Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Restbet

Restbet giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Restbet

Restbet giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom

bahislion

Marsbahis

1xbet

vbet

olabahis

betmoon

betmoon

holiganbet giriş

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

sekabet

sekabet

vdcasino giriş

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

matbet

bets10

pusulabet

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

meritking

1xbet

padişahbet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

milanobet

gallerbahis

galabet

betkolik

betticket

süratbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

betasus

bahiscasino

casinoroyal

sekabet

jojobet

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

betlike

vdcasino

ultrabet

tlcasino

galabet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

casinoas

berlinbet

dinamobet

artemisbet

casinolevant

enbet

madridbet

vdcasino

sonbahis

casibom

betturkey

atlasbet

grandpashabet

ఆయువు తీస్తున్న వాయువు

న్యూఢిల్లీని మరోసారి శీతాకాలపు పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో కంటిచూపు తగ్గుతోంది. ఆస్పత్రులు నిండిపోతున్నాయి. జనాలకు ఊపిరి సలపడం లేదు. వాయు నాణ్యత సూచిక ప్రమాద స్థాయిలో ఉంది. ఫలితంగా పాఠశాలలు మూసివేయాల్సి వస్తోంది. రాజధాని నివాసితులకు ఏటా శ్వాసకు ఇబ్బంది, ఊపిరాడకపోవడం ఓ భయంకరమైన ఆచారంగా మారింది. రాజధానిలో పిల్లలు ఇప్పుడు స్వచ్ఛమైన గాలి తెలియక పొగమంచును రూచిచూస్తూ పెరుగుతున్నారు.శీతాకాలం అంటే చలి మాత్రమేకాక తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతుందని వృద్ధులు అంటున్నారు. భారతదేశం ప్రతి సంవత్సరం అత్యవసర చర్యల గురించి చర్చిస్తుంది. కానీ, నిర్లక్ష్యం. తాత్కాలిక ఆలోచనే తప్ప, వాయుకాలుష్య నియంత్రణకు కఠినమైన, శాశ్వత చర్యలు తక్కువ. అయితే ఈసారి సమస్య కేవలం ఢిల్లీకే పరిమితం కావడంలేదు. మైదానాలకు దూరంగా -ఈశాన్య ప్రాంతంలో వాయు కాలుష్య భూతం విస్తరించిన వాస్తవాలు కలవరపెడుతున్నాయి.

సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సిఆర్‌ఇఎ) చేసిన కొత్త శాటిలైట్ ఆధారిత ఎంపి 2.5 అంచనా దిగ్భాంతి కలిగించే వాస్తవాన్ని వెల్లడించింది. అసోంలోని 11 జిల్లాలు ఇప్పుడు దేశంలోని 50 అత్యంత కలుషిత జిల్లాలలో ఉన్నాయి. ఈ సంఖ్య ఢిల్లీకి సమానం. మరీ ఆందోళన కలిగించే అంశం అసోం లోని 34 జిల్లాలు 2024లో జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాలను దారుణంగా అధిగమించాయి. కాలుష్యం తీవ్రతే కాదు అది కొనసాగడం విధాన రూపకర్తలను ఇబ్బందిపెడుతోంది. భారతదేశంలో ఎక్కువ భాగం వర్షాకాలంలో వాయు కాలుష్యం ప్రక్షాళన జరుగుతుంది, అసోంలో వర్షాకాలంలో కూడా పిఎం 2.5 నిబంధనలను 21 జిల్లాలు ఉల్లంఘించినట్లు రికార్డయింది. త్రిపురలో కూడా ఆరు జిల్లాలలో కాలుష్యం పెచ్చుపెరిగింది. ఇవి ఎపిసోడిక్ స్పైక్‌లను కాక, నిర్మాణాత్మక క్షీణతను సూచిస్తున్నాయి. భారతదేశంలో చక్కటి పర్యావరణానికి పెట్టింది పేరైన ఈశాన్య ప్రాంతం ఇప్పుడు దీర్ఘకాలిక వాయు కాలుష్య ఇబ్బందుల జోన్‌లోకి మారిపోయింది.

ఈ మార్పు అభివృద్ధి కారణం గా వచ్చిన అనివార్య పరిణామంగా చెప్పలేం, కానీ ఈ గణాంకాలను తోసిపుచ్చలేం కదా. దశాబ్దాలుగా ఈశాన్య రాష్ట్రాలు చక్కటి వర్షపాతం, దట్టమైన అటవీ విస్తీర్ణం, తక్కువ పట్టణీకరణ, పరిమితంగా పారిశ్రామికీకరణ కారణంగా స్వచ్ఛమైన గాలిని అనుభవిస్తూ వచ్చాయి. అయితే నేడు శీతాకాలం, వేసవి, వర్షాకాలం అన్న తేడా లేకుండా దేశంలో ఎక్కువ కాలుష్య ఐదు రాష్ట్రాలలో అసోం, త్రిపుర ఉండడం దురదృష్టకరం. ఇందుకు ప్రధాన కారణం పర్యావరణ రక్షణ చర్యలు లోపించడం, అభివృద్ధి విస్తరణ విషయాలపై నియంత్రణ పేలవంగా ఉండడం, పర్యావరణ సమతుల్యతపట్ల తీవ్ర నిర్లక్ష్యం. చట్టబద్ధమైన ముందస్తు అనుమతుల లేకుండా కార్యకలాపాలు ప్రారంభించే పరిశ్రమలకు ఫోస్ట్ ఫాక్టో పర్యావరణ అనుమతులను అనుమతించడం ద్వారా న్యాయస్థానం తీసుకున్న తిరోగమన చర్యవల్ల ఈ డైనమిక్స్ బయటపడుతున్నాయి.

పోస్ట్- ఫాక్టో పర్యావరణ అనుమతులను నిషేధించే 2025 వనశక్తి తీర్పును సుప్రీం కోర్టు ఈ మధ్య ఉపసంహరించుకోవడం భారతదేశ పర్యావరణ న్యాయశాస్త్రానికి ఎదురైన అతిపెద్ద ఎదురుదెబ్బ. పెట్టుబడులు రావాల్సిన అవసరం, ఆర్థిక పరిగణన నేపథ్యంలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన పరిశ్రమలు తరువాత పర్యావరణ పరమైన అనుమతులు కోరవచ్చునని కోర్టు పేర్కొంది. కానీ, ఇది పర్యావరణ నియంత్రణ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఇందుకు ముందు పరిస్థితి అంచనాలు, ప్రజా సంప్రదింపులు వంటి జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉంది. కోర్టు తీర్పు ఫలితంగా ఉల్లంఘనలు పెరుగుతాయి. పునరాలోచన తర్వాత తీర్పు అక్రమనిర్మాణాలను చట్టబద్ధం చేస్తుంది. వ్యాపార అవసరాలకోసం పర్యావరణానికి హాని జరిగినా ఆమోదించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ఈ తీర్పు ఆర్టికల్ 21 కింద పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం విషయంలో రాజ్యాంగ హక్కును దెబ్బతీస్తుందనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో పర్యావరణ దౌర్బల్యం తీవ్రంగా ఉంటుంది. నియంత్రణ, పర్యవేక్షణ తక్కువే. అందువల్ల మరింత శ్రద్ధ అవసరం.

ఈ విస్తృత జాతీయ సందర్భంలోనే సిఆర్ ఇఎ నివేదికను అర్థం చేసుకోవాలి. అసోంలో గాలి నాణ్యత క్షీణత కు కారణం స్థానిక పాలనా యంత్రాంగ వైఫల్యమే కాదు. ఇది పర్యావరణ పరంగా విస్తృత కోతకు సంకేతం. బ్రహ్మపుత్ర వ్యాలీలో థర్మల్ పవర్ నుంచి, పెట్రో కెమికల్స్ వరకూ, సిమెంటు ఫ్యాక్టరీల నుంచి చమురు శుద్ధి కర్మాగారాల వరకూ పలు పరిశ్రమలు విస్తరించడం ప్రధాన కారణం. కఠినమైన నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఉద్గారాలు అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్నాయి. ఆధునిక జిగ్‌జాగ్ టెక్నాలజీ, ఉద్గార ఫిల్టర్లు లేకుండా పనిచేసే ఇటుక బట్టీల కారణంగా, మొరిగావ్, నాగావ్, టిన్సుకియా, బొంగైగావ్ వంటి పట్టణాల చుట్టూ దట్టమైన కాలుష్య వలయం ఏర్పడుతోంది. గ్రామీణ జీవనోపాధిలో భాగమైన బయోమాస్‌కు తోడు ఇప్పుడు పట్టణ చెత్త దగ్ధం, ఏడాది పొడవునా సాగే నిర్మాణ పనుల కారణంగా కాలుష్యం మరీ మితిమీరుతోంది. అసోం పట్టణ ప్రాంతాలలో వాహనాల సంఖ్య గణనీయంగా పరిగింది. రోడ్ల విస్తరణ, హైవేల నిర్మాణం, నదీతీర అభిృవృద్ధితో నియంత్రణ లేని ధూళి పెరిగిపోతోంది.

ఈశాన్య ప్రాంతం కాలుష్య కేంద్రంగా మారడానికి ఇవే కారణాలని పూర్తిగా చెప్పలేం. బంగ్లాదేశ్, ఉత్తర బెంగాల్ నుంచి సరిహద్దు ఏరో సోల్స్ అసోం బేసిన్ లాంటి ప్రాంతాలలోకి ఎక్కువగా చొచ్చుకువస్తాయి. ఇక్కడి తేమ, తక్కువ గాలి ప్రసరణ కారణంగా కాలుష్య కారకాలు చిక్కుకుంటాయి. అడవుల నరికివేత, తగులపడుతున్న అడవులు, క్వారీయింగ్, నదీగర్భంలో అక్రమ మైనింగ్ ప్రకృతిని దెబ్బ తీస్తున్నాయి. జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, లీనియర్ మౌలిక సదుపాయాలు, రైల్వే డబ్లింగ్, సరిహద్దురోడ్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు, ఐదేళ్లుగా విస్తరించాయి. తరచుగా సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనాలను దాటవేస్తున్నాయి. పోస్ట్ ఫ్యాక్టో అనుమతులు ఇప్పుడు చట్టబద్ధం కావడంతో అనుమతులు పొందాలనే షరతు లేదు.

దాంతో ఈశాన్య పర్యావరణానికి ముఖ్యంగా పారిశ్రామిక, మౌలిక సదుపాయాలు, పర్యావరణ రంగాలనుంచి అన్నివైపులనుంచి ఒత్తిడి తప్పడం లేదు. దారుణం ఏమిటంటే, ఈ ప్రాంతం పర్యావరణ ప్రాముఖ్యత ఈ ప్రాంత నివాసితులకు స్వచ్ఛమైన గాలిని దూరం చేస్తోంది. ఈశాన్య ప్రాంతం ప్రపంచం లోని గొప్ప జీవవైవిధ్య హాట్‌స్పాట్ లలో ఒకటి. దాని అడవులు వర్షప్రాంతాన్ని నియంత్రిస్తాయి. నదీ వ్యవస్థలను స్థిరీకరిస్తాయి. మరో చోట లేని అరుదైన జాతులను సంరక్షిస్తాయి. గిరిజనులు, స్వదేశీ సమాజాలు శతాబ్దాలుగా స్థిరమైన భూనిర్వహణ సంరక్షకులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ పర్యావరణ ఆస్తుల నష్టం ప్రాంతీయపరమైన నష్టమేకాదు ఇది జాతీయ నష్టం. కలుషితమైన ఈశాన్యం అంటే అస్థిర రుతుపవాలు, అస్థిర వరదలు, మొత్తం భారత ఉప ఖండానికి ఎక్కువ నష్టం కలిగించే పరిస్థితి. బ్రహ్మపుత్ర లోయ ఇబ్బందిపడినప్పుడు దిగువ మైదానాలకు ఇబ్బందులు తప్పవు.భారతదేశ పర్యావరణ భవిష్యత్‌కు హానికరమే.

సంక్షోభాన్ని గుర్తిండమే కాదు, దేశంలో పర్యావరణ పరిరక్షణకు రూపొందించిన విధానాలను పునర్నిర్వచించడం ఎదుట ఉన్న సవాల్. కాలుష్య నియంత్రణ బోర్డులను స్వతంత్ర శాస్త్రీయ సామర్థ్యంతో బలోపేతం చేయడం, చట్టబద్ధమైన అధికారాలతో ఈశాన్య పర్యావరణ పరిరక్షణ అథారిటీ ఏర్పాటు చేయడం, ముందస్తు పర్యావరణ అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టును ప్రారంభించలేరనే సూత్రాన్ని పునరుద్ధరించడంవంటి చర్యలు ముఖ్యం. జిల్లా స్థాయి క్లీన్ -ఎయిర్ యాక్షన్ ప్లాన్‌ను తప్పనిసరి చేయాలి. శాటిలైట్ ఆధారిత హాట్‌స్పాట్ గుర్తింపునకు సంబంధించి మార్గనిర్దేశం చేయాలి. ఇటుక బట్టీలను ఆధునీకరించడమో, మూసివేయడమే చేయాలి. పరిశ్రమలు నిరంతర ఉద్గారాల పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. డేటా అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో జనాలకు స్వచ్ఛమైన ఇంధనం అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్మాణ కార్యక్రమాలనూ కఠినంగా నియంత్రించాలి. మున్సిపల్ సంస్కరణల ద్వారా చెత్త తగులపెట్టకుండా నియంత్రించాలి.

అడవులు, చిత్తడి నేలలు, గిరిజన భూముల రక్షణ కూడా కీలకం. అటవీ సంరక్షణ చట్టాలను నీరుగార్చడం, అటవీ భూమి విషయంలో స్పష్టమైన నిర్వచనం లేకపోవడంతో ఈశాన్య ప్రాంతంలో విస్తారమైన భూభాగాలు రక్షణాత్మక చట్టాల కింద లేకుండాపోయాయి. ప్రభుత్వం నోటీఫై చేసిన అడవుల మాదిరిగానే, కమ్యూనిటీ నిర్వహణ అడవులకు రక్షణ కల్పించే చట్టాలను బలోపేతం చేయాలి. వాతావరణ మార్పులు తీవ్రతరం అవుతున్నందువల్ల, కఠినమైన పర్యావరణ, అంచనాలు లేకుండా మైనింగ్, నదుల తవ్వకానికి కానీ, రోడ్ల విస్తరణకు కానీ అనుమతించరాదు. ఇందుకోసం అడవులను పణంగా పెట్టకూడదు. కాలుష్య నియంత్రణకు ప్రాంతీయ సహకారం అవసరం, కాలుష్యం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితం కాదు. ఈశాన్యం లోని అసోం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్ ఉమ్మడి కాలుష్య నియంత్రణకు గట్టి సమన్వయంతో కృషి చేయాలి.

బయోమాస్ దగ్ధం, కార్చిచ్చు, అడవులలో మంటల నియంత్రణ, పొరుగు దేశాలతో సరిహద్దులలో పారిశ్రామిక ఉద్గారాలపై ఉమ్మడి ప్రొటోకాల్ మున్ముందు చాలా అవసరం. దేశ రాజధాని ఢిల్లీలో ఏటా పొగమంచు సంక్షోభం ఓ హెచ్చరిక. కానీ ఈశాన్య ప్రాంతంలో ఏడాది పొడవునా పెరుగుతున్న కాలుష్యం మరింత తీవ్రమైనదిగా చూడాలి. ఒకప్పుడు రుతుపవన అడవులు, నదీ గాలులతో కూడిన ప్రాంతం విషపూరితంగా తయారైంది.దేశవ్యాప్తంగా పర్యావరణ పతనాన్ని అరికట్టగలమా. కోట్లాది సంవత్సరాలుగా పరిరక్షించుకుంటున్న సహజమైన వారసత్వ సంపదను పరిరక్షించుకోగలమా అన్నది మనం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది. స్పష్టమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందితే, దానికి చెల్లించే మూల్యం గాలి నాణ్యత ఇండెక్స్ లేదా అస్పత్రిలో చేరిన వారి సంఖ్యతో లెక్కించలేం. ఇది భారత వాతావరణ భద్రత, దాని జీవవైవిధ్యం, అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పనకు సంబంధించి రాజ్యాంగం ప్రసాదించిన హామీ అమలుపై భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

– గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)

– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు

అధికారం కోసం వేలం పాట వేస్తారా?

తెలంగాణ పల్లెల్లో ఎన్నికల శంఖారావం వినిపించే ప్రతిసారీ చుట్టుపక్కల వ్యాపించే ఒక మాట ఏకగ్రీవం అప్రతిహతంగా రాజకీయ వాతావరణాన్ని చుట్టుముట్టుతుంది. ఏకగ్రీవం అంటే అసలు అర్థంలో ప్రజాస్వామ్య పరంపరలో గొప్ప చిహ్నం. ప్రజలందరూ ఒకే అభిప్రాయంతో, ఒకే సంకల్పంతో, గ్రామ ప్రగతిని మించిన ఆకాంక్ష లేకుండా, నిస్వార్థ సేవా మనస్సు ఉన్న వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవడం. స్వచ్ఛత, నిర్ణయాత్మకత, వినయం, ప్రజాహితం, ఇవే అసలు ఏకగ్రీవానికి నిలువెత్తు అర్థాలు. కాని కాలగమనంలో ఈ పవిత్రమైన భావన పల్లెల అంచుల వెంట బతుకుతున్న రోజువారీ కుటుంబ జీవితాలు గడుపుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఉండే నాయకుడు ఉండాలి. కొంతమంది అవినీతిపరులైన రాజకీయ నాయకుల చేతుల్లో పడిపోవడంతో, అది ఇప్పుడు వేలంపాటలకు, బెదిరింపులకు, దురుద్దేశాలకు పూచికత్తిగా మారిపోయింది. ఇదే పరిస్థితికి ఒక ప్రతిబింబంగా గత రెండు దశాబ్దాలుగా గ్రామ ఎన్నికల్లో జరిగే ఏకగ్రీవాల శాతం పెరుగుతూ పల్లె రాజకీయాల్లో అజ్ఞాతంగా వ్యాపిస్తున్న వ్యాధిలా మారిపోయింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు ఏడున్నర శాతం మాత్రమే ఉన్న ఏకగ్రీవ సర్పంచి ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో 2019నాటికి 17 శాతానికి పైగా దూసుకుపోయాయి. ఈ గణాంకాలు గ్రామ ప్రజాస్వామ్యం బలపడిందనే వాదనకు నిదర్శనమా? ఈ కాలంలో ఏకగ్రీవాలు గ్రామాభివృద్ధి ప్రతిబింబం కాదు. అవి గ్రామ ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా మింగేస్తున్న ప్రాణాంతకమైన రాజకీయ వ్యాపారం. సేవాభావం లేకుండా, గ్రామం పట్ల బాధ్యతా రాహిత్యంతో, వ్యక్తిగత ప్రతిష్ట కోసమే పదవులను తమ కబంధహస్తాలలోకి తీసుకోవడం, గ్రామ ప్రజాస్వామ్యానికి అపాయకరం. ఒక గ్రామంలో ప్రజలు అభివృద్ధి కోసం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంటే అది శుభసూచక సంకేతం. అయితే, అదే ప్రజల స్వరాన్ని డబ్బుతో ముంచి, వారిని నిర్ణయించనియ్యకుండా బలవంతపు ఏకగ్రీవాలు చేయిస్తే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన, ప్రమాదకరమైనచర్య. ఇలా గ్రామ ప్రజాస్వామ్యాన్ని బంధించిన శక్తులు విస్తరిస్తున్న సమయంలో, మహాత్మాగాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం అనే భావనను ఒక్కసారి తలచుకుంటే పరిస్థితి ఎంత విరుద్ధ దిశలో నడుస్తోందో అర్థమవుతుంది.

మహాత్మా గాంధీ ఊహించిన గ్రామం అనేది స్వయం సమృద్ధిని చాటే వ్యవస్థ. రోడ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం, శానిటేషన్, నీటి వనరుల నిర్వహణ వంటి అంశాల్లో గ్రామమే స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. గ్రామసభ శక్తి కేంద్రంగా ఉండాలి. సర్పంచి ప్రజల సేవకుడిగా ఉండాలి. పంచాయతీ ప్రజల సంక్షేమాన్ని అత్యున్నత లక్ష్యంగా భావిస్తూ పని చేయాలి. అయితే నేటి గ్రామాల్లో చూస్తున్న దృశ్యం దీనికన్నా భిన్నంగా, కొన్నిసార్లు విరుద్ధంగా కనిపించడం బాధాకరం. పల్లెల్లో ఇప్పటికీ వెలుగులేని వీధులు, గుంతల రోడ్లు, పాడైపోయిన డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల లేమి, మహిళలు, వృద్ధులు ఎదుర్కొనే తీవ్రమైన సమస్యలు, వేసవి కాలంలో తాగునీటి కోసం పడే పోరాటం ఇవన్నీ చూస్తే స్వాతంత్య్ర భారత్‌లో 78 ఏళ్లు పూర్తయ్యాక కూడా పల్లెల పరిస్థితి ఎంత వెనకబడి ఉందో అర్థమవుతుంది.

గ్రామ ప్రజలకు అత్యవసరమైన సమస్యలు పరిష్కారాలు లేకుండా మిగిలిపోతున్నాయి. దీని వెనక కారణం ఏమిటి? పంచాయతీలకు తగిన నిధుల ఉండవు, వచ్చిన నిధుల దుర్వినియోగం, స్వయం ఆదాయ వనరుల కొరత, స్థానిక నాయకుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల నిరాసక్తత, గ్రామ ప్రజల హక్కులపై అవగాహన లేకపోవటం. కొన్నిసార్లు పంచాయతీ కార్యాలయాలకు తాత్కాలికంగా అద్దె భవనాల్లో పని చేయాల్సి వచ్చే దుస్థితి చూస్తే గ్రామపాలన ఎంత బలహీనంగా మారిపోయిందో తెలుస్తోంది. నిధుల విషయంలో కూడా పంచాయతీలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితి వేరే విధంగా లేదు. పల్లెల్లో బ్లీచింగ్ పౌడర్ వేసేందుకు కూడా నిధులు లేవనిపించటం ఏ శకానికి నిదర్శనం? బడ్జెట్ కొరతలతో చదును చేసే రోడ్లు నిలిచిపోవడం, వీధిలైట్లు పనిచేయకపోవడాన్ని లెక్కచేయరాదు అన్నపద్ధతిలో వ్యవహరించడం, కాలువల నిర్మాణం, చెత్త సేకరణ వంటి ప్రాథమిక వ్యవస్థలు తారుమారవడం-ఇవి అన్నీ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న లోతైన సమస్యలను మన ముందుంచుతున్నాయి.

ప్రజాస్వామ్యం పునాదిగా నిలిచే గ్రామ పాలన ఇలాగే బలహీనంగా ఉందంటే దేశ అభివృద్ధి ఎలా సాధ్యం? గ్రామాల్లో ప్రజాస్వామ్యాన్ని నిజంగా బలపర్చాలంటే ఏకగ్రీవాల పేరుతో జరుగుతున్న రాజకీయ వ్యాపారాన్ని నిలువరించడం అత్యావశ్యం. గ్రామ ప్రజలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలి. యువత గ్రామాభివృద్ధి కోసం ముందుకు రావాలి. పారదర్శకతను పెంచే విధానాలు పంచాయతీల్లో అమలు చేయాలి. నిధుల వినియోగంపై గ్రామసభకు పూర్తి హక్కు ఇవ్వాలి. ప్రతి రూపాయి ఖర్చుపై ప్రజల ముందే స్పష్టమైన వివరాలు ఉంచాలి. సత్యమైన ప్రజాస్వామ్యం ఎన్నికలతోనే బతుకుతుంది. పోటీ ఉంటేనే నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే. ప్రజల అవసరాలు, సమస్యలు, గ్రామ అభివృద్ధి ఇవన్నీ ఒక నాయకుడిని ప్రజలు జవాబుదారీగా ఉంచుతారని తెలిసినప్పుడు మాత్రమే బాధ్యతాయుతంగా పనిచేయమని బలవంతం చేస్తాయి. కానీ ఏకగ్రీవం అయితే బాధ్యత అనే పదం అక్కడే చనిపోతుంది. నాయకుడు పనులు చేయకపోయినా నిలదీయడానికి ఒక వేదిక కూడా మిగలదు.

ప్రజల మాట వినాల్సిన అవసరమే ఉండదు.ఇది అభివృద్ధికి అడ్డం, గ్రామప్రగతికి ప్రమాదం. గ్రామ స్వరాజ్యం అంటే ప్రజలు నిర్ణయాలు తీసుకునే స్వయం పాలన. కానీ ఏకగ్రీవాల అనర్ధం వల్ల అది నాయకుల స్వలాభ పాలనగా మారిపోతోంది. నిజమైన అభివృద్ధి జరగాలంటే ప్రజాస్వామ్యం బలపడాలి. గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగే వాతావరణం ఉండాలి. ప్రజలు అనుమతించిందే జరగాలి. గ్రామంఅంటే నాయకుడు కాదు, గ్రామం అంటే ప్రజల సమష్టి సముదాయం. గ్రామ ప్రజాస్వామ్యం పునర్నిర్మాణం కావాలి అంటే పారదర్శకత, నిష్పక్షపాతం, ప్రజల భాగస్వామ్యం ప్రధానమైన అంశాలు కావాలి. నాయకులు సేవా భావంతో ముందుకు రావాలి. గ్రామసభలు సజీవంగా ఉండాలి. మానవ విలువలు, గ్రామ బంధం, ప్రజల శ్రేయస్సు- ఇవి మాత్రమే పాలనకు ప్రమాణాలుగా ఉండాలి. ధనబలం, అహంకారం, వ్యక్తిగత ప్రతిష్టల కోసం గ్రామాల భవిష్యత్తును కోల్పోయే రోజులు పోవాలి. పల్లెల బాగోగులే పల్లె ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాణం. అన్ని పల్లెల్లో ప్రజాస్వామ్య వసంతాలు పుష్పిస్తేనే తెలంగాణ అభివృద్ధి, ఆర్థిక, రాజకీయ, స్వయం పాలనతో సంపూర్ణమవుతుంది అనేది నగ్న సత్యం.

– మన్నారం నాగరాజు, 9550844433

సంక్లిష్టతలను దాటితేనే సంకల్ప సిద్ధి

తెలంగాణ రాష్ట్రరాజకీయాలలో 2023 ఎన్నికలు ఒక మలుపు, మార్పు, మానసిక వాతావరణంలోని ఓ అల్లకల్లోల క్షణం. పది సంవత్సరాలపాటు సాగిన బిఆర్‌ఎస్ పాలన తరువాత ప్రజలు కోరుకున్న కొత్త తెలంగాణ, పారదర్శక పాలన, సంక్షేమం -సంస్కరణల కలయిక అనే ఆత్రుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చింది. ఆరు హామీల ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల్లో ఆశాభావాన్ని పెంచిన ఈ ప్రభుత్వం మొదటి రోజునుండే నిర్ణయాల వేగాన్ని, పరిపాలనా తీరు మారుస్తామనేదాన్ని ప్రదర్శించింది. అయితే శాసనసభలో గెలుపు ఒకటి, పరిపాలనా గడపలో అడుగుపెట్టిన తరువాత ఎదురయ్యే ఆర్థిక వాస్తవాలు, వ్యవస్థల సంక్లిష్టత, విభాగాల అంతర్గత గందరగోళం, అధికారులు- మంత్రుల మధ్య సమన్వయ లోపం, పెద్ద ఎత్తున పెరిగిన అప్పు భారాలు-వివిధ దిశల్లో ప్రభుత్వాన్ని పరీక్షించిన రెండు సంవత్సరాలు ఇవి. సంకల్పం స్పష్టంగా ఉన్నా, అమలులో ఎదురైన సంక్లిష్టత పాలనకు ప్రత్యేక స్వరూపాన్ని ఇచ్చిన కాలమిది. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందించడం రాజకీయంగా పెద్దగా ప్రశంసించబడింది.

రోజుకు సగటున 25- 28 లక్షల మహిళలు ఈ సేవను వినియోగిస్తున్నారని రవాణా శాఖ వివరాలు చెబుతున్నప్పటికీ, టిఎస్ ఆర్‌టిసిపై నెలకు రూ. 250- నుంచి రూ. 280 కోట్లు వరకు అదనపు భారం పడుతోంది. అప్పటికే రూ. 7,000 కోట్లకు పైగా అప్పుల్లో ఉన్న సంస్థకు ఈ పథకం ఆర్థిక రీతిలో తీవ్రమైన ఒత్తిడిని కలిగించింది. సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ పథకం ప్రతిబింబించినా, దీర్ఘకాలంలో దీనిని నిలబెట్టే మార్గం, చెల్లింపుల సమయపాలన రాష్ట్ర ఖజానాకు కఠిన పరీక్ష. ఇటువంటి సంక్షేమం వినిపించే శబ్దం ప్రజాపక్ష పాలనను సూచించినప్పటికీ, ప్రభుత్వ ఆర్థిక ఆరోగ్యం మాత్రం రోజుకు సగం కోట్ల రూపాయల బరువును మోయాల్సి వచ్చింది. ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిన నిర్ణయం మరింత ఆదరణ పొందినా, దీనివల్ల రాష్ట్ర ఖర్చులు సంవత్సరానికి అదనంగా రూ. 1,500- 2,000 కోట్లకు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు గమనిస్తున్నారు.

జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది 30% -40% వరకు ఖాళీలతో పనిచేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఆసుపత్రులే వైద్యంలో ప్రధాన ఆశ్రయం కావడం ప్రభుత్వ బిల్లులను పెంచుతోంది. ప్రజల ప్రయోజనానికి తీసుకున్న నిర్ణయాలు తక్షణ ఉపశమనం ఇస్తున్నప్పటికీ, ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగం ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు మొత్తం రూ. 32,000 కోట్లకు చేరాయి. మాఫీని దశలవారీగా చేసే ప్రయత్నాలు ప్రారంభమైనా పూర్తి అమలు కాలేకపోయాయి. ధాన్యం కొనుగోళ్లలో చెల్లింపుల జాప్యం, ఎండలతో పాడైపోయిన పంటలకు పరిహారం ఆలస్యం, మార్కెట్ ధరల్లో మార్పులు రైతుల నిరాశను పెంచాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలపై ప్రభుత్వం చేసిన విమర్శలు సాంకేతిక పరిశీలనకు దారితీశాయి. పంపింగ్ స్టేషన్లు తరచూ నిలిచిపోవడం, వ్యయ అధికరణలపై వివాదాలు సాగునీటిపరంగా రైతులకు ఇబ్బందులు కలిగించాయి.

నీటిపారుదలే తెలంగాణ రైతు ఆత్మ విశ్వాసానికి పునాది అయిన సందర్భంలో ఈ అంశాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు మోపాయి. విద్యా రంగంలో ప్రభుత్వానికి ఎదురైన సంక్షోభం మరింత లోతుగానే ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 800 కోట్లకు పైగా పెరగడంతో ప్రైవేట్ కళాశాలలు నిరసన వ్యక్తం చేస్తూ మూడు రోజుల బంద్‌కు దిగడం విద్యార్థుల్లో అనిశ్చితిని సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యం, సిబ్బంది కొరత, మధ్యాహ్న భోజనం, పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో నెమ్మదిగా సాగినా ప్రగతిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ రెండు సంవత్సరాల్లో అత్యంత క్లిష్ట దృశ్యం రాష్ట్ర ఆర్థిక స్థితి. రాష్ట్ర అప్పు మొత్తం రూ. 3.8- రూ. 4 లక్షల కోట్ల మధ్య తిరుగుతూ ఉండగా ఏటా వడ్డీ చెల్లింపులకు మాత్రమే రూ. 25,000 కోట్లకు పైగా ఖర్చవుతోంది. రెవెన్యూ వృద్ధి రేటు 7-9% మధ్య ఉంటే ప్రభుత్వ ఖర్చులు 15% కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి.

పూర్వప్రభుత్వంలో ప్రారంభమైన భారీప్రాజెక్టుల నిర్వహణ వ్యయం, విద్యుత్ సంస్థల అప్పులు, పెన్షన్ భారం, కేంద్ర నిధులలో వచ్చిన తగ్గుదల-కలగలిపి-రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా, అసమతులంగా మార్చాయి. ఆదాయం పెంచే కొత్త మార్గాల కోసం ప్రభుత్వం మద్యపాన ఆదాయంపై దృష్టి పెట్టినప్పటికీ, సామాజిక దృష్టిలో ఇది పెద్ద విమర్శలకే దారి తీసింది. మరో వైపు ప్రభుత్వం-, అధికార యంత్రాంగం మధ్య సహకారం కొన్నిసార్లు సరిగా పనిచేయలేదు. ముఖ్య శాఖల్లో అధికారులు తరచు బదిలీలు, మంత్రుల ఆదేశాలు అమలులో ఆలస్యం, ఫైళ్ల నిల్వ, ప్రధాన కార్యాలయం- శాఖల మధ్య కమ్యూనికేషన్ లోపాలు పాలన నెమ్మదించే ప్రధాన కారణాలు అయ్యాయి. కొందరు మంత్రులు ప్రజా వేదికలపై అధికారులు తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం, కొందరు అధికారుల నిర్ణయాలు రాజకీయ వివాదాలకు దారితీయడం పాలనా లోపాలను బహిర్గతం చేశాయి. సంక్షేమం, -అభివృద్ధి-, ఆర్థిక నియంత్రణ అనే మూడు అక్షాంశాలలో సమతుల్యత సాధించడంలో ప్రభుత్వం ఇంకా కృషి చేయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు రాజకీయ మార్పు కోసం ఇచ్చిన ఓటు ఇప్పుడు ఫలితాల రూపంలో కనబడాలని ఆశిస్తున్నారు. మూడవ సంవత్సరంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే పాలన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

– రామకిష్టయ్య సంగనభట్ల, 9440595494

సంచారజాతుల సంక్షేమం గాలిలో దీపం

దేశంలో ఆకాశాన్ని తాకే ఎత్తైన విగ్రహాలు నెలకొల్పడానికి అడవులను ఛిద్రం చేసి, పర్యావరణాన్ని బ్రష్టు పట్టించి వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, ఈ దేశ మూలవాసులైన వారి సంక్షేమం పూర్తిగా తుంగలో తొక్కింది. భారతదేశంలో దేశీయ భాషలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. సరైన నోటిఫైడ్ డీనోటిఫైడ్ కమ్యూనిటీల భాషలపై పరిశోధన ఇంకా నిర్వహించబడలేదు. అనేక దేశాల్లో రక్షణ కోసం అనేక నమూనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వర్గాలకు చెందిన భాషలు. భారతదేశం భాషాపరంగా ప్రసిద్ధి చెందింది సాంస్కృతిక వైవిధ్యం. అయితే అధికారిక గణాంకాలు లేవు. ఇప్పటివరకు ఎన్టీ/ఎస్‌ఎన్టీ/డిఎన్టీ కమ్యూనిటీల భాష మాట్లాడేవారికి సంబంధించినది. కొన్ని అంచనాల ప్రకారం ఎన్టీ/ ఎస్‌ఎన్టీకి చెందిన 198 సంఘాలు ఉన్నాయి. డిఎన్టీ కమ్యూనిటీలు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర వాటిపై విస్తరించాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 59 సెక్షన్లు ఉన్నాయి, వారి స్వంత మాండలికాలతో ఎన్టీ/ఎస్‌ఎన్టీ/డిఎన్టీ సంఘాలు. ప్రతి సంఘం ఉంది విస్తారమైన జ్ఞానం, వారి ఔషధ అభ్యాసం, పర్యావరణ జ్ఞానం, వాతావరణ నమూనాలు, ఆధ్యాత్మిక వైఖరులు, కళాత్మక మరియు పౌరాణిక కథలు. వీరి కళలు ఇంతకుముందు జంగం కథలుగా ఈనాడు, బుర్రకథగా పిలువబడుతుంది. ఒకనాడు మత ప్రబోధానికి, దేశభక్తికి ప్రతిబింబంగా నిలబడిన జంగం కథా కళారూపం రాను రాను యాచనకు, ఉదర పోషణకూ ఉపయోగపడి తిరిగి ఈనాడు దేశభక్తిని ప్రబోధిస్తూ, ప్రజా సమస్యలను చిత్రిస్తున్నది.

జంగం కథలు చెప్పే వారిని బుడిగె జంగాలని పిలుస్తారు. బుడికెను కంచుతో గానీ ఇత్తడితో గానీ తయారు చేస్తారు. గుమ్మెట కు ఒక వైపు బెత్తపు చత్రాన్ని బిగించి, తోలుతో మూస్తారు. రెండో పక్కన కూజామూతిలాగా, అనాచ్ఛాతీతంగా వుంటుంది. కథకునికి ఇరు ప్రక్కల వున్న వంతగాళ్ళు ఒక్కొక్కరూ తమ గుమ్మెటను చంకకు తగిలించుకుంటారు. కుడి చేతివ్రేళ్ళతో, చర్మము పైన వాయిస్తూ రెండో ప్రక్క మూస్తూ గుంభనగా శబ్దాన్ని తెప్పిస్తారు. కథ చెప్పె బుడిగె జంగం నిలువుటంగీ తొడిగి, తలపాగా చుట్టి, కాళ్ళకు గజ్జెలు, మువ్వలు కట్టుకుని, భుజం మీద తంబురాను ధరించి, చేతి వేలికి అందెలు తొడిగి, వాటిని తంబురాకు తట్టుతూ రెండో చేతితో తంబురా తీగను మీటుతూ కథను ప్రారంభిస్తారు. కథకునికి వంతలుగా వున్న వారు గుమ్మెటలు ధరించి కథకునికి పంతపాడుతూ, పాట వరుస ననుసరించి గుమ్మెటలను వాయిస్తూ మధ్య మధ్య హాస్యగాడు చలోక్తులతో హాస్యాన్ని కుమ్మరిస్తూ, ప్రేక్షకుల్ని నవ్విస్తూ వారి మెప్పు పొందుతాడు. ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ తెగలు, సంచార డీనోటిఫైడ్ తెగలు ప్రధానమైనవి వారు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి.

జటాపు, కొండ దొర, మూక దొర, మన్నె దొర, సవర, గదబ, చెంచు, కోయ, గొంది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఆదిమ గిరిజన సమూహాలు ఉన్నాయి. దాసరి, ఎరుకల, యానాది, సుగాలి, కొరవ, కొరచ, కైడై నక్కలా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని డినోటిఫైడ్ తెగలు. ఇంకా, వడ్డెర, పాముల, నిర్షికారి, బుడబుక్కల, మందుల, పూసల, గంగి, రెడ్దుల, బోయ, దొమ్మర, జోగి సంచార పాక్షిక సంచార తెగలలో కొన్ని. సాంప్రదాయ అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యంత సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనానికి గురికావడం ప్రధాన అర్హత కలిగిన షెడ్యూల్ కులాల్లో ఇంకా అణగారిన, ఏమాత్రం గుర్తింపు లేని జంగమ దేవర, డక్కలి, కిన్నెర జోగులు, బేడ బుడగ జంగాల కులాలు నేడు కనుమరుగై పోతున్నాయి. జంగమోళ్లు వీరిని జంగం దేవర అని కూడ అంటారు. వీరు శివ భక్తులు. నొసటన వీభూతి ధరించి చేతిలో పెద్ద గంట పట్టుకొని వాయిస్తూ సంక్రాంతి సందర్భంగా ఆ నెల అంతా తెల్లవారు జామున వీదుల్లో తిరుగుతు శివ కీర్తనలు చేస్తూ, ఆ రోజు తిథి, వార, నక్షత్ర పలాలను తెలిపి తెల్లవారాక ప్రతి ఇంటికి వచ్చి సంభావన తీసుకునే వారు.

అప్పటికే వీరు అంతిమ దిశలో వుండే వారు. వీరు అంతరించి చాల కాలమే అయింది. జంగం వారి జనాభా అతి తక్కువ. ముఖ్యంగా వీరు శివ భక్తులు. వీర భద్రుని ఆలయాల్లో పూజారులు వీరే వుంటారు. గతంలో వీరు కొన్ని పల్లెలను తమలో తమకు కేటాయించుకొని ఆ పల్లెల్లో కార్తీక మాస నెలంతా తెల్లవారు జామున తిరిగుతూ గంట వాయిస్తూ, శివనామ స్తుతి చేస్తూ తిథి, వార, నక్షత్రాలను చెప్పి, తెల్లవారి ప్రతి ఇంటి ఆసామి వద్ద సంబావన పొందుతారు. ఇలా తిరిగే వారిని జంగం దేవర అని అంటారు. వీరు శుభాశుభాలు చెప్పుతారు. వీరికి సమాజంలో బ్రాహ్మణుల తరువాత గౌరవ స్థానం వీరిదే. వీరి వేష ధారణ కూడా గౌరవప్రదంగా వుంటుంది. కాషాయ వస్త్రాలు ధరించి, తలపాగా కట్టి, భుజాన కావడి లేదా జోలే, ఒక చేతిలో గంట, రెండో చేతిలో శంఖం ఉంటుంది.

శివ స్తుతి చేస్తూ గంట వాయిస్తూ, మధ్య మధ్యలో శంఖాన్ని పూర్తిస్తారు. వీరిని పల్లె ప్రజలు శుభప్రదంగా భావించేవారు. వీరు కుల వృత్తి ఏనాడో మంటగలిసింది. ఎక్కడో కొందరు మిగిలిన వారు తమ పూర్వీకులు నేర్పిన విద్య భిక్షాటనకు ఉపయోగించుకుని జీవనం సాగిస్తున్నారు. షెడ్యూల్ కులాల జాబితాలో 9వ కులం బేడ బుడగ జంగం. బుడిగ, బేడ ఇలా రెండు రకాలుగా పిలువబడతారు. వీరు బుర్ర కథలు చెబుతారు. పగటివేషాలు, భిక్షాటన ఇవన్నీ వీరి కుల వృత్తులు. వీరికి సొంత భాష ఉంది. పెరుగుతున్న సాంకేతికతో పోటీపడలేక తమ తెగలు తరుగుతున్నది అని వాపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం పౌర సమాజం తమ కళను పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వ్యవసాయ కూలీలు కార్మికులు, తాపీ మేస్త్రిగా రూపాంతరం చెందారు. ఉన్న కొద్ది మంది కడుపు నింపుకోడానికి చిన్న చిన్న కమతాలలో పోడు సేద్యం చేసుకొని జీవిస్తున్నారు.

– డా. ముచ్చుకోట సురేష్ బాబు

-9989988912

పుడమి నొప్పులు పట్టించుకోలేమా?

ఇది శీతాకాలమేనా? ఒకప్పుడు ఎలా ఉండేది. హైదరాబాద్లో ఈ సమయమంతా గజగజ వణకడమేకదూ? ఇప్పుడు ఆ చలి పులి భయమే లేదు. మూడు, నాలుగు నెలల క్రితం చూడండి. వద్దంటే వర్షాలు.. అచ్చం మేఘాలయలోలాగా. చిరపుంజి, మౌసిన్రామ్లోలాగా నిత్యం వానే. చిత్తడి చిత్తడే. ఇక ఎండాకాలంలో భరించలేనంత వేడి. అదీ ఒకటి, రెండు నెలలు ముందుగానే. ఏతావతా.. రుతువులు క్రమం తప్పుతున్నాయి. భాగ్యనగరమే కాదు.. ప్రపంచంలో ప్రతిమూలా ఇలాంటి అసాధారణ వాతావరణమే. గత వారం.. మంచు తుఫానుతో అమెరికాలోని పలు నగరాలు గడ్డకట్టుకుపోయాయి. మొత్తంగా చూస్తే.. ఆకస్మికంగా పెరిగే ఉష్ణోగ్రతలు, నిండా ముంచేసే వరదలు, ఆగని కార్చిచ్చులతో జనజీవనమే అతలాకుతలమైపోతోంది. ఒకప్పుడు అరుదుగా కనిపించే విపత్తులు, వాతావరణంలో అనూహ్య మార్పులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇదంతా మామూలే అన్న ధోరణికి ఆ పరిస్థితులు చేరుతున్నాయి. భూగోళానికి ఏదో జరుగుతోందనే భయం కలుగుతోంది. అయితే, వాతావరణంలో కనిపించే ఈ విపరీతమైన మార్పులకు కారణం మనమే. శిలాజ ఇంధనాలను ఎడాపెడా వాడేయడం ద్వారా గత శతాబ్దకాలంలో కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్ వంటి గ్రీన్హౌజ్ వాయువులు భూగోళాన్ని పూర్తిగా కమ్మేశాయి. ఫలితంగా భూతాపం పెరిగింది. భూఉష్ణోగ్రతల పెరుగుదల ప్రకృతి విపత్తులకు కారణమవుతోంది. భూతాపం కట్టడికి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోకుంటే వినాశనం తప్పదు. వాతావరణంలో అసాధారణ మార్పులు, పర్యవసానాలను తరచూ చవిచూస్తున్నాం.

పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల్లాగానే హరికేన్లు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సెప్టెంబర్ 2022లో ఫ్లారిడా, ప్యుర్టోరికోలను గాలివానలు చుట్టుముట్టాయి. హరికేన్ ఫ్యూనా చేసిన నష్టం అంతా ఇంతా కాదు. విద్యుత్తు, మంచినీరు లేకపోవడంతో ప్యుర్టోరికో ప్రజలు విలవిల్లాడిపోయారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అధిక వర్షాలకు దారితీస్తాయి. సాధారణంగా వేడి వాతావరణం వల్ల నీరు ఆవిరై గాలిలో తేమగా మారి, తుంపరులుగా మారి వర్షాన్ని కురిపిస్తుంది. భూవాతావరణంలో వేడి పెరిగితే, మరింత నీరు ఆవిరిగా మారి, మరిన్ని మేఘాలు ఏర్పడి, భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిసార్లు పరిమిత ప్రాంతానికి పరిమిత సమయం మాత్రమే వాన దబదబా దంచేస్తుంది. ఇటీవల హైదరాబాద్లో మనం దీనినే తరచూ చూస్తున్నాం. ఈ క్లౌడ్బరస్ట్ వలనే గతంలో స్పెయిన్, ఆస్ట్రేలియాలను వరదలు ముంచెత్తాయి. బ్రిస్బేన్ వార్షిక సగటు వర్షపాతంలో 80% కేవలం ఆరు రోజుల్లోనే నమోదు అయిందంటే ఆ మార్పుల ప్రభావం ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక.. ఉత్తరార్థగోళంలో కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చుల ముప్పు కూడా వేగంగా పెరుగుతోంది. అమెరికా పశ్చిమ ప్రాంత జనజీవనంలో వైల్ ఫైర్స్ భాగమే అయినా.. దాని వ్యాప్తి, ప్రచండత ఇటీవల బాగా పెరుగుతోంది. ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్, క్రొయేషియా, ఆల్బేనియాలను ఇలాంటి కార్చిచ్చులే ఇటీవల చుట్టుముట్టాయి. 1970 నాటితో పోల్చుకుంటే.. 40 చదరపు కిలోమీటర్ల మేర కమ్మేసే కార్చిచ్చులు పశ్చిమ అమెరికాలో ఏడు రెట్లు పెరిగాయని పర్యావరణ శాస్త్రవేత్తల అంచనా. రెండేళ్ల నాడు కెనడాలో వేడిగాలులు అనూహ్య వేగంతో దావానలాన్ని రగిలించగా, అది కార్చిచ్చుగా మారి సమీప ప్రాంతాలన్నీ తగలబడ్డాయి. 2020లో కాలిఫోర్నియాలో 40 లక్షల ఎకరాల మేర భస్మీపటలం కాగా, వారంనాడు మళ్లీ అలాంటిదే భారీ ఆస్తి నష్టానికి కారణమైంది. మరోవైపు,

వేడి పెరిగే కొద్దీ వాతావరణం పొడిగా మారిపోతుంది. భూతాపం పెరిగితే.. నీటివనరులు, భూమిపొరల్లోని తేమ త్వరితంగా ఆవిరి అవుతుంది. దాని వల్ల భూమి వేడెక్కే సమ యం తగ్గిపోయి.. భూమిపై గాలి వేడెక్కుతుంది. తద్వారా మరింత వేడి పెరుగుతుంది. వేడివాయువులు తీవ్రంగా, సుదీర్ఘకాలం ఉండే కొద్దీ కరువు ఛాయలు పెరుగుతాయి. అమెరికాలో లేదా ఇతర దేశాల్లో దుర్భిక్షం తీవ్రంగా, ఎక్కువ కాలం కొనసాగడానికి కారణం ఇదే. గత 1200 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పశ్చిమ అమెరికాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతమంతా అత్యంత, అసాధారణ కరువును చవిచూస్తోంది. ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులు వాతావరణంలో అసాధారణ మార్పులకు దారితీస్తున్నాయి.

భూమి వేడెక్కడం వల్ల సముద్రజలాలు కూడా వేడెక్కి మంచుదిబ్బలు కరగడానికి కారణమవుతోంది. శతాబ్దాలుగా గడ్డ కడుతూ వచ్చిన గ్లేసియర్లు వేగంగా కరిగిపోతుంటాయి. అలాస్కాలోని కొలంబియా గ్లేసియర్ ఇందుకు చక్కటి ఉదాహరణ. ప్రస్తుతం ఆ గ్లేసియర్ దాదాపు మాయమైనట్టే. గ్లేసియర్లు సూర్యకాంతిని పరావర్తనం చెందేలా చేస్తాయి. అలా భూమి వేడెక్కకుండా కాపాడుతుంటాయి. భూమిపై ఉన్న స్వచ్ఛమైన నీటిలో అధిక శాతం గ్రీన్లాండ్, అంటార్కిటికా మంచు ఫలకాల్లోనే ఉంది. అంటార్కిటికా కన్నా గ్రీన్లాండ్ గ్లేసియర్లు శరవేగంగా కరిగిపోతున్నాయి. ఇక్కడి మంచు ఫలకాలు వరుసగా 26వ ఏడు కూడా భారీగా కరిగిపోయాయి. గతంలో లెక్కించిన దాని కన్నా వందరెట్లు వేగంగా మంచుఫలకలు మాయమవుతున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. ఇలా హిమానీనదాలు కరగడం వల్ల సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. ఇక.. గ్రీన్లాండ్లోని గ్లేసియర్లన్నీ కరిగిపోతే.. 6 మీటర్ల మేర సముద్రమట్టం పెరిగేంత నీరు వస్తుందని అంచనా. అంటార్కిటిక్ ఐస్ షీట్ మొత్తం కరిగిపోతే 17 మీటర్ల మేర మట్టాలు పెరిగే ప్రమాదం ఉంది.

గత 150 ఏళ్లలో గ్లేసియర్లు కరిగిపోవడంతో ఇప్పటికే 20 సెంటీమీటర్ల మేర సముద్ర నీటి మట్టా లు పెరిగాయి. అమెరికాతీరాన అట్లాంటిక్, గల్ఫ్ ఆఫ్ మెక్సి కో సముద్ర నీటిమట్టాల పెరుగుదల ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి. రికార్డు స్థాయి వర్షాలు దీనికి తోడు కావడంతో భీకర వరదలను అమెరికా తీర ప్రాంతాలు చవిచూశాయి. 1993 నుంచి లెక్కిస్తే.. సముద్ర నీటిమట్టాలు రెం డింతలు పెరిగాయి. మరోవైపు, వేడి వాతావరణం వల్ల ఆవిరయ్యే నీరు.. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు భారీగా మంచు కురవడానికి కారణమవుతోంది. 2021 నాటి మం చు తుఫాను టెక్సస్లో 295 బిలియన్ల డాలర్ల నష్టాన్ని కలగజేసింది. మానవ ప్రమేయం వల్లే పర్యావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. అమెరికాలో కార్చిచ్చులు, భార త్, పాకిస్థాన్లలో అధిక ఉష్ణోగ్రతలు, ఆసియాలో తుఫాన్లు, బ్రిటన్లో రికార్డు స్థాయి వర్షాలను అధ్యయనం చేసిన నిపుణులు, శాస్త్రవేత్తలు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ప్రకృతి నుంచి తీసుకోవడమే కానీ.. తిరిగి ఇచ్చే అలవాటు తగ్గిపోవటం వల్లే ఈ వైపరీత్యాలన్నీ సంభవిస్తున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెడ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా 400 తులనాత్మక సమీక్షలు జరిగాయి. పర్యావరణ మార్పులకు మానవుల ప్రమేయమే కారణమని 80% సమీక్షలు కుండబద్దలు కొట్టాయి.

– ఐనం ప్రసాద్

98489 28787

ఇదేమిటి ‘సర్’.. తీరని బేజార్

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఈమేరకు దాఖలైన పిటిషన్లపై రెండు రోజులపాటు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించి తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది. బీహార్ రాష్ట్రంలో ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇప్పుడు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సవరణ నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ పేరుతో చట్టసభల విధులను ఎన్నికల కమిషన్ తనకు తాను చేపట్టినట్టుగా ఈ కసరత్తు సాగుతోందని, రాజ్యాంగ పరిమితులను దాటి నిర్హేతుకమైన నిబంధనలతో పౌరులపై తీవ్ర భారాన్ని ఎన్నికల కమిషన్ మోపుతోందన్న అభ్యంతరాలు తలెత్తుతున్నాయి. ఓటర్ల అర్హతను నిర్ణయించడానికి 11 పత్రాలు సమర్పించాలని ఎన్నికల కమిషన్ నిబంధన విధించింది. ఏ చట్ట ప్రకారం ఆ నిబంధన విధించారని పిటిషనర్లు నిలదీస్తున్నారు. అటువంటి చట్టాన్ని పార్లమెంట్, లేదా అసెంబ్లీలు మాత్రమే చేయాలని, వాటికి అతీతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ఈ ప్రక్రియ ఫోటో ధ్రువీకరణ కోసం కాకుండా పౌరసత్వ తనిఖీ కోసం చేపట్టినట్టు కనిపిస్తోందని ఆక్షేపిస్తున్నారు. బూత్‌స్థాయి అధికారులుగా ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. వారి ద్వారానే పౌరసత్వాన్ని నిర్ధారించడం, ఆ తరువాత ఓటరుగా చేర్చాలో లేదో నిర్ణయించడం జరుగుతోంది.

ఈ విధంగా పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు, లేదా రాజ్యాంగపరమైన విధి బూత్‌లెవెల్ ఆఫీసర్లుకు కట్టబెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా సాగుతోంది. మరోవైపు గత ఓటర్ల జాబితాలతో ఇప్పటి నమోదు ఫారాలను పోల్చిచూస్తున్నారు. అప్పటి జాబితాల్లో ఓటరు ఏవైనా పొరపాట్లు చేస్తే ఆ కారణాలతో అతని సంతానానికి ఇప్పుడు ఓటు తిరస్కరించడం ఏమిటని పిటిషనర్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పౌరసత్వానికి ఆధార్‌కార్డు మాత్రమే ప్రామాణికం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేయడం కూడా సమస్యగా మారింది. చొరబాటుదారులు కానీ, ఇక్కడ పనిచేస్తున్న విదేశీయులు కానీ రేషన్ కోసం ఆధార్ కార్డు సంపాదిస్తే వారు మన పౌరులేనని ధ్రువీకరించాలా అని సుప్రీం కోర్టు ప్రశ్నించడం సమంజమే.కానీ చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికంగా ఓటర్లు భావిస్తుంటారు. వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే మరే అధికారిక పత్రాలు వారి వద్ద ఉండవు. చాలామంది నిరక్షరాస్యులు కావడంతో ఈ నిబంధనలు వారికి తెలియడం లేదు. ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాల తయారీకి ప్రతిబంధకాలవుతున్నాయి. ఓటరు నమోదు ఫారం 6 లో పేర్కొన్న వివరాలు సరైనవో, కావో నిర్ధారించుకునే అధికారం ఇసికి ఉందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కానీ ఆ నిర్ధారణే సరిగ్గా జరగడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.

బీహార్‌లో ఏ విధంగా అనేక లోపాలతో ఈ ప్రక్రియ సాగిందో ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లోనే అదే తీరులో సాగుతుండటం గమనార్హం. బ్లాక్ లెవెల్ ఆఫీసర్లు (బిఎల్‌ఒ) అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు నింపిన తరువాత ఆ వివరాలను 2002 2005 ఓటర్ల జాబితాలతో పోల్చిచూడడంలోనే చిక్కులు ఏర్పడుతున్నాయి. బీహార్ డేటా అక్కడి ఎన్నికల ఫలితాలను నాటకీయంగా మార్చలేకపోయినప్పటికీ ఓటర్ల లింగ నిష్పత్తిలో గణనీయమైన తగ్గుదల చూపింది. నిజమైన ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాల కోసం పెనుగులాడుతూనే ఉన్నారు. ఓటర్ల వివరాల నమోదుకు డాక్యుమెంటేషన్ ఈ 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వచ్చే నెలలోగా పూర్తి చేయవలసి ఉంది. బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలన్న నిబంధన కాగితాలపైనే కనిపిస్తోంది. ఓటర్లు స్థానికంగా నివాసం ఉంటున్నట్టు ఇప్పుడు నిరూపించుకోవలసి వస్తోంది. గతంలో ఓటు వేసినా, అప్పటి ఓటర్ల జాబితాలో తన పేరు ఉన్నా సరే ఇప్పుడు పాత రికార్డులతో పనిలేకుండా తాను స్థానికుడిననే చట్టబద్ధతగా నిర్ధారించుకోడానికి రుజువు చూపించక తప్పడం లేదు. ఎన్నికల కమిషన్ చేయవలసిన ఈ బాధ్యతలన్నీ పౌరులపైనే నెట్టేయడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ పరిస్థితి వల్ల చివరకు ఓటరు ప్రధాన హక్కులను తొలగించడమే అవుతుంది. ముఖ్యంగా వివాహితులైన మహిళలకు, వలసదారులకు ఇది అగ్నిపరీక్షే. స్థానిక నివాసిని గుర్తించడంలో కఠినంగా నిబంధనలు అమలు చేయాల్సిందేనని కోర్టు కూడా స్పష్టం చేయడంతో గుర్తింపు సమస్య జటిలంగా మారింది. దీన్ని గమనించి నిజమైన ఓటర్లను రక్షించే బాధ్యత పార్టీల ప్రతినిధులపైన, అధికారిక వాలంటీర్లపైన ఉందని కోర్టు సూచించింది.

అసలు ఎన్యూమరేషన్ విధానం రాజ్యాంగ సమ్మతి పొందిందా లేదా? సవరించిన జాబితాల్లో తప్పులు సవరించారా లేక అలాగే కొనసాగుతున్నాయా అన్నది కోర్టు వరకు రావడం లేదు. అలాగే ఎన్నికల కమిషన్ కూడా పట్టించుకోవడం లేదు. ఎన్నికల కమిషన్ సహనంతో ఇంటింటికీ వెళ్లి పరిశీలించే పకడ్బందీ విధానం అనుసరిస్తే కానీ పొరపాట్లు తొలగిపోవు. అలా చేస్తేనే సార్వత్రిక వయోజన ఓటు హక్కును కాపాడగలుగుతారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నకిలీ ఓటర్లను కూడా గుర్తించవచ్చు. ఈ విధంగా ఓటర్ల ప్రాథమిక హక్కును కాపాడడానికి బదులు ఓటర్ల జాబితాలను శుద్ధి చేయడమే ప్రధాన బాధ్యతగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోంది. ‘సర్’ ప్రక్రియ విస్తరిస్తున్న కొద్దీ విధానపరమైన పర్యవేక్షణకు మించి కోర్టు ఈ ప్రక్రియ రాజ్యాంగ బద్ధత పునాదులను పరిశీలించడం చాలా ముఖ్యం. అదే విధంగా గత కొన్నేళ్లుగా తాము ఓటర్ల జాబితాల్లోనే ఉన్నామని ఓటర్లే స్వయంగా నిరూపించుకోవాలన్న నిబంధన అనుసరించకుండా ఎన్నికల కమిషనే ఆ బాధ్యతను మళ్లీ తీసుకునేలా సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. 

లేబర్ కోడ్స్ కాదు.. కాపిటల్ కోడ్స్

సంఘం ఏర్పాటు, గతంలో సంఘం రిజి స్టర్ చేసుకోవడానికి ఏడుగురు సభ్యులుంటే చాలు. దానిని ఇప్పుడు ఆ కంపెనీ కార్మికు ల సంఖ్యలో పది శాతం తప్పనిసరి చేశారు. దీని ప్రకారం, ఎవరైనా కొత్త సంఘం నిర్మాణం చేయాలంటే అసాధ్యం. ఎందుకం టే ఇన్ని నిబంధనల మధ్యలో కార్మికులు కొత్త సంఘం వైపు రావడం అసాధ్యం. కార్మికుల సంఘానికి ఎన్నికలు జరిపి ఒక సంఘానికి గుర్తింపు ఇస్తారు. ఆ సంఘం యాజమాన్యంతో కార్మికుల, ఉద్యోగుల సమస్యలపై చర్చించి, కొన్ని డిమాండ్లను సాధించుకుంటారు. ఇది సర్వసాధారణ ప్రక్రియ. అయితే గుర్తింపు సంఘానికి జరిగే ఎన్నికల్లో పోలైన ఓట్లలో 51 శాతంకు పైగా ఓట్లు వస్తేనే, ఆ సంఘానికి గుర్తింపు ఉంటుంది. అంతకన్నా తక్కువ వస్తే గుర్తింపు ఉండదు. ఆ ఎన్నికల్లో పాల్గొన్న సంఘాలలో 50 శాతం ఓట్లు వచ్చినా ఆ సంఘానికి గుర్తింపు ఇవ్వరు. యాజమాన్యం ఇష్ట ప్రకారం ఎవరితోనైనా చర్చలు జరపవచ్చు.

ఇది పని హక్కుకు ఒక సూచిక. అయితే ఈ చట్టాలతో ఉద్యోగ నియామకాలు అనేవి ఫిక్స్‌డ్ టర్మ్, పర్మినెంట్ ఎంప్లాయిమెంట్‌లుగా విభజించారు. దీనికి ఎటువంటి ప్రాతిపదిక లేదు. రెండు విధానాలు ఉన్నప్పుడు ఎక్కువ ప్రయోజనాలు అందించే శాశ్వత ఉద్యోగాల కన్నా, ఎప్పుడుపడితే అప్పుడు తీసివేసే ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగాల నియామకానికి యజమానులు ఎక్కువ మొగ్గు చూపుతారు. అయితే ఇప్పటికే అటువంటి ప్రక్రియ విచ్చలవిడిగా కొనసాగుతున్నది. ఇది కేవలం కంపెనీలు, పరిశ్రమలలో మాత్రమే కాదు. ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఇది చాలా ఎక్కువగా అమలవుతున్నది. అందుకే ప్రభుత్వం నేరుగా నియమించే ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. దాని స్థానంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల సంఖ్య ఎక్కువైంది. ఈ చట్టాల ద్వారా అది మరింత న్యాయమైనదినా ప్రభుత్వం చెప్పదలచుకుంది. ఇది అమెరికా నుంచి సాఫ్ట్‌వేర్ ద్వారా దిగుమతి అయి, ఇప్పుడు లేబర్ కోడ్‌లతో చట్టబద్ధమైంది. ఉద్యోగ నియామకాలతో పాటు తొలగించే ప్రక్రియ కూడా సులభతరం చేశారు.  

గత వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. ఇది గత కార్మిక విధానాలకు పూర్తిగా భిన్నంగా ఉండడం మాత్రమే కాకుండా పూర్తిగా పారిశ్రామికవేత్తల, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుకూలంగా తయారు చేసినట్టు కనిపిస్తున్నది. ఇందులో నాలుగు విధానాలను ప్రత్యేకించి క్రోడీకరించారు. ఒకటి, పారిశ్రామిక సంబంధాలు, రెండవది వేతనాలు, మూడోది పని పరిస్థితులు, ఆరోగ్యం, నాలుగోది సామాజిక భద్రత.

వీటన్నింటిని విడివిడిగా చూడడం కన్నా మొత్తంగా కార్మికులు, వారి హక్కులు అనే విషయాన్ని పరిశీలించాలి. ఏ కార్మికునికైన ముఖ్యమైనది ఉద్యోగ నియామకం. ఉద్యోగ నియామకంలో గతంలో శాశ్వత పని స్థలాలలో శాశ్వత ఉద్యోగులను నియమించాలి. ఏదైనా తాత్కాలిక పనులుంటే అక్కడ కాంట్రాక్టు కార్మికులను గాని, క్యాజువల్ వర్కర్లను గాని నియమించాలి. ఇది ప్రాథమికమైన సూత్రం.

ఇది పని హక్కుకు ఒక సూచిక. అయితే ఈ చట్టాలతో ఉద్యోగ నియామకాలు అనేవి ఫిక్స్‌డ్ టర్మ్, పర్మినెంట్ ఎంప్లాయిమెంట్‌లుగా విభజించారు. దీనికి ఎటువంటి ప్రాతిపదిక లేదు. రెండు విధానాలు ఉన్నప్పుడు ఎక్కువ ప్రయోజనాలు అందించే శాశ్వత ఉద్యోగాల కన్నా, ఎప్పుడుపడితే అప్పుడు తీసివేసే ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగాల నియామకానికి యజమానులు ఎక్కువ మొగ్గు చూపుతారు. అయితే ఇప్పటికే అటువంటి ప్రక్రియ విచ్చలవిడిగా కొనసాగుతున్నది. ఇది కేవలం కంపెనీలు, పరిశ్రమలలో మాత్రమే కాదు. ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఇది చాలా ఎక్కువగా అమలవుతున్నది. అందుకే ప్రభుత్వం నేరుగా నియమించే ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. దాని స్థానంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల సంఖ్య ఎక్కువైంది. ఈ చట్టాల ద్వారా అది మరింత న్యాయమైనదినా ప్రభుత్వం చెప్పదలచుకుంది. ఇది అమెరికా నుంచి సాఫ్ట్‌వేర్ ద్వారా దిగుమతి అయి, ఇప్పుడు లేబర్ కోడ్‌లతో చట్టబద్ధమైంది.

ఉద్యోగ నియామకాలతో పాటు తొలగించే ప్రక్రియ కూడా సులభతరం చేశారు. గతంలో ఎవరినైనా ఒక ఉద్యోగిని, కార్మికుని తొలగించదలచుకుంటే ఒక క్రమపద్ధతి ఉండేది. ముందుగా కారణాలు తెలుపుతూ, ఒక మెమో ఇవ్వడం, దానికి వివరణ కోరడం, దానితో సంతృప్తి చెందకపోతే, ఇతర పద్ధతులన్నా పూర్తి చేసి తొలగించేవారు. ఒకవేళ కంపెనీ, ఇతర సంస్థల చర్యల మీద కోర్టుకుపోతే వారి ఉద్యోగం నిలిచి ఉండేది. కాని ఈ చట్టం ద్వారా అది పూర్తిగా కంపెనీ యజమానుల నిర్ణయమే. పైగా దానికి నైపుణ్యం లోపం అనే ఒక్క కారణాన్ని జత చేస్తే చాలు వాళ్లను తీసివేయవచ్చు. రెండోది, ఆర్థికపరమైన సమస్యల ఉన్నందువల్ల తమ కంపెనీని రీస్ట్రక్చర్ చేస్తున్నామనే పేరుతో కూడా ఉద్యోగులను తీసి వేయవచ్చు. ఉద్యోగాలు కూడా రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు అని నియామక పత్రాలు ఇచ్చి, ఎల్లప్పుడు అభద్రతా భావంలోకి నెట్టివేసే అధికారం కంపెనీలకు ఇచ్చారు.

ఇక జీతాలు కూడా ఒక నియమం లేదు. అందుకు ముందున్న కనీస వేతనాల సలహా మండళ్లను నామమాత్రం చేస్తున్నారు. అవి సలహాలు మాత్రమే ఇవ్వవచ్చునని, అంతిమ నిర్ణయం కంపెనీలకే ఇచ్చారు. అందువల్ల వేతనాల, నియామకం కేవలం కంపెనీల ఇష్టా రాజ్యంగా మారిపోతున్నది. ఇది కూడా ఇప్పటికే అమలులో ఉంది. ఎవరికి ఎంత జీతం ఇవ్వాలనే అంశం చట్టాలలో ఉన్నప్పటికీ అమలు విధానం మాత్రం కంపెనీలకే అప్పజెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం, నెలకు పద్దెనిమిది వేల జీతం కన్నా తక్కువ ఉన్నా, అంతే ఉన్నా వారు కార్మికులు, ఉద్యోగులు కాదు. వారు మేనేజిమెంట్‌లో భాగం. అందువల్ల వారికి ఎటువంటి కార్మిక, ఉద్యోగ సంఘంలో చేరే హక్కు ఉండదు. ఇక్కడ నుంచే కార్మిక సంఘాలను, ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేసే కుట్ర మొదలైంది.

అదే విధంగా కార్మికుల, ఉద్యోగుల పని గంటలను ఎనిమిది గంటల నుంచి 10, 12 గంటల దాకా పొడిగించుకునే అవకాశాన్ని కంపెనీలకు అప్పజెప్పారు. గత 150 సంవత్సరాల క్రితం చికాగోలో కార్మికులు రక్తతర్పణ చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని ఈ చట్టం ద్వారా లాగేసుకున్నారు. మళ్లీ ప్రజాస్వామ్యం పూర్వపు దశకు కార్మిక లోకాన్ని తీసుకు వెళుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం, సంఘం ఏర్పాటు, గతంలో సంఘం రిజిస్టర్ చేసుకోవడానికి ఏడుగురు సభ్యులుంటే చాలు. దానిని ఇప్పుడు ఆ కంపెనీ కార్మికుల సంఖ్యలో పది శాతం తప్పనిసరి చేశారు. దీని ప్రకారం, ఎవరైనా కొత్త సంఘం నిర్మాణం చేయాలంటే అసాధ్యం. ఎందుకంటే ఇన్ని నిబంధనల మధ్యలో కార్మికులు కొత్త సంఘం వైపు రావడం అసాధ్యం.

కార్మికుల సంఘానికి ఎన్నికలు జరిపి ఒక సంఘానికి గుర్తింపు ఇస్తారు. ఆ సంఘం యాజమాన్యంతో కార్మికుల, ఉద్యోగుల సమస్యలపై చర్చించి, కొన్ని డిమాండ్లను సాధించుకుంటారు. ఇది సర్వసాధారణ ప్రక్రియ. అయితే గుర్తింపు సంఘానికి జరిగే ఎన్నికల్లో పోలైన ఓట్లలో 51 శాతంకు పైగా ఓట్లు వస్తేనే, ఆ సంఘానికి గుర్తింపు ఉంటుంది. అంతకన్నా తక్కువ వస్తే గుర్తింపు ఉండదు. ఆ ఎన్నికల్లో పాల్గొన్న సంఘాలలో 50 శాతం ఓట్లు వచ్చినా ఆ సంఘానికి గుర్తింపు ఇవ్వరు. యాజమాన్యం ఇష్ట ప్రకారం ఎవరితోనైనా చర్చలు జరపవచ్చు. 20 శాతం ఓట్లు వచ్చిన యూనియన్‌తోనైనా యాజమాన్యం మాట్లాడవచ్చు. అంటే ప్రజాస్వామిక ప్రక్రియ అనేది ఒక ప్రహసనంలా మార్చాలనేది దీని ఉద్దేశం. ఇది పూర్తిగా కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే చర్య.

అంతేకాకుండా, గతంలో కార్మికులు తమ అపరిష్కృత సమస్యల పరిష్కారానికి సమ్మెకు పోవాలనుకుంటే కనీసం 60 రోజులు అంటే రెండు నెలల ముందు నోటీసు ఇవ్వాలి. గతంలో ఇది పదిహేను రోజులుగా ఉండేది. దానితోపాటు కనీసం 50 శాతం మందికిపైగా కార్మికుల ఆమోదం ఉండాలి. అంటే ఇక ఎంతమాత్రం కార్మికులు పోరాటాలు చేసే పరిస్థితి లేదు. ఇంకా కొన్ని విషయాలున్నాయి. కానీ ఇవే కీలకమైనవి. గత రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి భారత స్వాతంత్య్రం వరకు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు ఈ కోడ్‌లతో శూన్యమైపోయాయి.

అయితే ఈ దుర్మార్గ చర్యలకు పునాది 1990 తర్వాత నుంచే మొదలైంది. ఆర్థిక రంగంలో వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలవల్ల పెట్టుబడులను ఆకర్షించే పేరుతో రకరకాలుగా కార్మిక, ఉద్యోగుల హక్కులను నామమాత్రం చేశారు. దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈ దుర్మార్గాలన్నింటికీ చట్టబద్ధత కల్పించారు. ప్రజాస్వామ్యాన్ని, కార్మిక చైతన్యాన్ని పాతర వేసే ప్రక్రియకు మోడీ ప్రభుత్వం అంతిమ గీతం పాడింది.

దీనికి అంతటికీ కారణం, పెట్టుబడిదారుల, కంపెనీ యజమానుల దోపిడీకి రక్షణగా నిలవడమే ఆదాయాల పెంపు, ఆర్థిక పెరుగుదల పేరుతో యంత్రాలకు, యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా చేశారు. ఇది పెట్టుబడి, యంత్రాల కేంద్రంగా సాగుతున్న అభివృద్ధికి పెద్దపీట వేయడమే. మనిషి కేంద్రంగా మానవాభివృద్ధికి ఇక ఎంత మాత్రం స్థానం లేదన్న విషయానికి ఈ నాలుగు లేబర్ కోడ్‌లు ఒక నిలువెత్తు నిదర్శనం. 

మల్లేపల్లి లక్ష్మయ్య

చిన్నారుల అక్రమ రవాణా ఆగేదెలా?

సుప్రీం కోర్టు ఇటీవల బాలల ట్రాఫికింగ్ అంశంపై వ్యక్తం చేసిన ఆందోళన ఎంతో కీలకం. ప్రతి 8 నిమిషాలకో చిన్నారి తప్పిపో తున్నారు అని వార్తాపత్రికల శీర్షికలను ఉటంకిస్తూ న్యాయమూర్తు లు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ బెంచ్ కేంద్రాన్ని తప్పిపడింది. జిల్లాకు ఒక నోడల్ అధికారి నియామకం, వారి వివరాలను ‘మిషన్ వాత్సల్య’ పోర్టల్లో ప్రజలకు అందుబాటులో ఉంచడం, డిసెంబర్ 9లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయడం ఇవన్నీ కోర్టు ఆదేశాలే. కానీ ఇవి కేవలం మొదటి అడుగులు మాత్రమే.  

భారతదేశంలో చిన్నారుల అదృశ్యం కేసుల పెరుగుదల ఒక పెను సామాజిక సమస్యగా, మానవ హక్కుల ఉల్లంఘనగా పరిణమిస్తోంది. అందుబాటులో ఉన్న గణాంకాలు, ఇటీవలి న్యాయస్థానం వ్యాఖ్యలు ఈ సమస్య తీవ్రతను స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి. భారతదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నారు. ఈ గణాంకం కేవలం సంఖ్య మాత్రమే కాదు, ఒక దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద మానవీయ సంక్షోభం. జాతీయ నేర గణాంక బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం ఏటా సగటున 65 నుంచి 70 వేల మంది బాలలు మిస్సింగ్ కేసులుగా నమోదవుతున్నారు. వీరిలో 40- 50 శాతం మంది ఆచూకీ ఎప్పటికీ లభించడం లేదు. అంటే ప్రతి రోజూ సగటున 75 నుంచి 100 మంది పిల్లలు శాశ్వతంగా కుటుంబాల నుంచి తెగిపోతున్నారన్నమాట. అదృశ్యమవుతున్న వారిలో దాదాపు 70 శాతం బాలికలే. ఇది లైంగిక వేధింపులు, బలవంతం పెళ్లిలు, గృహ బానిసత్వం, వేశ్యా వృత్తి ముఠాలకు సరఫరా ఇలాంటి దారుణ గమ్యస్థానాలను సూచిస్తోంది. బీహార్‌లో గత ఐదేళ్లలో మిస్సింగ్ కేసులు 252 శాతం, పంజాబ్‌లో 142 శాతం పెరగడం ఈ సమస్య ఎంత తీవ్రతరమైందో చెబుతోంది. ఉతరప్రదేశ్ మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఈ బాలల ట్రాఫికింగ్ నెట్‌వర్క్ బాగా వ్యవస్థీకృతంగా పని చేస్తున్నాయని ఎన్‌జిఒలు, సుప్రీం కోర్టు వేదికల మీద ఆధారాలు సమర్పించాయి.

సుప్రీం కోర్టు ఇటీవల ఈ అంశంపై వ్యక్తం చేసిన ఆందోళన ఎంతో కీలకం. ప్రతి 8 నిమిషాలకో చిన్నారి తప్పిపోతున్నారు అని వార్తాపత్రికల శీర్షికలను ఉటంకిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ బెంచ్ కేంద్రాన్ని తప్పిపడింది. జిల్లాకు ఒక నోడల్ అధికారి నియామకం, వారి వివరాలను ‘మిషన్ వాత్సల్య’ పోర్టల్లో ప్రజలకు అందుబాటులో ఉంచడం, డిసెంబర్ 9లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయడం ఇవన్నీ కోర్టు ఆదేశాలే. కానీ ఇవి కేవలం మొదటి అడుగులు మాత్రమే. సమస్య లోతు చాలా ఎక్కువ. క్షేత్రస్థాయిలో ఎక్కువ మంది పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ ఫిర్యాదును కూడా స్వీకరించడానికి నిరాసక్తత, ముఖ్యంగా కౌమార బాలికల కేసుల్లో ప్రేమించి పారిపోయింది అని తేల్చేయడం, ఫిర్యాదు నమోదు చేసినా వెంటనే దర్యాప్తు మొదలుపెట్టకపోవడం -ఇవన్నీ బాలల ట్రాఫికింగ్ ముఠాలకు బంగారు అవకాశం కల్పిస్తున్నాయి. మొదటి 24- 48 గంటలు (గోల్డెన్ అవర్స్) కీలకమైనప్పటికీ, ఆ గడువులో చర్య జరిగేది మీడియా ఒత్తిడి ఉన్న కేసుల్లో మాత్రమే. తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. 2019 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు సగటున 7మంది, తెలంగాణలో 9 మంది బాలలు మిస్సింగ్ అవుతున్నారు. దేశవ్యాప్త జాబితాలో తెలంగాణ 7వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉండడం స్థానికంగా కూడా ఈ సమస్య తీవ్రమేనని తెలియజేస్తోంది.

ఈ సమస్యకు పరిష్కారంలో భాగంగా.. ప్రతి జిల్లాలో ప్రత్యేక ‘మిస్సింగ్ చిల్డ్రన్ యూనిట్’ ఏర్పాటు చేయాలి. దీనికి స్వతంత్ర సిబ్బంది, వాహనాలు, ఫోరెన్సిక్ సపోర్ట్ ఉండాలి. మొదటి 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు తప్పనిసరి చేయాలి, ఆలస్యం చేసిన అధికారులపై క్రిమినల్ చర్య తీసుకోవాలి. ‘ఖోయా-పాయా’, ‘ట్రాక్ ఛైల్డ్’, ‘మిషన్ వాత్సల్య’ పోర్టల్స్‌ను ఒకే జాతీయ డేటాబేస్‌లో విలీనం చేసి రియల్ టైమ్ షేరింగ్ చేయాలి. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్త్మ్రల్ లాంటి కార్యక్రమాలను ఏడాది పొడవునా నిరంతరం నడపాలి. బాలల ట్రాఫికింగ్ కేసులకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, కనీసం 6 నెలల్లో తీర్పు వచ్చేలా చేయాలి. బాలల హక్కుల ఉల్లంఘనలకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. పిఒసిఎస్‌ఒ, జెజె యాక్ట్ లో మరింత కఠోర సవరణలు చేయాలి. పాఠశాలలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీల ద్వారా పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

చిన్నారుల అదృశ్యం అనేది కేవలం పోలీసు శాఖ సమస్య మాత్రమే కాదు.- ఇది మన సమాజ సామూహిక వైఫల్యం. ఒక పిల్లవాడు ఇల్లు దాటి బయటకు వెళ్తే వారు సురక్షితంగా ఉండాలనే నమ్మకం లేనప్పుడు ఆ దేశం ఎలా అభివృద్ధి చెందగలదు? సుప్రీంకోర్టు హెచ్చరికలు, ఎన్‌జిఒల ఆందోళనలు, బాధిత తల్లుల కన్నీళ్లు ఇవన్నీ ఒక్కటే చెబుతున్నాయి. తక్షణ చర్యలు తప్పనిసరి. ప్రతి చిన్నారి సురక్షితంగా ఉండే దేశం కావాలంటే, ప్రతి పౌరుడూ బాధ్యత వహించాలి. ఇది ప్రభుత్వం ఒక్కటే పరిష్కరించే సమస్య కాదు. ఇది మనందరి సమస్య. మన పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడే మేలుకోవాలి.

ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి

+91 90320 42014

హైదరాబాద్ విమోచన నేపథ్యం

నవంబర్ 29, 1947 తేదీ హైదరాబాద్ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. దేశం స్వాతంత్య్రం పొందిన మూడు నెలలకే, హైదరాబాద్ సంస్థానంలో 15 ఆగస్టు 1947 పూర్వపు పరిస్థితిని కొనసాగించేందుకు ‘యథాతథ స్థితి ఒప్పందం’ కుదిరిన రోజు ఇది. స్వాతంత్య్రం వచ్చినా భారత ఉపఖండంలోని అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్ మాత్రమే భారత్ యూనియన్‌లో విలీనానికి ముందుకు రాకపోవడం, ఆ కారణంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, రజాకారు దౌర్జన్యాలు, ప్రజా తిరుగుబాట్లు, చివరకు జరిగిన సైనిక చర్య -ఇవన్నీ ఈ తేదీ చుట్టూ తిరిగే చారిత్రక వాస్తవాలు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 1947 నాటికి బ్రిటిష్ భారతంలో 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా వీటికి మూడు మార్గాలు సూచించబడ్డాయి. భారత్‌లో కలవడం, పాకిస్తాన్‌లో విలీనం కావడం లేదా స్వతంత్రంగా నిలవడం. ఆ అవకాశం వచ్చినపుడు జనాభా నిర్మాణం, సామాజిక-, రాజకీయ వాస్తవాలకు విరుద్ధంగా మూడు సంస్థానాలు విలీనానికి నిరాకరించాయి. జునాఘడ్, కశ్మీర్, హైదరాబాద్. జునాఘడ్ విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కఠిన నిర్ణయంతో ప్రజాభిప్రాయం ఆధారంగా విలీనాన్ని సాధించగా, కశ్మీర్ పరిస్థితి భిన్నమై యుద్ధం రూపందాల్చింది. కానీ అత్యంత క్లిష్టమైనది హైదరాబాద్ సంస్థాన సమస్య.

భూభాగ పరిమాణం, ఆర్థిక శక్తి, మత-జాతి సమగ్రత, రాజకీయ సంక్లిష్టతల వల్ల హైదరాబాద్ విలీనం సులభం కాని పని అయింది. ఆదిలాబాద్ నుండి రాయచూర్ వరకు, ఏడు తెలంగాణ జిల్లాలు, ఐదు మరఠ్వాడా జిల్లాలు, మూడు కర్ణాటక జిల్లాలతో కలిపి 82,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో విస్తరించిన హైదరాబాద్ రాష్ట్రం మూడు ప్రధాన భాషల (తెలుగు, మరాఠీ, కన్నడ)తో జీవించిన సంస్థానం. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలన చివరి దశలో ఖాసిం రజ్వీ నేతృత్వంలోని ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సైనిక విభాగమైన రజాకార్లు హింస, దోపిడీ, మతవిద్వేషం, క్రూరపాలనకు ప్రతీకలుగా మారారు. రాజ్యం అంతటా 90కు పైగా పన్నులు విధించబడడం, ప్రజల్ని బానిసలుగా మార్చే వెట్టిచాకిరి విధానాలు, తెలుగు వారికి అవమానకర స్థితి, సంప్రదాయాలపై, మతాచారాలపై, భాషపై జరిగిన దాడులు ప్రజల్లో వ్యతిరేకతను అగ్నికీలకంగా మార్చాయి. రజాకార్ల ‘తొడెలు, సుడులు’ పేరుతో పిలిచే దౌర్జన్యాలు, గ్రామాల్లో మహిళలపై జరిగిన అమానుష హింసలు, యువకులపై జరిగిన చిత్రహింసలు ఆ కాలపు తెలంగాణకు నిత్యనరకం.

ఈ పరిస్థితుల్లో స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, సాయుధ కమ్యూనిస్టు పోరాటాలు, ప్రజల స్వాభిమానం కాపాడేందుకు ఏర్పడిన రహస్య సంఘాలు, గ్రామాల రక్షణకోసం భూముల యజమానులు, పని జీవులు ఏర్పరచుకున్న దళాలు అన్నీ కలసి నిజాం నిరంకుశ పాలనకు ఎదురు నిలిచాయి. రావి నారాయణరెడ్డి, చండ్రరాజేశ్వరరావు, మల్లుస్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హన్మంతరావు, దాశరథి, కాళోజీ, సుద్దాల హనుమంతు, అనభేరి ప్రభాకర్‌రావు, షోయబుల్లా ఖాన్ వంటి నేతలు, కవులు, రచయితలు ఈ పోరాటం ద్వారా తెలంగాణకు స్వరమిచ్చారు. నారాయణరావు పవార్, శంశాబాద్ గంగారాం సైతం నిజాంపైనే బాంబులు విసిరిన ఘటనలు ప్రజల్లో తిరుగుబాటును మరింత వేగవంతం చేశాయి. ఇదే కాలంలో నిజాం పాలన అంతర్జాతీయ వేదికలపై ‘హైదరాబాదు స్వతంత్రదేశం’గా గుర్తింపు పొందాలని ప్రయత్నించింది. పాకిస్తాన్ తో రహస్య చర్చలు, విదేశాలనుంచి ఆయుధాల కొనుగోలు ప్రయత్నాలు, ఐక్యరాజ్యసమితిలో భారత్‌పై ఫిర్యాదు ఇవన్నీ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. రజాకార్లు రోజురోజుకీ అదుపు తప్పగా, మరోవైపు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం రాజ్యం అంతటా విస్తరించగా, శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నిజాంకు ‘యథాతథ స్థితి ఒప్పందం’ ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వ ప్రేరణతో నిజాం ఢిల్లీకి వెళ్లి మౌంట్ బ్యాటన్, సర్దార్ పటేల్‌లను కలిశాడు. 1947 నవంబర్ 29న సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం సంవత్సరం పాటు 15 ఆగస్టు 1947 నాటి పరిపాలనా నిర్మాణం కొనసాగాలి. భారత ప్రభుత్వ ప్రతినిధిగా కె.ఎం. మున్షీ హైదరాబాద్‌లో ఏజెంట్ జనరల్‌గా పనిచేయాలి అన్న నిబంధనలు అమలులోకి వచ్చాయి. కానీ ఈ ఒప్పందం కూడా శాంతికి దారితీయలేదు. నిజాం తొలుత ఒప్పుకున్నా రజాకార్లు మాత్రం హింసను మరింత పెంచారు. ప్రజల కేకలు ఢిల్లీల్లో వినిపించగా, పటేల్ సహనం సరిహద్దుకు చేరింది. సమస్యకు చివరి పరిష్కారం కోసం సర్దార్ పటేల్ సైనిక చర్యకే మొగ్గుచూపాడు. 1948 సెప్టెంబర్ 13న జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వంలో ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. నాలుదిక్కుల నుంచి భారత సైన్యం పురోగమించగా రజాకార్ల దళాలు కొన్ని రోజుల్లోనే చెల్లాచెదురయ్యాయి.

నిర్ణయాత్మక సమయంలో నిజాం, హుస్సేన్ సాగర్ తీరంలోని లేక్ వ్యూ అతిథి గృహంలో ఉన్న ఏజెంట్ మున్షీని కలసి లొంగుబాటు నిర్ణయం వెల్లడించాడు. సెప్టెంబర్ 17న నిజాం అధికారికంగా భారత్ ముందు తలవంచడంతో హైదరాబాద్ విమోచన జరిగింది. తదనంతరం లాయక్ అలీ, ఖాసింరజ్వీ తొలగింపబడి ఖైదు చేయబడ్డారు. జెఎన్ చౌదరి సైనిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించగా, ఎంకె వెల్లోడి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1956లో నిజాంకు భరణం, రాజబిరుదుల కొనసాగింపు వంటి ఒప్పందాలు కుదిరాయి. అక్టోబర్ 31, 1956 వరకూ నిజాం రాజ్ ప్రముఖుడిగా కొనసాగాడు. ఈ విధంగా దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత మరొక సంవత్సరం పాటు తెలంగాణ ప్రజలు అనుభవించిన దుష్టరాజ్యం, రజాకార్ల ఉన్మాదం, వేలాది మంది తెలియని వీరుల త్యాగాలు, సర్దార్ పటేల్ రాజకీయ సంకల్పం, భారత సైన్య ధైర్యసాహసాలు కలిసి హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేశాయి.  

రామకిష్టయ్య సంగనభట్ల

9440595494

రష్యా ఇం‘ధన’మే యుద్ధానికి ఆజ్యమా?

రష్యా నుంచి భారత్ వంటి దేశాలు చమురు కొనుగోలు పూర్తిగా మానేస్తేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని, రష్యా దిగివచ్చి శాంతి ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. చమురు నుంచి వచ్చే పుష్కలమైన ఆదాయ వనరులతోనే ఆర్థికంగా బలం పెంచుకుని రష్యా ఉక్రెయిన్‌పై ఎడతెగని యుద్ధాన్ని కొనసాగిస్తోందని ట్రంప్ బాహాటంగా వెల్లడిస్తున్నారు. అంతేకాదు రష్యా లోని ప్రముఖ చమురు సంస్థలపై ఆంక్షలు కూడా విధించారు. ఈ ఆంక్షల ప్రభావం ఎంతవరకు యుద్ధాన్ని ఆపగలుగుతుందో చెప్పలేం. కానీ భారత్ మాత్రం ఈ ఆంక్షలతో చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. మాస్కో లోని రోస్‌నెఫ్ట్, లుకోయిల్ అనే భారీ చమురు ఉత్పత్తి సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంతో రష్యా నుంచి చవకగా చమురు కొనుగోలు చేయడం భారత్‌కు కష్టమవుతోంది. రష్యా కన్నా చవకగా మరే దేశం భారత్‌కు చమురు సరఫరా చేయడం లేదన్నది వాస్తవం. రష్యా నుంచి అందే చమురు సరఫరాలు భారత్ చమురు అవసరాల్లో 36 శాతం తీరుస్తున్నాయి.

2023 నుంచి రోజుకు అయిదు బిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు భారత్‌కు సరఫరా అవుతోంది. దీనివల్ల భారత్‌కు అదనపు ఖాతాలపై భారం చాలా వరకు తగ్గుతోంది. అయితే తాజాగా రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు రోజుకు 47 శాతం వంతున తగ్గిపోయాయి. అంటే అక్టోబర్‌లో రోజుకు 1.86 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి కాగా, ఈ నవంబరులో రోజుకు 9,82,000 బ్యారెళ్ల ముడి చమురు మాత్రమే దిగుమతి అయింది. దీన్ని బట్టి డిసెంబర్ జనవరి నాటికి దిగుమతులు మరింత ఎక్కువగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ స్వంత రిఫైనరీలు, రిలయన్స్ వంటి ప్రైవేట్ రిఫైనరీలు రష్యా నుంచి నేరుగా చమురు కొనుగోళ్లను తగ్గించి వేస్తున్నాయి. రిలయన్స్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని దాదాపు నిలిపివేసిందని చెప్పవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ సంస్థలు అమెరికా ఆంక్షల పరిధి లోకి రాని కంపెనీల నుంచి డిస్కౌంట్ ధరలకు చమురు సరఫరా చేస్తే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

అమెరికాతోపాటు పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో భారతీయ కంపెనీలు రష్యాకు బదులుగా పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, పశ్చిమాఫ్రికా, అమెరికా, కెనడా తదితర దేశాల వైపు తమ దృష్టిని మరల్చుతున్నాయి. ఏదేమైనా చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడడం మాత్రం మనకు తప్పడం లేదు. ఈ దిశలో రష్యాయేతర ఇంధన వనరుల సంస్థలతో చమురు వాణిజ్య సంబంధాలు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచ చమురు మార్కెట్ ఇంధన నిల్వలతో సమృద్ధిగా ఉండటమే కాక, ధరలు కూడా తగ్గుముఖం పడతాయన్న అంచనా వస్తోంది. బ్రెంట్ ముడి చమురు ధరలు గత జనవరిలో బ్యారెల్‌కు 79 డాలర్లు ఉండగా, అక్టోబర్ నాటికి 64 డాలర్లకు పడిపోయాయి. అప్పటి నుంచి ధరలు నిలకడగా ఉంటున్నాయి. అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్‌కు బ్యారెల్‌కు 62.5 డాలర్లకు, 2026 మొదటి మూడు నెలల్లో 54 డాలర్లకు చమురు ధరలు ఇంకా పడిపోతాయని అమెరికా ఎనర్జీ ఇన్‌ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఇఐఎ) ముందస్తు అంచనా వెలువడింది. పెట్రోలు ఎగుమతి దేశాల ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ, ఇఐఎ వంటి సంస్థలు ధరలపై వేటికవే అస్పష్టమైన అంచనాలు అందిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ధరలు తగ్గితేనే రష్యా దారి లోకి వస్తుందన్న దృఢ నమ్మకంతో ఉంటున్నారు. కానీ ఆయన ప్రయత్నాలు బెడిసికొట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా కొనసాగితే రష్యా చమురు సంస్థలపై మరిన్ని ఆంక్షలు అమెరికా విధించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచ చమురు మార్కెట్ మరింత కట్టుదిట్టమై ధరలు అమాంతంగా పెరిగిపోవచ్చు. అలాంటప్పుడు భారత్ పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న. అందుకని భారత్ ముందుచూపుతో ఒక్క రష్యాయే కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోక తప్పదన్న హెచ్చరికలు వస్తున్నాయి. భౌగోళిక రాజకీయాలు చమురు ధరలపై విపరీత ప్రభావం చూపిస్తాయి. 88 శాతం వరకు పూర్తిగా ఇంధన దిగుమతులపై ఆధారపడే భారత ఇంధన భద్రతకు ఇదో పెద్ద సవాలు. దేశీయ చమురు ఉత్పత్తిలో వివిధ కారణాల వల్ల ఏర్పడుతున్న క్షీణతను గమనించి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు భారత్ ముమ్మరం చేయవలసిన అగత్యం ఏర్పడుతోంది.

చమురు ఉత్పత్తికోసం పెట్టుబడి పెట్టడంలో అవరోధకరమైన నిబంధనలు, అత్యధిక పన్నుల భారం, ఇవన్నీ సహజ చమురు క్షేత్రాలనుంచి ఉత్పత్తికి ఆటంకాలుగా పరిణమిస్తున్నాయి. ఈ అవాంతరాలను తొలగించుకోక తప్పదు. చమురు కోసం సముద్రగర్భ అన్వేషణ సాగించడంలో మనకు తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. ప్రపంచ చమురు దిగ్గజం చెవ్రాన్ అత్యంత ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అల్ట్రా హై ప్రెజర్‌తో చమురు తవ్వకాలను కొనసాగిస్తోంది. ఇదివరకు ఉపయోగించే సామర్థం కన్నా మూడింతలు ఎక్కువతో అన్వేషణలో దూసుకెళ్తోంది. మెక్సికో జలసంధిలో గతంలో చమురు లభ్యం కాని క్షేత్రాలనుంచి ఇప్పుడు సమృద్ధిగా చమురును సేకరించగలుగుతోంది. అలాంటి మార్గదర్శకత్వంతో మనదేశ సముద్ర తీర చమురు పరిపక్వ క్షేత్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చమురు నిల్వలను వెలికి తీయగల ప్రముఖ చమురు సంస్థల దిగ్గజాలను ప్రోత్సహించే ప్రణాళికలను ప్రభుత్వం చేపడితేనే చమురు సంపాదనలో స్వయం సామర్థం పెరుగుతుంది. స్వయం సామర్థం పెరిగితేనే రష్యా వంటి దేశాలపై చమురు కోసం ఆధారపడవలసిన గతి తప్పుతుంది.