Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

vaycasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

vaycasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

vaycasino

Atlasbet Giriş

Wbahis

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

Wbahis

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

ఐబొమ్మ రవిని ‘హీరో’ చేసిందెవరు?

ఐ బొమ్మ రవి. ఈ పేరుకు ఈ మధ్య కాలంలో మంచి ప్రాచుర్యం వచ్చింది. రవి చేసింది తప్పే. సినిమా ఇండస్ట్రీకి నష్టమే. చట్టం ప్రకారం శిక్షార్హమే. అయినా.. సామాన్యులు మాత్రం ఆయనను ‘రాబిన్ హుడ్’ లేదా ‘మధ్యతరగతి దేవుడు’ అని కొనియాడుతున్నారు. సినీ ప్రముఖులు రవిని తప్పు బడుతున్నారు. పోలీసులు రవి వెనుక ఉన్న కథ మొత్తం బయట పెడతామని చెప్పినా.. సామాన్యుల్లో మాత్రం రవికి మద్దతు తగ్గటం లేదు. పైరసీ తప్పే అని చెబుతూనే మధ్య తరగతి సినీ అభిమానులు రవికి అండగా నిలుస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రవిని అరెస్ట్ చేసిన పోలీసులు కాదు. ప్రధాన కారకులు సినీ ప్రముఖులు. రవిని ఇంతలా సాధారణ ప్రజలు అభిమానిస్తున్నారంటే సినీ ప్రముఖులు అలర్ట్ కావాల్సిందే. అసలు రవి సినిమాల వైపు మధ్య తరగతి ప్రజలు ఎందుకు ఆసక్తిగా ఉన్నారనే విషయం సినీ ప్రముఖులకు తెలియదా? తెలిసినా తెర మీద నటించినట్లుగానే బయట నటిస్తున్నారా? తమ రెమ్యునరేషన్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడని హీరోలు.. ఖర్చు విషయంలో ఆలోచన చేయని దర్శకులు.. అవసరానికి మించి ప్రతిష్ఠకు పోయి అప్పుతెచ్చి మరీ సినిమాలు తీసుకున్న నిర్మాతలు.. ప్రేక్షకులను తమ ధరలతో భయపెడుతున్న సినిమా హాళ్లు.. అందులోని రేట్లతో కొనకుండానే షాక్ కొట్టే క్యాంటీన్లు.. ఇలా ఎక్కడ చూసినా అంతు లేని దోపిడీ. బలి అవుతుందని సామాన్యుడే.

థియేటర్‌లలో అమ్మే పాప్‌కార్న్, సమోసాలు, కూల్‌డ్రింక్స్, అలాగే స్క్రీన్‌పై రన్ అయ్యే ప్రకటనలు ఈ మొత్తం ఆదాయానికి నిర్మాతకు ఎలాంటి సంబంధం లేదని, వాటిలోనుంచి ఒక్క రూపాయి కూడా నిర్మాత జేబులోకి రాదని ప్రముఖ నిర్మాత ఎస్.కే.ఎన్. (శ్రీనివాస కుమార్) తన ఎక్స్ ఖాతాలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒక సగటు కుటుంబం సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లినప్పుడు మొత్తం 2,178 రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ మొత్తం నుండి నిర్మాతకు కేవలం రూ. 372 మాత్రమే వస్తుందని ఆయన వివరించారు. మిగిలిన డబ్బు ఎక్కడికో ఎలా వెళ్తుందన్న వివరాలు ఇలా ఉన్నాయి: టికెట్ షేర్, మెయింటెనెన్స్ ఫీజు, థియేటర్‌లో అమ్మే F&B (Food & Beverages) ద్వారా మల్టీప్లెక్సులు మొత్తం రూ.1,545.33 వరకూ తీసుకుపోతాయి. ప్రభుత్వానికి జిఎస్‌టి రూపంలో రూ.182 వెళ్తుంది. ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన బిఎంఎస్ అయితే రూ. 78.67 వసూలు చేస్తుంది. మొత్తంగా చూస్తే నిర్మాతకు వచ్చే వాటా కేవలం 17% మాత్రమే అని ఆయన ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

అయితే, ఎస్.కే.ఎన్ చేసిన ఈ పోస్టుపై సినీ ప్రేక్షకులు ప్రశ్నల వర్షం కురిపించారు. థియేటర్లలో తినుబండారాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న విషయాన్ని చర్చకు తెచ్చిన అభిమానులు థియేటర్‌లో ఒక చిన్న పాప్‌కార్న్ కోసం మూడు వందలు, కూల్ డ్రింక్ రెండు వందలు, వాటర్ బాటిల్‌కే 150 వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ దోపిడీపై మీరు మాత్రం ఏమీ చెప్పడం లేదెందుకు? అని ప్రశ్నించారు. తినుబండారాల ధరలపై నియంత్రణ మీ చేతుల్లో లేకపోతే, ఆ ధరల వల్ల ఇబ్బందిపడుతున్న ప్రేక్షకుల తరఫున పరిశ్రమ పెద్దలు ముందుకు వచ్చి మాట్లాడటం, పరిష్కారం కోరడం మీ బాధ్యత కాదా? నిర్మాతకు ఆ ఆదాయంలో వాటా లేకపోతే, ప్రేక్షకులను రక్షించేందుకు కనీస ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదని అభిమానులు మండిపడ్డారు. ఇక్కడ ఒక్కటే స్పష్టంగా అర్థమవుతుంది, ఎవరి లాభాలు వారికి కావాలి. ఒకవైపు సినీ పరిశ్రమ సాధారణ ప్రేక్షకుడి శ్రమ దోచుకోవటానికి అలవాటుపడితే, మరోవైపు సామాన్యుడి బలహీనత సొమ్ము చేసుకునేందుకు ఐ రవి లాంటి వారు ఎంట్రీ ఇచ్చారు. అంతే, సామాన్యుడు కోరుకుందీ.. రవికి కావాల్సింది ఒక్కటే.

రవి పైరసీ చేయటం నేరమే. శిక్షకు అర్హుడే. మరి.. సినిమా అభిమానించే ప్రేక్షకులు ప్రీమియర్ షో.. బెనిఫిట్ షో.. ప్రత్యేక షోల పేరుతో వందల రూపాయాల టికెట్లు వసూలు చేయటం ఏమనాలి? సినిమా టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే, ప్రజలు పైరసీ వైపు వెళ్లే పరిస్థితి ఉండదు కదా అని వాదిస్తున్న వారు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకొని మొదటి రెండు వారాల పాటు టికెట్లు రేట్టు పెంచుకునేందుకు వీలుంటుంది. అలాగే పాప్‌కార్న్ రేట్ల విషయంలోనూ జిఎస్‌టిని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ 2023లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, పాప్‌కార్న్, బెవరేజస్ లూజ్ సేల్స్ పేరుతో రూ.150 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారు. రూ.30 ఉండే పాప్ కార్న్ రూ.700 వరకు అమ్ముతుంటే, సినిమాలు ఏ విధంగా చూడాలని నిలదీస్తున్నారు.

ఐ బొమ్మ సినిమాలు చూడటం కోసం వ్యక్తిగత సమాచారాన్ని లాగిన్ కోసం ఇచ్చి మరీ చూస్తున్నారంటే సినిమా కోసం టికెట్ల నుంచి ధియేటర్ల వరకు జరిగే దోపిడీ కంటే ఇది డేంజర్ కాదని ప్రేక్షకులు డిసైడ్ అయినట్లుగానే భావించాలేమో. సినీ పెద్దలు మాత్రం ఐ బొమ్మను తప్పు బడుతున్నారు. ప్రేక్షకుల ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వటం లేదు. సినీ పరిశ్రమ ఇలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తే దోచుకుంటున్నంత కాలం వారు ఐ బొమ్మ లేకుంటే ఓటీటీ… అదీ కాకుంటే టీవీల్లో వచ్చే వరకూ వేచి చూస్తారు. ఈ సినిమా పేరుతో జరిగే దోపిడీ భరించే సహనం ప్రేక్షకుడు కోల్పోయాడు. ఇప్పటికైనా నిర్మాత నుంచి థియేటర్ యజమాని వరకు తీరు మార్చుకోవాలి ఐ బొమ్మ రవి వ్యవహారం స్పష్టం చేస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఐ బొమ్మ రవిని ప్రేక్షకులు రియల్ హీరోగా చూడటం వెనుక వారి ఆవేదన ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. ఇది రీల్ హీరోలకు అర్దం అవుతుందా… లేదంటే మరో ఐ బొమ్మ పుట్టుకురావాల్సిందేనా.

– బాలకృష్ణ ఎం

(సీనియర్ జర్నలిస్ట్)

సినిమా పైరసీ ఇప్పట్లో ఆగేది కాదు

పైరసీ అనేది ప్రపంచవ్యాప్త దృగ్విషయం. ఇది ప్రపంచమంతటా ఉంది. దీనిని పూర్తిగా నిర్మూలించడం ఆచరణాత్మకంగా అసాధ్యం. భవిష్యత్తులో ఎలా ఉంటుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి ఈ రోజు ఐబొమ్మను పట్టుకున్నారు. ఇంతకు ముందు కూడా మరొకరిని పట్టుకున్నారు. వారిని పట్టుకున్నంతమాత్రాన పైరసీ ఆగిపోతుందా? ఐ బొమ్మ రవిని పట్టుకున్న తర్వాత కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. కాబట్టి ఐ బొమ్మతోనో లేదా మరొకరితోనో ఇది ఆగదు. పైరసీ వల్ల నష్టం ఎంత? ఎంత నష్టం జరుగుతుంది? నాకు తెలిసినంత వరకు, వీడియో సినిమా వచ్చినప్పుడు సినిమారంగంలో పైరసీ మొదలైంది. అంతకు ముందు వీడియో సినిమా 16ఎంఎంలో చేసేవారు. 35 ఎంఎం సినిమాను 16ఎంఎంలో చేసి రోడ్ల మీద, పండుగల సమయంలో రాత్రిపూట రోడ్డు మీద ప్రదర్శించేవారు. కాబట్టి అప్పట్లో అది ఒక రకమైన పైరసీ. తర్వాత వీడియోలు వచ్చిన తర్వాత, వీడియో పార్లర్లలో వీడియోలు వేసేవారు. నగరాల్లో ప్రదర్శించేవారు. వీడియో క్యాసెట్లను అద్దెకు తీసుకుని ఇంట్లో సినిమాలు చూసేవారు. తర్వాత సీడీలు, డీవీడీలు వచ్చాయి. ఈ విధంగా, పైరసీ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, అది ఆగదు. అది ఆగలేదు కూడా.

ఈ పైరసీ ఎక్కడి నుండి వస్తోంది? అన్నింటికంటే ముందు, ఇది ఎక్కడ పుడుతుందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేదు. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత కూడా పైరసీ పెరిగింది. పైరసీ నాణ్యత పెరిగింది. ఇంతకు ముందు, థియేటర్ ప్రింట్ ఉన్నప్పుడు, థియేటర్లో నేరుగా ప్రదర్శించేవారు. దానిని నేరుగా కాపీ చేయడం కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు దీనికి ప్రక్రియ ఏమిటో నాకు తెలియదు, కానీ ఇది చాలా సులభం అయిపోయింది. సెల్ ఫోన్లు వచ్చాక, ఇది మునుపటి కంటే సులభం అయింది. ఇది కాకుండా, మన సినిమా థియేటర్లన్నింటిలోనూ శాటిలైట్ల ద్వారా సినిమాలు పంపే కొత్త ప్రక్రియ ఉంది. కాబట్టి బహుశా సినిమా పరిశ్రమకు చెందిన కొందరు కూడా పైరసీ చేస్తూ వారికి సహాయం చేస్తున్నారేమో. వాళ్ళు హార్డ్ డిస్కులు ఇస్తున్నారు కదా? అక్కడి నుండి కూడా జరగవచ్చు. అయితే, థియేటర్ నుండి తీసేది మరో రకం. ఇలా మూడు నాలుగు రకాలు ఉన్నాయి. వారికి సినిమా ఎక్కడి నుండి వస్తోంది? ఎలా తీసుకువస్తున్నారు? ఎవరు తీసుకువస్తున్నారు? అసలు సమస్య ఏమిటంటే, దీని మూలం ఎక్కడి నుండి వస్తుందో అక్కడే ఉంది. దాన్ని తొలగించనంతవరకు, పైరసీ ఆగదు. పైరసీ బయటకు వచ్చింది. దొంగ అసలైన వాడు కాదు. చూసినవాడిని పట్టుకుంటామని అంటారు, లేదా అమ్మిన వాడిని పట్టుకుంటారు. ఇచ్చిన వాడిని పట్టుకుంటారు. కానీ అది ఎక్కడి నుండి వచ్చింది? ఐ బొమ్మకు ఎవరు సరఫరా చేశారు? సరఫరా చేసిన వాడు థియేటర్లో తీసిన వాడు కాదు. థియేటర్లో తీసిన వాడు వేరే.

కానీ అసలు ప్రింట్ వారికి ఎలా వచ్చింది? కాబట్టి, ఇప్పుడు మనం థియేటర్లకు కంటెంట్ ఇస్తున్నాం కదా? కంటెంట్ ప్రొవైడర్లు ఉంటారు కదా? వారి నుండి వెళ్ళాలి. లేకపోతే, మన ఎడిటింగ్ రూమ్ల నుండి వెళ్ళాలి. అది మరో పద్ధతి. కాబట్టి పైరసీ ఎక్కడ జరుగుతోందో స్పష్టత లేదు. బహుశా ఆ స్పష్టత ఇప్పట్లో రాకపోవచ్చు. ఇప్పటివరకు చాలా సినిమాలు బయటకు వచ్చాయి. వాటిలో కొన్ని ఎడిటింగ్ రూమ్ నుండి వెళ్ళాయని చెప్పారు. ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ అలా జరిగిందని చెప్పారు. ‘టాక్సీవాలా’ సినిమా కూడా అంతే. ఆ మొత్తం సినిమా బయటకు వచ్చింది. నిజానికి, ‘అత్తారింటికి దారేది’ సినిమా 3/4వ భాగం బయటకు వచ్చింది. ఇవే కాకుండా, ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమాలన్నీ ఇలానే బయటకు వస్తున్నాయి. ఇది ఎలా జరుగుతోంది? నేను అది కూడా చెప్పాలి. దీనివల్ల వేల కోట్ల నష్టం జరిగింది. నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం, పైరసీ వల్ల ఆదాయం 30% నుండి 40% పడిపోయిందని చెబుతున్నారు. నేను వ్యక్తిగతంగా దాన్ని నమ్మను. ఎందుకంటే సినిమా అనేది ఒక థియేట్రికల్ అనుభవం. అది ఒక విభిన్నమైన అనుభవం. దానిని సెల్ ఫోన్లో చూసినా లేదా టీవీలో చూసినా, అది సరైన ప్రింట్ కాదు. సినిమాకు మంచి ప్రింట్ వస్తే, అది టీవీలో కూడా మంచి నాణ్యతతో ఉంటుంది.

కానీ సెల్ ఫోన్లో చూసే చిన్న బొమ్మ సాధ్యం కాదు. సినిమా బాగుంటే, వారు ఖచ్చితంగా మళ్లీ థియేటర్కు వెళ్తారు. ఈ సినిమాలను ఫోన్లో లేదా టీవీలో చూసే వ్యక్తులు, వారిలో 80% మంది సినిమాకు వస్తారు. ఇది ఉచితంగా వచ్చే బ్యాచ్. వీరు టిక్కెట్లు కొనే బ్యాచ్ కాదు. ప్రేక్షకులలో 20% నుండి 30% మంది తగ్గిపోవడంవల్ల, మా ఆదాయం నష్టపోతున్నాం. దీనికి అదనంగా థియేటర్ ఖర్చు.. అంటే టికెట్ ధర, ముఖ్యంగా ఆహార పదార్థాల ధర, అది పాప్కార్న్ అయినా, సమోసాలైనా సరే. గతంలో మనకు ఒకటిన్నర రూపాయల టికెట్ ఉంటే, టీ లేదా చిప్స్, సమోసాలు దొరికేవి. వాటిని బండి మీద అమ్ముతుంటే గేటు దగ్గరకు వెళ్లి కొనేవాళ్ళం. ఆ తర్వాత థియేటర్లలో మనకు ఏసీ వచ్చింది. రూ.500కు పాప్కార్న్, రూ. 200నుంచి 300వరకూ ఖర్చు చేస్తే సమోసాలు దొరుకుతున్నాయి. అదే సమోసా బయట 5 నుంచి10 రూపాయలు మాత్రమే ఉంటుంది. నేను ప్రతిరోజూ కనీసం రెండు సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు నెలకు ఒక సినిమా చూడటం కూడా కష్టంగా ఉంది. నేను థియేటర్కు వెళ్తే, రోజూ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. నెలకు ఒక్కసారి వెళ్లినా కూడా నాకు 700 రూపాయలు ఖర్చు అవుతుంది. థియేటర్లలో ధరలు తగ్గించాలి. ఇది మాత్రమే కాదు, వాళ్ళు విడుదలయ్యే సినిమాలకు ధరలు పెంచుతున్నారు. టికెట్ల ధర వేలల్లో ఉంటోంది. అది అన్యాయం. ఇదంతా పైరసీకి లాభదాయకంగా మారుతోంది. అందుకే, అయూబ్ అమ్మూ ఒక హీరో అయ్యాడు. రాబిన్ హుడ్ లాగా, అతనికి ఒక ఫాలోయింగ్ వచ్చింది. కాబట్టి, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలి.

– తమ్మారెడ్డి భరద్వాజ

(సినీ నిర్మాత, దర్శకుడు)

ధరలు దిగి రావాలి!

టూరింగ్ టాకీస్ గురించి ఈ తరంవారు ఎంతమంది విన్నారో తెలియదు. ఇవి సినిమాలు ఆడించడం కోసం తాత్కాలికంగా వేసే టెంట్లు. సర్కస్ టెంట్ల లాంటివి. వీటిని ప్రజలు సినిమాలు చూడటానికి వీలుగా వివిధ పట్టణాలు, గ్రామాలలో ఏర్పాటు చేసేవారు. క్రమేణా థియేటర్లు అంతటా పుట్టుకొచ్చాయి. వాటిని మార్నింగ్, మ్యాట్నీ, ఫస్ట్, సెకండ్ షోలు అని పిలిచే ప్రదర్శనలకు నిర్ణీత సమయాలు ఉండేవి. ఇవికాక ప్రత్యేక ప్రదర్శనలు అరుదుగా వేస్తుండేవారు. థియేటర్లలో ఎయిర్ కూల్డ్, ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం ఉంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. మొదటి 70ఎంఎం స్క్రీన్, డీలక్స్ (ఆర్‌సిసి రూఫ్) థియేటర్ మనకిప్పటికీ గుర్తున్నాయి. వాటిగురించి అపురూపంగా చెప్పుకునే వాళ్ళం. థియేటర్లలో నేల, బెంచ్, బాల్కనీ తరగతులు ఉండేవి. ఇప్పుడు తరగతి భేదాలు పోయాయి. కనీసం థియేటర్ల విషయంలో అయినా వర్గరహిత సమాజం సాధించామని దేశం గర్వపడవచ్చునేమో. అప్పట్లో సినిమా టికెట్ల ధరలు 25 పైసల నుండి 2 రూపాయల వరకు ఉండేవి. ద్రవ్యోల్బణం వల్లా లేదా ఆర్ధిక స్థోమత పెరిగే కొద్దీ ధరలు నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి.

కానీ ఇప్పుడు సాధారణ థియేటర్లలో ధరలు కనీసం రూ. 150 నుండి మల్టీప్లెక్స్‌లలో రూ. 350 వరకు ఉన్నాయి. చాలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక పిక్నిక్ లాంటి అనుభవం. ఇక్కడ మొత్తం కుటుంబం వెళ్లి సినిమా చూసేది. ఆ అనుభవంలో పాప్‌కార్న్, చిప్స్ లేదా సమోసా ఉన్నాయి. అప్పుడప్పుడు బోనస్‌గా సాఫ్ట్ డ్రింక్ ఉంటుంది. ప్రజలు ఈ కొద్దిపాటి డబ్బును ఏ మాత్రం బాధపడకుండా ఇష్టపూర్వకంగా ఖర్చు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. నలుగురు సభ్యుల కుటుంబం వేలల్లో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటేనే ఈ అనుభవాన్ని పొందగలదు. థియేటర్లలో అమ్మే వస్తువుల ధరలను విక్రయదారులు ఏకపక్షంగా నిర్ణయించేస్తారు. ఎన్ని కేసులు పెట్టినా, ప్రభుత్వ శాఖలు థియేటర్లలో తినుబండారాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని ఆదేశాలు జారీ అయినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవు. ఇటువంటి ఉల్లంఘనల మీద అధికారులు చర్యలు తీసుకోవడం ఎప్పుడయినా చూసామా?

కలర్ టీవీలు, వీసీఆర్లతో సాంకేతికత ప్రజలకు చేరువైనప్పుడు వీడియో లైబ్రరీలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. అవి కనుమరుగైపోయిన దశలో పైరసీ అనేది వచ్చింది. థియేటర్లలో దొంగచాటుగా కెమెరాలతో సినిమాలను రికార్డు చేసి బయట అమ్ముకోవడం మొదలయింది. ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేని లేదా ఇష్టపడని వ్యక్తులు సినిమాలు చూడటానికి ఈ మార్గాన్ని ఉపయోగించారు. సిడీ ప్లేయర్లు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్‌లు చివరికి స్మార్ట్‌ఫోన్‌ల దాకా ఈ టెక్నిక్ మరింత అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీతోపాటు పైరసీ కూడా అభివృద్ధి చెందింది. ఇటీవలి ఐ బొమ్మ కేసు సినీ ప్రియులను మాత్రమే కాకుండా మొత్తం సమాజం దృష్టినే ఆకర్షించింది. సమాజం, ముఖ్యంగా సోషల్ మీడియా రవికి మద్దతుగా, వ్యతిరేకంగా రెండుగా చీలిపోయింది. టీవీ, ఓటీటీలు, ప్రత్యేక ప్రదర్శనలు, ప్రీమియర్ ఈవెంట్లు, పాటల విడుదల మొదలైనవాటి ద్వారా ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్న సినిమా పరిశ్రమ మళ్ళీ పాత రోజుల్లో మాదిరిగా కుటుంబం ఆటవిడుపుగా థియేటర్లకు వెళ్ళగలిగే పరిస్థితిని తీసుకురావాలి.

అలా మార్చడం ద్వారా పాత సినిమా అనుభవాన్ని పునరుద్ధరించడానికి కలిసిరావాలి. అందరూ ఆర్థ్ధిక ప్రయోజనం పొందే సహేతుకమైన ఆదాయ భాగస్వామ్య నమూనాను గురించి ఆలోచించాలి. ఒక చిన్న బడ్జెట్ సినిమా బ్లాక్‌బస్టర్‌గా మారుతుందంటే, అన్ని వినోద అంశాలతో కూడిన సినిమాలను వీక్షకులు ఎల్లప్పుడూ అభినందిస్తారనే కదా అర్ధం. కాబట్టి మంచి సినిమా నిర్మించే సృజనాత్మకతతోబాటు దాన్ని జనబాహుళ్యంలోకి ఈ పద్ధతుల్లో తీసుకుపోయే ఐ బొమ్మ వంటి చాతుర్యాలు రెండూ ఉన్నాయి మన సమాజంలో. సినిమాను వినోద మాధ్యమంగా మాత్రమే కాకుండా దాని సందేశం ద్వారా సమాజానికి సేవ చేయడానికి కూడా ఉమ్మడి కృషి జరగాలి.

– గోపిరెడ్డి మధుసూదన్ రెడ్డి

(ఇండిపెండెంట్ జర్నలిస్ట్)

సామాజికంగానూ ఎదుర్కోవాలి

తెలుగు సినిమా పరిశ్రమను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య పైరసీ. సాంకేతికత పెరిగేకొద్దీ పైరసీ స్వరూపం కూడా మారుతూ వస్తోంది. సీడీలు, డీవీడీల నుంచి టొరెంట్లు, టెలిగ్రామ్ గ్రూపుల వరకు ఎన్నో రూపాల్లో పైరసీ తన ప్రతాపాన్ని చూపించింది. కానీ, గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ప్రియులకు, అదే సమయంలో నిర్మాతలకు గుదిబండగా, ఒకరకంగా చెప్పాలంటే వెన్నుపోటులా మారిన పేరు ‘ఐబొమ్మ’. కొత్త సినిమా విడుదలైందో లేదో, కొన్ని గంటల్లోనే హెచ్‌డీ క్వాలిటీతో జనం ముందుకు రావడం ఐబొమ్మ ప్రత్యేకత. ఈ పైరసీ సామ్రాజ్యానికి సూత్రధారిగా భావిస్తున్న గడ్డం రవి శంకర్ అలియాస్ ‘ఐబొమ్మ రవి’ అరెస్టు, అతని నేర సామ్రాజ్యం గురించిన వాస్తవాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఐబొమ్మ కేవలం ఒక పైరసీ వెబ్‌సైట్ మాత్రమే కాదు, అది ఒక పక్కా ప్రణాళికతో నిర్మించిన వ్యవస్థ. దీని పనితీరు చాలా పకడ్బందీగా ఉండేది.

1. కంటెంట్ సేకరణ: సినిమా విడుదలైన వెంటనే, లేదా కొన్నిసార్లు విడుదల కాకముందే, విదేశాల నుంచి డిజిటల్ ప్రింట్లను సంపాదించేవాడు. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లోని థియేటర్ల నుంచి లేదా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి హై-క్వాలిటీ ప్రింట్లను దొంగిలించేవాడు. సొంత సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను అభివృద్ధి చేసిన రవి, వీడియోల క్వాలిటీని ఓటీటీ స్థాయిలో ఉండేలా తయారు చేసేవాడు. ఇదే ఆ సైట్‌కు ప్రాచుర్యం రావడానికి ప్రధాన కారణం. 2.సర్వర్‌ల నిర్వహణ: భారతీయ చట్టాల నుంచి, సైబర్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రవి తన వెబ్‌సైట్ సర్వర్‌లను ఉక్రెయిన్, అమెరికా వంటి దేశాల్లో ఏర్పాటు చేశాడు. దీనివల్ల అతన్ని కనిపెట్టడం పోలీసులకు చాలా కష్టతరంగా మారింది. వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, డొమైన్ పేర్లను మారుస్తూ, సైబర్ నిపుణులకు కూడా సవాలు విసిరాడు. 3. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్: ఐబొమ్మ వేగంగా ప్రాచుర్యం పొందడానికి ముఖ్య కారణం దాని యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్. ఎలాంటి అనవసరమైన యాడ్స్ లేకుండా, సులభంగా సినిమాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా, కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కన్నా మెరుగైన అనుభూతిని యూజర్లకు అందించాడు. ఇది సాధారణ ప్రేక్షకులను సైతం ఐబొమ్మ వైపు ఆకర్షించింది.

ఈ పైరసీ వ్యాపారాన్ని రవి కేవలం వినోదం కోసం చేయలేదు. దీని వెనుక భారీ ఆర్థిక ప్రణాళిక ఉంది. ప్రధానంగా మూడు మార్గాల ద్వారా రవి ఆదాయం సంపాదించినట్లు తెలుస్తోంది. 1. విరాళాలు: వెబ్‌సైట్ నిర్వహణ ఖర్చుల కోసం అంటూ వినియోగదారుల నుంచి విరాళాలు సేకరించేవాడు. చాలామంది స్వచ్ఛందంగానే డబ్బు పంపేవారు. 2. ప్రకటనలు: కొన్నిసార్లు బెట్టింగ్ యాప్‌లు, ఇతర వెబ్‌సైట్ల ప్రకటనల ద్వారా కూడా భారీ మొత్తంలో డబ్బు సంపాదించాడు. పైరసీ వెబ్‌సైట్ల ద్వారా నెలకు రూ. 50 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు సంపాదిస్తే, అడల్ట్ అడ్స్, బెట్టింగ్/ క్యాసినో ప్రమోషన్లు, వీపీఎన్ అఫిలియేట్ డీల్స్ ద్వారా సంవత్సరానికి కోటి రూపాయల స్థాయి లోనే ఆదాయం సంపాదించినట్టు దర్యాప్తులో బయటపడింది. 3. క్రిప్టోకరెన్సీ: తన అడ్రస్ దొరక్కుండా ఉండేందుకు, రవి చాలా లావాదేవీలను క్రిప్టోకరెన్సీ రూపంలో నిర్వహించాడని కూడా పోలీసుల అనుమానం. ఈ డబ్బుతో అతను విలాసవంతమైన జీవితం గడుపుతూ, రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది.

ఈ కేసు మనకు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతోంది. సాంకేతికత మారితే పైరసీ కూడా రూపం మార్చుకుంటుంది. కానీ న్యాయవ్యవస్థ, అవగాహన, ప్రజల సహకారం కలిస్తే ఈ నెట్‌వర్కులను కూల్చడం అసాధ్యమేం కాదు. అందుకే పైరసీని కేవలం చట్టపరంగానే కాకుండా, సామాజికంగా కూడా ఎదుర్కోవాలి. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెరగాలి. ఉచితంగా సినిమా చూస్తున్నామనే ఆనందం వెనుక వేలాదిమంది కష్టం, వందల కోట్ల పెట్టుబడి నష్టపోతున్నాయనే వాస్తవాన్ని ప్రేక్షకులు గ్రహించాలి. చట్టపరమైన మార్గాల్లో, థియేటర్లలో లేదా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమా చూడటమే నిజమైన సినీ అభిమాని చేయాల్సిన పని. అప్పుడే పరిశ్రమ బాగుంటుంది. మరిన్ని మంచి చిత్రాలను మనం ఆశించగలుగుతాం. మరీ ముఖ్యంగా సినిమా టిక్కెట్ల ధరలు అందుబాటులో ఉంటే ఎవరైనా ఈ పైరసీ వీడియోల కోసం ఎందుకు ఎగబడతారు? 

— జీడిగుంట నాగేశ్వర్ రావు

(సీనియర్ జర్నలిస్ట్) 

పైరసీ చిచ్చు

పైరసీ… ఈ మధ్యకాలంలో తరచుగా వినబడుతున్న మాట ఇది. సినిమా ఇలా వి డుదలైందో లేదో అలా పైరసీ చేసి ఆన్ లైన్ లో పెడుతున్న ఐబొమ్మ రవి అరెస్టుతో పైరసీ పై అంతటా చర్చ రాజుకుంది. కొత్త సినిమాలను పైరసీ చేయడం ద్వారా తెలుగు సిని మా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా రవి కోట్లాది రూ పాయల నష్టం కలిగించాడని సినీ పరిశ్ర మ వాపోతోంది. మరోవైపు, ఆ కాశాన్నంటుతున్న టికెట్ ధర లు, థియేటర్లలో అందుబాటులో లేని టీ, స్నాక్స్, శీతల పానీయాల ధ రలతో కుదేలవుతున్న పేద, మధ్యతరగతి వ ర్గాల పాలిట ఐబొమ్మ రవి దేవుడనే వారూ లేకపోలేదు. సినీ నిర్మాతలు, థియేటర్ల యా జమాన్యాలు తమ లాభాలు తాము చూసుకుంటున్నప్పుడు వేలల్లో డబ్బు వెచ్చించి, మ ల్టీప్లెక్స్ కు వెళ్లలేని సగటు మనిషి పైరసీ సిని మా చూస్తే తప్పేమిటన్నది వారి వాదన. ఈ నేపథ్యంలో ఐబొమ్మ రవి అరెస్టయినంతమాత్రాన పైరసీ ఆగినట్టేనా? పైరసీ సినిమాలు ఆగాలంటే సినీ పరిశ్రమ తీసుకోవలసిన చర్యలేమిటి? వంటి అంశాలపై ప్రముఖుల అభిప్రాయాలను మీకందిస్తోంది ‘సమగ్ర’

సినిమా పైరసీ ఇప్పట్లో ఆగేది కాదు

పైరసీ అనేది ప్రపంచవ్యాప్త దృగ్విషయం. ఇది ప్రపంచమంతటా ఉంది. దీనిని పూర్తిగా నిర్మూలించడం ఆచరణాత్మకంగా అసాధ్యం. భవిష్యత్తులో ఎలా ఉంటుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి ఈ రోజు ఐబొమ్మను పట్టుకున్నారు. ఇంతకు ముందు కూడా మరొకరిని పట్టుకున్నారు. వారిని పట్టుకున్నంతమాత్రాన పైరసీ ఆగిపోతుందా? ఐ బొమ్మ రవిని పట్టుకున్న తర్వాత కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. కాబట్టి ఐ బొమ్మతోనో లేదా మరొకరితోనో ఇది ఆగదు. పైరసీ వల్ల నష్టం ఎంత? ఎంత నష్టం జరుగుతుంది? నాకు తెలిసినంత వరకు, వీడియో సినిమా వచ్చినప్పుడు సినిమారంగంలో పైరసీ మొదలైంది. అంతకు ముందు వీడియో సినిమా 16ఎంఎంలో చేసేవారు. 35 ఎంఎం సినిమాను 16ఎంఎంలో చేసి రోడ్ల మీద, పండుగల సమయంలో రాత్రిపూట రోడ్డు మీద ప్రదర్శించేవారు. కాబట్టి అప్పట్లో అది ఒక రకమైన పైరసీ. తర్వాత వీడియోలు వచ్చిన తర్వాత, వీడియో పార్లర్లలో వీడియోలు వేసేవారు. నగరాల్లో ప్రదర్శించేవారు. వీడియో క్యాసెట్లను అద్దెకు తీసుకుని ఇంట్లో సినిమాలు చూసేవారు. తర్వాత సీడీలు, డీవీడీలు వచ్చాయి. ఈ విధంగా, పైరసీ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, అది ఆగదు. అది ఆగలేదు కూడా. ఈ పైరసీ ఎక్కడి నుండి వస్తోంది? అన్నింటికంటే ముందు, ఇది ఎక్కడ పుడుతుందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేదు. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత కూడా పైరసీ పెరిగింది. పైరసీ నాణ్యత పెరిగింది. ఇంతకు ముందు, థియేటర్ ప్రింట్ ఉన్నప్పుడు, థియేటర్లో నేరుగా ప్రదర్శించేవారు. దానిని నేరుగా కాపీ చేయడం కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు దీనికి ప్రక్రియ ఏమిటో నాకు తెలియదు, కానీ ఇది చాలా సులభం అయిపోయింది. సెల్ ఫోన్లు వచ్చాక, ఇది మునుపటి కంటే సులభం అయింది. ఇది కాకుండా, మన సినిమా థియేటర్లన్నింటిలోనూ శాటిలైట్ల ద్వారా సినిమాలు పంపే కొత్త ప్రక్రియ ఉంది. కాబట్టి బహుశా సినిమా పరిశ్రమకు చెందిన కొందరు కూడా పైరసీ చేస్తూ వారికి సహాయం చేస్తున్నారేమో. వాళ్ళు హార్డ్ డిస్కులు ఇస్తున్నారు కదా? అక్కడి నుండి కూడా జరగవచ్చు. అయితే, థియేటర్ నుండి తీసేది మరో రకం. ఇలా మూడు నాలుగు రకాలు ఉన్నాయి. వారికి సినిమా ఎక్కడి నుండి వస్తోంది? ఎలా తీసుకువస్తున్నారు? ఎవరు తీసుకువస్తున్నారు? అసలు సమస్య ఏమిటంటే, దీని మూలం ఎక్కడి నుండి వస్తుందో అక్కడే ఉంది. దాన్ని తొలగించనంతవరకు, పైరసీ ఆగదు. పైరసీ బయటకు వచ్చింది. దొంగ అసలైన వాడు కాదు. చూసినవాడిని పట్టుకుంటామని అంటారు, లేదా అమ్మిన వాడిని పట్టుకుంటారు. ఇచ్చిన వాడిని పట్టుకుంటారు. కానీ అది ఎక్కడి నుండి వచ్చింది? ఐ బొమ్మకు ఎవరు సరఫరా చేశారు? సరఫరా చేసిన వాడు థియేటర్లో తీసిన వాడు కాదు. థియేటర్లో తీసిన వాడు వేరే. కానీ అసలు ప్రింట్ వారికి ఎలా వచ్చింది? కాబట్టి, ఇప్పుడు మనం థియేటర్లకు కంటెంట్ ఇస్తున్నాం కదా? కంటెంట్ ప్రొవైడర్లు ఉంటారు కదా? వారి నుండి వెళ్ళాలి. లేకపోతే, మన ఎడిటింగ్ రూమ్ల నుండి వెళ్ళాలి. అది మరో పద్ధతి. కాబట్టి పైరసీ ఎక్కడ జరుగుతోందో స్పష్టత లేదు. బహుశా ఆ స్పష్టత ఇప్పట్లో రాకపోవచ్చు. ఇప్పటివరకు చాలా సినిమాలు బయటకు వచ్చాయి. వాటిలో కొన్ని ఎడిటింగ్ రూమ్ నుండి వెళ్ళాయని చెప్పారు. ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ అలా జరిగిందని చెప్పారు. ‘టాక్సీవాలా’ సినిమా కూడా అంతే. ఆ మొత్తం సినిమా బయటకు వచ్చింది. నిజానికి, ‘అత్తారింటికి దారేది’ సినిమా 3/4వ భాగం బయటకు వచ్చింది.

ఇవే కాకుండా, ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమాలన్నీ ఇలానే బయటకు వస్తున్నాయి. ఇది ఎలా జరుగుతోంది? నేను అది కూడా చెప్పాలి. దీనివల్ల వేల కోట్ల నష్టం జరిగింది. నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం, పైరసీ వల్ల ఆదాయం 30% నుండి 40% పడిపోయిందని చెబుతున్నారు. నేను వ్యక్తిగతంగా దాన్ని నమ్మను. ఎందుకంటే సినిమా అనేది ఒక థియేట్రికల్ అనుభవం. అది ఒక విభిన్నమైన అనుభవం. దానిని సెల్ ఫోన్లో చూసినా లేదా టీవీలో చూసినా, అది సరైన ప్రింట్ కాదు. సినిమాకు మంచి ప్రింట్ వస్తే, అది టీవీలో కూడా మంచి నాణ్యతతో ఉంటుంది. కానీ సెల్ ఫోన్లో చూసే చిన్న బొమ్మ సాధ్యం కాదు. సినిమా బాగుంటే, వారు ఖచ్చితంగా మళ్లీ థియేటర్కు వెళ్తారు. ఈ సినిమాలను ఫోన్లో లేదా టీవీలో చూసే వ్యక్తులు, వారిలో 80% మంది సినిమాకు వస్తారు.

ఇది ఉచితంగా వచ్చే బ్యాచ్. వీరు టిక్కెట్లు కొనే బ్యాచ్ కాదు. ప్రేక్షకులలో 20% నుండి 30% మంది తగ్గిపోవడంవల్ల, మా ఆదాయం నష్టపోతున్నాం. దీనికి అదనంగా థియేటర్ ఖర్చు.. అంటే టికెట్ ధర, ముఖ్యంగా ఆహార పదార్థాల ధర, అది పాప్కార్న్ అయినా, సమోసాలైనా సరే. గతంలో మనకు ఒకటిన్నర రూపాయల టికెట్ ఉంటే, టీ లేదా చిప్స్, సమోసాలు దొరికేవి. వాటిని బండి మీద అమ్ముతుంటే గేటు దగ్గరకు వెళ్లి కొనేవాళ్ళం. ఆ తర్వాత థియేటర్లలో మనకు ఏసీ వచ్చింది. రూ.500కు పాప్కార్న్, రూ. 200నుంచి 300వరకూ ఖర్చు చేస్తే సమోసాలు దొరుకుతున్నాయి. అదే సమోసా బయట 5 నుంచి10 రూపాయలు మాత్రమే ఉంటుంది. నేను ప్రతిరోజూ కనీసం రెండు సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు నెలకు ఒక సినిమా చూడటం కూడా కష్టంగా ఉంది. నేను థియేటర్కు వెళ్తే, రోజూ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. నెలకు ఒక్కసారి వెళ్లినా కూడా నాకు 700 రూపాయలు ఖర్చు అవుతుంది. థియేటర్లలో ధరలు తగ్గించాలి. ఇది మాత్రమే కాదు, వాళ్ళు విడుదలయ్యే సినిమాలకు ధరలు పెంచుతున్నారు. టికెట్ల ధర వేలల్లో ఉంటోంది. అది అన్యాయం. ఇదంతా పైరసీకి లాభదాయకంగా మారుతోంది. అందుకే, అయూబ్ అమ్మూ ఒక హీరో అయ్యాడు. రాబిన్ హుడ్ లాగా, అతనికి ఒక ఫాలోయింగ్ వచ్చింది. కాబట్టి, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలి.- తమ్మారెడ్డి భరద్వాజ  (సినీ నిర్మాత, దర్శకుడు)

ఐబొమ్మ రవిని ‘హీరో’ చేసిందెవరు?

ఐ బొమ్మ రవి. ఈ పేరుకు ఈ మధ్య కాలంలో మంచి ప్రాచుర్యం వచ్చింది. రవి చేసింది తప్పే. సినిమా ఇండస్ట్రీకి నష్టమే. చట్టం ప్రకారం శిక్షార్హమే. అయినా.. సామాన్యులు మాత్రం ఆయనను ‘రాబిన్ హుడ్’ లేదా ‘మధ్యతరగతి దేవుడు’ అని కొనియాడుతున్నారు. సినీ ప్రముఖులు రవిని తప్పు బడుతున్నారు. పోలీసులు రవి వెనుక ఉన్న కథ మొత్తం బయట పెడతామని చెప్పినా.. సామాన్యుల్లో మాత్రం రవికి మద్దతు తగ్గటం లేదు. పైరసీ తప్పే అని చెబుతూనే మధ్య తరగతి సినీ అభిమానులు రవికి అండగా నిలుస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రవిని అరెస్ట్ చేసిన పోలీసులు కాదు. ప్రధాన కారకులు సినీ ప్రముఖులు. రవిని ఇంతలా సాధారణ ప్రజలు అభిమానిస్తున్నారంటే సినీ ప్రముఖులు అలర్ట్ కావాల్సిందే. అసలు రవి సినిమాల వైపు మధ్య తరగతి ప్రజలు ఎందుకు ఆసక్తిగా ఉన్నారనే విషయం సినీ ప్రముఖులకు తెలియదా? తెలిసినా తెర మీద నటించినట్లుగానే బయట నటిస్తున్నారా? తమ రెమ్యునరేషన్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడని హీరోలు.. ఖర్చు విషయంలో ఆలోచన చేయని దర్శకులు.. అవసరానికి మించి ప్రతిష్ఠకు పోయి అప్పుతెచ్చి మరీ సినిమాలు తీసుకున్న నిర్మాతలు.. ప్రేక్షకులను తమ ధరలతో భయపెడుతున్న సినిమా హాళ్లు.. అందులోని రేట్లతో కొనకుండానే షాక్ కొట్టే క్యాంటీన్లు.. ఇలా ఎక్కడ చూసినా అంతు లేని దోపిడీ. బలి అవుతుందని సామాన్యుడే.

థియేటర్‌లలో అమ్మే పాప్‌కార్న్, సమోసాలు, కూల్‌డ్రింక్స్, అలాగే స్క్రీన్‌పై రన్ అయ్యే ప్రకటనలు ఈ మొత్తం ఆదాయానికి నిర్మాతకు ఎలాంటి సంబంధం లేదని, వాటిలోనుంచి ఒక్క రూపాయి కూడా నిర్మాత జేబులోకి రాదని ప్రముఖ నిర్మాత ఎస్.కే.ఎన్. (శ్రీనివాస కుమార్) తన ఎక్స్ ఖాతాలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒక సగటు కుటుంబం సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లినప్పుడు మొత్తం 2,178 రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ మొత్తం నుండి నిర్మాతకు కేవలం రూ. 372 మాత్రమే వస్తుందని ఆయన వివరించారు. మిగిలిన డబ్బు ఎక్కడికో ఎలా వెళ్తుందన్న వివరాలు ఇలా ఉన్నాయి: టికెట్ షేర్, మెయింటెనెన్స్ ఫీజు, థియేటర్‌లో అమ్మే F&B (Food & Beverages) ద్వారా మల్టీప్లెక్సులు మొత్తం రూ.1,545.33 వరకూ తీసుకుపోతాయి. ప్రభుత్వానికి జిఎస్‌టి రూపంలో రూ.182 వెళ్తుంది. ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన బిఎంఎస్ అయితే రూ. 78.67 వసూలు చేస్తుంది. మొత్తంగా చూస్తే నిర్మాతకు వచ్చే వాటా కేవలం 17% మాత్రమే అని ఆయన ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే, ఎస్.కే.ఎన్ చేసిన ఈ పోస్టుపై సినీ ప్రేక్షకులు ప్రశ్నల వర్షం కురిపించారు. థియేటర్లలో తినుబండారాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న విషయాన్ని చర్చకు తెచ్చిన అభిమానులు థియేటర్‌లో ఒక చిన్న పాప్‌కార్న్ కోసం మూడు వందలు, కూల్ డ్రింక్ రెండు వందలు, వాటర్ బాటిల్‌కే 150 వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ దోపిడీపై మీరు మాత్రం ఏమీ చెప్పడం లేదెందుకు? అని ప్రశ్నించారు. తినుబండారాల ధరలపై నియంత్రణ మీ చేతుల్లో లేకపోతే, ఆ ధరల వల్ల ఇబ్బందిపడుతున్న ప్రేక్షకుల తరఫున పరిశ్రమ పెద్దలు ముందుకు వచ్చి మాట్లాడటం, పరిష్కారం కోరడం మీ బాధ్యత కాదా? నిర్మాతకు ఆ ఆదాయంలో వాటా లేకపోతే, ప్రేక్షకులను రక్షించేందుకు కనీస ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదని అభిమానులు మండిపడ్డారు. ఇక్కడ ఒక్కటే స్పష్టంగా అర్థమవుతుంది, ఎవరి లాభాలు వారికి కావాలి. ఒకవైపు సినీ పరిశ్రమ సాధారణ ప్రేక్షకుడి శ్రమ దోచుకోవటానికి అలవాటుపడితే, మరోవైపు సామాన్యుడి బలహీనత సొమ్ము చేసుకునేందుకు ఐ రవి లాంటి వారు ఎంట్రీ ఇచ్చారు. అంతే, సామాన్యుడు కోరుకుందీ.. రవికి కావాల్సింది ఒక్కటే.

రవి పైరసీ చేయటం నేరమే. శిక్షకు అర్హుడే. మరి.. సినిమా అభిమానించే ప్రేక్షకులు ప్రీమియర్ షో.. బెనిఫిట్ షో.. ప్రత్యేక షోల పేరుతో వందల రూపాయాల టికెట్లు వసూలు చేయటం ఏమనాలి? సినిమా టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే, ప్రజలు పైరసీ వైపు వెళ్లే పరిస్థితి ఉండదు కదా అని వాదిస్తున్న వారు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకొని మొదటి రెండు వారాల పాటు టికెట్లు రేట్టు పెంచుకునేందుకు వీలుంటుంది. అలాగే పాప్‌కార్న్ రేట్ల విషయంలోనూ జిఎస్‌టిని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ 2023లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, పాప్‌కార్న్, బెవరేజస్ లూజ్ సేల్స్ పేరుతో రూ.150 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారు. రూ.30 ఉండే పాప్ కార్న్ రూ.700 వరకు అమ్ముతుంటే, సినిమాలు ఏ విధంగా చూడాలని నిలదీస్తున్నారు. ఐ బొమ్మ సినిమాలు చూడటం కోసం వ్యక్తిగత సమాచారాన్ని లాగిన్ కోసం ఇచ్చి మరీ చూస్తున్నారంటే సినిమా కోసం టికెట్ల నుంచి ధియేటర్ల వరకు జరిగే దోపిడీ కంటే ఇది డేంజర్ కాదని ప్రేక్షకులు డిసైడ్ అయినట్లుగానే భావించాలేమో. సినీ పెద్దలు మాత్రం ఐ బొమ్మను తప్పు బడుతున్నారు. ప్రేక్షకుల ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వటం లేదు. సినీ పరిశ్రమ ఇలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తే దోచుకుంటున్నంత కాలం వారు ఐ బొమ్మ లేకుంటే ఓటీటీ… అదీ కాకుంటే టీవీల్లో వచ్చే వరకూ వేచి చూస్తారు. ఈ సినిమా పేరుతో జరిగే దోపిడీ భరించే సహనం ప్రేక్షకుడు కోల్పోయాడు. ఇప్పటికైనా నిర్మాత నుంచి థియేటర్ యజమాని వరకు తీరు మార్చుకోవాలి ఐ బొమ్మ రవి వ్యవహారం స్పష్టం చేస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఐ బొమ్మ రవిని ప్రేక్షకులు రియల్ హీరోగా చూడటం వెనుక వారి ఆవేదన ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. ఇది రీల్ హీరోలకు అర్దం అవుతుందా… లేదంటే మరో ఐ బొమ్మ పుట్టుకురావాల్సిందేనా.-బాలకృష్ణ ఎం(సీనియర్ జర్నలిస్ట్)

పిడుక్కీ, బియ్యానికీ సుంకాల మంత్రమే!

ఇతర దేశాలను దారికి తెచ్చుకునే విషయంలో అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌నకు తెలిసింది ఒక్కటే.. భారీ సుంకాలు విధించడం. అంతకుమించి దౌత్యమార్గంలో చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుక్కుందామనే ఆలోచనే ఆయనకు రాదనడానికి తాజా ఉదాహరణ భారత్ నుంచి తమ దేశానికి ఎగుమతి అవుతున్న బియ్యంపై అధిక సుంకాలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడటం. రష్యానుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ, పరోక్షంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యాకు ఆర్థిక వనరులు సమకూర్చి పెడుతోందన్న నెపంతో భారత్ పై ఇప్పటికే అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ మరోసారి కన్నెర్ర చేయడానికి కారణం.. భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యంవల్ల తమ రైతులు పండిస్తున్న సరకుకు గిరాకీ ఉండటం లేదని. అసలు ఇదంతా ఎలా మొదలైందంటే, మొన్న ట్రంప్ మహాశయుడు వ్యవసాయం, వ్యవసాయాధారిత పరిశ్రమల స్థితిగతులపై శ్వేతసౌధంలో ఓ రౌండ్ టేండ్ సమావేశం నిర్వహించారు. ఆ భేటీలో ఎవరో ఒక ప్రతినిధి లేచి భారతీయ వ్యాపారులు తమ బియ్యాన్ని అమెరికా మార్కెట్ లోకి కుమ్మరిస్తున్నారని, ఇలా దిగుమతి అవుతున్న బియ్యానికి పన్ను మినహాయింపులు కూడా లభిస్తున్నాయని ఫిర్యాదు చేశారు.

ఇంకేముంది.. ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసు వెలిగక్కుతూ, బియ్యం దిగుమతులను అడ్డుకునేందుకు సుంకాల మోత మోగిస్తానంటూ వీరంగం వేశారు. ప్రపంచంలోనే బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. అమెరికా సహా అనేక దేశాలకు ఏటా కోట్లాది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ఉంటుంది.భారత్ కాకుండా థాయ్‌లాండ్, చైనా, ఇండొనేసియా వంటి దేశాలు కూడా అమెరికాకు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నాయి. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే బియ్యంలో సింహభాగం బాసుమతి బియ్యమే. బిర్యానీ తయారీలో ఉపయోగించే బాసుమతి బియ్యాన్ని పండించడంలో భారత్ పెట్టింది పేరు. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో భారత్ 337 మిలియన్ డాలర్ల విలువగల 2.75 లక్షల మెట్రిక్ టన్నుల బాసుమతి బియ్యాన్ని అమెరికాకు ఎగుమతి చేసింది.

బాసుమతియేతర బియ్యాన్ని మాత్రం 61 వేల మెట్రిక్ టన్నులే ఎగుమతి చేసింది. ఒకవేళ ట్రంప్ నిజంగానే భారత్ బియ్యం ఎగుమతులపై సుంకాలు విధించిన పక్షంలో నష్టపోయేది అక్కడి వినియోగదారులే. ఎందుకంటే, భారత్ నుంచి బాసుమతి బియ్యం ఎగుమతులు ఆగిపోతే, అధిక ధరలు వెచ్చించి పాకిస్తాన్ వంటి ఇతర దేశాలనుంచి కొనుగోలు చేయవలసి వస్తుంది. ఇక అమెరికాలో పండే సాధారణ రకం బియ్యం నాణ్యతలో మన బియ్య ముందు తీసికట్టే. ఇక్కడ గమనించవలసిన మరొక విషయమేమిటంటే, అమెరికాకంటే పశ్చిమాసియా దేశాలకే భారత్ అధిక మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. మన బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా మూడు శాతం మాత్రమే. ఇవన్నీ అగ్రరాజ్యాధిపతికి తెలియవని అనుకోలేం. అమెరికా రైతుల్లో అధిక సంఖ్యాకులు ట్రంప్ మద్దతుదారులనేది బహిరంగ రహస్యం.వారికి ఊరట కలిగించేందుకు కంటితుడుపుగా ఆయన భారత్ పై ఆగ్రహం నటించి ఉండవచ్చుననే వాదన వినబడుతోంది.

ఇటీవల పుతిన్ భారత్‌కు రావడం, ఆయనకు ఇక్కడ ఘన స్వాగతం లభించడం కూడా ట్రంప్ కడపుమంటకు కారణం కావచ్చు. పిడుక్కీ, బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లు ట్రంప్ ప్రతి విషయానికీ సుంకాల అస్త్రమే సంధించాలనుకుంటున్నారు. సుంకాలతోటే అందరినీ దారికి తెచ్చుకోవాలనుకుంటున్నారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన సుంకాలు విధించడాన్ని కింది కోర్టులు తప్పుపట్టినా, ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు సరికదా, సుప్రీం కోర్టులో తనదే గెలుపనే ధీమాతో ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఓడిపోతే ప్రపంచ దేశాలముందు తన పరువేం గాను అనే స్పృహ ఆయనకు కలగకపోవడమే విచిత్రం. సుంకాల బూచిని చూపి రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలువరించినట్లే బియ్యం ఎగుమతుల విషయంలోనూ భారత్ కు ముకుతాడు వేయొచ్చన్నది ట్రంప్ ఎత్తుగడ. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ప్రస్తుతం భారత్‌లో అమెరికా బృందం చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో బియ్యంపై సుంకాల విషయంలో ట్రంప్ తాటాకు చప్పుళ్లకు భారత్ బెదరదనే విషయాన్ని విస్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది.

అక్కడ తుపాకులే మాట్లాడతాయా?

రకరకాల జాతులు, సమూహాల సమాహారమే ఈ దేశం. భిన్న భాషలు, సంస్కృతులు ఈ దేశంలో ఉన్నా, అవన్నీ దేశ సార్వభౌమాధికారానికి తలఒగ్గి తమ మనుగడను నిలుపుకుంటున్నాయి. వీటికి తోడు మనదేశంలోని కులాలు, మతాలు, రకరకాల సిద్ధాంతాలతో కూడిన రాజకీయ పార్టీలు మితవాదులు, మతవాదులు, అతివాదులు, జాతీయవాదులు వెరసి మనం ఘనంగా చెప్పుకునే భిన్నత్వంలో ఏకత్వం. ఇంత పెద్ద దేశంలో సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండడం సహజమే. కొందరు అహింసా వాదాన్ని అనుసరించడం ప్రచారం చేయడం జరిగితే, మరికొందరు హింసవాదాన్ని, ఆయుధాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వీరంతా దేశాభివృద్ధిని కాంక్షించే వారే కానీ మార్గాలే వేరు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించబడిన రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూల్ ప్రకారం అటవీ ప్రాంతాలలోని గిరిజనులకు ప్రత్యేకమైన హక్కులు కల్పించబడ్డాయి. అడవికి వారే రాజు లాంటివారు. కానీ ప్రభుత్వాలు క్రమంగా అడవులలోని ఖనిజ వనరుల మీద కన్నేశాయి. ఇన్నాళ్లుగా వాటిని అక్కడి గిరిజనులే కాపాడుకుంటున్నారు.

కానీ కార్పొరేట్ కంపెనీలకు ఖనిజ వనరులను ధారాదత్తం చేసే ప్రయత్నంలో గిరిజనులు, వారికి మద్దతుగా ఉన్న మావోయిస్టులు అడ్డుగా నిలుస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు పూనుకున్నది. మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత దేశమే ధ్యేయంగా అడవులను జల్లెడపడుతూ మావోల ఆచూకీ ఆనుపానులు తెలుసుకుంటూ ఎన్‌కౌంటర్ పేరు మీద వారిని మట్టుపెడుతున్నారు. మావోయిస్టు ఉద్యమం ఈ నేపథ్యంలోనే కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. పెద్ద నాయకులను కోల్పోయింది. మరి కొంతమంది నేతలు రకరకాల కారణాలతో రాజ్యానికి లొంగిపోయారు. కాల్పులు ఏకపక్షమే, మృతులు ఏకపక్షమే. యుద్ధం విరమించిన వారిపై కాల్పులు జరపడం యుద్ధ నీతి కాదు. అస్త్ర సన్యాసం ప్రకటించిన వారితో యుద్ధం ఎలా చేస్తారు? ఇది నాటి రాజుల కాలంలో కూడా జరగలేదు.

కానీ ఘనత వహించిన ప్రజాస్వామ్యంలో జరగడం శోచనీయం. గిరిజనులలోనే కాదు సమాజంలోనూ మావో ‘యిస్టు’ ల మద్దతుకు సానుభూతికి కొదవలేదు. అందరూ తుపాకీ పట్టి పోరాడలేకపోవచ్చు. నైతిక మద్దతు ఇచ్చేవారు చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కానీ వారిని అర్బన్ నక్సలైట్లు అనే పేరుతో అంతమొందించే ప్రమాదము లేకపోలేదు. ఈ మధ్య వరుస ఎన్‌కౌంటర్లలో చాలామంది మావోయిస్టులు తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో గతంలో జరిగిన అనేక ఎన్‌కౌంటర్లు బూటకమని నిరూపించబడ్డాయి. పరిమిత స్థాయి ఉద్యమంపైన రాజ్యం పైచేయి సాధించింది. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఇష్టం లేకపోయినా మావోయిస్టులు శాంతి ప్రక్రియ ప్రతిపాదన చేశారు. కానీ రాజ్యం అందుకు ఒప్పుకోక తన లక్ష్యం పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉంది. బందూకులతోనే బదులు చెప్పింది.

హింస ఎవరు చేసినా ఖండించదగినదే. హింసకు ప్రతి హింస సమాధానం కాదు. సిద్ధాంతం నచ్చనంత మాత్రాన అవతలి వ్యక్తిని చంపే హక్కు మన రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదు. రాజ్యానికి కూడా ఇవ్వలేదు. ఉద్యమ బాటను ఎంచుకున్న వారు అటవీ సంపదను, ఖనిజ వనరులను సంరక్షిస్తూ గిరిజనులకు అండగా నిలుస్తూ వచ్చారు. కానీ రాజ్యం మాత్రం యథేచ్ఛగా తన బలాన్ని ప్రయోగిస్తూ, సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుతూ మావోయిస్టులను మట్టుబెట్టుతున్నది. పర్యవసానంగా చిన్నతనంలోనే అడవి బాట పట్టి గత 30, 40 ఏళ్లుగా గిరిజనులతో మమేకమై తల్లిదండ్రులకు తమ కుటుంబాలకు దూరంగా ఉన్నవారు తమ వ్యక్తిగత జీవితాన్ని, సుఖాన్ని, సంతోషాలను త్యాగం చేసిన వారు నేడు ఎన్‌కౌంటర్లలో నేలకొరుగుతున్నారు. ఆ నేతల అంత్యక్రియలలో వారి పట్ల ప్రజలకు ఉన్న ఆదరాభిమానాలు పెద్ద ఎత్తున పెల్లుబికాయి. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం సడలేలా చేసింది రాజ్యం. మావోయిస్టుల మార్గం నచ్చడం నచ్చకపోవడం వేరే విషయం. కానీ వారు కూడా ఈ సమాజ శ్రేయస్సు కోసం ఈ దేశ అభ్యున్నతి కోసమే పోరాడుతున్నారనేది సత్యం.

భారతదేశం శాంతికాముక దేశంగా చెప్పుకుంటాం. శాంతి సూక్తులన్నీ మనదేశంలో పుట్టినవే. అంతర్జాతీయంగా అనేక దేశాలతో శాంతి ఒప్పందాలు, ఒడంబడికలు చేసుకుంటాం. కానీ మనదేశంలోనే దాన్ని ఆచరించడానికి ప్రభుత్వం విముఖత చూపుతున్నది. మన శత్రుదేశాల పట్ల కూడా సంయమనం పాటిస్తాం. కానీ దేశంలోని అంతర్గత శక్తులు అది ప్రజా శ్రేయస్సు కోసం దేశంలోని ఖనిజ సహజ వనరుల సంరక్షణ కోసం పోరాడే వారి పట్ల కఠినంగా, కర్కశంగా, అమానవీయంగా ప్రవర్తిస్తున్నాం. వారేమీ దేశద్రోహులు కాదు. వారి దేశభక్తిని శంకించవలసిన పని కూడా లేదు. వారిమీ దేశ భద్రతకు భంగం కలిగించడం లేదు. సమాజంలో ఆదివాసీలు కూడా భాగమేనని, వారి రక్షణ, హక్కులు కాపాడడం గురించి, దేశ భవిష్యత్తు దృష్ట్యా ఖనిజ వనరుల సంరక్షణ గూర్చి మాత్రమే మావోలు పోరాటం చేస్తున్నారు. ఆదివాసీల సంరక్షణకు పెంపు వహించాల్సిన ప్రభుత్వం వారి చట్టాలకు తూట్లు పొడుస్తోంది. కార్పొరేట్ కంపెనీలకు ఎర్రతివాచి పరిచి అటవీ సంపదను దోచుకోవడానికి ఆహ్వానం పలకడం దారుణం. గిరిజన ఆదర్శ నేత బిర్సా ముండాను గౌరవిస్తాం కానీ ఆయన ఆశయాలను పక్కన పెడతాం.

ఎవరి హక్కుల గురించి డాక్టర్ బ్రహ్మదేవ శర్మ తన జీవితాంతం పోరాడాడో వారి శ్రేయస్సు మనకు పట్టదు. అవసరమైనప్పుడు అదే శర్మను ఒక జిల్లా కలెక్టర్‌ను విడిపించడానికి వాడుకుంటాం. అంతవరకే. ఆ తర్వాత ఆయన ఆకాంక్షలు తుంగలో తొక్కేస్తాం. కార్పొరేట్లు ఒకసారి కాలు పెట్టి తవ్వకాలు మొదలు పెడితే అడవిలో బూడిద కూడా మిగిల్చరు. గిరిజనులు ఇక అడవులను ఖాళీ చేయాల్సిందే. భావితరాలకు ఉపయోగపడే ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పనంగా అప్పగిస్తూ అందులో భాగంగా మావోయిస్టులను ఏరిపారేస్తూ రాజ్యం గిరిజనులను ఏకాకులను చేస్తున్నది. వారిని నిరాశ్రయులను చేస్తున్నది. భవిష్యత్తులో తలెత్తే పర్యావరణ సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అడవి తల్లిని నమ్ముకున్న వారు తమ అడవికి దూరం అవుతున్న పరిస్థితి నెలకొన్నది. వారికి ప్రత్యేక హక్కులు కల్పించిన ఐదు ఆరు షెడ్యూళ్ళు రాజ్యం వంక, తమ బిడ్డలైన గిరిజనుల వంక నిస్సహాయ చూపులు చూస్తున్నాయి.

‘చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం. ఫిబ్రవరి వరకు మాకు సమయం కావాలి. అంతవరకు ఆయుధాలను విసర్జిస్తున్నాం’ ఇలాంటి మాటలు శంఖం ఊదిన చందాన వృథా అయ్యాయి. ఎన్‌కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మావోయిస్టులు కనుమరుగవుతూనే ఉన్నారు. సాయుధ పోరాట విధానంపై మావోయిస్టులు సమీక్షలు చేసుకుంటున్నామన్న తరుణంలో ప్రభుత్వం వారిపై తన ప్రతాపం చూపింది. అడవిపై మావోలు తమకు పట్టు కోల్పోతున్నారు. మావోయిస్టుల ఒకనాటి ‘వర్గ శత్రు నిర్మూలన’ను నేడు కేంద్ర ప్రభుత్వం పక్కాగా, ప్రణాళికతో అమలు చేస్తున్నట్లుగా కనపడుతున్నది. వ్యక్తులు, నేతలు నేడు మరణించవచ్చు. కానీ సిద్ధాంతం ఎన్నటికీ మరణించదు. కానీ ఆ సిద్ధాంతకర్తలు తమ వాదాన్ని సమీక్షించుకోవలసిన సరియైన సమయం ఇది. ప్రభుత్వం కూడా మావోల సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా చూడాలి.

వారి అజెండాలో ముఖ్యమైన సామాజిక అసమానతలు, దోపిడీ, దౌర్జన్యాలు, పౌరహక్కులు, గిరిజన సమస్యలు లాంటి వాటిని పరిష్కరించడం ద్వారా మావోలను, వారి సిద్ధాంతాలను ప్రభుత్వం గెలవవచ్చు. వ్యక్తులను మట్టుపెట్టడం తాత్కాలికమే. వారి సిద్ధాంతాన్ని తమదైన ఆచరణ ద్వారా గెలిచి చూపవచ్చు. మావోలు కూడా ప్రజల్లో చైతన్యం లేకుండా కొంతమందితోనే బలమైన రాజ్యం మీద పైచేయి సాధించడం అసాధ్యమని గ్రహించాలి. ఏది ఏమైనా ఈ ఎన్‌కౌంటర్లకు తెరదించాలి. తుపాకులు కాకుండా మనుషులే మాట్లాడుకునే సుహృద్భావ వాతావరణం ఏర్పడాలి. ఇన్నాళ్లు తుపాకీ మోతలతో, బుల్లెట్ల వర్షంతో దండకారణ్యం దద్దరిల్లింది. రక్తపుటేరులు పారాయి. జరిగిన రక్తపాతం ఇక చాలు. దానికి స్వస్తి చెప్పాల్సిన తరుణమిదే. ‘అహింస ఒక ఆశయమే కానీ ఆయుధం కాదు; ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాదు’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఒక ప్రజా స్వామిక వాతావరణంలో రాజ్యానికి, మావోయిస్టులకు చర్చలు జరిగి ఆ మహాకవి ఆశ నిజం కావాలని కోరుకుందాం.

– శ్రీశ్రీ కుమార్

9440354092

తెలంగాణ సోయి ఏమైంది?

పదేళ్ల క్రితం దాకా తెలుగువాళ్లంతా ఒకే రాష్ట్రంగా ఉన్నారు. ఆంధ్ర ఆధిపత్యం, ఉమ్మడి పాలనలో తెలంగాణ నిర్లక్ష్యం ఇలా వివిధ కారణాల వల్ల స్వీయపాలన కోసం తెలంగాణ ఏర్పాటు అనివార్యమైంది. కళలలో కూడా ఆంధ్రుల ఆధిపత్యమే సాగడంవల్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక కళారూపాలు ధ్వంసమైన మాట కూడా నిజమే. అయినా ఆంధ్రప్రాంత కళలకు, కళాకారులకు, రచయితలకు ఈ వైపు నుంచి గౌరవాభిమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటి ఆధిపత్యాన్ని అంగీకారం లభిస్తోంది. తెలుగు వారందరి లాగే తెలంగాణవాసులు కూడా ఆంధ్ర ఆధిపత్య సినిమాలను ఆదరిస్తున్నారు. దీనిని కేవలం వినోదంలో భాగంగా, అభిరుచిగానే చూడాలి. భవిష్యత్తులో తెలంగాణ భాష, కళలు విడిగా స్థిరపడే కార్యక్రమాలు అటు ప్రజల నుంచి మొదలై ప్రభుత్వ తోడ్పాటుతో ముందుకు సాగాలి. అలా కాలం గడిచిన కొద్దీ కొత్తగా పాదుకునే కళా వైవిధ్యాల పరిణామక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎవరి సాంసృతిక చిహ్నాలు వారికి ఏర్పడవచ్చు. రాబోయే రచయితలు, కళాకారులు కూడా తాము ఉమ్మడి రాష్ట్ర వారసులుగా భావించే అవకాశం లేదు. అంతదాకా ఉమ్మడి రాష్ట్ర కాలంలోని రాజకీయ నాయకులు, రచయితలు, కళాకారులు, సినిమా నటులు ఇరువైపులా అభిమానం పొందుతారు.

వివిధ రంగాల్లో ఉండి తెలంగాణను కావాలని తక్కువ చేసిన ఆంధ్రులకు మాత్రం ఎప్పటికి గౌరవం దొరకదు. రాష్ట్రం వేరుపడినా ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహానుభావుల విషయంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి వ్యతిరేక, శత్రుభావన లేవు. ట్యాంక్ బ్యాండ్ పైని విగ్రహాల ధ్వంసం కూడా ఓ అక్రోశంలోంచి పుట్టిన కోప ఫలితమే తప్ప అదో ప్రణాళికాబద్ధ ప్రతిచర్య కాదు. దానికి ఆనాటి పాలకులే బాధ్యత వహించాలి. మరింత కాలం ప్రజల అభిమానాలను గౌరవిస్తూ ఉమ్మడి కాలంలో అలరించిన కళాకారులను ఇరువైపులా ఆదరణ లభిస్తుంది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్దేశపూర్వకంగా ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించినవారు, ఆ విషయాన్నీ బహిరంగంగా ప్రకటించినవారు ఎప్పటికైనా తెలంగాణ శత్రువులే. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవారు ఆంధ్రావారైనా, తెలంగాణవారైనా ఒకటే. తెలంగాణ సాధనను వ్యతిరేకించని వారితో పేచీ అక్కర లేదు. అయితే రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రాథమ్యాలను పక్కనపెట్టి రాష్ట్రాలు రెండైనా తెలుగువారంతా ఒకటే అన్న రీతిలో చాప కింద నీరులా తమ ఆలోచనని విస్తరిస్తోంది. ఆంధ్రుల చేతిలో తెలంగాణ ప్రజలు పడిన అవమానాలు, వివక్షలు అన్నీ ఇంకా పచ్చిపచ్చిగానే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారి ఆకాంక్షలు తీరని లేదు. అయితే కొత్త ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని కావాలని తొక్కివేసే కార్యక్రమాలు చేపడుతోంది.

కొన్ని సంఘటనలను చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర పగ్గాలు ఆంధ్ర రాష్ట్ర సారథి చేతిలో ఉన్నాయా అనిపించేలా ఉన్నాయి. తెలంగాణ రాజధానిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినీ నేపథ్య గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్టాపన ఆలోచన ఇందుకు మరో ఉదాహరణ. రవీంద్రభారతి ప్రాంగణంలో డిసెంబర్ 15న ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. విగ్రహం రవీంద్రభారతి ప్రాంగణంలోకి చేరింది. ముసుగు తొలగించే కార్యక్రమమే మిగిలి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దీని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ గాయకుడి బావమరిది, నటుడు సుధాకర్, కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పర్యాటక్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్ల్లి కృష్ణారావు కూడా స్థలాన్ని సందర్శించి ఇది ప్రభుత్వ నిర్ణయమని ప్రకటించారు.

బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్టాపనపై తెలంగాణవాదుల నుండి గట్టి వ్యతిరేకత కనబడుతోంది. తెలంగాణలోని సినీ అభిమానులు మాత్రం కళలకు ప్రాంతీయత లేదని వ్యతిరేకతను తప్పుపడుతున్నారు. ఈ రకంగా విగ్రహ ఏర్పాటుపై రెండు రకాల అభిప్రాయాలు వినవస్తున్నాయి. అయితే ఉద్యమ కాలంలో నిర్మించిన ఓ తెలంగాణ సినిమాలో తెలంగాణ అనే పదంతో కూడిన పంక్తి ఉన్నందున ఆ పాట పాడడానికి ఆ గాయకుడు నిరాకరించాడని ఓ వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే బాల సుబ్రహ్మణ్యం తెలంగాణను వ్యతిరేకించినట్లే. ఆయన అభిమానులైనా ఈ విషయాన్నీ తీవ్రంగా తీసుకోవాలి. మరోవైపు వద్దు వద్దన్నా మొండిగా ఏర్పాటుకు సిద్ధపడడం ఆక్షేపణీయమే. నిలదీస్తున్న తెలంగాణవాదులకు సంతృప్తికరమైన సమాధానం చెప్పకుండా కమిటీ సభ్యులు జారుకుంటున్నారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉందని ప్రజల అభీష్టాన్ని ఇలా పక్కన పెట్టడం పద్ధతి కాదు.

బలవంతంగా విగ్రహం పెట్టి సాధించేదేమిటి? హైదరాబాద్‌పై తమ పెత్తనం తగ్గలేదని రుజువు చేసుకునే ఆంధ్రుల పన్నాగమేనా ఇది అని అనుకోవలసి వస్తుంది. మరోవైపు చూస్తే ప్రపంచ స్థాయి కంపెనీల రాకతో తెలంగాణ రూపురేఖల్లో మార్పు వస్తోంది. దాని ప్రభావం తప్పకుండా ప్రాంత అస్తిత్వంపై పడుతుంది. ఇతర రాష్ట్రాల, విదేశీయుల ఆస్తులు ఇక్కడ పెరిగిపోతున్నాయి. వారితో స్థానికులు పోటీ పడలేని స్థితి వస్తుంది. మంచికో చెడుకో హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోంది. అది కేవలం తెలంగాణ ప్రజల సొత్తు కాదు అనే రోజులు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇది ఉండాలి, అది ఉండొద్దు అనేందుకు గొంతు సరిపోని కాలం వచ్చింది. పాలకులు ఆ వైపు ఉంటే ఇంకేమి చేయలేని స్థితి ఇది. తరం మారుతున్నది కాబట్టి తెలంగాణ ప్రజల ఆలోచన సరళి కూడా మారిపోతోంది. జరిగేది జరగని అనే నిర్లిప్తతలో వారు పడిపోయినట్లున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ హమారా హై అనే గొంతులకు బలం చేకూర్చవలసిన అవసరం ఎంతో ఉంది.

హక్కుల పరిరక్షణలో మనమెక్కడ?

అంతర్జాతీయ మానవ హక్కుల దినంకు సరిగ్గా వారం రోజులముందు భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రోటోకాల్ నిబంధనలను పక్కనపెట్టి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయంకు వెళ్లి ఎదురేగి ‘రెడ్ కార్పెట్’ స్వాగతం పలికారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యంకు మాతృక, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న భారత్ ఇటీవల కాలంలో మానవహక్కుల ప్రమాణాలలో ప్రజలు సిగ్గుచేటుతో తలవంచుకొని పరిస్థితులు నెలకొంటున్నాయి. పుతిన్ తెలివైన రాజకీయ నాయకుడే కాకుండా ప్రపంచంలోనే నేడు అతి కిరాతకమైన నియంత. గత మూడేళ్ళుగా ఉక్రెయిన్‌పై అక్రమంగా యుద్ధానికి ఉపక్రమించి, యుద్ధంకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ఎంత దారుణంగా ఊచకోత కోస్తున్నారో చూస్తున్నాం. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను ఏవిధంగా అణచివేస్తున్నారో చూస్తున్నాం.కేవలం మోడీ ప్రభుత్వమే కాకుండా భారతీయ మీడియా సైతం ఆయనను పొగడ్తలతో నింపే ప్రయత్నం చేసింది.

ఈ సందర్భంగా ఆయనతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ మీడియా సంస్థ జైలులో విషప్రయోగంతో చనిపోయిన ఆయన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణం గురించి ఒక్క ప్రశ్న వేసే సాహసం చేయలేదు. పుతిన్ పర్యటన చివరిలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ను ‘వివాదం’గా పేర్కొన్నారు గాని ‘యుద్ధం’, ‘సంఘర్షణ’ అనే పదాలు వాడేందుకు భారత్ సాహసింపకపోవడం విస్మయం కలిగిస్తోంది. కొద్దీ నెలల క్రితం విడుదలైన ప్రపంచ చిత్రహింసల సూచిక 2025లో భారతదేశం ‘అధిక ప్రమాదం’ కలిగిన దేశంగా ర్యాంక్ పొందింది. ఇది 200కి పైగా పౌర సమాజ సంస్థల సహకారంతో చిత్రహింసలకు వ్యతిరేకంగా ప్రపంచ సంస్థ (ఒఎంసిటి) రూపొందించిన మొట్టమొదటి వార్షిక అంచనా. 2024లో, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)నివేదిక ప్రకారం దేశంలో 2,739 నిర్బంధంలో మరణాలు జరిగాయి. ఇవి 2023లో జరిగిన 2,400 కేసుల నుండి బాగా పెరిగిందని నివేదిక పేర్కొంది.

లిబియా, హోండురాస్, బెలారస్, కొలంబియా, టర్కీ, ఫిలిప్పీన్స్, ట్యునీషియాలతో పాటు భారతదేశం బాధితులు, రక్షకులపై క్రమబద్ధమైన హింస, ప్రతీకార చర్యలకు అధిక ప్రమాదం ఉన్న దేశాలుగా తాజా సూచిక గుర్తించింది. ఈ గణాంకాలు ఉన్నప్పటికీ, భారతదేశంలో హింస లేదా సిఐడిటిపి (క్రూరమైన, అమానుషమైన లేదా అవమానకరమైన చికిత్స లేదా శిక్ష)ను ప్రత్యేకంగా నేరంగా పరిగణించే జాతీయ చట్టం లేదు. హింసను ఎదుర్కోవడానికి రాజకీయ నిబద్ధతను గణనీయమైన ప్రమాదంగా రేట్ చేశారు. అయితే నిర్బంధంలో హింస నుండి స్వేచ్ఛ, శిక్షార్హతను అంతం చేయడం, బాధితుల హక్కులు, పౌర స్థలంతోసహా అన్ని ఇతర స్తంభాలు అధిక ప్రమాదం స్కోరును పొందాయి. మరోవంక, స్వతంత్రంగా పనిచేయలేక పోవడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొందని కూడా నివేదిక పేర్కొంది. మార్చి 2025లో, గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్‌స్టిట్యూషన్స్ (జిఎఎన్‌హెచ్‌ఆర్‌ఐ) జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ‘ఏ’ నుండి ‘బి’ హోదాకు తగ్గించడం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంకు అంతర్జాతీయంగా అవమానకరమైన అంశం. దీనివల్లనే అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో అధికారిక హోదాను కోల్పోయాం.

దర్యాప్తులలో పోలీసుల ఉనికి, తగ్గిపోతున్న పౌర స్థలం, మానవ హక్కుల పరిరక్షకులుపై హింసను పరిష్కరించడంలో వైఫల్యాన్ని పేర్కొంటూ. హింస, అరెస్టులు లేదా జైలు మరణాలకు సంబంధించిన డేటా ప్రజలకు పరిమితంగా అందుబాటులో ఉండటం వల్ల, పారదర్శకతపై భారతదేశపు స్కోరు ‘దాగి ఉంది’ అని గుర్తించారు. ‘బాధితుల హక్కులు తీవ్రంగా పరిమితంగా ఉన్నాయి’ అని నివేదిక పేర్కొంది. ‘హింస బాధితులను నిర్వచించే సమగ్ర చట్టం లేకపోవడంతో చాలా మంది బాధితులకు పరిష్కారం లేదా పునరావాసం లేదు. ‘విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (ఎఫ్‌సిఆర్‌ఐ), 2010 కింద 30,000 కంటే ఎక్కువ ఎన్‌జిఒలు మూతబడ్డాయి. ఆదాయపన్ను నియమాలు 2021 వంటి చట్టాలు పౌర సమాజాన్ని అణచివేస్తూనే ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఈ ధోరణులు ఉన్నప్పటికీ, కొన్ని సానుకూల పరిణామాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2020లో, సుప్రీం కోర్టు పోలీస్ స్టేషన్లలో 24 గంటలూ సిసిటివిలను మోహరించాలని ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయం ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదు. భారతదేశంలో, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), క్రిమినల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్ (సిఆర్‌పిసి), భారతీయ సాక్ష్య చట్టంల స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య బిల్లు (బిఎస్బి) వంటి కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు. ఇవి గతంలోని చట్టాలలో గల లోపాలను మెరుగుపరిచే బదులు చట్టపరమైన తిరోగమనం కూడా మానవ హక్కుల సమాజం గుర్తించింది. ఈ చట్టాలు కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టిన్నప్పటికీ, అవి పోలీసు కస్టడీ వ్యవధిని కూడా పొడిగించాయి.

ప్రభుత్వ అధికారులను విచారించడానికి కార్యనిర్వాహక అనుమతి అవసరమని పేర్కొన్నది. గణనీయమైన చట్టపరమైన, సంస్థాగత లోపాల కారణంగా భారతదేశంలో శిక్షార్హత లేకపోవడం లోతుగా పాతుకుపోయిందని అంతర్జాతీయ నివేదికలు స్ఫష్టం చేస్తున్నాయి. భారతదేశంలో మానవ హక్కుల ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అవసరమైన వ్యవస్థాగత మార్పులు కనిపించడం లేదు. ఈ సందర్భంగా గ్లోబల్ టార్చర్ ఇండెక్స్ భారతదేశానికి పది అంశాల సిఫార్సు చేసింది. యుఎన్ క్యాట్‌ను ఆమోదించడం, సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఎఎఫ్‌ఎస్ పిఎ), ఎఫ్‌సిఆర్‌ఎలను రద్దు చేయడం, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం, నిర్బంధ పరిస్థితులు మండేలా, బ్యాంకాక్ నియమాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి. మండేలా, బ్యాంకాక్ నియమాలు ఖైదీల చికిత్సకు కనీస మార్గదర్శకాలను నిర్దేశించే ఐరాస ప్రమాణాలు. మండేలా నియమాలు అందరు ఖైదీలకు వర్తిస్తుండగా, బ్యాంకాక్ నియమాలు ప్రత్యేకంగా మహిళా ఖైదీలు, నేరస్థుల అవసరాలను పరిష్కరిస్తాయి. యుఎపిఎ నిబంధనల దుర్వినియోగాన్ని ఆపివేసి, మానవ హక్కుల పరిరక్షకులను రక్షించడానికి సమగ్ర చట్టాన్ని రూపొందించాలని కూడా ఇది ప్రభుత్వాన్ని కోరింది. ‘జాతీయ భద్రతా చట్టాల దుర్వినియోగం, పేలవమైన నిర్బంధ పరిస్థితులు, పరిష్కారానికి ప్రాప్యత లేకపోవడం వల్ల భారతదేశంలో హింస నుండి బయటపడిన వారిలో ఎక్కువ మందికి న్యాయం లేకుండాపోతుంది’ అని నివేదిక ముగించింది.

హింస, నిర్బంధంలో మరణాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై కీలకమైన డేటాను యాక్సెస్ చేయడంలో పౌరసమాజం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్లను నొక్కి చెబుతుంది. ‘ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనం నిర్ధారించడానికి, చట్టంలో, ఆచరణలో ప్రతి సమాజంలో డేటా యాక్సెస్‌కు హామీ ఇవ్వాలి’ అని అది పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు, పోలీసు ప్రోటోకాల్‌లు, నిర్బంధ గణాంకాలపై అధికారిక డేటా పేలవమైన లభ్యత ‘దేశంలోని సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సవాళ్లను ప్రతిబింబిస్తుంది’. వ్యవస్థాగత దుర్వినియోగాన్ని పర్యవేక్షించడానికి, పరిష్కరించడానికి సంస్థలు, వ్యక్తుల సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది.

వాస్తవానికి భారత దేశంలో ఉన్నన్ని మానవ హక్కుల సంస్థలు మరో దేశంలో లేవు. జాతీయ స్థాయిలోనే 9 హక్కుల కమిషన్లు ఉండగా, రాష్ట్రాలలో మరిన్ని ఉన్నాయి. మొత్తం మీద 180 వరకు ఉన్నాయి. అయితే, అవ్వన్నీ ఐరాస ప్రమాణాలకు విరుద్ధంగా ‘రాజకీయ పునరావాసం’ మాదిరిగా రిటైర్డ్ న్యాయమూర్తులు, అధికారులకు ప్రయోజనకర ఉపాధి కల్పించే సంస్థలుగా మారిపోతున్నాయి. దానితో వాటి నిజాయితీ, చిత్తశుద్ధి, స్వతంత్రతలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఇన్ని మానవ హక్కుల సంస్థలు ఉన్న ఏకైక దేశం మనది. అయినప్పటికీ అవి పనిచేయడం లేదు’ అని పీపుల్స్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రీ టిఫాగ్నే ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాతీయ మానవ హక్కుల కమిషన్ 32 సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. చట్టవిరుద్ధ హత్యలు లేదా హింసకు కారణమైన ఒక్క పోలీసు అధికారిని కూడా విచారించలేదు’ అని ఆయన గుర్తు చేశారు. హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సదస్సును ఆమోదించడంలో విఫలమైనందుకు, కస్టడీ మరణాలలో దాని ‘సున్నా జవాబుదారీతనం’ కోసం భారతదేశం ‘సిగ్గుతో నమస్కరించాలి’ అని ఆయన స్పష్టం చేశారు. శిక్ష విధించకపోవడం, అణచివేత, న్యాయవాదులను చట్టపరంగా లక్ష్యంగా చేసుకోవడం ద్వారా గుర్తించిన విస్తృత మానవ హక్కుల సంక్షోభం గురించి కూడా హెన్రీ హెచ్చరించారు.

చలసాని నరేంద్ర

98495 69050

అద్భుత ‘విజన్’.. రైజింగ్ సన్

స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తి కానున్నాయి. అప్పటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే అత్యంత ప్రాధాన్యంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అద్భుతమైన ఫలితాలకు వేదికగా అందర్నీ ఆశ్చర్యపర్చింది. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో సదస్సులను నిర్వహించారు. మొదటి రోజునే ఈ సదస్సు సూపర్ సక్సెస్ అయింది. 35 కంపెనీలు రూ. 2.43లక్షల కోట్లు తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం కావడం గొప్ప విషయం. రెండో రోజు మంగళవారం అదే స్థాయిలో కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా, ఈ రెండు రోజుల సదస్సులో ఇప్పటివరకు రూ. 6లక్షల వేల కోట్ల పెట్టుబడులు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ఎకానమీ ప్రస్తుతం దాదాపు 185 బిలియన్ డాలర్ల వరకు ఉండగా, త్రీ ట్రిలియన్ డాలర్లకు చేరుకునేందుకు 22 ఏళ్లలో 16 రెట్లు పెరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం సంకల్పాన్ని పెట్టుకుంది. ఎకానమీ ప్రాథమిక సూత్రాలను మార్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. క్యాపిటల్, ఇన్నోవేషన్ కలిపి ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమని భావిస్తోంది.

విజన్‌లో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) మోడళ్లను ప్రభుత్వం నిర్దేశించుకుంది. డీప్‌టెక్, ఎఐ, క్వాంటమ్, కంప్యూటింగ్ తదితర సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా దూసుకెళ్తున్న ప్రపంచంలో తెలంగాణను ఆసియాకు ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాల ప్రారంభంగా ప్రభుత్వం ఈ రైజింగ్ విజన్ సదస్సు భారీ ఎత్తున నిర్వహించింది. చైనా లోని అన్ని ప్రావిన్స్‌ల్లో పెద్దదైన గ్వాంగ్‌డాంగ్ ప్రాంతం 20 ఏళ్ల లోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించింది. ఆ ప్రావిన్స్‌నే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విజన్‌కు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ విజన్ సాధించడం కష్టంగా అనిపించినా, కృషితో సాధించగలమన్న నమ్మకంతో ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. మొదటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటి, గ్రీన్‌ఎనర్జీ, విద్యుత్, రవాణా, విద్య, వైద్యం, పర్యాటకం, వినోదం, ఈ విధంగా వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక్క ఇంధన రంగంలోనే రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రావడం విశేషం. దీని ద్వారా 1,52,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ 14 సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41 వేల కోట్లు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. డీప్‌టెక్ రంగంలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ రూ. 75 వేల కోట్లు (భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తారు), ఎప్రిన్/యాక్సిస్ రూ. 31 వేల కోట్లు, విన్‌గ్రూప్ రూ. 27 వేల కోట్లు, సల్మాన్‌ఖాన్ రూ.10 వేల కోట్లు, మేఘా 8 వేల కోట్లు, వంతారా తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధమయ్యాయి.

పునరుత్పత్తి శక్తి, పవర్ సెక్యూరిటీ రూ. 39,700 కోట్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ లాజిస్టిక్ గేల్‌వేలకు రూ. 19,350 కోట్లు, అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ , కోర్ ఇండస్ట్రీ రూ. 13,500 కోట్లు ఒప్పందం కుదిరింది. మై హోం నుంచి గ్లోబల్ కంపెనీల వరకు ఈ ఒప్పందాల వెల్లువ ఉప్పొంగింది. ప్రస్తుతం తెలంగాణలో 11.4 గిగావాట్ల (11,400 మెగావాట్ల) పునరుత్పాదక విద్యుత్‌కు అదనంగా మరో 20 గిగావాట్ల (20 వేల మెగావాట్ల) విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్షంగా పెట్టుకున్నారు. 2047 నాటికి 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం అవుతుంది కాబట్టి ఆ డిమాండ్ సాధన కోసం మరిన్ని సౌర, థర్మల్ ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థలు నెలకొల్పడానికి నిర్ణయించుకున్నారు. రక్షణ, అంతరిక్షరంగాల పరిశోధనలతోపాటు ఉత్పత్తులకు వీలుగా హైదరాబాద్ నగరం త్వరలో మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చ జరిగింది. రానున్న రోజుల్లో తెలంగాణలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మరో మూడు యూనిట్లు నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రక్షణ ఉత్పత్తులు అందించడానికి 3500 కంపెనీలు 25 పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయని చర్చలో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్న సూచన వెలువడింది.

అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయం, అనుబంధ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 34.6 బిలియన్ డాలర్లు ఉండగా, 2047 నాటికి 400 బిలియన్ డాలర్లకు పెంచడం లక్షంగా పెట్టుకున్నారు. సోమవారం క్రీడారంగానికి ప్రోత్సాహకరంగా రూ.16వేల కోట్ల పెట్టుబడులు సమకూరగా, మంగళవారం మరో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు సమకూరుతున్నాయి. రాష్ట్రంలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చింది. కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి రూ. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే నాలుగేళ్లలో 200 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. అపోలో గ్రూప్ ఆధునిక విశ్వవిద్యాలయం, వైద్య, విద్య పరిశోధన కేంద్రం నిర్మాణానికి 200 కోట్లు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. అరబిందో ఫార్మా రూ. 2 వేల కోట్లు, ఎఐ రెడీ డేటా పార్క్ రూ.70 వేల కోట్లు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఆయా కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉండడం విశేషం. ఆయన సమక్షం లోనే ఒప్పందాలు కుదురుతుండడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరుపురాని ఘట్టం.