ankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escort

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

sekabet

pusulabet

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

నెత్తురోడుతున్న ‘సంధి’కాలం

ఇవాళ ప్రపంచాన్ని కింది నుంచి పైకి చూసినా, పైనుంచి కిందికి చూసినా ఒకే దృశ్యం. నిష్ఫల హింసతో నెత్తురోడుతున్న వర్తమానం. ఇది ఆశ నిరాశల బాధాకర సమ్మిశ్రమం కూడా. మన కళ్ల ముందే, యుక్రేన్ దేశం ఇక ఇప్పుడిప్పుడే కోలుకోలేనంతగా ఛిద్రమయిపోయింది. పశ్చిమ రాజ్యాలు యుక్రేన్ ద్వారా రష్యాకు పక్కలో బల్లెం కావాలనుకున్నాయి. కుదరలేదు. రాపిడి యుద్ధం (వార్ అఫ్ అట్రషన్) మాత్రం కొనసాగుతోంది. జనాన్ని బలవంతంగా యుద్దభూములకు తరలిస్తున్నారు. నగరాల్లో పవర్ గ్రిడ్స్ బద్దలైపోయాయి. యుక్రేనియన్లు చీకటిలో, చలిలో ముడుచుకుంటున్నారు.

సౌదీ, ఖతార్ వంటి ముస్లిం రాజ్యాల పరోక్ష వత్తాసుతో(నే) పాలస్తీనా, సిరియా దేశాలలో అమెరికా, ఇజ్రాయిల్ మారణహోమం కొనసాగుతోంది. పాలస్తీనా పెద్ద శవాల గుట్టగామారింది. అలాగని ఇజ్రాయిల్, అమెరికా పెత్తనం కూడా నిలబడడం లేదు. పశ్చిమ దేశాల ఆర్థిక మాంద్యాన్ని యుద్ధాలూ, సుంకాలు పరిష్కారించలేకపోయాయి. అమెరికా, యూరప్ సహా అన్ని దేశాల్లో విచిత్రమైన నిరుద్యోగం విస్తరిస్తోంది. జెన్ జీ అనబడే నవతరం ఎక్కడికక్కడ తిరగుబడుతోంది. తిరగబడి ఏం చేయాలో తెలియక తికమక పడుతోంది. తమకేం కావాలో, అసలు తాము ఎవరో తెలియక తికమకపడుతోంది. నిన్నటి నిర్వచనాలేవీ వాళ్ల ప్రశ్నలకు జవాబివ్వడం లేదు. వాళ్లు కార్మికులా? రైతులా? బూర్జువా బిడ్డలా? పశ్చిమ రాజ్యాల మానస పుత్రులా?

సమాజంలో ఆర్థిక వర్గాల పొందికలో గణనీయమైన మార్పు వచ్చింది. నిన్నటి శ్రామికుల పిల్లలు ఇవాళ శ్రామికులు కారు. వాళ్లు మధ్యతరగతి వర్గంలో చేరిపోయారు. ఇవాళ రెక్కాడితే గాని డొక్కాడని శ్రామిక ప్రజలు అసల్లేరని కాదు. బాగానే ఉన్నారు. జనాభాలో వారి శాతం గణనీయంగా తగ్గింది. ఎంత గణనీయంగా అంటే, వాళ్ల సమస్యలపై వీధులకెక్కి పోరాడ్డానికి తగిన శాతంలో నిరుపేదల జనాభా లేదు. బహుశా, ఇదే ఇవాళ వామపక్షాల ఇర్రిలవెన్సుకు కారణం. ఇదే ‘జెన్ జీ’ ఫినామినన్ కు మూలం. ఈ సరికొత్త వర్గ-పొందికకు తగిన వ్యూహం, ఎత్తుగడలను అన్వేషించాల్సి ఉంది.

మునుపటి పేదలు చాల మంది కొత్తగా మధ్య తరగతిలో చేరిపోయారు. మధ్యతరగతి ప్రజలు మునుపటి కన్న ఎక్కువగా రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నారు. తాత్వికంగా గుర్తింపుచేతనా (ఐడెంటిటీ) రాజకీయాలకు ఇదే పునాది. ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ (మాగా), పాన్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో తెల్ల భూస్వాముల భయాలు, ఇండియాలో మాలమహానాడు, మాదిగదండోరా, బీసీల ఐక్యత, మైనారిటీల అభద్రత, రెడ్ల, కమ్మల వనభోజనాలు, బ్రాహ్మణ సంఘాలు… ఇవి కాక మిగిలిపోయిన పేద శ్రామికులు పోరాటాలకు తగిన శాతం లేరు. అంటే, పోరాడితే తప్ప బతుకు లేని వాళ్లు… సామాజిక చలనాల్ని నిర్ణయించడానికి… తగిన సంఖ్యలో లేరు. ఈ పేదలు సంఖ్య రీత్యా తక్కువే గాని, వారి దుఃఖం మాత్రం చాల ఎక్కువ.

ఆ దుఃఖం ఎలా ఉంటుందో మొన్న కోవిడ్ సమయంలో చూశాం. పేదలు తాము ఉన్న చోట్లలో బతకలేక, పనులు వెదుక్కుంటూ వలసపోయేవారు. ఆధునిక యుగంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి వలసలు ఎక్కువయ్యాయి. కోవిడ్ ‘లాక్ డౌన్’ సమయంలో బయటికి వెళ్లి పనులు చేసుకునే అవకాశం లేదు. వలస వచ్చిన వాళ్లకు కొత్త చోట్ల కూడా పనులు లేకుండా పోయాయి. పనులు లేక, లాక్ డౌన్ కారణంగా పిల్లా పాపలతో తలదాచుకునే చోటు లేక, కనీసం బంధుమిత్రులతో కలిసి ఉందామని దక్షిణాది నుంచి తిరిగి తమ ఊళ్లకు నడిచి వెళ్లారు. బస్సులు, రైళ్లు ఎక్కడానికి వాళ్ల దగ్గర డబ్బుల్లేవు. ప్రభుత్వాలు ఆదుకోలేదు. అలాంటి తిరుగు వలసలలో ఎన్నెన్నో హృదయవిదారక దృశ్యాలు. ఉదాహరణకు… తిరుగు-వలస ప్రయాణంలో ఒక రైలు స్టేషన్ వద్ద శవమై పడి వున్న ఒక అమ్మ. చిరుగుల బనియన్ తో అభంశుభం తెలియని ఆమె పిల్లవాడు. పిల్లవాడు పాల కోసం అమ్మ పైట కొంగు తీస్తున్న దృశ్యాన్ని చాల మంది చూసి ఉంటారు. కెమెరా కంట బడని దృశ్యాలు ఇంకెన్నో.

అంత ఘోరకలిలో ప్రభుత్వాలు ప్రజలను గాలికొదిలేశాయి. ప్రైవేటు వితరణతో దొరికిన కొంత ఉపశమన తప్ప వాళ్లనెవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వాలు పట్టించుకోవాలని ఉద్యమాలేమీ జరగలేదు. ఇంత ఉదాసీనతకు కారణమేమిటి? ఆ బాధితులు బాగా అట్టడుగు జనం. జనం ఉన్నారు గాని, జమగూడి పోరాడేందుకు తగినంతమంది (క్రిటికల్ మాస్) లేరు. వ్యవస్థను ఎదిరించి, డిమాండ్ చేసి సాధించుకోడానికి తగినంత మంది నిరుపేదలు లేరు. బహుశా, ఈ నిస్సహాయతే, తీవ్ర సమస్యలు ఉండీ పోరాటానికి తగిన మానవ సంఖ్యలేని నిస్సహాయతే, ఇక అడుగు ముందుకు పడని నిస్సహాయతే… ఇటీవలి మావోయిస్టు ఉద్యమంలో ఏర్పడిన ప్రతిష్టంభనకు కూడా మూల కారణం. నక్సలైట్లు ఏదో ఒక సమస్య మీద కాకుండా వ్యవస్థను సమూలంగా మార్చాలనుకునే యోధులు. అది రాజ్యానికి అస్సలు ఇష్టం ఉండదు. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో రాజ్యం మావోయిస్టుల మీద అలివిగాని దాడులు మొదలెట్టింది. కొన్ని మాత్రమే నిజమైన ఎన్కౌంటర్లు. చాల ఎన్కౌంటర్లు బూటకం. ఏది నిజం ఎన్కౌంటరో ఏది బూటకమో నిర్ణయించలేని దుస్థితి. ఈ దుస్థితికి కారణం నక్సలైట్లు అనుసరించిన రహస్యగోపన పనివిధానం అని చెప్పక తప్పదు.

యుద్దం చేసే యోధులకు దాడులు చేయడమే కాదు, ఆత్మరక్షణ చేసుకునే విద్య కూడా తెలియాలి. ముందుకు పోవడం మాత్రమే కాదు, వెనక్కి తగ్గే విద్య కూడా తెలిసి ఉండాలి. రెండవది తెలియని సైనికులు తమ అజ్ఞానానికి తాము బలి అవుతారు. తమతోపాటు తమ వెంట నడిచే ప్రజల్నీ బలి చేస్తారు. నక్సలైట్/మావోయిస్టు ఉద్యమంలో ఈ రకం బలిదానాలే ఎక్కువ అని చెప్పక తప్పదు. ఆపరేషన్ కగార్ లో రాజ్యానిదే పైచేయి అయ్యింది. అది అనూహ్యం కాదు. అనివార్యం కూడా. అడివి ఉద్యమానికి రాజ్యంతో యుద్ధానికి తలపడే శక్తి లేదు. నిర్బంధానికి తట్టుకుని నిలబడే పరిస్థితి లేదని మృత నేత బసవరాజుతోపాటు చాలమంది ఉద్యమ నాయకులు గ్రహించారు. ‘వికల్ప్’ పేరుతో పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ చేసిన విజ్ఞప్తిని అందరూ చూసి/విని ఉంటారు. సాయుధపోరాటం విరమిస్తామనీ, అయితే, ఆ సంగతి తమలో తాము చర్చించుకోడానికి నెల రోజుల సమయం కావాలని ఆ లేఖ/విజ్ఞప్తి సారాంశం.

వెంటనే లొంగిపోవడం (సరెండర్ కావడం) వినా మార్గం లేదని ప్రభుత్వం మొండికేసింది. ‘ఆపరేషన్ కగార్’ కొనసాగించింది. మల్లోజుల, ఆశన్న తదితర నేతలు పలువురు అనుచరులతో పాటు ఏకపక్షంగానే సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వాళ్లు ద్రోహులు అని ప్రకటించిన వాళ్లలో మరి చాలమంది ఇప్పుడు అదే విజ్ఞప్తి చేస్తున్నారు. తామూ ఆయుధాలు విసర్జిస్తామని, చర్చించుకోడానికి సమయం కావాలని అడిగారు. అలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆ ప్రకటన కర్తలు కొందరు ఏకపక్షంగా లొంగిపోయారని… ఈ వ్యాసం రాస్తున్న సమయంలో బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వయ్యెస్సార్ ముఖ్యమంత్రిత్వం కింద ఒకసారి శాంతికి సదవకాశం వచ్చింది. నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య ఒక పద్ధతిగా చర్చలు జరిగి గౌరవప్రద ఒప్పందానికి అవకాశం కనిపించింది. శాంతి ఒప్పందం కుదరాలంటే నక్సలైట్లు ఆయుధాల్ని విసర్జించాలని ప్రభుత్వం నిబంధించింది. అది తప్పు అని అనలేం. సమాజంలో ఒక సెక్షన్ ప్రజలకు ఆయుధాలు ధరించే స్వేచ్ఛను ఏ లెజిటిమేట్ ప్రభుత్వం ఇవ్వదు. అలా అనుమతించడానికి ‘రాజ్యాంగం’ అంగీకరించదు. ఆ మాత్రం తెలీకుండా శాంతి చర్చలకు వెళ్లడం అమాయకత్వమే.

ఆనాడు ఆయుధాల అప్పగింతకు అంగీకరించక ‘యుద్ధం’ కొనసాగించడానికే మావోయిస్టులు నిశ్చయించారు. ఇవాళ ఆయుధ విసర్జనకు సిద్ధమే గాని, తమలో తాము మాట్లాడుకోడానికి నెల రోజుల సమయం కావాలని ఒకటికి రెండు సార్లు కోరారు. ప్రభుత్వం అంగీకరించలేదు. రిట్రీట్ తప్పు కాదు గాని, అది ఇంత గందరగోళంగా ఉండాల్సింది కాదు. లొంగుబాటు (సరెండర్) అవమానకరం కాదు. ఫలానా రాజ్యాంగానికి విధేయులం అని ప్రకటించుకోవడం ఆ దేశపౌరులకు అవమానకరం కాదు. జనసందోహంలో కలవడానికి అంతకు మించి పద్ధతి ఏదీ లేదు. మావోయిస్టులు తమ పాత ప్రకటనలకు బలైపోకుండా, ఆయుధాలు విసర్జించాలి. నీళ్లలో చేపల్లా ప్రజలలో కలిసిపోవాలి. ఎక్కడో అడివిలో ఒక మూలన ఏర్పరిచే ‘జనతన రాజ్యాలు’ ప్రజలకు మేలు చేయవు. జనతన రాజ్యాల రక్షణ పేరిట పెట్టిన మందుపాతరలు మేలు చేయవు. గిరిజన బాలలు మైదానాల్లోని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల వంటి సౌకర్యాల్ని ఉపయోగించుకుని చదువూ సంధ్యా నేర్చుకుని మిగతా దేశ ప్రజలందరిలాగే పురోగమిస్తేనే నేటి వెనుకబాటుతనం తొలగిపోతుంది. దీనికి దోహదం చేయడమే గిరిజన బిడ్డలతో సహా ప్రజలను, దేశాన్ని ప్రేమించే కమ్యూనిస్టులందరి కర్తవ్యం.

– హెచ్చార్కె

(ప్రముఖ కవి, రచయిత)

వెనక్కి వెళ్లేటట్లయితే, ఎందుకు వచ్చినట్టు?

మావోయిస్టుల ఉద్యమం ప్రస్తుతానికి అంతమై పోయినట్లే. ఇప్పట్లో దానికి పునరుజ్జీవం కలిగించేలా విప్లవకాంక్షతో రగిలేవారెవరూ కన్పించడం లేదు. ఒక శకం సమాప్తమైందనే నిర్ధారణలు జరుగుతున్నాయి. చారుమజుందార్, బస్వరాజ్ నుంచి హిడ్మావరకు విప్లవ వీరులు చేసిన పోరాటాలు, త్యాగాల గురించి ప్రస్తుత తరానికి అర్ధమయ్యే భాషలో ప్రచారం జరగవలసి ఉందన్న భావన వ్యక్తమవుతోంది. జానపద కథలలో వీరుల వలె వారి చరిత్ర ఉబుసుపోకకు పరిమితం కాకూడదు.స్ఫూర్తి రగిలించాలి. మేధావి వర్గాలు ఆ బాధ్యత స్వీకరించాలని కొందరు విప్లవాభిమానులు కోరుతున్నారు. కాగా సామాజిక కార్యకర్త, ఆదివాసీ పోరాటాలు నిర్వహిస్తున్న సోనీ సోరీ ఇటీవల హైదరాబాద్ కు వచ్చినపుడు రచయిత్రి రూపకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. లొంగిపోతున్న మావోయిస్టులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాది బతుకు పోరాటం. లొంగిపోయే ఆలోచన వుంటే మా దగ్గరకు ఎందుకొచ్చారు? ఇన్నేళ్లు మాకోసం పోరాటం చేసి, ఇవాళ మాతో కనీసం ఒక్కమాట కూడా చెప్పకుండా ప్రభుత్వం ముందు ఎలా లొంగిపోతున్నారు? హిడ్మా మా ఆదివాసి బిడ్డ. అతను మరణిస్తే మేమే కదా నష్టపోయేది?’ ఆమె ఈ ప్రశ్నలు సంధించిన పది రోజుల్లో నవంబర్ 18 వ తేదీ తెల్లవారుఝామున ఆదివాసీ కథానాయకుడు హిడ్మా జీవితం ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ రూపంలో తెల్లారిపోయింది. సోనీ సోరి ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలి? ఏవిధంగా జవాబులు చెప్పినా అవి ’కన్విన్సింగ్’గా ఉండే అవకాశాలు లేవు. మావోయిస్టులు 2000 నుంచి బలం పుంజుకున్నారు.

వారి కార్యకలాపాలు తూర్పున నేపాల్ సరిహద్దు నుండి దక్షిణాన దక్కన్ పీఠభూమి వరకు నడిచాయి. – ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు దండకారణ్యం లేదా డీకే అని పిలిచారు. ఇది భారతదేశ స్థానిక ప్రజలు, ఆదివాసీలు నివసించిన ప్రాంతం. ఇక్కడ విలువైన ఖనిజాలు, ఇతర సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. భారత రాష్ట్రం సహజ వనరుల సంపదపై నియంత్రణ కోరుకుంది. కానీ మావోయిస్టులు దానికి అడ్డంకిగా మారారు. అప్పుడు, భారతదేశానికి ’అతిపెద్ద అంతర్గత భద్రతా ముప్పు’ అని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2009 లో ప్రకటించారు. కాగా 2020 నుంచి మావోయిస్టు ఉద్యమం క్షీణించడం వేగంగా జరిగింది. మావోయిస్టులను వేటాడేందుకు ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులతో సహా ఆదివాసీల ప్రత్యేక బెటాలియన్ను ఏర్పాటు చేసింది. ఇది పెద్ద ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. 2018లో గణపతి నుండి మావోయిస్టు చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన నంబాల కేశవ రావు గత మే 21 న పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు. నవంబర్ 18 న హిడ్మా ఎన్ కౌంటర్ జరిగింది. కొద్దీ మంది మినహాయించి మొత్తం మావోయిస్టు నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. గత సెప్టెంబర్లో మల్లోజుల వేణుగోపాల అలియాస్ అభయ్ విడుదల చేసిన ప్రకటనలో నాయకత్వం అనేక వ్యూహాత్మక తప్పులు చేసిందని, రక్తపాతాన్ని ఆపడానికి ఇప్పుడు కాల్పుల విరమణ ముఖ్యమని ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. మావోయిస్టుల అణచివేత కార్యకలాపాలు కొనసాగుతున్నందున, అడవిలో ఇంకా కొంతమంది చివరికి లొంగిపోతారు లేదా చంపబడతారు.

అయితే ఇంతటితో విప్లవ రాజకీయాలు అంతమయిపోతాయని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే విప్లవోద్యమ ప్రభావం, పరిధి చాలా విస్తారమైంది. దేశంలో పైపై మెరుగులను చూసి నక్సల్ బరీ సాయుధ పోరాట రాజకీయాలకు కాలం చెల్లిపోయిందని వీలునామా రాస్తున్నారు. కానీ నిజానికి పేట్రేగుతున్న ఫాసిస్టుల నేపథ్యంలో ఆ రాజకీయాలకున్న ఆవశ్యకత మరే రాజకీయాలకూ లేదు. అయితే కేవలం విప్లవోద్యమమే ఫాసిజాన్ని ఓడిస్తుందనే భ్రమలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ప్రజా ఐక్య సంఘటన రాజకీయాలే ఫాసిజాన్ని, అది ఇప్పుడు కగార్ రూపంలో కొనసాగిస్తున్న దాడిని నిలువరించగలుగుతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ‘పేదవాడి దృష్టిలో అన్నలు పేద ప్రజల కోసం ప్రాణాలను పూచికపుల్లతో సమానంగా ఆహుతి చేసుకొన్నవాళ్లు. ఇప్పటి సమాజానికి, సమాజం కోసం జీవితాన్ని అంకితం చేయడమనే భావజాలం అర్ధం కాకపోవచ్చు. కానీ నక్సలైట్లు చేసింది అదే. పోలీసులను చంపారంటే, వారి మీద కక్షతో కాదు, యుద్ధంలో పోలీసులు శత్రువులు కాబట్టి చంపక తప్పదు. జరిగింది అణగారిన వర్గానికి, అణిచివేసే రాజ్యానికి మధ్య సమరం మాత్రమే. అందులో అటు ఇటు సమిధలు ఆహుతి కావడం సహజ పరిణామం. పోలీసులను చంపారు కాబట్టి నక్సలైట్లను నరహంతకులుగా ప్రచారం చేస్తున్నారు’ అని రచయిత మల్లాప్రగడ రామారావు ఒక వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

లొహండిగూడలో 2005లో టాటా కంపెనీ స్టీల్ ప్లాంట్ పేరుతో భూముల ఆక్రమణకు దిగినప్పుడు అక్కడ మావోయిస్టు పార్టీ ఉనికే లేదు. అయినా సరే.. ప్రతిఘటించకపోతే భూములు దక్కవని, భూములు కోల్పోతే వలస కూలీలుగా మారిపోయి దిక్కులేని బతుకు బతకాల్సి వస్తుందనే ఎరుకే వారిని చేతికి అందిన పనిముట్టునే ఆయుధంగా మల్చుకొని వీధుల్లోకి వచ్చేలా చేసింది. ఇలాంటి గొప్ప వారసత్వం గల గడ్డపైన 1970 దశకం చివరలో, దక్షిణ బస్తర్లోని పువ్వర్తి అనే ఒక మారుమూల పల్లెలో హిడ్మా పుట్టాడు. బాల్యం అంతా ప్రజాపోరాటాల మధ్యే గడిచింది. 1996 లేదా 1997లో హిడ్మా దళంలో చేరాడు. దళంలో ఉంటూ ఏ ఆయుధాన్ని ఎక్కడ, ఎలా వాడాలో తెలుసుకున్నాడు. ప్రజలే హిడ్మా బలం. ఆ ప్రజలకు హిడ్మా బలం. వాళ్లే ఆయనకు కళ్లూ, చెవులూ, కాళ్లూ, చేతుల్లా పని చేశారు. ఎందుకంటే, తమ గ్రామాలను తగులబెట్టి, ఆడపడచులను రేప్ చేసి, తమ బిడ్డలను హత్య చేస్తున్న సల్వాజుడుం గుండాలను, ప్రభుత్వ సాయుధ బలగాలను శిక్షించగల హీరోగా ప్రజలు ఆయనను చూశారు. హిడ్మా, ఆయన సహచరి రాజెల శవాల పక్కన రోదించినవాళ్లలో, వారి శవయాత్రలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.

ఇదిలా ఉండగా కోల్కతాలో మావోయిస్టు విద్యార్థి రాజకీయాలు బహిరంగంగా పునరుజ్జీవింపబడటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫ్రంట్ జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో నవంబర్ 24న తన ఆరవ రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించింది. జాదవ్పూర్ విశ్వవిద్యాలయానికి ’మల్లోజుల కోటేశ్వర్ రావు నగర్’గా పేరు పెట్టారు. ఆడిటోరియంకు ’బసవరాజు’ పేరు పెట్టారు. ’వివేకానంద హాల్ను ’హిడ్మా స్టేజ్’గా పేరు మార్చారు. ’అడవిలో సమాంతర ప్రభుత్వాన్ని స్థాపించడం ద్వారా నీరు, అడవి, భూమి హక్కులను పరిరక్షించినవారికి ఇది మా నివాళి. రాష్ట్ర ప్రభుత్వం మాపై పగ పడుతుందని, మాపైకి వస్తుందని మాకు తెలుసు’ అంటూ ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకులతోపాటు సంగ్రామి శ్రామిక్ మంచ్, సంగ్రామి కృషక్ మంచ్ సభ్యులు ప్రసంగాలు చేశారు. అడవుల్లో మావోయిస్టుల ప్రభావం తగ్గినప్పటికీ, పట్టణ విద్యార్థి సమాజంలో సైద్ధాంతిక ప్రభావం ఇప్పటికీ ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ విద్యార్థులలో మావోయిస్టుల ప్రభావం పునరుజ్జీవనమా లేక బలహీనమైన సమూహాన్ని ప్రేరేపించడమా అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, భద్రతా సంస్థల ముందున్న సవాలు.

-జకీర్

(సీనియర్ పాత్రికేయుడు)

మళ్లీ బక్కచిక్కిన మన రూపాయి

భౌగోళిక, రాజకీయ, దేశీయ పరిణామాల కారణంగా మన దేశ కరెన్సీ రూపాయి మారక విలువ ఇటీవల కాలంలో ఎన్నో ఒడిదుడుకులకు గురవుతోంది. డాలర్‌లో పోల్చితే రూపాయి మారకం విలువ తొలిసారి 90 స్థాయికి పతనమైంది. గత కొద్ది రోజులుగా అమెరికన్ కరెన్సీ ముందు అనేక కుదుపులకు బక్కచిక్కి మంగళవారం నాటికి చారిత్రకంగా కనిష్ఠ స్థాయికి పడిపోవడం గమనార్హం. గత కొద్ది నెలలుగా డాలర్లకు దిగుమతిదారుల నుంచి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దాంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. గత నెల 21న ఒక్క రోజే 98 పైసలు దిగజారడం గమనార్హం. భారతీయ రిజర్వుబ్యాంక్ కూడా ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకోకపోవడంతోపాటు ఇతర కారణాల కూడా ఈ పరిస్థితికి దోహదం చేశాయి. ఎగుమతి వృద్ధి మందగించడంతో వాణిజ్య లోటు పెరుగుతుండడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థిక వేత్త మదన్‌సబ్నవిస్ అభిప్రాయం వెలిబుచ్చారు. దేశీయంగా వృద్ధి మందగించడం, వాణిజ్య లోటు పెరగడం, దేశీయంగా పెట్టుబడులు సన్నగిల్లడం, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఆగకపోవడం తదితర కారణాలు రూపాయి విలువను మరింత దిగజారుస్తున్నాయి.

గత ఏడాది కూడా ఇదే డిసెంబర్ నెలలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 85.20 కి కనిష్ఠ స్థాయికి చేరింది. అంటే గత ఏడాది డిసెంబరు నెలలోనే రెండుసార్లు రూపాయి విలువ అమెరికా డాలరుతో పోలిస్తే బాగా క్షీణించిందని స్పష్టమవుతోంది. గడచిన ఐదేళ్లలో రూపాయి విలువ 20 శాతం క్షీణించగా, వచ్చే ఐదేళ్లలో ఇదే స్థాయిలో పతనం కావచ్చని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 2030 నాటికి అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలరుతో రూపాయి మారకం విలువ 100 కు పడిపోవచ్చని నివేదికలు జోస్యం చెబుతున్నాయి. 2019 లో డాలరుతో రూపాయి మారకం విలువ 70 స్థాయిలో ఉండగా, మోడీ ప్రభుత్వకాలంలో 20 శాతం పతనమై ఇప్పుడు 90 స్థాయికి దిగజారింది. ఈ నేపథ్యంలో 2029 డిసెంబరు నాటికి 8788 స్థాయిల మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు రూపాయితోపాటు కొరియన్ వోన్, మలేసియన్ రిగింట్స్, ఇండోనేషియా రూపాయి విలువలు కూడా హెచ్చుతగ్గులవుతున్నాయి. అయితే ఇవేవీ అంతర్జాతీయ మారకపు కరెన్సీలుకావు. కేవలం డాలర్‌కే ఆ ప్రాధాన్యం ఉంది.

అంతర్జాతీయ వాణిజ్యంలో డాలరు ఒక్కటే లింకు కరెన్సీ. అంతర్జాతీయ మార్కెట్‌లో లావాదేవీలన్నీ డాలర్ల లోనే జరుగుతాయి. దిగుమతి సరకులన్నిటికీ డాలర్ లోనే చెల్లింపులు జరగాలి. మన ఎగుమతులు మన అవసరానికి మించి డాలర్లను సంపాదించినప్పుడే అంతర్జాతీయ వాణిజ్య లోటు తొలగుతుంది. లేదా పరిమితమవుతుంది. అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిడి అంటే అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం వల్ల కలిగే ఒత్తిడి. స్వదేశంలో ద్రవ్యోల్బణాన్ని పరిమితిలో ఉంచుకోడానికి అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతుంటుంది. మన రూపాయితోపాటు వర్ధమాన దేశాల కరెన్సీపై ఒత్తిడి పెంచుతోంది. ఈ క్రమం లోనే మనదేశంలో గత ఏడాది డిసెంబర్ 18న 84.94 స్థాయిలో ఉన్న రూపాయి మారకం విలువ డిసెంబర్ 19 ఉదయానికి 85.06 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. వరుసగా రూపాయి పతనం వల్ల దిగుమతి ఉత్పత్తులు భారంగా మారనున్నాయి.

విదేశీ చదువులు, అంతర్జాతీయ ప్రయాణాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, చమురు, బంగారం, వంటనూనెలు, పప్పుదినుసులు తదితర ధరలు భారీగా పెరుగుతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల వీసాలు, వసతి కోసం వారి తల్లిదండ్రులు భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి నగదును డాలర్ల లోకి మారిస్తే మరిన్ని ఎక్కువ రూపాయిలు వెచ్చించాల్సి ఉంటుంది. మనం దిగుమతి చేసుకునే చమురుకు కూడా డాలర్ల లోనే చెల్లింపులు చేస్తుంటాయి. దీనివల్ల ఖజానాపై భారం పడడమే కాకుండా పెట్రోలు, డీజిల్ ధరలు మరింత పెరుగుతున్నాయి.అనవసరమైన దిగుమతులను మానుకోవడమో, తగ్గించుకోవడమో చేస్తే డాలర్‌తో రూపాయి పతనాన్ని పరిమితం చేయవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు 2022 లో మే నెలలో 107 టన్నుల బంగారాన్ని మనదేశం దిగుమతి చేసుకుంది.

బంగారాన్ని డాలర్లు చెల్లించి తెచ్చుకోవలసి ఉంటుంది. అది అవసరమైన దిగుమతి కాదు కాబట్టి దాని దిగుమతిని నిరుత్సాహ పర్చడం ద్వారా డాలర్లను పొదుపు చేయాలని భావించి దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. మన దిగుమతుల్లో ముఖ్యమైనది క్రూడాయిల్. పెట్రోల్, డీజిల్‌కు మూలమైన క్రూడాయిల్ 85 శాతం ఇతర దేశాల వద్ద అంతర్జాతీయ రేటుకు విదేశీ మారక ద్రవ్యంతో కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటున్నాం. దాని రేటు పెరిగే కొద్దీ విదేశీ మారక ద్రవ్యాన్ని అమితంగా చెల్లించవలసి వస్తుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తదితర కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర అనూహ్యంగా పెరుగుతోంది. మనం దిగుమతి చేసుకుంటున్న సరకులను స్వదేశీయంగా ఉత్పత్తి చేసుకోగలిగితే రూపాయి పతనం నుంచి రక్షణ పొందవచ్చు. ఇదిలా ఉండగా ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ప్రధాని మోడీ పదేపదే ప్రచారం చేస్తున్నా, అంతర్జాతీయ మార్కెట్ స్థాయిలో నాణ్యమైన ఉత్పత్తులను అందించే పరిస్థితి ఇంకా మనకు ఏర్పడలేదు. నాణ్యమైన సరకులను ఉత్పత్తి చేయగలిగితేనే వాటికి విదేశాల్లో మంచి గిరాకీ ఏర్పడుతుంది. ఆమేరకు మనదేశం నుంచి ఎగుమతులు పెరుగుతాయి. దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది.

‘సంచార సాథి’ వివాదం

భారత దేశంలో డిజిటల్ యుగంలో ప్రజల జీవితాలు మొబైల్ ఫోన్లతో ముడిపడి ఉన్నాయి. ప్రతి సందేశం, ప్రతి కాల్, ప్రతి లొకేషన్… ఇవన్నీ మన స్వేచ్ఛా జీవితాలలో భాగం. కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఒక ఆదేశం ఈ స్వేచ్ఛను ఆపదకు గురిచేస్తోంది. ‘సంచార సాథి’ అనే యాప్‌ను అన్ని స్మార్ట్ ఫోన్లలో బలవంతంగా ప్రీ -ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్, కంపెనీలను, యూనిట్స్ ను ఆదేశించింది. ఇది ఫోన్ దొంగతనాలు, స్కామ్‌లు నిరోధించడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ, ఈ వాదానికి వ్యతిరేక (సాంకేతిక నిపుణులు) వాదులు చెప్పేది ఏమిటంటే, ప్రైవసీ యాక్టివిస్టులు దీన్ని ‘స్నూపింగ్ యాప్’గా, పెగాసస్ 2.0 బ్రాండ్ అని పిలుస్తున్నారు. ఇది రక్షణ వాగ్దానమా లేక ప్రజలను పర్యవేక్షించే గూఢచార (స్పై) ఆయుధమా? ఈ వివాదం మన డిజిటల్ హక్కులపై లోతైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

‘సంచార సాథి’ యాప్ 2023 మే లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డాట్) చేత ప్రవేశపెట్టబడింది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ప్లాట్ ఫామ్‌గా, మొబైల్ యూజర్లకు ఫోన్ గుర్తింపు (ఐఎంఇఐ వెరిఫికేషన్), కోల్పోయిన డివైస్‌లు ట్రాకింగ్, అనధికార సిమ్‌లు బ్లాక్ చేయడం వంటి సౌకర్యాలు అందిస్తుంది. ప్రభుత్వం ప్రకారం, 2023 నుంచి 6 లక్షలకు పైగా కోల్పోయిన ఫోన్లు పునరుద్ధరించబడ్డాయి. ఒక్క క్షణానికి ఒక ఫోన్ ట్రేస్ అవుతోంది. 57 లక్షల సిమ్‌లు బ్లాక్ చేయబడ్డాయి, 17 వేల దొంగ ఫోన్లు అడ్డుకున్నాయి. ఇది ‘డిజిటల్ భారత్’ విజన్‌లో భాగంగా, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేస్తుందని యూనియన్ టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెబుతున్నారు. ‘ఇది ఐచ్ఛికం, డిలీట్ చేయవచ్చు’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం యాప్ ‘పర్సనల్ డేటా’ స్వయం చాలకంగా క్యాప్చర్ చేయదని, యూజర్ అనుమతి లేకుండా ఏమీ చేయదని వాదిస్తోంది. టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 కింద జారీ చేసిన ఈ ఆదేశం, 90 రోజుల్లో అమలు చేయాలని ఆపిల్, సామ్‌సంగ్, గూగుల్, షియోమీ వంటి కంపెనీలకు ఆదేశించింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఇన్‌స్టాల్ చేయాలని కూడా చెప్పారు.

కానీ ఈ ‘సేఫ్టీ ప్రామిస్’ వెనుక దాగిఉన్న వాస్తవాలు భయభ్రాంతులు కలిగిస్తున్నాయి. యాప్‌కు కాల్స్, మెసేజెస్, స్టోరేజ్, లొకేషన్, కెమెరా యాక్సెస్ అవసరమవుతుంది. ఇది (ఐఎంఇఐ) స్నూఫింగ్‌ను నిరోధిస్తుందని చెప్పినా, ఇది ప్రజల ఫోన్ యాక్టివిటీని పూర్తిగా మానిటర్ చేసే బ్యాక్ డోర్‌గా మారే అవకాశం ఉందని, అపోజిషన్ నేతలు (కొందరు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ సాంకేతిక నిపుణులు) దీన్ని ‘బిగ్ బ్రదర్’ వాచింగ్‌గా వర్ణిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ‘ఇది బిజెపి అధికారులతో ప్రజల మాటపై నిఘా పెట్టడానికి మరో ప్రయత్నం’ అని, ‘మరో డిక్టేటర్‌షిప్’ గా అభివర్ణించారు. ప్రియాంక గాంధీ ‘స్నూపింగ్ యాప్’ అని ‘ఫ్రాడ్ రిపోర్టింగ్, మధ్యలో ప్రతి పౌరుడు ఫోన్‌ను చూసే వ్యక్తి గత సమాచార సేకరణ’ అని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపి రేణుక చౌదరి పెగాసస్‌తో పోల్చి, ‘ఎంపిలు, ఎంఎల్‌ఎల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి’ అని ఆరోపించారు. ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసి ‘ప్రజల ప్రైవసీని ధ్వంసం చేసే మోడీ ప్రభుత్వం మరో ప్రయత్నం’ అని ట్వీట్ చేశారు. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ‘ఇది రీసెండ్ అయ్యే వరకు పోరాటం చేస్తాం’ అని ప్రకటించింది.

ఈ విమర్శలు ఆధార్ రహితం కాదు. 2017లో సుప్రీం కోర్టు ప్రైవసీని ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా గుర్తించింది. కానీ, మోడీ ప్రభుత్వం అప్పటి నుంచి ప్రైవసీకి వ్యతిరేకంగా నిలబడింది. ‘పెగాసస్ స్కాండల్’ లో ప్రభుత్వం ‘జవాబుదారీతనం చూపలేదు’. ఇప్పుడు సంచార సాథి 73 కోట్ల స్మార్ట్ ఫోన్లలో బలవంతంగా రావడం, ఇది మాస్ సర్వెయిలెన్స్ టూల్‌గా మారే అవకాశం ఉంది. యాప్ ‘రెడిలీ విజిబుల్’ గా ఉండాలి, ‘డిసేబుల్’ చేయకూడదని ఆదేశం. ఇది యూజర్ ఎంపికను బలహీనపరుస్తుంది. ఆపిల్, సామ్‌సంగ్ వంటి కంపెనీలు ఇంకా కంప్లయి చేయడానికి మానసికంగా తమ సంసిద్ధతను చూపలేదు. ఆపిల్ ‘ప్రైవసీ రిస్క్‌లు’ అని చెప్పి, మధ్య మార్గంలో ప్రజలు నిత్యజీవితంపై 27X7 నిఘాను ఉంచాలని చూస్తోంది. ఇది ఆర్థిక బలవంతంపై కంపెనీలు భారత మార్కెట్‌ను కోల్పోవడానికి తోడ్పడతాయి.

ప్రభుత్వ వాదనలు ఆకర్షణీయంగా ఉన్నా, వాటిలో లోపాలు ఉన్నాయి. (ఐఎంఇఐ) మిస్‌యూజ్ నిరోధం అవసరమే. కానీ.. దానికి మొత్తం పాపులేషన్‌ను స్కాన్ చేయాలా? యూరపులో (జిడిపిఆర్) వంటి చట్టాలు ప్రైవసీని ప్రాధాన్యత ఇస్తాయి. ఇక్కడ మాత్రం ‘సేఫ్టీ’ పేరుతో సర్వైలెన్స్ జస్టిఫై చేస్తున్నారు. ఈ యాప్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎవరు యాక్సెస్ చేస్తారు? పార్లమెంట్‌లో చర్చ లేకుండా రహస్యంగా జారీ చేయడం డెమోక్రసీకి విరుద్ధం అని విపక్షాలు విమర్శలు, హెచ్చరికలు చేస్తున్నాయి. వ్యతిరేకులు చెప్పేది సరైనదే. -ఇది డిసెంట్‌ను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీడియా రిపోర్టుల ప్రకారం, ఇది ‘పర్మినెంట్ సర్వెయి లెన్స్ బ్యాక్ డోర్’ గా మారవచ్చు. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, మోడీ ప్రభుత్వం ఇప్పటికే ‘లాఫుల్ ఇంటర్‌సెప్షన్’ సిస్టమ్‌ల ద్వారా స్నూపింగ్ చేస్తోంది.

ఈ వివాదం మన డిజిటల్ భవిష్యత్తును ప్రశ్నిస్తోంది. సర్వైలెన్స్ రాజ్యంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడలేరు, రాజకీయాలు చేయలేరు. ప్రభుత్వం ‘సేవా తీర్థ్’ పేరుతో పిఎంఒను మార్చుకుంటుండగా, ప్రజల హక్కులు కోల్పోతున్నాయి. ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి. పార్లమెంటరీలో చర్చ జరిగి, ట్రాన్స్‌పరెంట్ పాలసీ రూపొందించాలి. యాప్ ఐచ్ఛికంగా ఉంచి, స్ట్రాంగ్ డేటా ప్రొటెక్షన్ లాస్ తీసుకు రావాలి. లేకపోతే, డిజిటల్ భారత్ ‘డిస్టోపియన్ భారత్’ గా మారిపోతుంది. ప్రజలు మొబైల్‌లను ఆఫ్ చేసి, ప్రైవసీకై పోరాడాలి. ఇది కేవలం యాప్ వివాదం మాత్రమే కాదు. మన స్వేచ్ఛా, స్వాతంత్య్రాలపై చట్ట రీత్యా యుద్ధం చేయటమే.

– డా. కోలాహలం రామ్ కిశోర్

9849328496

అంతులేని ఆవేదనలకు పరిష్కారం ఎక్కడ?

చాలీచాలని సంపాదనతో, ఆర్థికంగా సతమతమవుతూ, బతుకుదెరువు బహు కష్టంగా మారిన నేపథ్యంలో మధ్య తరగతి జీవితాలు అల్లకల్లోల సాగరాన్ని తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులనుండి కాపాడి, ఒడ్డుకు చేర్చే శాశ్వత పరిష్కారాలను అన్వేషించడం అత్యవసరం. సమాజంలో పలు వైరుధ్యాలు తాండవిస్తున్నాయి. అహంకారమే తప్ప ఆలోచనా శక్తిలేని నూతన తరం రూపుదిద్దుకుంటున్నది. తరాల మధ్య అంతరం పెరిగింది. అంతరంగ మథనం లోపించింది. ‘తాను మునిగిందే గంగ, తాను వలచిందే రంభ..’ చందంగా మూర్ఖ భావజాలం, ఆధిక్యతా ధోరణి మానవ మస్తిష్కంలో తిష్ఠ వేసింది. స్వార్థ్ధం పరాకాష్ఠకు చేరింది. వంచనతో దర్జాగా బతికే వారు కొందరైతే, వ్యక్తిత్వంతో బతికలేక జీవశ్ఛవాల్లా జీవితాంతం మనోవేదనతో బతుకీడ్చేవారు మరికొందరు నేటి సమాజంలో అడుగడుగునా తారసపడతారు. తినడానికి తిండిలేక కొంతమంది విగతజీవులవుతుంటే, సకల సౌభాగ్యాలతో జీవిస్తూ, విలాసాల్లో తేలియాడుతూ ఏదో అసంతృప్తితో ఆత్మహత్యలకు పాల్పడేవారు మరికొందరు నేటి సమాజంలో మనకు అగుపిస్తున్నారు. యువశక్తి వ్యసనాలతో నిర్వీర్యమవుతున్నది. కలిమి కలత చెందుతున్నది. లేమి దిగులు చెందుతూ జీవనయానం సాగిస్తున్నది.

ఒకవైపు మోదం, ఇంకోవైపు ఖేదం.. ఇదే సామాజిక వైపరీత్యం. అంబరాన్ని తాకే సంబరంతో ఆడంబరాలతో దిగంబరంగా మారుతున్న నూతన విన్యాసం ఒక వైపు… జానెడు పొట్ట నింపుకోలేక, కట్టుకోవడానికి సరైన గుడ్డలేక, ఉండడానికి సరైన గూడులేక అలమటించే అభాగ్యుల దీనగాథలు మరో వైపు మానవ జీవితం లోని అంతరాలను వెక్కిరిస్తున్నాయి. విందు వినోదాల ఉల్లాసాలు వికాసానికా? విలువల విధ్వంసానికా? ఇది ప్రగతికి బాటలు వేస్తున్నదా? బీటలు పెడుతున్నదా? ఒకవైపు మధ్య తరగతి జీవుల బతుకుల్లో హాలాహలం.. మరో వైపు బరువెక్కిన కరెన్సీని విలాసాలకు వెచ్చిస్తూ కాలయాపన చేస్తున్న యువతరం కోలాహలం. ఇది కలానికందని కల్లోలం. సగటు జీవుల బతుకుల్లోని వేదనలు కాలగర్భంలో దాగున్న కనబడని సుడిగుండాల వంటివి. కష్టాల సుడిగుండాలు బలపడి మృత్యు విహంగాలై జీవిత నావను తీరం దాటే తరుణంలో ప్రళయ ప్రభంజనమై ముంచేస్తున్నాయి. జీవన యానానికి ముగింపునిస్తున్న సన్నివేశాలు హృద్యం.. మరికొంతమందికి చోద్యం. కొందరి కంట కన్నీరు! కొందరి ఇంట సిరుల పన్నీరు! సేద్యంలో విలాపం.. స్వేదానికి దగ్గని ఫలితం. కొందరి స్వేదం మరికొందరికి కరెన్సీగా మారి, కొంత మంది ధనిక యువత చేతిలో ఖరీదైన మద్యం సీసాలా పరివర్తన చెంది వెక్కిరిస్తే ఇది సమాజ వికాసమా? విలాపమా? ఒక చెంత ‘మందు’తో తనువు చాలిస్తున్న కర్షకుడు! మరోచెంత మందుతో గాండ్రిస్తున్న భోగలాలసుడు! విందు విలాసాలే జీవిత పరమార్థంగా కొందరు బతికేస్తున్నారు.

ఆర్థికంగా చితికిపోయి అతి దీనంగా మరికొందరు బతుకీడ్చుతున్నారు. విలాసాల వినువీధుల్లో ఊరేగి, ఆశించింది అందక తనువు చాలిస్తున్నారు ఇంకొందరు! బతకాలని ఉన్నా బతకనీయని బడబాగ్ని జ్వాలలు చుట్టుముడుతుంటే, గరళాన్ని మింగుతున్న సగటు జీవుల వెతలు వర్ణనాతీతం. దేశానికి ‘ముద్ద’ పెడుతూ, ముద్ద లేక గతిస్తున్న కర్షకజన చరిత్ర ఆద్యంతం అత్యంత బాధాకరం. విలాసాల్లో మునిగి ప్రేమ అంచుల దాకా పయనించి పతనమవుతున్న యువతరానికి ఉరితాళ్ళే శరణ్య మవుతుంటే, కష్టాలను భరించలేని కర్షకునికీ ఆ ఉరితాళ్ళే ఆలంబన అవుతున్నాయి. మధ్య తరగతి జీవుల ఆర్థిక బాధలకు ఆత్మహత్యలే ఆఖరి అవకాశంగా మారుతున్నాయి. అందరి గమ్యం ఒకటై వెక్కిరిస్తుంటే చోద్యం చూడడం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా విలపిస్తున్నాం. ఒకరిది అర్థవంతమైన ఆవేదన, మరొకరిది అర్థంలేని మనోవేదన.

ఇరువురూ విషాద గేయానికి పల్లవులే. నిద్దురలేని రాత్రులలో ప్రపంచం వెక్కిరిస్తుంటే పలకలేని గేయానికి చరణాలే. స్వరం తప్పిన గీతికలే. బతుకు వేదంలో శృతిలేని నాదాలే. ఇద్దరిదీ ఒకటే గమ్యం.. అదే మరణం. విలాసాల మోజుకు బానిసలై కడకు ‘మనీ’ లేక మినీ జీవితం గడపలేమని బలవుతున్న బడాయి జీవుల బతుకు చిత్రం ఒకరిదైతే, అహరహం స్వేదం చిందించి, దక్కని ఫలితంతో తనువు చాలిస్తున్న దైన్య చరిత మరొకరిది. ఇదే ఇరువురి జీవితాలలో కానరాని సారూప్యం.. అడుగడుగునా వైరుధ్యం. ఆశించినది దక్కక ఒకరు. హృదయం బరువెక్కి బతకలేక తనువు చాలిస్తున్నది మరొకరు.అర్థవంతమైన జీవితాలకు ముగింపు మరణమా? అర్థంలేని వ్యర్థవాదుల మనుగడకు మార్గమా ? విలాసాల విహంగంలా తేలియాడుతూ, కోరికల గుర్రాన్నెక్కి ఊహల్లో భ్రమిస్తూ పరిభ్రమిస్తున్న యువత తన లక్ష్యం మరచి, మత్తులో చిత్తవడం హాస్యాస్పదం. జల్సాలకు మరిగి, కోరింది దొరకలేదనే ఆవేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు, ఒక్క క్షణం ఇతరుల జీవితాల్లో ఎదురవుతున్న సమస్యలను తొంగిచూస్తే వారి సమస్యల ముందు తమ సమస్యలు అర్థంలేని చిందరవందర గీతలుగా అగుపించక మానవు. అర్థవంతమైన జీవితాలకు ముగింపు మరణం కారాదు. జీవన తీరానికి దారులు ఆత్మహత్యలు కావనే సందేశం నిజం కావాలంటే ప్రస్తుత పరిస్థితులు మారాలి.

– సుంకవల్లి సత్తిరాజు

97049 03463

సైన్యానికి క్రమశిక్షణే మతమా?

సాధారణంగానే మిలిటరీ రూల్స్ కఠినంగానే ఉంటాయి. అందులోని మాన్యువల్స్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్షలు కూడా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి క్రమశిక్షణ ఉల్లంఘనలకు ఎలాంటి మన్నింపులు, మాఫీలు ఉండవు. సైన్యంలో చేరేముందే వీటన్నింటిని గురించి ఆలోచించుకోవాలి. సాధారణ పౌరుడికి లభించే స్వేచ్ఛ కూడా కొన్ని సందర్భాల్లో సైనికులకు నిరాకరించవచ్చు. కోర్టులు కూడా సైనికుడి వాదనను త్రోసిపుచ్చుతాయి. కవాతులో భాగంగా పరమత దేవాలయంలోకి వెళ్లి పూజను ఆచరించకున్నా క్రమశిక్షణ తప్పిన కిందికే లెక్క. క్రైస్తవ మతానికి చెందిన సైనిక అధికారి సామ్యూల్ కమలేశన్ తన రెజిమెంట్ పాటించే హిందూ మత ఆచారాలను పాటించనందుకు క్రమశిక్షణ చర్యగా 2021 లో తన ఉద్యోగం కోల్పోయాడు. ఆర్మీ చట్టంలోని సెక్షన్ 19, ఆర్మీ రూల్స్‌లోని రూల్ 14 ప్రకారం తమ చర్య సక్రమమే అని సైన్యం అంటోంది. తనను తిరిగి ఉద్యోగం లోకి తీసుకోవాలని ఆయన ఢిల్లీ హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లు కూడా ఫలితం ఇవ్వలేదు. రెండు కోర్టులు సైన్యం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాయి.

పంజాబ్ లోని మూడవ కల్వరి రెజిమెంట్ లో సామ్యూల్ కమలేశన్ లెఫ్టినెంట్ కల్నల్ గా 2017 లో చేరాడు. ఆ యూనిట్‌లో హిందూ గుడి, గురుద్వారా మాత్రమే ఉన్నాయి. వారంలో ఒకసారి సైనికులంతా కవాతుగా వెళ్లి ఆ దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తుంటారు. వారితో గుడుల దాకా వెళ్లిన ఆయన హారతి సమయంలో బయటే ఉండిపోయేవాడు. ఈ ప్రవర్తన ఆర్మీ నిబంధనలకు విరుద్ధమని ఆయనకు పలుమార్లు చెప్పడం జరిగింది. ఆయన రెజిమెంటల్ పరేడ్‌లో పూర్తిగా పాల్గొన లేదని, ఆర్మీ చట్టంలోని సెక్షన్ 41 పై అధికారి ఆదేశాలను ఉల్లంఘించడం నేరమని కూడా పేర్కొంది. తన క్రైస్తవ విశ్వాసాలు ఇందుకు అనుమతించవని ఆయన అధికారులకు స్పష్టం చేశాడు. సుదీర్ఘ విచారణ తర్వాత అతను 2021 లో సర్వీస్ నుండి తొలగించబడ్డాడు.

తన తొలగింపును సవాల్ చేస్తూ కమలేశన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే మతపరమైన కవాతులో పాల్గొననందుకు ఆయనను సర్వీసు నుంచి తొలగించడాన్ని హైకోర్టు కూడా సమర్థించింది. మన సైన్యం అన్ని మతాలు, కులాలు, ప్రాంతాల ప్రజలతో రూపొందించబడింది, దీని ఏకైక లక్ష్యం దేశాన్ని రక్షించడం మాత్రమే. సైన్యం ఐక్యత వారి యూనిఫాం ద్వారా ఏర్పడుతుంది. కమలేశన్ ప్రవర్తన సైన్యం లౌకిక సూత్రాలకు విరుద్ధంగా ఉంది. తన రెజిమెంట్‌లో గుడి, గురుద్వారా ఉన్నాయని, అయితే అన్ని మతాలకు సంబంధించిన ‘సర్వ ధర్మ స్థల్’ లేదని, చర్చి కూడా లేదని కమలేశన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కొన్ని రెజిమెంట్ల పేర్లు లేదా సంప్రదాయాలు ఏదైనా మతం లేదా ప్రాంతంతో ముడిపడి ఉన్నప్పటికీ ఇది సైన్యం లౌకిక స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని కోర్టు పేర్కొంది. అధికారి ప్రవర్తన రెజిమెంట్ ఐక్యత, క్రమశిక్షణ, లౌకిక విలువలకు హాని కలిగిస్తుందని హైకోర్టు అంగీకరించింది. యుద్ధ పరిస్థితుల్లో సైన్యంలో ఇటువంటి ప్రవర్తన హానికరమని, కమలేశన్ తన సీనియర్ అధికారుల ఆదేశాల కంటే తన మతానికి ప్రాధాన్యత ఇచ్చాడని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

చివరకు సుప్రీంకోర్టు కూడా కమలేశన్ తొలగింపుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. సుప్రీం కోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను ధర్మాసనం ఒప్పుకోలేదు. పూజ లేదా హారతి లాంటివి తన క్లయింట్ విశ్వాసానికి విరుద్ధం. రెజిమెంట్ వెంట తను వెళ్లేవాడు, కానీ లోపలికి వెళ్లి పూజలు చేయలేడు. అక్కడ ‘సర్వ ధర్మ స్థల్’ లేదు. దేవాలయాలు, గురుద్వారాలు మాత్రమే ఉన్నాయి. తనను ఏదైనా పూజ చేయిస్తారేమోనని భయపడ్డాడు అని న్యాయవాది వివరించగా కోర్టు ఆ మాటలని తోసిపుచ్చింది. సైనికుల మనోభావాలను మీ క్లయింట్ గౌరవించలేదు. ఆయనను ఎలాంటి పూజలు చేయమని ఎవరూ అడగలేదు. సైనికులతో కలిసి ఉండడం ఆయన విధి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి సెంటిమెంట్‌ను రక్షించదు. దేవాలయంలోకి అడుగు పెట్టడం క్రైస్తవ మతంలో ఎక్కడ నిషేధించబడింది అని ప్రశ్నించింది. ఇది భారత సైన్యం, ఇక్కడ సెక్యులరిజం అగ్రస్థానంలో ఉంటుంది. ఆయన తోటి సైనికుల మనోభావాలను గౌరవించలేదు. ఆయన వంద విషయాల్లో మంచివారు కావచ్చు, కానీ ఈ తప్పు చాలా పెద్దది. క్రమశిక్షణ విషయంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేము. హైకోర్టు ఆదేశాలను కొనసాగిస్తాం అని సుప్రీం నిర్ణయించింది.

వ్యక్తిగత మత విశ్వాసాలు పక్కన బెట్టి సైన్యం లౌకికతకి విలువనీయడం గొప్ప విషయమే. కానీ దాని వల్ల అన్ని మతాల వారికి సమాన అవకాశాలు లభించాలి. దేవాలయ సముదాయం ఒక్క ఆవరణలో ఉంటే సైనిక క్రమశిక్షణకు తప్పే అవసరం ఎవరికీ పడదు. ఇలా ఓ మైనారిటీ వర్గానికి చెందిన అధికారి మత విశ్వాస నమ్మిక వల్ల ఉద్యోగానికే ముప్పు వాటిల్లే పరిస్థితులు రావడం విచారకరమే. అయితే ఈ కేసు కొత్తగా ఒక రాజ్యాంగపరమైన ప్రశ్నను లేవనెత్తింది అనవచ్చు. ఆర్టికల్ 25 ప్రకారం ఒక మత విశ్వాసాన్ని ప్రకటించే, ఆచరించే హక్కు సైనిక క్రమశిక్షణకు లోబడి ఉందా అనే చర్చ అవసరం.

– బి.నర్సన్, 94401 28169

హద్దుల్లేని హామీలతో అభివృద్ధి సాధ్యమా?

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల పోకడలు శ్రుతి మించుతున్నాయి. ఎంఎల్‌ఎ, ఎంపి పదవులకోసం అభ్యర్థులు ఎంతకైనా తెగించడం, కోట్లలో ఖర్చు చేయడం చూశాం. కానీ, ఒక గ్రామానికి మాత్రమే పరిమితమయ్యే సర్పంచ్ ఎన్నికల్లోనూ అభ్యర్థులు లక్షలు ఖర్చు పెట్టేందుకు వెనుకాడట్లేదు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయన్నది వట్టిమాట అని ఏనాడో నిరూపణ అయిపోయింది. పార్టీల అధినాయకులే వెనకుండి, అభ్యర్థులను బరిలోకి దింపుతున్న నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తరహాలోనే పంచాయతీ ఎన్నికలూ పార్టీలకు ‘ప్రతిష్ఠాత్మకం’గా మారుతున్నాయి. గెలిచేందుకు అడ్డదారులు తొక్కడం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, చాటుమాటుగా కోట్లు ఖర్చు చేయడం, పోలింగ్ రోజున ఓటర్లను మందు, మనీతో ప్రలోభపెట్టడం పార్లమెంటు, శాసనసభ ఎన్నికలకు మాత్రమే పరిమితమనుకునేవాళ్లు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల తీరును చూస్తే ముక్కున వేలేసుకోవలసిందే. రెండేళ్ల క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలన్నీ అలవిమాలిన, ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించాయి.

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు ఇప్పటికీ ఆపసోపాలు పడుతోంది. రాజకీయాల్లో తమ అగ్రజులు హామీలు ఇవ్వగా లేనిది, తాము ఇస్తే తప్పేమిటనే ధోరణిలో ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు సైతం ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అన్న చందాన అడ్డమైన హామీలు ఇచ్చి, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థి 15 హామీలతో రూపొందించిన మేనిఫెస్టోను చూస్తే, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా పేరొందిన భారతదేశంలో ఎన్నికల తంతు ఎంత ప్రహసనంగా మారిందో అర్థమవుతుంది. ఆడబిడ్డ పుడితే రూ. 5వేల ఫిక్సెడ్ డిపాజిట్, ఆడపడుచు పెళ్లికి పుస్తెలు, మట్టెలు, అబ్బాయి వివాహానికి రూ. 5116 రూపాయలు ఇస్తాననీ సదరు అభ్యర్థి హామీల చిట్టా విప్పింది. అంతటితో ఆగకుండా, ఇల్లు కట్టుకునేవారికి పైకప్పు వేయించుకునేందుకు రూ.21 వేలు, శస్త్ర చికిత్స అవసరమైనవారికి రూ. 15 వేల సాయం, నెలకోసారి ఊళ్లో వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తాననీ మాట ఇచ్చిందామె. తానిచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కానివని తనకే అనిపించిందో ఏమో, ఓటర్లను నమ్మించేందుకు ఏకంగా వంద రూపాయల బాండ్ పేపర్‌పై హామీలు రాసి ఇచ్చింది. పంచాయతీలలో నిధులు ఉంటేనో లేక ప్రభుత్వం మంజూరు చేస్తేనో సర్పంచులు అభివృద్ధి పనులు చేయడం కద్దు. కానీ హరితహారం నర్సరీల నిర్వహణ, గ్రామీణ పార్కులు, చెత్త డంపింగ్ యార్డులు, శ్మశానవాటికల ఏర్పాటు వంటి పనుల అమలును చేపట్టవలసిందిగా సర్పంచులపై ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చి మరీ పనులు పూర్తి చేయిస్తున్నాయి.

నిధుల మంజూరు విషయానికొచ్చేసరికి మొహం చాటేస్తున్నాయి. సొంత డబ్బు వెచ్చించి పనులు పూర్తి చేసి, బిల్లుల మంజూరు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న సర్పంచులు ఇప్పటికీ కోకొల్లలుగా కనిపిస్తారు. కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. గ్రామాలలో సర్పంచిగిరీ వెలగబెట్టేవారి వెనుక ఉండే ఇలాంటి విషాదగాథల గురించి తెలిసి కూడా ప్రస్తుత ఎన్నికల్లో పదవే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్న అభ్యర్థులను ఏమనాలి? ఏకగ్రీవాల పేరిట గ్రామాలలో జరుగుతున్న వేలం పాటల తీరు సైతం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తోంది. గ్రామస్థులంతా ఏకతాటిపైకి వచ్చి పోటీ లేకుండా ఎవరో ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎంచుకోవడం స్వాగతించదగిన పరిణామమే. ఇందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. అయితే, అక్రమార్కులు ఈ ఏకగ్రీవాలను కూడా పరిహాసం చేస్తున్నారు. పోటీదారులను ప్రలోభపెట్టి, సర్పంచ్ పదవిని తన్నుకుపోయే గద్దల వల్ల గ్రామాభివృద్ధి జరగదు సరికదా, అవినీతి పెచ్చరిల్లే ప్రమాదం పొంచి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో వేలంపాట నిర్వహించి, ఎవరు ఎక్కువగా పాడితే వారికే పదవి అప్పగించేందుకూ వెనుకాడటం లేదు. ఈసారి ఎన్నికల్లో ఇలాంటి దొడ్డిదారి ఏకగ్రీవాల సంఖ్య ఊపందుకునే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అసలే నిధుల లేమితో, పాలకుల నిర్లక్ష్యంతో నీరసిస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థకు గోరుచుట్టుపై రోకటిపోటు మాదిరిగా ఎన్నికలూ ప్రహసనంగా మారుతున్న నేపథ్యంలో గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యం సాధ్యమయ్యే పరిస్థితి కనుచూపు మేరలో కూడా కనపించడం లేదంటే అతిశయోక్తి ఏముంటుంది?

దిష్టికి చెట్లు ఎండిపోతాయా?

నేడు శాస్త్ర సాంకేతికతతో ప్రపంచం దూసుకుపోతున్నది. భారతదేశం కూడా ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణలతో ముందుకు వెళ్తున్నది. మరోవైపు మూఢ నమ్మకాలు మనల్ని అథఃపాతాళానికి నెట్టుతున్నాయి. మరి ఈ మూఢ నమ్మకాలు చదువురాని అమాయక ప్రజలే నమ్ముతారని ఆలోచన సమాజంలో ఉంది. కానీ విద్యావంతులు, పాలకులు సైతం అంధ విశ్వాసాలు నమ్ముతున్న తీరును ఆశ్చర్యపరుస్తున్నది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత కొన్ని నెలలుగా కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ దిష్టి కారణమని చెప్పడం విస్మయం కలిగిస్తుంది. ఆయన కోట్లాది ప్రజలకు సినిమా హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఇలాంటి అశాస్త్రీయమైన మాటలు అంధకారానికి నిదర్శనం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇవి ప్రాంతీయ విద్వేషాలను కూడా రగిలిస్తున్నాయి. అసలు కొబ్బరి చెట్లు ఎండి పోవడానికి సముద్రపు నీరు వెనక్కి రావడం, మురుగు కాలువ నీటిలో లవణాల శాతం పెరగడం వంటి కారణాలను నివేదికలు చెబుతున్నాయి. మహిమ గల వ్యక్తిగా దిష్టి గురించి చెప్పడం పాలకుల అజ్ఞానానికి నిదర్శనం. ఇది ఒక రకంగా రాజకీయంగా తన ఉనికి మూఢ నమ్మకాలతో మూడు పెట్టినట్టుంది. ఇటీవల కాలంలో దేశంలో కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కూడా మూఢత్వాన్ని పెంచి పోషించే వ్యాఖ్యలు చేస్తున్నారు.

మనిషి వైజ్ఞానిక ఫలాలు అనుభవిస్తూనే.. అంధత్వంలోకి జారుకుంటున్నాడు. ఇప్పటికే మంత్రగాళ్ళు, జ్యోతిష్కులు, బాబాలు, స్వాములతో ప్రజలు మోసపోతున్నారు. బాణమతి, చేతబడినీ నమ్ముతున్నారు. ఎడమ కాళ్లకు నల్లదారం కట్టుకునే సంస్కృతి పెరుగుతున్నది. తల్లి కడుపులోంచి పుట్టబోయే బిడ్డను ముహూర్తాలు చూస్తున్నారు. మనిషి మరణానికి సైతం మంచి చెడు చూస్తున్నారు. ప్రజల్లో అంధ విశ్వాసాలు ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. క్షుద్రపూజల వంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జోగిని వ్యవస్థ కొనసాగుతుంది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలోని ప్రాంతంలో మెజారిటీ గ్రామాల ప్రజలు వేములవాడ ప్రాంతానికి చెందిన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీరాజరాజేశ్వర స్వామి పేరు మీద లింగధారణ చేసుకొని దేవునికి అంకితమవుతున్నారు. ఈ ఆచారం ముఖ్యంగా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల్లోనే ఉంది. ఏ ఒక్క అగ్రకులం కూడా ఇలాంటి లింగ ధారణ చేయరు. దేవుని పేరిట ఆచారంలో కూడా అట్టడుగు వర్గాలను బలి చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ భూమి పూజ సందర్భంగా గర్భిణీ మహిళలు, వితంతువులు కొబ్బరి కాయలు కొట్టడానికి వెనుకాడుతున్నరని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇది మూఢాచారాలు, విశ్వాసాలు, అవగాహన లోపాలకు నిదర్శనమన్నారు. ఇంత సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు శాస్త్రీయ జీవన విధానాన్ని అవలంబించకపోవడం దురదృష్టకరం.

నేడు సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ గ్రామ ప్రాంత ప్రజలు అస్వస్థతకు గురైనప్పుడు బాబాలను, స్వాములను, సిగం ఊగే వాళ్లను, పాస్టర్లును ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చే పసుపు, కుంకుమ, విభూతిని, నిమ్మకాయలను, కొబ్బరికాయలను రాత్రిపూట ఆది, గురువారం, అమావాస్య రోజున గ్రామ ప్రాంత నడి వీధుల్లో పెట్టి వారి రోగాలకు స్వాంతనగా భావిస్తారు. పట్టణాల్లో కొందరు విద్యావంతులు సైతం ఇలాంటి అజ్ఞానాన్ని ఆచరించడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల రంగురాళ్లు ధరించడం, సంఖ్యా శాస్త్రం ఆధారంగా పేర్లు మార్చుకోనే వారి సంఖ్య పెరిగింది. ఇప్పటికీ కొన్ని గ్రామాలో విజృంభించిన వ్యాధులను తగ్గించుకోవడానికి జంతుబలులు, నరబలులు చేస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట మండలం, మర్రివానిపల్లి గ్రామంలో ఐదు నెలలుగా వరుస మరణాలు సంభవించాయి. గ్రామానికి కీడు సోకిందని, వరుస మరణాలు జరుగుతున్నాయని భావించిన ప్రజలు, ఒక పండితుడి సూచనతో ఆ ఊరిని విడిచిపెట్టి, పొలాల వద్దకు వెళ్లి వంటలు చేసుకుని భోజనం చేశారు. ఇలాంటి మూఢ నమ్మకాలను అజ్ఞానులతో పాటు విజ్ఞానులు కూడా పాటించడం చాలా విచారించదగ్గ విషయం. మంత్రాల నేపంతో దాడులు, హత్యలు పెరుగుతున్నాయి. మానసిక బలహీనత వలన విచక్షణ కోల్పోయి అతీంద్రియ శక్తులు నమ్మడం వల్లనే సమాజంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఇవి శాంతిభద్రకు విఘాతం కలిగిస్తున్నాయి.

ప్రజల్లో రోజురోజుకు శాస్త్రీయ వైఖరి, ప్రశ్నించే తత్వం లోపించడమే ఈ గుడ్డి నమ్మకాలకు కారణం. ఇదే కాకుండా పాలకుల్లో కూడా శాస్త్రీయ వైఖరి లోపించడం, ప్రభుత్వ విధానాలు కూడా దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. మితిమీరిన మతవిశ్వాసాలు, అశాస్త్రీయ బోధనలు, ప్రభుత్వ విధానాలు, మీడియా ప్రకటనలు ప్రజల్ని మరింత మూఢత్వ దిశగా ప్రేరేపిస్తున్నాయి. మన దేశంలో గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులకు ఇచ్చినంత ప్రాముఖ్యత విద్యాలయాలకు ఇవ్వడం లేదు. సైన్స్ ఆవిష్కరణల కన్నా సూడో సైన్స్‌కు ఆదరణ పెరిగిపోతుంది. భూత వైద్యానికి, అతీంద్రియ శక్తులకు ఆదరణ పెరుగుతుంది. సమాజ అభివృద్ధికి మూలం విజ్ఞాన శాస్త్రవే. కావున విద్యాసంస్థల్లో శాస్త్రీయ ప్రగతిశీల విద్య అభ్యసనం జరగాలి. ప్రభుత్వాలు హేతుబద్ధ, శాస్త్రీయ ఆలోచన విధానాలను ప్రోత్సహించాలి. నిత్య సమస్యలను ఎదుర్కోవడానికి గల శాస్త్రీయ పరిష్కారాలను ప్రజలకు తెలియచేయాలి. సైన్స్ ప్రచార సంస్థలు కూడా ఆ దిశగా కృషి చేయాలి. అప్పుడే దేశంలో వేళ్లూనుకొని ఉన్న సామాజిక రుగ్మతలను నిర్మూలించవచ్చు. మన విశ్వవిద్యాలయాలు పరిశోధన కేంద్రాలుగా ఎదగడానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించాలి. ఇవీ నవ కల్పనలకు నాంది పలుకాలి. యువతను పరిశోధన వైపు ఆకర్షించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. రాజకీయ నాయకుల ఆలోచన, ప్రభుత్వ పరిపాలన ప్రగతి శీలంగా ఉండాలి. అప్పుడే ప్రజల్లో వైజ్ఞానిక చైతన్యం వస్తుంది.

వికలాంగులకేదీ ‘స్థానిక’ ప్రాతినిధ్యం?

రాజకీయ ప్రాతినిధ్యం అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ సమాన హక్కుగా ఉండాలి. అయితే దీన్ని సాకారంగా అమలు చేయడంలో మన సమాజం ఇంకా అనేక వర్గాలకు ముఖ్యంగా వికలాంగులకు పూర్తి న్యాయం చేయలేకపోయింది. ఎన్నికల సమయంలో వికలాంగుల ఓట్ల కోసం తాపత్రయపడతారు. కానీ వారి సమస్యలపై వారే స్వరం వినిపించుకునే స్థాయిలో స్థానిక సంస్థలు, చట్టసభల్లో పాతినిధ్యం మాత్రం లభించడంలేదు. ఆల్ ఇండియా కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టో 2024లో చత్తీస్‌గఢ్ మాదిరిగా వికలాంగులకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పిస్తాం అని స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హామీని ప్రపంచ వికలాంగుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా అమలుకు అంగీకారం తెలియజేస్తే తెలంగాణలో సుమారు 25 వేలకు పైగా వికలాంగులకు రాజకీయ అవకాశాలు లభిస్తాయి. ఇందులో సగం ప్రాతినిధ్యం వికలాంగ మహిళలకే దక్కుతుంది. తెలంగాణలో సుమారు 10 లక్షల మంది వికలాంగులు నివసిస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులను కలుపుకుంటే ఇది 50 లక్షలకు పైగా ఓటర్ల ప్రభావం కలిగిన వర్గం. కానీ రాష్ట్రంలోని స్థానిక సంస్థలు, పంచాయతీలు, మండల పరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వీరికి ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. చాలా మంది వికలాంగులు చదువుకున్నవారు, నైపుణ్యం, సామర్థ్యం ఉండి ప్రజాప్రతినిధులుగా పని చేయగలిగినవారు ఉన్నారు.

కానీ చట్టపరమైన అవకాశాలు లేనందున వికలాంగులు ప్రాతినిధ్యానికి దూరంగా ఉండవలసి వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు పలు సంక్షేమ పథకాలద్వారా వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నది. కానీ నిజమైన చేయూత అనేది రాజకీయ ప్రాతినిధ్యంలోనే ఉంది. కొన్ని దశాబ్దాలుగా వికలాంగులు తమ జీవితాలపై ప్రభావంచూపే నిర్ణయాల్లో భాగస్వాములుగా ఉండలేకపోతున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ఒక రాజ్యాంగ హక్కు మాత్రమే కాక, ఒక నైతిక బాధ్యత కూడా. ఇది గౌరవం, సమానత్వం, సమగ్ర అభివృద్ధికి దారితీసే కీలక మార్గం. తెలంగాణలో గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు ఎక్కడా వికలాంగులకు నామినేట్ లేదా రిజర్వేషన్ ప్రాతినిధ్యం లేదు. 2016 నుంచి అమలులో ఉన్న వికలాంగుల హక్కుల చట్టం Rights of Persons with Disabilities ACT (2016) ప్రకారం పాలన, రాజకీయ ప్రాతినిధ్యంలో వికలాంగులకు సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్తుంది. కానీ రాష్ట్రంలోని చట్టాలు ఇంకా దీనికి అనుగుణంగా సవరణ పొందలేదు. వికలాంగులు ఎన్నికలలో పోటీ చేయలేక, చట్టసభలలో నామినేట్ చేయబడక వారిపై తీసుకునే విధానాల్లో పాల్గొనలేక అణచివేతకు గురవుతున్నారు. 2019లో చత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చట్ట సవరణలు చేసి, ప్రతి పంచాయతీలో ఒక వికలాంగ పురుషుడు, ఒక వికలాంగ మహిళను నామినేట్ చేసే విధంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది వికలాంగుల రాజకీయ ప్రాతినిధ్యానికి చట్టబద్ధత కల్పించిన తొలి చలనం. తరువాత రాజస్థాన్ రాష్ట్రం కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. 2021లో స్థానిక సంస్థల్లో వికలాంగుల నామినేషన్ ద్వారా పాలనా ప్రమేయం కల్పించింది. ఏప్రిల్ 2025 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి వికలాంగులకు అన్నిస్థాయిలలో నామినేట్ చేయడం ప్రారంభించింది. వికలాంగులకు స్థానికి సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ప్రతినిధులుగా ఎంపికైన వికలాంగులు స్థానిక సమస్యలపై నేరుగా మాట్లాడగలుగుతారు. ప్రభుత్వ ప్రణాళికల్లో వికలాంగుల అవసరాలకు తగిన ప్రాధాన్యం లభిస్తుంది. సామాజికంగా వారిపై ఉన్న అనవసర దృష్టి కోణాలు తొలగిపోతాయి. ఇది ఆర్థికంగా ప్రభుత్వం మీద భారం కాదు. ఒకసారి నామినేషన్ చట్టం అమలు చేస్తే అది ప్రజాస్వామ్య నిర్మాణంలో ఒక పెద్ద పునాది రాయవుతుంది. చత్తీస్‌గఢ్ మాదిరిగా, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాల్లో సవరణలు చేసి గెజిట్ ద్వారా ఒక వికలాంగ పురుషుడు, ఒక వికలాంగ మహిళను ప్రతీ పంచాయతీ స్థాయిలో నామినేట్ చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.

ఈ ప్రక్రియకు RPWD Act, 2016 (Rights of Persons with Disabilities Act) ద్వారా చట్టపరమైన గౌరవం కూడా ఉంది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243 డి, 243టి ప్రకారం స్థానిక సంస్థలలో బలహీనవర్గాలకు రిజర్వేషన్ కల్పించినందున తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాలలో అవసరమైన సవరణలు తీసుకురావాలి. చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల పంచాయితీరాజ్ చట్ట సవరణలు పరిశీలించాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ ఇచ్చిన హామీని అమలు చేయడంలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. ఇది నిజమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని సాధించే చారిత్రక అవకాశంగా నిలుస్తుంది. వికలాంగుల హక్కులు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం అనే అంశాలు ఈ రోజుల్లో సమాజంలో ప్రాధాన్యత కలిగినవిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో, తెలంగాణ రాష్ట్రం చరిత్రాత్మకమైన, సమానత్వాన్ని ప్రతిబింబించే నిర్ణయం తీసుకునే గొప్ప అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది.

వికలాంగులకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించడంవల్ల ఈ చర్య రాష్ట్రానికి ఆర్థికంగా భారంగా ఉండదు. కానీ ఇది సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య మార్గంలో ఒక గొప్ప అడుగు. స్థానికంగా వికలాంగుల స్వరం వినిపించాలంటే వారికి అధికార భాగస్వామ్యం కల్పించాల్సిందే. ఇది సమసమాజ నిర్మాణానికి అవసరమైన మానవ హక్కుల దిశగా ముందడుగు. చట్టపరంగా అవసరమైన సవరణలు చేసి గెజిట్ నోటిఫికేషన్‌ద్వారా వికలాంగులను స్థానిక సంస్థల్లో నామినేట్ చేసే విధంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే తీసుకుని పంచాయతీలు, మండల పరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ హామీని ప్రపంచ వికలాంగుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా అమలు చేస్తే అది రాజకీయంగా వికలాంగుల చరిత్రలో కీలక మలుపుగా నిలుస్తుంది. ఇది నిజమైన ప్రాతినిధ్యం కల్పించే చరిత్రాత్మక అవకాశం. ఇది కేవలం హక్కుల కోసం పోరాటం కాదు. ఇది సామాజిక న్యాయానికి అంకితమైన ఉద్యమం. 

దైనంపల్లి మల్లికార్జున్

94903 00985

పార్లమెంట్ మెరుగ్గా పనిచేస్తేనే స్ఫూర్తి

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం (1.12.2025) ప్రారంభమయ్యాయి. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 20 రోజుల పాటు జరుగుతాయి. కానీ ఈసారి వాటిని 15 రోజులకే కుదించారు. ప్రవేశ పెట్టిన బిల్లులపై ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసేందుకు సమగ్రంగా చర్చించడానికి విపక్షాలకు ఇదో అవకాశం. కానీ ఏదో ఒక అంశంపై పట్టుపట్టి పదేపదే సమావేశాలను బహిష్కరించినట్టయితే చర్చించే అవకాశాలను విపక్షాలు కోల్పోతాయి. అంతేకాదు ప్రభుత్వం ముందు ఒక రాజకీయ క్రీడగా మిగిలిపోతారు. గత కొంతకాలంగా పార్లమెంట్ సమావేశాల తీరుతెన్నులు పరిశీలిస్తే అలాగే ఉంటున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు ముందు నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో చక్కగా ‘ధర్మోపదేశాలు’ వెలువడుతుంటాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని అధికార పక్షంనుంచి అభ్యర్థనలు వస్తుంటాయి. ప్రతి అంశంపై సమగ్రంగా చర్చ జరగాలన్న అభిప్రాయాలు వస్తుంటాయి. కానీ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి ఎవరికి వారే యమునా తీరే అన్న విధానం బయటపడుతుంది.

ఏదో ఒక అంశంపై తప్పనిసరిగా చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టడం, అధికార పక్షం మొండికెత్తడం, దాంతో విపక్షాలు సమావేశాలను బహిష్కరించడం మళ్లీ చివరి దశ లోనే బహిష్కరణల నుంచి విపక్షాలు వెనక్కి తగ్గి హాజరవుతుండటం పరిపాటి. మొత్తం మీద సమావేశాలు ముగిశాయి అని అటుఇటు సంతృప్తి పడుతుంటారు. సోమవారంనాడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా అంతరాయం తప్పడం లేదు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ప్రధాని మళ్లీ విమర్శలకు తెరలేపారు. ప్రతిపక్షాలకు చురకలంటించామన్న ఆత్మసంతృప్తి ప్రధాని ప్రసంగంలో వినిపించింది. క్రియాశీలక చర్చలు జరిగితేనే చట్టసభలకు సార్థకత అని సభ్యులకు హితోపదేశం చేసిన ప్రధాని మోడీ తరువాత తన స్వరం మార్చి సమావేశాల్లో డ్రామాలొద్దు.. కావాలంటే టిప్స్ ఇస్తానని విపక్షాలను కవ్విస్తూ ఎత్తిపొడిచారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి. మరి అలాంటప్పుడు అఖిలపక్ష సమావేశాలెందుకు? బుజ్జగింపు మాటలెందుకు? అఖిలపక్ష సమావేశాల వల్ల ఒరిగిందేముంది? విపక్షాలు కూడా ప్రశ్నోత్తరాల గంటపై ఆందోళనకు దిగడంతో కొంతసేపు సమావేశాలకు అంతరాయం ఏర్పడింది. దీన్ని బట్టి సమావేశాలు అర్థవంతంగా కొనసాగిద్దామన్న స్ఫూర్తి సభ్యుల్లో కొరవడినట్టు విమర్శలు వస్తున్నాయి.

ఈసారి సమావేశాల్లో ఎస్‌ఐఆర్ (ఓటర్ల జాబితా సమగ్ర సవరణ) నిర్వహిస్తున్న తీరుపై విపక్షాలు గట్టిగా చర్చ జరగాలని పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత న్యాయస్థానం వద్ద కూడా ఎస్‌ఐఆర్‌పై అనేక పిటిషన్లు దాఖలై ఉన్నాయి. దీనిపై ప్రభుత్వ వైఖరి ఏమిటో అందరికే తెలిసిందే. కొన్ని సార్లు ఉన్నత న్యాయస్థానం ఎస్‌ఐఆర్ విషయంలో జోక్యం చేసుకోవడం జరుగుతోంది. అందుకని దీనిపై కూలంకషంగా చర్చ జరగాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అన్నది ప్రశ్నార్థకం. ప్రజాస్వామ్య సమతూకానికి ఓటర్ల సమగ్ర ప్రక్షాళన అవసరం అన్నవిషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ లోపాలను ఎత్తి చూపినప్పుడు దానిపై చర్చ జరగడం అవసరం. ఈ సమావేశాల్లో 13 బిల్లులు ప్రవేశపెట్టాలని సిద్ధమవుతున్నారు. అలాగే ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద ఆత్మాహుతి కారు బాంబు పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత, కార్మిక కోడ్‌లుపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా పాలక వర్గాల నుంచి ఎలాంటి హామీ రాలేదు. సాధారణ రుతుపవనాల వర్షాల కన్నా భారీ వర్షాలు కుండపోతగా కురియడంతో పంటలు దెబ్బతిని రైతులు కష్టనష్టాల పాలయ్యారు.

దేశరాజధానిని కకావికలం చేస్తున్న వాయు కాలుష్యం, భారత్ అమెరికా సంబంధాలపై మన దేశీయ విధానం, ఇవన్నీ చర్చకు రానున్నాయి. పార్లమెంట్ సభ్యులు చర్చించాల్సిన అవసరాన్ని విశాల దృక్పథంతో గుర్తించడానికి బదులు, స్వల్పకాలిక చర్చకు కూడా పాలకవర్గాలు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఏమనుకోవాలి? ఏది చర్చించాలో ముందుగానే నిర్ణయించడం అవి తప్పితే మరేదైనా చర్చకు తీసుకు వస్తే నిరాకరించడం పార్లమెంట్ సమావేశాల విలువలను తగ్గించడమే అవుతుంది. ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలు వెల్లడించడానికి తగినంత సమయం కేటాయించక పోతే, ఆమేరకు ప్రభుత్వ ఆలోచనా విధానాల్లో మార్పు రాకుంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి విచ్ఛిన్నమవుతుంది. దేశసమస్యలపై చర్చించడానికి పార్లమెంట్ తప్పితే మరేదైనా వేదిక ప్రతిపక్షాలకు ఉంటుందా? గత వర్షాకాల సమావేశాలన్నీ నిరంతరం అంతరాయాలతోనే ముగిశాయి. సమావేశాల నుంచి ఫలితాలు అత్యంత అల్పరేటింగ్‌లో కనిపించాయి. కేటాయించిన సమయం చర్చలతో అర్థవంతంగా వినియోగం కావలసి ఉండగా లోక్‌సభ కేవలం 29 శాతం, రాజ్యసభ 34 శాతం మాత్రమే పనిచేశాయి.

అలాగే పార్లమెంట్ సమావేశాల్లో అత్యంత ముఖ్యమైన సమయంగా పేర్కొనే ప్రశ్నోత్తరాల సమయం కూడా లోక్‌సభలో 23 శాతం, రాజ్యసభలో 6 శాతం పరమ అధ్వాన్నంగా వినియోగమయ్యాయి. గత సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్, ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) అంశాలే పార్లమెంట్ సమావేశాలను ఎక్కువగా స్తంభింప చేశాయి. ఈసారి ఇతర ముఖ్యాంశాలతోపాటు ఎన్నికల కమిషన్ తీరు మళ్లీ చర్చకు వస్తే పార్లమెంట్ సమావేశాల సమయాన్ని వృథా చేసిన వారవుతారన్న అభిప్రాయం రాజకీయ నిష్ణాతుల్లో కనిపిస్తోంది. స్వేచ్ఛగా, నిష్కర్షగా చర్చించడానికి ఏమాత్రం అవకాశంఇవ్వని పాలకవర్గాల మొండితనం ఒకవైపు, తాము లేవనెత్తిన అంశాలపై తప్పనిసరిగా చర్చించాలన్న విపక్షాల డిమాండ్లు, నిరసనలుతో అంతరాయాలు మరోవైపు కొనసాగితే పేరుకే ప్రజాప్రతినిధుల సభ మరేమీ కాదన్న అధోగతికి పార్లమెంట్ సమావేశాలు దిగజారిపోతాయి.