం చూపించడంతో ఎఐ టెన్నాలజీ ఆధారంగా రూపొందించిన డేటా మధ్య ప్రపంచం విశ్వసనీయతకు దూరంగా ఉంటుందన్న తేడాను గుర్తించగలిగింది. దీంతో ఈ టెక్నాలజీపై ఉన్న అభిప్రాయాలు రోజురోజుకూ రూపుమార్చుకుంటున్నాయి. ఇతర పరిణామాలు ఎఐ టెక్నాలజీ రూపకర్తల సమూహంలో హెచ్చరికల గంటలు మారుమ్రోగుతున్నాయి. దీంతో ఎఐ నుండి అంతరించిపోయే ప్రమాదాన్ని తగ్గించడం అనేది మహమ్మారి అణుయుద్ధం వంటిదనే సంకేతాలను ప్రముఖులు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇతర సామాజిక- స్థాయి ప్రమాదాలతో పాటు ప్రపంచ ప్రాధాన్యతగా ఉండాలని, ఎఐని ఉపయోగించే వారు తగిన క్రమశిక్షణతో లేకుంటే అదే సమాజంపై తీవ్ర పరిణామాలను తీసుకురావడం ఖాయమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కమ్యూనిక్యూలలో పేర్కొన మరికొన్ని నిర్దిష్టమైన ఆందోళనలను కూడా ఇక్కడ తీవ్రంగా పరిగణించాలి. అయితే ఎఐ మోడల్స్ అంతర్గత పని తీరు అస్పష్టత, కాపీరైట్‌చేసిన డేటాను ఉపయోగించడం, మానవ గౌరవం, గోప్యతతోపాటు తప్పుడు సమాచారంనుండి రక్షణ కల్పించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతో ఉంది.

నేడు అభివృద్ధి చేనసిన టెక్నాలజీతో పాటు, వివిధ సంస్థలు ఉపయోగిస్తున్న మోడళ్లు అనుసరించడం తప్పనిసరి కాదని వివరిస్తున్నాయి. ఎందుకంటే వాటిలో ఎదురయ్యే ప్రమాదాలను అర్థం చేసుకోవడానికి ఎటువంటి మార్గం లేదు కాబట్టి. ఎఐ మోడళ్లను పూర్తిగా అమలు చేయడానికి అవసరమైన వనరుల వినియోగదారులు కేవలం ఎలక్ట్రానిక్స్ విభాగంలోని వారే అందుబాటులో ఉన్న వాటితో సమస్యలను, ఇబ్బందులను సరిచేయడానికి వీలుంటుంది. అలాగే. పరిష్కారానికి వీలుగా ఉన్నప్పుడు కూడా, ప్రమాదకరమైన సంస్థలపై బ్రేకులు వేయడానికి ప్రజాస్వామ్య సంస్థల కు తలుపులు తెరిచి ఉంచే కనీసం రోలింగ్ విధానాలు ఈ ఎఐ ప్రపంచానికి ఎంతో అవసరం. ఈ సమయంలో, భారత ప్రభుత్వం ముందుగానే ఓపెన్ సోర్స్ ఎఐ రిస్క్ ప్రొఫైల్స్ ప్రారంభించి, ఆధునిక టెక్నాలజీ సహాయంతో నిర్వహించాలి. అధిక- రిస్క్ ఉన్న ఎఐ మోడల్స్ పరీక్షించడానికి శాండ్బాకస్డ్ రిసెర్చి అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ ఆండ్ డి) పరిసరాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలతో కూడిన సంస్థలు మన దేశంలో వినియోగించే టెక్నాలజీని వినియోగించేందుకు తగిన ఎఐ అభివృద్ధిని ఆచితూచి పరిశీలించిన తరువాతే ప్రోత్సహించాలి.

– వివి వెంకటేశ్వరరావు

63008 66637

క్షమాభిక్షా? మరణశిక్షా?

ఆరేళ్ల క్రితం కేంద్రంలో గృహ వ్యవహారాల మంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని ఆయన నోట దృఢంగా వినిపిస్తూ వస్తోంది. ఉట్టి మాటగా కాకుండా దానికి తగిన కార్యాచరణను కూడా ఆయన రచిస్తూ వచ్చారు. ప్రభావిత రాష్ట్రాల పోలీసులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఫలితాలను డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల లెక్కలు, వాటి పెరుగుదల తప్ప మరో మాట ఆయన వినదలుచుకోలేదు. లొంగిపోవాలని ఏడాది నుండి పోలీసులు మైకులు పెట్టి చెప్పినా మావోయిస్టులు మాత్రం యథావిధిగా పోలీసులతో తలపడడానికే సిద్ధపడ్డారు. పెరిగిన బలగాలను ఎదుర్కొనే క్రమంలో చాలామంది పోలీసు తూటాలకు బలి అయ్యారు. చివరకు వారు దిగివచ్చి శాంతిచర్చలు జరపాలని కోరినా అలాంటి ప్రసక్తే లేదని ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. మే నెలలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌తో యుద్ధం ఏకపక్షమైంది. ఆ తర్వాత మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటు పార్టీపై భారీ ప్రభావాన్ని చూపింది. ప్రాణభయంతో లొంగిపోతున్న వారికి క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన కార్యకర్తలపై ఎలాంటి కేసులు పెట్టకుండా సామాజిక జీవనం గడిపేందుకు వీలు కల్పిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. పట్టుబడినవారిని జైలుకు పంపుతున్నందువల్ల లొంగిపోవడమే ఉత్తమ మార్గమమైంది.

అయితే ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ క్షమాభిక్ష రూల్ మడావి హిడ్మాకి మాత్రం దక్కలేదు. మావోయిస్టుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ముద్ర పడిన హిడ్మాను ప్రాణాలతో వదిలేందుకు ప్రభుత్వం, పోలీసులు సిద్ధంగా లేరనే విషయం ఆయన ఎన్‌కౌంటర్ తర్వాత అర్థమవుతోంది. హిడ్మా విషయంలో మాత్రం కంటికి కన్ను అనే సిద్ధాంతాన్నే పోలీసులు అనుసరించారు. సర్కారు దృష్టిలో హిడ్మా మావోయిస్టు అనే పదానికే పర్యాయంగా కనబడ్డాడు. ఎందరో పోలీసు జవాన్ల మరణాల ధ్వంస రచనకు మూలమని భావిస్తున్న హిడ్మాపై భద్రతా దళాల కోపం సహజంగానే తారస్థాయిలో ఉంటుంది. హిడ్మాలో కొందరు వీరుణ్ణి చూస్తే ప్రభుత్వం మాత్రం ఆయన్ని ఓ క్రూరుడిగా భావించింది. అందుకే ఆయన్ని ఓ సెపరేట్ టార్గెట్‌గా పరిగణించారు. ఎంతకూ ఆచూకీ దొరకని హిడ్మాను దారిలోకి తెచ్చుకోవడానికి ఆయన తల్లిని వాడుకున్నారు. తనను వదిలి పెట్టరు అని తెలిసి మొండిగా అడవిలో తప్పించుకుంటున్న హిడ్మా మనసు మెత్తపడేలా ఆయన తల్లితో కొడుకు గురించి మాట్లాడించారు. మనమంతా ఒక్కటే అనే భావన కలిగేలా చత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ వారి గ్రామానికి వెళ్లి హిడ్మా తల్లితో కలిసి పక్కన కూచొని భోజనం చేశాడు. దగ్గరి బంధువులా చేతులు కలిపి, దండం పెట్టి నమ్మకాన్ని పెంచాడు. ఈ సంఘటన వల్ల తల్లితో ఊర్లో అందరితో కల్సి బతకాలనే ఆశ హిడ్మా మనసులో కలగవచ్చు.

హిడ్మా లొంగిపోవాలనుకొని అనుకున్నాక దానికి సరియైన మార్గం కోసం ప్రయత్నించినట్లు కథనాలు ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలోనే తెలంగాణలో పోలీసుల ముందుకు రావాలనుకున్నాడు కానీ ప్రభుత్వం సహకరించలేదని ఒక వాదన ఉంది. అయితే ఆ సంప్రదింపుల మూలంగా మధ్యవర్తి ద్వారా హిడ్మా దళం కదలికలు కొందరు అధికారుల దాకా చేరాయి. కేసుల ఎత్తివేత, పునరావాసానికి ఎపిలోని కూటమి ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని ఆయన్ని ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి వచ్చేలా చేశారు. ఆ విషయం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు సమాచారం వెళ్ళింది. బతుకుమీద తీపి హిడ్మాను దుర్బలుణ్ణి చేసింది. లొంగుబాటు అవకాశాన్ని పూర్తిగా నమ్మి వేరే దళంలో ఉన్న తన భార్య రాజేను కూడా రప్పించుకొని అందరూ కలిసి మారేడుమిల్లి చేరుకున్నారు. పొంచి ఉన్న పోలీసులు దాడి చేసి అందరిని ఎన్‌కౌంటర్ చేశారని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది అనే విషయాన్ని ఎవరు వివరించడం లేదు.

తనకు ఎదురైన పోలీసులపై హిడ్మా దళం ఆయుధాలతో తలపడినట్లు ఆధారాలేవీ లేవు. లొంగిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నవాడు యుద్ధానికి తలపడే అవకాశమే లేదు. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. చికిత్స కోసం విజయవాడలోని హాస్పిటల్‌కు వచ్చిన ఆయన్ని పట్టుకెళ్లి కాల్చి చంపారని పార్టీ ప్రకటించింది. ఇప్పుడు పార్టీ పూర్తిగా బలహీనపడింది. లొంగుబాట్లు జరుగుతున్నా ఎన్‌కౌంటర్లు ఆగడం లేదు. ఎవరికి ప్రాణభిక్ష పెట్టాలి, ఎవరిని మట్టుపెట్టాలి అనే నిర్ణయాధికారం పూర్తిగా పోలీసుల చేతుల్లోకిపోయింది. కొందరు నాయక స్థాయి వ్యక్తులు పోలీసుల అధీనంలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. వారి లొంగుబాటు ప్రక్రియను ఎప్పుడు, ఎలా చేపట్టాలో పోలీసులే నిర్ణయిస్తారని అంటున్నారు. లొంగుబాటుకు సిద్ధపడ్డవాళ్లను కాల్చేస్తే ప్రభుత్వం మాటపై విశ్వాసం పోతుంది. మావోయిస్టులు పోలీసులపై కాల్పులకు పాల్పడుతున్న ఘటనలేవీ వార్తల్లోకి రాలేదు. ఎన్‌కౌంటర్లలో పోలీసు జవాన్లు గాయపడిన సందర్భాలు కూడా లేవు. మావోయిస్టులపై పైచేయి సాధించిన పోలీసులు ఈ కీలక సమయంలో కాల్పులను పూర్తిగా ఆపివేయాలి. అడవి బాట వీడాలనుకున్నవారికి ప్రాణభిక్షయే ప్రభుత్వ ధర్మం.

– బి.నర్సన్, 9440128169

మరో మహోద్యమానికి బడుగులు సిద్ధం కావాలి!

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో బడుగు బలహీన వర్గాలలో బానిసత్వ విముకై పోరాటం మొదలైనది. ఇదే తెలంగాణలో బిసిల రిజర్వేషన్ ఉద్యమం. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఎవరమెంతో వారికి అంత వాటా అనే సిద్ధాంతం బలపడుతున్నది. పలు సభల్లో, వేదికల దగ్గర 90 శాతం ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలు తమకు రావాల్సిన వాటాను డిమాండ్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో అమలు కావాలని కోరుకుంటున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక కొంత మేరకు సమానత్వానికి పెద్దపీట వేశారు. అయినప్పటికీ ఇంకా వివక్ష ఛాయలు కొనసాగుతున్నాయి. అన్నివర్గాలకు జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బిసి రిజర్వేషన్లను 42 శాతం పెంపుతో సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది. బిసి రిజర్వేషన్ల బిల్లు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపారు. ఇప్పుడది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండడంతో చట్టరూపం దాల్చలేకపోయింది.

తక్షణం బిసి రిజర్వేషన్ 42 శాతం అమలతో స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించడానికి జిఒ 9 తీసుకొచ్చారు. ఇదీ న్యాయ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అటు చట్టం, ఇటు జిఒ న్యాయస్థానాల్లో నిలవడం కష్టంగా మారింది. ఆ చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడమే పరిష్కారమని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. మరోవైపు బిసి సంఘాల సైతం ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల పోరుకు సిద్ధమవుతోంది. పాత పద్ధతిలో అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్ 50 శాతానికి పరిమితం చేస్తూ ఇటీవల జిఒ 46 తీసుకొచ్చారు. ఈ క్రమంలో తొమ్మిదో షెడ్యూల్లో బిసి రిజర్వేషన్ చేర్చాలని నడుస్తున్న బిసి ఉద్యమంపై ప్రధాన బాధ్యత ఉంది.

భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అనేది ఆయా వర్గాల ప్రాతినిధ్యం. ఎలాంటి పరిమితి విధించలేదు. సుప్రీం కోర్టు ఇందిరా సాహ్ని కేసులో ప్రతిభకు అవకాశం కల్పించాలని అసంబద్ధమైన 50 శాతం పరిమితిని విధించింది. ఇప్పుడు దేశంలో తమిళనాడు తరహాలో పలు రాష్ట్రాలు విద్య, ఉద్యోగాల్లో ఆయా వర్గాల ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్లను పెంచాలని భావిస్తున్నాయి. కోర్టు విధించిన 50 శాతం పరిమితితో అమలుకు నోచుకోవడం లేదు. 2023 లో బీహర్ ప్రభుత్వం 65 శాతం రిజర్వేషన్ పెంపును పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 42 శాతం బిసి రిజర్వేషన్ పెంపుకుసైతం కోర్టు చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో బిసి రిజర్వేషన్లను తమిళనాడు మాదిరిగా 9 వ షెడ్యూల్‌లో చేర్చాలని బిసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటయ్యింది. ఇందులో బిసి, ఎస్‌సి, ఎస్‌టి జెఎసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్, ఉమ్మడి ఎపి రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. వీరి నాయకత్వంలోనే బిసి రిజర్వేషన్ల ఉద్యమం విజయవంతం కానుంది. వీరితోపాటు పలువురు బిసి, ఇతర కులసంఘ నాయకులు, మేధావులు కలిసి వస్తున్నారు. ఈ సమితి రాజకీయాలకతీతంగా నికార్సయిన నాయకత్వంతో బిసి కేటగిరీలకు 42 శాతం రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తుంది.

ఇది బిసి రిజర్వేషన్లకు శాస్త్రీయ పరిష్కారం కానుంది. న్యాయపరమైన రక్షణ లభించనుంది. ఈ రిజర్వేషన్లను రాజకీయ, విద్య, ఉద్యోగాల్లోనూ అమలుకై పటిష్టమైన ఉద్యమానికి పిలుపునిస్తున్నారు. కావున ప్రభుత్వం సైతం బిసి రిజర్వేషన్లను రాజకీయ కోణం గా చూడకుండా సబ్బండవర్గాల అభివృద్ధిగా భావించాలి. అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కోర్టులు సైతం ప్రతిభ పేరుతో అవకాశాలను లాక్ చేయడం సరికాదు. కాలమాన పరిస్థితుల కనుగుణంగా సుప్రీం కోర్టు 50 శాతం రిజర్వేషన్ పరిమితిని పునస్సమీక్షించాలి. అభివృద్ధి జరగాలంటే ఉచిత పథకాలకు బదులు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆర్థికవేత్తల భావన. ఇందుకై రిజర్వేషన్స్ పంపు దోహదపడనుంది.

అధికార వికేంద్రీకరణకు కేంద్ర బిందువు అయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి గ్రామాభివృద్ధి జరగాలని భారత రాజ్యాంగం కోరుకుంటుంది. ఈ అధికార వికేంద్రీకరణలో అట్టడుగు వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం లభించాలంటే 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు కావాలి. లేదంటే ధనస్వామ్య ప్రజాస్వామ్యంలో జనరల్ స్థానంలో ఒక నిరుపేద బిడ్డ గెలిచే అవకాశం లేదు. బిసి రిజర్వేషన్ల కోసం ఉద్యమించకపోతే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో బలమైన బిసి ఉద్యమం నడుస్తుంది. ఇటీవల కామారెడ్డిలో బిసి ఆక్రోష సభ నిర్వహించారు. ఈ విధంగా రిజర్వేషన్ల సాధన సమితి వైవిధ్యమైన పోరాటం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది. ఈ ఉద్యమానికి బిసిలు మరింత తోడై రావాలి. లేదంటే బిసిలు మరోసారి మోసపోతారు. కొందరు బిసి నాయకులు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ బిసిల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు. ఇది సరికాదు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా సీటు గెలవగానే వెనుకబడిన వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యమిచ్చే బిసి రిజర్వేషన్లపై పరిష్కారాన్ని పక్కన పెట్టారు. ఇది ఎటు తేలికముందే రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నది.

కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ సాధ్యం కానీ బిల్లులు, ప్రకటనలు చేస్తున్నారా అనిపిస్తుంది. రాజకీయ పార్టీలకు ఏమాత్రం నిబద్ధత లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఓటు బ్యాంకు కోసం బిసి, ఎస్‌సి, ఎస్‌టి లను వాడుకుంటున్నారు. దేశం, రాష్ట్రాలు కులగణన రిజర్వేషన్ల పెంపు అనేవి సామాజిక న్యాయం, వనరుల సమాన పంపిణీకి విధాన రూపకల్పనగా చెప్పవచ్చు. ఎవరి వాటా ప్రకారం వారికి అవకాశాలు కల్పిస్తూ వనరుల పునః పంపిణీ జరగడమే. ఈ దేశ నిర్మాణంలో తన రక్తమాంసాలు ధార పోసిన ఈ వర్గాలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయం. దీనికి రిజర్వేషన్ 42 శాతం రిజర్వేషన్లు ప్రాతిపదిక కానున్నాయి. కానీ ప్రభుత్వం స్థానిక పోరుకు వెళ్లడమంటే మరొకసారి సబ్బండవర్గాలను మోసం చేయడమే. దీనిపై బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు ఏకమై మరో మండల కమిషన్ ఉద్యమంలా పోరాటం చేస్తే తప్ప సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. 

– సంపతిరమేష్ మహరాజ్

7989578428

అప్పులు దేశానికి.. ఆస్తులు కార్పొరేటర్లకు!

78 సంవత్సరాల స్వతంత్ర పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాక పోగా, ఆర్థిక అసమానతలు తీవ్రతరం అయ్యాయి. పేదరికం తీవ్రంగా ఉంది. పేదలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. మొత్తం దేశ జనాభాలోని 10% మంది వద్ద 77% సంపద పోగుబడి ఉంది. ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం 2017లో సృష్టించబడిన సంపదలో 73% ఒక శాతంగా ఉన్న అత్యంత సంపన్నులకు చేరింది. కటికి పేదలుగా ఉన్న 67 కోట్ల మంది ప్రజల్లో సగం మంది ఆస్తిలో 1% పెరుగుదల మాత్రమే ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతున్నదని కొందరు ఆర్థికవేత్తలు ప్రచారం చేస్తుంటే, దేశం మాత్రం తీవ్ర అసమానతల మధ్య ఉంది. గ్రామీణ ప్రాంతం నిరంతర సంక్షోభం మధ్యలో ఉంటే, పట్టణాలలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పాలక ప్రభుత్వాల సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారుల, బడా భూస్వాముల అనుకూల విధానాల ఫలితంగా దేశం అప్పుల్లో కూరుకుపోతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అప్పుల మీద అప్పులు చేస్తున్నాయి.

2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడేనాటికి దేశీయ అప్పు రూ. 55 లక్షల కోట్లు. మోడీ 11 సంవత్సరాల (2014- 2024-25 వరకు) పాలనలో దేశం అప్పు సుమారు రూ. 202 నుంచి రూ. 210 లక్షల కోట్ల దాకా ఉంటే, పెరిగిన అప్పు రూ. 150 కోట్లు. మొత్తం అప్పులో విదేశీ అప్పు రూ. 54 లక్షల కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ అప్పు కాకుండా దేశంలోని 28 రాష్ట్రాలు చేసిన అప్పులు రూ. 81 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌధరి పార్లమెంటులో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో 37.32% మొత్తం రుణాలపై వడ్డీలకే చెల్లిస్తున్నట్లు పార్లమెంట్‌లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ప్రపంచంలో అత్యధిక అప్పులు చేసిన 10 దేశాల్లో భారత్ 7వ స్థానంలో ఉంది. తాజాగా వివిధ డేటాల సమాచారం ప్రకారం రాష్ట్రం అప్పులు బాగా పెరిగాయి. 2024 జూన్ నాటికి రాష్ట్ర అప్పు రూ. 5,19,192 కోట్లని రాష్ట్ర ఆర్థిక మంత్రి శాసనసభలో వెల్లడించారు. 2014 రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ వాటా అప్పు రూ. లక్షా 18 వేల కోట్లు. 2019 నాటికి రూ. 2 లక్షల 64 వేల కోట్లకు చేరింది. 2023 సంవత్సరం నాటికి రాష్ట్రం అప్పు రూ. 4 లక్షల 28 వేల కోట్లని ఆర్‌బిఐ పేర్కొంది. 2024 నవంబర్ నాటికి రాష్ట్రం అప్పు 9,47,000 కోట్ల రూపాయలు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని చంద్రబాబు చెబితే, కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న లెక్కల ప్రకారం రాష్ట్రం అప్పు రూ. 5.62 లక్షల కోట్ల. ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఇప్పటికే రూ. 2 లక్షలకు పైగా అప్పు చేసింది.

ఈ అప్పులు రాష్ట్ర జిడిపి 34.4% గా ఉంది. 2024 -25 సంవత్సరంలో అప్పులకు, వాటి వడ్డీలకు 58,253.30 కోట్ల రూపాయల అవసరమని కూటమి ప్రభుత్వం బడ్జెట్ పేర్కొంది. ఇందులో వడ్డీ చెల్లింపులకే రూ. 28,754.37 కోట్లు. అంటే అసలు కన్నా వడ్డీలకే ఎక్కువ చెల్లిస్తున్నారు. 2014-19లో తెలంగాణ అప్పు 69,603.87 కోట్లు. నేడు తెలంగాణ రాష్ట్రం అప్పు రూ. 5,04,814 కోట్లు. కెసిఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పు రూ. 3.5 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 2 వేల కోట్లకు పైగా అప్పు చేసింది. తెలంగాణ అప్పులపై కూడా వివాదం ఉంది. 202425 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అప్పులకు రూ. 23,337 కోట్లు వడ్డీ చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం అప్పులన్నీ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, విదేశీ వాణిజ్య బ్యాంకుల, విదేశీ రుణదాతల నుంచి తీసుకున్నది. ఈ అప్పులన్నీ విదేశీ కరెన్సీలో తీసుకున్నవి. మారకపు విలువ మార్పుపై ఈ అప్పుల ప్రభావం ఉంటుంది. డాలర్‌తో రూపాయి విలువ తగ్గడంతో దేశీయ రుణ చెల్లింపులు ఎక్కువ అవుతున్నాయి. దేశం మొత్తం అప్పు దేశ జిడిపిలో 55.60 శాతంగా ఉంది.

అప్పులు నేటి ప్రజలపైనే కాకుండా, రాబోయే తరంపైనా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ప్రజలు, తమకు అప్పు లేదని భావిస్తూ ఉంటారు. పాపం వారిపైన కూడా అప్పులభారం ఉందని వారికి తెలియదు. భారతదేశ జనాభా 142 కోట్లు ఉండగా, ఒక్కో వ్యక్తిపైన సగటు అప్పు సుమారు రూ. లక్షా 44 వేల నుంచి లక్షా 48 వరకు ఉంటుందని సాధారణ అంచనాగా ఉంది. రూపాయి విలువను బట్టి అప్పు మొత్తంలో మార్పులు ఉంటాయి. మోడీ పదకొండు ఏళ్లకాలంలో దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టు ఒక్కటీ స్థాపించలేదు. నీటి పారుదల ప్రాజెక్టు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఉపాధి పెంచలేదు. తెచ్చిన అప్పులన్నీ సంపన్న వర్గాల సౌకర్యాలకోసం జాతీయ రహదారులకు, విమానాశ్రయాలకు ఖర్చు చేసింది. వీటిని నిర్మించిన తర్వాత తిరిగి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నది. కార్పొరేట్ల రుణాల మాఫీకి రాయితీలు ఇవ్వడం చేస్తున్నది. కూటమి ప్రభుత్వ పరిస్థితి అదే. పాలకుల విధానాల ఫలితంగా దేశం అప్పుల ఊబిలో కూరుకుపోవటంవల్ల పేదరికం పెరుగుతూ, పేదలు దుర్బలమైన జీవితాలు గడుపుతున్నారు. కార్పొరేట్ల సంపదలు, లాభాలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. 2020- 21లో 2.50 లక్షల కోట్ల రూపాయలగా ఉన్న కార్పొరేట్ల లాభం, 2024 -25లో 7 లక్షల, 10 వేల కోట్లకు పెరిగిందని ఆర్‌బిఐ బులిటిన్ తెలియజేసి, పలు కీలక విషయాలను వెల్లడించింది. సంవత్సర కాలంలో దేశంలో కార్పొరేట్ పన్నులను, వారి వ్యక్తిగత ఆదాయపు పన్నులు మించిపోయాయి. 2020-21 మధ్య కాలంలో వారి లాభాలు మూడింతలు పెరిగినట్లు ఆర్‌బిఐ నివేదిక పేర్కొంది భారతదేశంలో ఆర్థిక అసమానతలకు, సంపద కేంద్రీకరణకు, పేదరికానికి, ఉపాధి లేమికి, నిరుద్యోగానికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారుల, బడా భూస్వాముల అనుకూల విధానాలే కారణం.  

– బొల్లిముంత సాంబశివరావు

98859 83526 

పగసాధింపా? నియంతృత్వ తీర్పా?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించడం చట్టపర ప్రక్రియ భారాన్ని మోయవచ్చు. కానీ ఇందులో గుర్తించలేని రాజకీయ ప్రతీకార చర్య దాగి  ఉందన్న దుర్గంధం గుప్పుమంటోంది. ఒకవైపు ప్రజలంతా ఈ సమయంలో ఉద్రిక్తతలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని అభ్యర్థిస్తూ , మరోవైపు ఈ తీర్పు చారిత్రాత్మకమైనదని, అత్యంత లోతైన పరిశీలనతో కూడుకున్నదని మొహమ్మద్ యూనస్ నేతృత్వం లోని తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రభుత్వం తనకు తాను గొప్పలు చెప్పుకుంటోంది. అయినప్పటికీ బంగ్లాదేశ్ అంతటా చెలరేగిన రాజకీయ అశాంతి ఇప్పటివరకు చేసిన పొరపాట్లలో ఉన్న లోతుపాతుల పగుళ్లను బయటపెడుతోంది. బంగ్లాదేశ్‌కు విముక్తి ప్రసాదించిన పోరాట యోధుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె హసీనా. ఆమెకు అత్యంత సన్నిహితుడైన బంగ్లా మాజీ హోం మంత్రి అసదుజమాన్ ఖాన్‌కు కూడా మరణశిక్ష పడింది. వీరిద్దరినీ తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ఒత్తిడి తెస్తోంది. దీనికి భారత్ విముఖత చూపిస్తుండటంతో ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడానికి బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. భారత్ నుంచి తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లాలని హసీనాకు ఇష్టం లేకపోయినా, వెళ్లిపోవాల్సిందిగా భారత్ అసాధారణంగా బహిష్కరించినప్పుడు ఆమె ఉరికంబం ఎక్కవలసి వస్తుంది.

ప్రజలు ఎన్నిక చేయని తాత్కాలిక ప్రభుత్వ నిర్వహణ లోని ట్రిబ్యునల్ తీర్పు కేవలం రాజకీయ ప్రతీకారమేనని, తన వాదనలు వినిపించనీయకుండా ఏకపక్ష నిర్ణయమని ఆమె విమర్శిస్తున్నారు. హసీనాను తమ దేశానికి తిరిగి పంపించివేయాలని బంగ్లాదేశ్ అభ్యర్థనను భారత్ పట్టించుకోకపోవడం సమంజమే. ఎందుకంటే చట్టబద్ధంగా ఎన్నికై, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఏర్పడినప్పుడే తాము ఆలోచించాల్సి వస్తుందని భారత్ వాదిస్తోంది. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో హసీనాకు చెందిన అవామీ లీగ్‌కు చోటు లేకుండా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం వేటు వేసింది. హసీనా మూడు ప్రధాన సంఘటనల్లో దోషిగా తేలారు. గత ఏడాది విద్యార్థుల నేతృత్వంలో సాగిన తిరుగుబాటులో ఘర్షణలను ప్రేరేపించడం, కాల్పులకు ఆదేశాలు ఇవ్వడం, దౌర్జన్యాల నివారణలో వైఫల్యం చెందడం ఈ మూడు విషయాల్లో ఆమె పొరపాట్లు చేసి దోషిగా తేలారు. ఈ మూడింటిలో రెండు విషయాల్లో ఆమెకు ట్రిబ్యునల్ మరణశిక్ష విధించగా, మూడో విషయంలో ఆమె సహజ మరణం పొందేవరకు జీవితఖైదు విధించాలని తీర్పు వెలువడింది. 2024 నాటి అల్లకల్లోలంతో బాధపడుతున్న దేశంలో ఈ అవకాశాలు మరింత దహించి వేస్తున్నాయి.

తిరుగుబాటు తరువాత అణచివేత చర్యలను దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ పరిశోధకులు బంగ్లాదేశ్‌లో దాదాపు 1400 మరణాలు సంభవించాయని అధికారికంగా ధ్రువీకరించారు. వీటిలో చాలావరకు దగ్గరగా గురిపెట్టి కాల్చిచంపారని తేల్చారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణాలు జరిగాయని, నియంతృత్వ విధానంతో ఏకపక్షంగా అరెస్టులు సాగాయని నివేదికలో వెల్లడించారు. ఆడియో రికార్డింగ్‌లను పరిశీలించగా ప్రభుత్వం ఎంత హద్దులు మీరి అతిగా ప్రవర్తించిందో చాలా దీనాతిదీనమైన దృశ్యం బయటపడింది. అయినప్పటికీ ఈ తీర్పు చాలా ఇబ్బందికరమైన సందర్భంలో వెలువడింది. ఈనాడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ పాలనలో సాగుతోంది. దీని చట్టబద్ధత సంక్షోభం నుంచి ఆవిర్భవించిందే తప్ప ప్రజా తీర్పు ద్వారా ఏర్పడలేదు. యూనస్ సారథ్యంలో ఢాకా ఇంకా స్థిరత్వాన్ని సాధించలేదు. తీర్పు వెలువడక ముందునుంచే బంగ్లాదేశ్ హసీనా మద్దతుదార్లు, అవామీలీగ్ కార్యకర్తల ఆందోళనలతో భగ్గుమంటోంది. ఢాకా లోని వీధివీధినా ఆందోళనలు, ఘర్షణలు సాగుతున్నాయి.

బస్సులు తగలబడుతున్నాయి. లాఠీలు విరుగుతున్నాయి. ఒక దేశానికి అవసరమైన శాంతిభద్రతల సమతుల్యత, భద్రత ఇవేవీ కనిపించకుండా దూరంగా ఉంటున్నదంటే తాత్కాలిక ప్రభుత్వ పాలన ఎలా ఉందో అర్థమవుతోంది. చట్టపరమైన పాలన, రాజకీయ స్థిరత్వం కేవలం ప్రతీకార పునాదులపై నిర్మింపబడవన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. హసీనా కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు కొన్ని క్షమించరాని పొరపాట్లు చేశారు. ఆందోళనకారులపై సైనిక బలగాలు మితిమీరి చర్యలు తీసుకోకుండా అడ్డుకోలేకపోయారు. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేశారు. ఆమె పర్యవేక్షణలో అసమ్మతిని సహించలేకపోయారు. అయినాసరే మరణశిక్ష తీర్పుతో రాజకీయ ప్రతీకారం సమానం చేయడం తీవ్ర ఆక్షేపణీయం. న్యాయం అన్నది ముందుగా సాగే మార్గాన్ని ప్రకాశవంతం చేయాలే తప్ప అస్తిరతలోకి దేశం దిగజారేలా మరింత తీవ్ర పరిస్థితులను కల్పించరాదు.

ఇక ఈ పరిస్థితుల్లో భారతదేశం సంయమనం కోరుకుంటోంది. బంగ్లాదేశ్‌తో దైపాక్షిక సంబంధాల్లో క్లిష్టతరమైన దశను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా రానున్న బంగ్లాదేశ్ ఎన్నికల్లో హసీనాకు చెందిన అవామీలీగ్‌కు ప్రాతినిధ్యం లేనప్పుడు ఢాకా లో రాజకీయ అనిశ్చితి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ బంగ్లాదేశ్ అంటే కేవలం ప్రభుత్వమే కాదు, తన ప్రజలు, తన సాంస్కృతిక వారసత్వ భాగస్వామ్యం, ఆర్థిక భవిష్యత్తు, దేశభద్రత ఇవన్నీ పెనవేసుకుని ఉన్నాయన్న వాస్తవాన్ని బంగ్లాదేశ్ పాలకులు అర్థం చేసుకోవాలి. ఈ విషయాల్లో దీర్ఘదృష్టి మందగిస్తే ఉపఖండంలో అత్యంత కీలకమైన పరిణామాలను ప్రమాదంలో నెట్టేయడమే అవుతుంది. ఇప్పుడు హసీనాకు విధించిన మరణశిక్ష బంగ్లాదేశ్ నియంతృత్వ విధానాలకు ప్రారంభ సంకేతమా లేక రాజకీయ ప్రతీకార చర్యల కొనసాగింపా అన్నది బంగ్లాదేశ్ ప్రభుత్వం తనకుతాను నిర్ణయించుకోవాలి. 

అభివృద్ధి, సుపరిపాలనకు పట్టం

బీహార్ 18వ శాసనసభ 243 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధాని మోడీ సారథ్యంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) అంచనాలకు మించి అఖండ విజయం సాధించడం సుపరిపాలనకు, అభివృద్ధికి అనుకూలంగా ప్రజలిచ్చిన తీర్పు. ప్రతిపక్ష మహాగట్‌బంధన్ నేతగా బరిలో నిలిచి హోరాహోరీగా తలపడి ఈసారైనా ముఖ్యమంత్రి కావాలని ఉధృతంగా ప్రచారం సాగించిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) యువనేత తేజస్వి యాదవ్ ఆశలు ఆడియా శలయ్యాయి. ఎన్‌డిఎను దీటుగా ఢీ కొట్టడానికి కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం, ప్రతి మహిళ ఖాతాలో నెలనెలా రూ. 2500 నగదు జమ చేస్తామని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గట్టి ప్రయత్నాలు చేస్తామని, పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి యువత జీవితాలలో వెలుగులు నింపుతామని ఆశలు రేపినా అధికార కూటమి ముందు వెలవెలపోవలసి వచ్చింది. ఇందుకు భాగస్వామ్య పక్షాల పనితీరు ప్రధాన కారణమని భావిస్తున్నారు.

ప్రాచీన జాతీయ పార్టీగా ఎన్నో ఏళ్లు ఈ దేశాన్ని, వివిధ రాష్ట్రాల్లో ఏకఛత్రాధిపత్యం నెరపిన కాంగ్రెస్ గంగా మైదాన రాష్ట్రాలు యుపి, బీహార్, పశ్చిమబెంగాల్‌లో మండల్ రాజకీయాల కారణంగా ప్రాభవం కోల్పోయి, సంస్థాగతంగా కోలుకోలేనంత శిధి ల స్థాయికి చేరడం, అయినా చేవలేకపోయినా అత్యధిక స్థానాలు తీసుకుని మహాపరాజయం చెందడం ఈ ఎన్నికలలో మరింత స్పష్టమైనది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్ధానాలలో పోటీచేసి 19 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఈసారి సర్దుబాటులో 51, స్నేహపూర్వక పేరుతో మరో 10 మొత్తం 61 స్థానాలలో పోటీ చేసి కేవలం 6 సీట్లే గెలవడం గట్‌బంధన్‌కు శరాఘాతమైనది. గత ఎన్నికల్లో వామపక్షాలు 16 స్థానాలు గెలిచి (సిపిఐ ఎంఎల్ 12, సిపిఐ 2, సిపిఎం 2) కాంగ్రెస్ కంటే మెరుగ్గా ఫలితాలు సాధించినా ఈసారి సిపిఎంఎల్ కేవలం 2, సిపిఎం భిభూతిపూర్ ఒక్క స్థానాన్ని గెలవగా, సిపిఐ ఒక్క స్థానం లో కూడా విజయం సాధించలేకపోవడం విచారకరం. యాదవ, ముస్లిం బంధంతో 32% ఓట్లకుతోడు అత్యంత వెనుకబడిన (ఇబిసి) కులాల ఓట్లు రాబట్టే వ్యూహంలో భాగంగా నిషదులలో 2.6% ఉన్న మల్లా ఉపకులం ఓట్ల కోసం ముకేశ్ సహానికి ఉప ముఖ్యమంత్రి హామీతో వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి)తో జట్టు కట్టినా ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేకపోయింది.

ముంబయిలో సినిమా సెట్ డిజైనర్‌గా పనిచేసే ముఖేష్ ఆరేడేళ్ల క్రితం బీహార్‌కు తిరిగి వచ్చి గత ఎన్నికల్లో ఎన్‌డిఎతో చేరి, డిప్యూటీ సిఎం పదవి హామీతో గట్‌బంధన్‌తో జట్టుకట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గంగా తదితర నదీ పరీవాహక ప్రాంతాలలో పడవలు నడపటం, చేపలు పట్టడం వంటి వృత్తుల్లో ఉన్న కేవట్, మల్లా తదితర మత్స్యకారులు బీహార్ జనాభాలో 8 శాతం, ఇబిసిలలో గణనీయంగా ఉన్నా వారు ప్రధానంగా జెడి(యు), ఎన్‌డిఎ మద్దతుదారులు. ఇలా ప్రధాన భాగస్వామ్య పక్షాలు అధ్వాన ప్రభావం చూపడంతో 50 మంది యాదవులకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చినా గట్‌బంధన్ మహా పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. అయితే తేజస్వి నేతృత్వంలోని ఆర్‌జెడి గత ఎన్నికలలో 75 సీట్లు గెలిచి పెద్ద పార్టీగా నిలిచింది. ఈసారి 143 స్థానాలకు పోటీ చేసి కేవలం 25 సీట్లే గెలిచి, 50 సీట్ల కోల్పోయినా తన 23 శాతం ఓటు బ్యాంకును నిలబెట్టుకోగలగడం ఆ పార్టీకి కొంత ఊరట. బీహార్ వ్యవసాయ ప్రధాన నిరుపేద రాష్ట్రం. పట్టణ జనాభా కేవలం 11 శాతం. జీవాలు, పాడి పశువులు, మత్స్య పరిశ్రమపై ఆధారపడి మూడోవంతు రాష్ట్ర ప్రజలు మనుగడ సాగిస్తున్నారు.

గట్‌బంధన్ గెలిస్తే 1990 నుండి -95 వరకు సాగిన లాలూ, రబ్రీదేవిల ఆటవిక పాలన మళ్లీ వస్తుందని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్‌సింగ్, ఆరోగ్య మంత్రి నడ్డా, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభృత ఎన్‌డిఎ నాయకులు చేసిన భారీ ప్రచారం ఇబిసి కులాలు, మహా దళితులను భీతావహులను చేసింది. అదీగాక గత పదేళ్లకాలంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు మహిళలు, నిరుపేదలకు అందాయి. పల్లె రోడ్లతోబాటు జాతీయ, రాష్ట్ర రహదార్లను అభివృద్ధి చేసి రాకపోకలను సుగమం చేయడాన్ని ప్రజలు హర్షించారు. 1000 కి.మీగా ఉన్న గ్రామీణ రోడ్లను 1,16,880 కి.మీకు విస్తరించారు. గత 12 ఏళ్లలో పల్లెల్లో వివిధ గృహనిర్మాణ పథకాల కింద పేదలకు 59 లక్షల ఇళ్లను నిర్మించారు. గతంలో నీళ్లు, విద్యుత్, రోడ్ల వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రజలు ఎన్నో ఆందోళనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2019లో జలజీవన్ మిషన్ ప్రారంభించింది. గతంలో కేవలం 2 శాతం ఇళ్లకు మాత్రమే రక్షిత మంచినీటి సరఫరా ఉండేది.

గత ఆరేళ్లలో నితీశ్ ప్రభుత్వం 95.7 శాతం ఇళ్ళకు మంచినీటి సౌకర్యాలు కల్పించింది. అఖిలభారత స్థాయిలో రక్షిత నీటి సరఫరా 81.3%. జాతీయ సగటు కంటే తక్కువే అయినా బీహార్‌లో తలసరి విద్యుత్ వినియోగం గత 12 ఏళ్లలో 134 నుండి 363 యూనిట్లకు పెరిగి, 3 రెట్లు పెరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలేగాక మహిళా సాధికారతను పెంపొందించడం కోసం నితీశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా, పట్టుదలగా కృషి చేస్తూనే ఉంది. 2006 లోనే పంచాయతీలలో 50 శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసిన మొదటి రాష్ట్రం బీహార్. ఆ తర్వాత ఆ రిజర్వేషన్లను పురపాలక సంఘాలకు విస్తరింపజేశారు. బాలికల విద్యను ప్రోత్సహించడానికి నితీశ్ ప్రభుత్వం 2006లో బాలికలకు సైకిళ్లు కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ. 2 వేలు ఇచ్చింది. అదీగాక హైస్కూలు నుండి డిగ్రీ వరకు వివిధ స్థాయిలలో బాలికలకు లక్ష వరకు ప్రత్యేక స్కాలర్ షిప్‌లు ఇస్తూ వచ్చారు. ఇందువల్ల విద్యాభ్యాసం కొనసాగించే బాలికల సంఖ్య 67 శాతానికి పెరిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. సోషలిస్టు అయిన నితీశ్ 1973లో స్వర్గీయ మంజు కుమారిని వివాహమాడినపుడు వరకట్నం వద్దని విలువలు పాటించారు. గత ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగి జెడి(యు)పై పోటీ పెట్టి ఆ పార్టీ విజయావకాశాలు దెబ్బతీసిన చిరాగ్ పాశ్వాన్ లోక్‌జనశక్తి పార్టీ ఈసారి ఎన్‌డిఎ భాగస్వామిగా 29 స్థానాలకు పోటీ చేసి, 19 గెలిచి బీహార్‌లో 4వ పెద్ద పార్టీగా నిలిచింది.

ఎల్‌జెపి, మహా దళిత నేత జితన్ రామ్ మాంజి భాగస్వాములుగా ఉన్నందున గత ఎన్నికల్లో 37% ఉన్న ఎన్‌డిఎ ఓట్లు 10 శాతం అంటే 47 శాతానికి పెరిగాయి. 2010 ఎన్నికలలో ఆర్‌జెడికి 22 స్థానాలు, ఎన్‌డిఎకు 206 స్థానాలు వచ్చాయి. 2020 ఎన్నికలలో 43 స్థానాలకే పరిమితమైన నితీశ్ జెడి(యు) ఈసారి రెట్టింపు (85) స్థానాలు గెలవడమేగాక, తన సుపరిపాలనతో మహిళలు, మహా దళితులు, అత్యంత వెనుకబడిన కులాలను బాగా ఆకట్టుకుని వాళ్ళు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని ఎన్‌డిఎ 67% పైగా ఓట్లు సాధించడంలో ప్రశంసనీయ పాత్ర పోషించారు. అందుకే జెడి(యు) ఈసారి 5% ఓట్లు పెరిగి, ఓట్లు 23 శాతానికి పెరగడం గమనార్హం. నితీశ్ ఎక్కడా కులమత ఘర్షణలు జరగకుండా పాలనలో కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారు. మైనారిటీలకు రక్షణ కల్పించారు. నితీశ్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి బిజెపి కుతంత్రాలు పన్ని చిరాగ్‌ను ఎగదోసినా, పెద్ద పార్టీగా బిజెపికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అప్పుడప్పుడు కొందరు కమల నేతలు సన్నాయి నొక్కులు నొక్కినా అందుకు సాహసించలేకపోయారు. నితీశ్ హిందూత్వ ఎజెండాను దూరం పెట్టారు. ప్రధాని మోడీ, తదితర కమల నేతలు వాస్తవాన్ని గుర్తించి ప్రాప్తకాలజ్ఞతతో నితీశ్ నే పదోసారి సిఎంగా అంగీకరించారు.

బిజెపికి 2020లో 19.46% ఓట్లు రాగా, ఈసారి స్వల్పంగా 20.08 శాతానికి పెరిగాయి. 89 స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా ఉన్నా పెరిగిన ఓట్లు కొంచమే. జెడి(యు), బిజెపి చెరి 101 స్థానాలకే పోటీ చేసినా గరిష్ట ఫలితాలు సాధించి రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ అధికారం చేపడుతున్నాయి. గత 20 ఏళ్లుగా మహిళా సాధికారతను సాకారం చేయడానికి, అన్నార్తులై ఎలుకలు వేటాడి ఆకలి తీర్చుకునే ముసాహిర్‌ల వంటి మహా దళితులు, అత్యంత వెనుకబడిన కులాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన నితీశ్‌కు కృతజ్ఞత తెలియజేయడానికే ఆ వర్గాలు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని అభివృద్ధి, సుపరిపాలనకే మద్దతు పలికాయి. ఇప్పటికీ బీహార్ జనాభాలో మూడోవంతు దుర్భర దారిద్య్రంలో ఉండటం, ఏటా ఉపాధి కోసం 25 లక్షల మంది వలసలు వెళుతూ ఉండటం, పల్లెలు జనాలతో కిక్కిరిసి ఉండటం, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి ఆదాయాలు పెంచడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలే. 13.4 కోట్ల బీహార్ జనాభాలో కోటి మంది వలస వెళ్ళారు.

2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలు అభివృద్ధి చెందడం ఎంతో అవసరం. డబుల్ ఇంజిన్ సర్కార్‌లు అందుకు ఎంతో శ్రమించవలసి ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లక్షిత వర్గాలకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కేంద్ర పథకాల నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి ఒక ప్రత్యేక ఐఎఎస్ అధికారిని ఢిల్లీలో నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం అభినందనీయం. ప్రాప్తకాలజ్ఞతతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో హస్తం పార్టీ సకలశక్తులు ఒడ్డి ఘన విజయం సాధించింది. బిజెపి డిపాజిట్లు కోల్పోయి చతికిలబడింది. కెసిఆర్ బిఆర్‌ఎస్ ఇప్పటికీ బలంగానే ఉంది. ఈ సంగతి గుర్తించి రేవంత్ రెడ్డి సమ్మిళిత సుపరిపాలనతో ముందుకు సాగాలి. 

– పతకమూరు దామోదర్ ప్రసాద్

94409 90381

‘సైన్సే నా మతమన్న’ సి.వి

విదేశీయులే.. పరిశోధనల కోసం ఇక్కడకు రావాలని, ఆ స్థితికి మన దేశం చేరుకోవాలని ఆకాంక్షించిన మహోన్నత వ్యక్తి రామన్. రామన్ ముందు వరకూ సైన్స్‌లో నోబెల్ బహుమతులు పాశ్చాత్యులకే దక్కేవి. కానీ, రామన్ అచ్చమైన భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని, తలమానికమైన పరిశోధన జరిపి సైన్సులో దేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పి భారత్‌కు నోబుల్ సాధించిపెట్టారు. ‘నా మతం సైన్సు.. దానినే జీవితాంతం ఆరాధిస్తా’ అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు. 1930 లో సి.వి. రామన్‌కు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన తరువాత ఇప్పటి వరకు మన దేశంలో జన్మించి, నివసిస్తున్న ఏ ఒక్క శాస్త్రవేత్తకు నోబుల్ బహుమతి లభించకపోవడం విచాకరం. మన దేశం లో జన్మించి, విదేశాలలో స్థిరపడ్డ హరగోవింద్ ఖురానా (1968), సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ (1983), వెంకట్రామన్ రామకృష్ణన్ (2009) లకు మాత్రమే సైన్స్‌రంగంలో నోబుల్ బహుమతులు లభించాయి. సత్యేంద్రనాధ్ బోస్, జి.యం. రాంచంద్రన్, ఉత్పల్, మాణిక్‌పాల్ భద్ర, మేఘనాధ్ సాహా, శంభునాధ్‌డే, హోమీ బాబా, జగదీష్ చంద్రబోస్, సి.ఎన్.ఆర్.రావు వంటి భారతీయ శాస్త్రవేత్తలు సైన్స్ పరిశోధనా రంగంలో అంతర్జాతీయంగా ఖ్యాతిగడించినప్పటికీ, నోబుల్ బహుమతులు పొందలేకపోయారు.

1930లో నోబెల్ బహుమతి స్వీకరించిన సందర్భంలో సివి రామన్ బహుమతి ప్రదానోత్సవానికి హాజరైన సభికులకు తాను ఆవిష్కరించిన రామన్ ప్రభావాన్ని ప్రదర్శించేందుకు ‘ఆల్కాహాల్’ని మాధ్యమంగా ఉపయోగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కాక్‌టెయిల్ పార్టీలో ‘ఆల్కాహాల్ తీసుకుంటారా’? అని రామన్‌ను విందుకు హాజరైనవారు అడుగగా ‘ఇప్పటి వరకు మీరు ఆల్కహాల్‌లో రామన్ ఎఫెక్టు చూసారు, రామన్‌పై ఆల్కహాల్ ఎఫెక్ట్ చూడాలని కోరుకోవద్దు’ అని చమత్కరించి పరోక్షంగా తాను మద్యానికి దూరంగా ఉంటాననే విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రశేఖర వెంకట్రామన్ 1888 నవంబర్ 7న ఆనాటి మద్రాసు ప్రావిన్సులోని తిరుచరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాల్‌లకు జన్మించారు. ఆయన బాల్యం నుంచే చురుకైన విద్యార్థిగా వుంటూ కేవలం 11 సంవత్సరాల వయస్సులోనే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. చిన్నతనంనుంచే పరిశోధన రంగంపై ఆసక్తి వున్న ఆయన విద్యాభ్యాసం అనంతరం 1907లో ఇండియన్ ఫైనాన్స్ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్ ఎకౌంటెంట్ జనరల్‌గా చేరారు.

ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు పరిశోధనపై దృష్టి సారించారు. తన లక్ష్యసాధన కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరారు. 1919లో ‘ది ఇండియన్ అసోషియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్‌కు’ గౌరవ కార్యదర్శిగా నియమితులయ్యారు. సివి రామన్ కాంతిపై పరిశోధనలుచేసి 1928లో ‘రామన్ ఎఫెక్టు’ కనుగొన్నారు. కాంతి కిరణాలు ఒక ద్రవపదార్ధంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది, అంటే కాంతికిరణాలలోని ఫొటాన్ కణాలు ద్రవపదార్థాల పరమాణువులపైపడి పరిక్షేపణ చెందుతాయి. దూరపు కొండలు, సముద్రపు నీరు, ఆకాశం నీలి రంగులో ఉండటానికి గల కారణాలను రామన్ ఎఫెక్టు విశ్లేషిస్తుంది. వైద్యరంగంలో మందుల్ విశ్లేషణకు, రసాయన పదార్థాలలోని అణువులు, పరమాణువుల పరిశీలనకు, మనం ధరించే వస్త్రాల రంగుల అధ్యయనానికి రామన్ ఎఫెక్టు దోహదపడుతుంది.

రామన్ ఫలితం ఆహారపు నాణ్యతని నిర్ధారించడంలో, పదార్థాల అణువుల నిర్మాణాన్ని గుర్తించడంలో, పదార్థాల రసాయనిక, భౌతిక గుణాలను గుర్తించడంలో ఉపయోగపడుతుంది. రామన్ ఫలితాన్ని ఉపయోగించి యానక పదార్థం నిర్మాణాన్ని విశ్లేషించవచ్చు. పదార్థాల స్పటిక నిర్మాణాలను అవగతం చేసుకోవటానికి రామన్ ఫలితం ఉపయోగపడుతుంది. ఆయన పరిశోధనలకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. రామన్ ఎఫెక్టు కనుగొన్న రోజైన ఫిబ్రవరి 28ని భారత ప్రభుత్వం ‘జాతీయ సైన్స్ దినోత్సవంగా’ ప్రకటించింది. 1933లో బెంగళూరులోని ప్రతిష్టాత్మక ‘ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ కు రామన్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు. 1948లో ఆయన బెంగళూరులో ‘రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను’ స్థాపించి పలువురు యువశాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. కేవలం రూ. 250తో రామన్ తన ప్రయోగాన్ని ఆవిష్కరించడం విశేషం.

1954లో రామన్‌ని ‘భారతరత్న’ వరించింది. మత విశ్వాసాల ఆధారంగా విద్యాలయం నడిపే ఒక మతసంస్థ రామన్‌ను తమ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించమని ఆహ్వానిస్తే ‘స్వర్గం, నరకం, పునర్జన్మ వంటి అశాస్త్రీయ విషయాలపై నేను మాట్లాడను’ అని ఆ సంస్థ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. ‘సైన్సే నా మతం’ అని రామన్ స్పష్టం చేశారు. ఆయన ధ్వనిపై కూడా పలు పరిశోధనలు చేసారు. నోబెల్ బహుమతి పొందినప్పుడు రామన్ ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తూనే మరొకవైపు ‘దేశం పరాయిపాలనలో ఉందని బహుమతి అందుకునేటప్పుడు నా దేశం తరపున, నా దేశ జాతీయజెండా లేకపోవడం నన్ను బాధిస్తుందని’ రామన్ తెలిపి దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు.

‘ది లైట్ ఆఫ్ ఏషియా’ పుస్తకం రామన్‌పై అమిత ప్రభావం చూపించింది. ఆత్మన్యూనతా భావాన్ని, ఓటమి భయాన్ని వీడి ధైర్యంతో ముందడుగు వేసి పరిశోధనా రంగంలో భారత కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయంగా నిలపాలని, నిరంతర పరిశీలన, అధ్యయనంతోనే ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. సైన్సులో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా ఛేదించి ప్రపంచ వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధృవతార సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ (సివి రామన్) 1970 నవంబర్ 21న తుదిశ్వాస విడిచారు. ఇటీవల ప్రకటించిన నోబెల్ బహుమతుల్లో కూడా మన దేశానికి స్థానం దక్కలేదు.అందుకే సివి రామన్ స్ఫూర్తితో నేటి పాలకులు పరిశోధనలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయవలసిన అవసరం ఉంది. అప్పుడే మనదేశం సైన్స్ ఆవిష్కరణలలో ముందుండే అవకాశం ఉంటుంది.

– యం. రాంప్రదీప్

94927 12836

సోషల్ మీడియాలో పెడదారులు

సమాజం ఎంత వేగంగా మారిపోతోందో చెప్పాలంటే, మన చేతిలో ఉన్న చిన్న మొబైల్‌నే చూడాలి. ఒకప్పుడు వార్తలు పత్రికల ద్వారా ఉదయం ఒక్కసారి చేరేవి. ఇప్పుడు క్షణక్షణం సమాచారం మన ముందుకొస్తోంది. కాని ఈ వేగం మనలో ఆలోచనలకు అవకాశం ఇవ్వకుండా చేస్తోంది. మనం చూసే ప్రతి పోస్టు, చదివే ప్రతి వాక్యం, వినే ప్రతి చిన్న క్లిప్ మన భావోద్వేగాలకు నేరుగా తాకుతోంది. ఇక్కడే సోషల్ మీడియా చూపించే అందమైన వెలుగుల వెంట వచ్చే కనిపించని అంధకారం మొదలవుతుంది. అనుకుంటే ఎంత మంచి ప్రపంచం ఇది. ప్రపంచం నలుమూలలనుంచి వచ్చే అభిప్రాయాలు, కొత్త ఆలోచనలు, మనమే చెప్పకుండా మనకోసం ఆగి వినే వేదిక. కానీ ఈ స్వేచ్ఛే కొన్నిసార్లు మనల్నిమనమే తప్పుదారిలోకి నెట్టేస్తుంది. నిమిషానికి వేల పోస్టులు అప్‌డేట్ అయ్యే ఈ ప్రవాహంలో నిజమా అబద్ధమా అనే తేడా గుర్తించడం కష్టంగా మారిపోతోంది. వేగమే ముఖ్యమయింది, నిజం రెండో స్థానానికి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితిలో యువత ఎంత సులువుగా ప్రభావితమవుతారో అంచనా వేయడం కష్టమే. స్మార్ట్‌ఫోన్‌లో కనిపించే ప్రతి పోస్టు మనసు లో చిన్న అలలు రేపుతూనే ఉంటుంది. ఇతరులందరూ ఎంతో బాగా ఉన్నారేమో!, నేను మాత్రం ఎందుకు ఇలాగే? అనే అనుమానాలు నెమ్మదిగా పెద్ద భావోద్వేగ ఒత్తిడులుగా మారతాయి.

సోషల్ మీడియాలో కనిపించే జీవితాలన్నీ నిజానికి ఒక గొప్ప ప్రదర్శనే. వెలుగువైపు మాత్రమే చూపించే ఆ ఫోటోల వెనక మనకు తెలియని చీకట్లు ఉంటాయి. కానీ యువతకి అవి కనిపించవు. వారు చూస్తుంది కేవలం మెరుపు, కాని ఆ మెరుపు వెనుక ఉన్న మేఘాన్ని గుర్తించడం ఇంకా నేర్చుకోని వయసు. తరచూ స్క్రోల్ చేస్తూ ఉండటం అనేది ఒక అలవాటుగా మొదలై, మెల్లగా ఒక అవలంబనగా మారుతుంది. రోజుకు గంటలోపే స్క్రీన్ చూశామన్న భావన ఉన్నా, వాస్తవంలో గంటలు గడిచిపోతాయి. ఆ సమయంలో మనసు బయట ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోతుంది. కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నా, మాట్లాడటానికి సమయం లేకుండా పోతుంది. వ్యక్తిగత సంబంధాల్లో కనిపించని గీతలు ఏర్పడతాయి. నమ్మకాల బంధాలు సామాన్యమైన అపార్థాలతోనే దెబ్బతింటాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వ్యాఖ్యను మనసులో పెట్టుకోవడం, ప్రతి మాటను వ్యక్తిగతంగా తీసుకోవడం అలవాటైపోతుంది. కొన్నిసార్లు ఒక పదం, ఒక్క ఫోటో, ఒక చిన్న వీడియో తప్పుగా అర్థమైపోతుంది. ఆ విషయంలో పూర్తి వివరాలు తెలుసుకునే లోపే తీర్పులు వేయడం మొదలవుతుంది.

ప్రజల భావోద్వేగాలకు ఈ వేదికల ప్రభావం అంత ఎక్కువగా ఉండటంతో, నిజానికి సంబంధం లేకుండా విమర్శలు వెల్లువెత్తుతాయి. అలా నిర్దోషులైన వారు అనవసర వివాదాలకు గురవడం జరుగుతూనే ఉంది. తీర్పు వేగంగా కానీ ఆలోచన నెమ్మదిగా ఈ విరుద్ధం సోషల్ మీడియా యుగానికి ప్రతీకగా మారింది. అయితే ఇది పూర్తిగా ప్రతికూలమైన వేదిక అని చెప్పడం అన్యాయం. ప్రపంచానికి అనుసంధానమైన అవకాశాలు, ప్రతిభను ప్రదర్శించే దారులు, సమాచారం పంచుకునే స్వేచ్ఛ ఇవన్నీ ఈ వేదిక ఇచ్చిన గొప్ప వరాలు. ఒక చిన్న గ్రామంలో ఉన్న ప్రతిభావంతుని పాట లేదా కవిత ప్రపంచం వరకు చేరడానికి ఇదొక బలమైన వేదిక. సహాయం కావాల్సిన వారికి క్షణాల్లో మద్దతు అందించే వేదిక కూడాను. కానీ ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఈ వేదికను మనం ఎంత బాధ్యతతో వాడుతున్నాం? సమాచారం అందుబాటులోకి వచ్చిందనే కారణంతోనే అది నిజం అవ్వదు. ప్రతీ పోస్టునూ, ప్రతీ మాటనీ గుండెల్లో పెట్టుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఇది నిజమా?, దీనికి ఆధారం ఉందా?, దీని వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా? అనే మూడు చిన్న ప్రశ్నలు అడిగితే చాలా వదంతులు ఆగిపోతాయి. యువతలో ఈ ఆలోచన అలవాటు పెంచడం అత్యంత అవసరం.

మరొక ముఖ్యమైన విషయం -డిజిటల్ ప్రవర్తన. ఒకరి జీవితంపై కావాలనే వ్యాఖ్యలు చేయడం, మనసుకు నొప్పిచేసే మాటలు రాయడం చాలా సులభమైపోయింది. కానీ ఆ మాటను చదివే వ్యక్తి హృదయంలో అది ఎలాంటి గాయాన్ని చేస్తుందో మనకు తెలియదు. సోషల్ మీడియా మనలను వ్యక్తీకరణ వైపు దగ్గర చేస్తున్నప్పటికీ, మనసులను కూడా దూరం చేస్తున్న విరుద్ధ ప్రపంచంగా మారిపోతోంది. తల్లిదండ్రులు కూడా ఈ మార్పును అర్థం చేసుకోవాలి. పిల్లల చేతుల్లో ఫోన్ ఉన్నంతసేపు ప్రమాదం ఉన్నట్టే కాదు; పక్కనే ఉన్నప్పటికీ అర్థం చేసుకునే సంభాషణలు తగ్గిపోతే అదే పెద్ద ప్రమాదం. వారి మనసులో ఏముంది? ఏ వీడియోలు చూస్తున్నారు? ఏ విషయాలు ప్రభావం చూపుతున్నాయి? ఇవన్నీ తెలుసుకోవడం సంరక్షణలో భాగమే. నిషేధాలు పెట్టడం కాదు; అవగాహన కల్పించడం ముఖ్యం. ఇక చివరిగా, సోషల్ మీడియా జీవితం మొత్తం కాదు. అది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ప్రపంచం ఎంత పెద్దదో, మనుషులు ఎంత విలువైనవారో, ప్రత్యక్షంగా మాట్లాడితేనే తెలుస్తుంది. మనసు మన వ్యక్తిత్వానికి అద్దం. ఆ అద్దం స్క్రీన్ వెలుగులో కాకుండా మనసులో వెలిగితేనే జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ మీడియా మనల్ని కలపడానికి వచ్చింది.

మనల్ని విడదీయడానికి కాదు. తప్పుదోవలు గుర్తించి, సరైన దారిలో వినియోగిస్తే అది శక్తి. ఆలోచించకుండా ఉపయోగిస్తే అది నీడ. నీడను వెలుగుగా మార్చే బాధ్యత మాత్రం మనదే. సోషల్ మీడియా మన జీవితాల్లోకి వచ్చిన మార్పులను పూర్తిగా నిరాకరించే స్థితి ఇప్పుడు మనకు లేదు, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం మాత్రమే ఈ సమస్యలకు స్థిరమైన పరిష్కారం. యువతలో డిజిటల్ నియమ శిక్షణను పెంచడం, సమాచారం పంచుకునే ముందు నిజానిజాలను ధ్రువీకరించుకోవడం, వ్యక్తిగత గోప్యతను కాపాడుకునే అలవాటు, ఇతరుల జీవితాలను తమతో పోల్చుకోకుండా స్వంత ప్రయాణానికి విలువ ఇవ్వడం- ఇవన్నీ తప్పుదారుల్లోంచి బయటపడే మొదటి అడుగులు. కుటుంబాలు పిల్లలతో సంబంధాన్ని మరింత దగ్గరగా ఉంచి, రోజులో కొంతసేపైనా మొబైల్ లేకుండా జీవించే సంస్కృతిని ప్రవేశపెడితే డిజిటల్ భారాన్ని తగ్గించవచ్చు. యువతకు వేదికల ప్రభావం ఎంత గణనీయమో చెప్పి, లోపలున్న భావోద్వేగ దృఢత్వాన్ని పెంపొందించటం అత్యంత ముఖ్యం. ఇదే సమయం లో సోషల్ మీడియా సంస్థలు కూడా మార్గనిర్దేశక విధానాలు, నమ్మకమైన సమాచారం ప్రోత్సాహం, హానికర కంటెంట్‌ను వెంటనే నియంత్రించే వ్యవస్థలను బలపరచాలి. డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా త్యజించడం కాదు; దానికి బానిస కాకుండా దానిపై అధిపత్యం సాధించడం అసలైన పరిష్కారం. 

– చిటికెన కిరణ్ కుమార్

94908 41284