ankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escort

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

‘హైడ్రోజన్ బాంబ్’ పేలిందా?

హర్యానా శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత భారత రాజకీయాల్లో తీవ్ర కలకలం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘హైడ్రోజన్ బాంబ్’ పేరుతో బిజెపిపై ఓటు చోరీ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రఖ్యాత మీడియా ఛానెల్స్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించాయి. దేశీయ, విదేశీ మీడియా కవరేజ్ ఈ ఆరోపణల లోతును తెలియజేస్తోంది. ఎన్నికల కమిషన్‌పైనా ప్రశ్నలు లేవనెత్తారు. రాహుల్ గాంధీ ఆరోపణలు తీవ్రమైనవి. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లతో బిజెపి గెలిచిందని చెప్పారు. ఓటరు జాబితాల్లో డూప్లికేట్‌లు, తప్పు చిరునామాలు, నకిలీ ఫోటోలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకే ఫోటోతో 22 ఎంట్రీలు, బ్రెజీలియన్ మోడల్ ఫోటోను ఉపయోగించి స్వీటీ, సీమ, సరస్వతి వంటి పేర్లు పెట్టారని ఆరోపించారు. ఈ మహిళ ఫోటో 10 పోలింగ్ బూత్‌ల్లో కనిపించిందని, అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. ఒకే నియోజకవర్గంలో 100 ఓటర్ కార్డులు ఒకే ఫోటోతో ఉన్నాయని హైలైట్ చేశారు. మరో మహిళ ఫోటో 223 సార్లు కనిపించిందని తెలిపారు.

ఒక ఇంట్లో 501 మంది ఓటర్లు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినవారికి ఓటు హక్కు కల్పించారని ఆరోపణ. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ప్రధాని మోడీ, అమిత్ షా మధ్య సంప్రదింపులు జరిగాయని కూడా చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ గెలుపు అంచనా వచ్చినా, ఫలితాలు బిజెపికి ఎక్కువని గుర్తు చేశారు. హర్యానా సిఎం నాయబ్ సింగ్ సైనీ ఏర్పాట్ల వార్తలు, బిజెపి గెలవబోతుంది అన్న వీడియోను రుజువుగా చూపించారు. పోస్టల్ ఓటింగ్‌లో అసాధారణ తేడాలు, 8 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోవడం, మొత్తం 22,779 ఓట్ల తేడాతో పరాజయం – ఇవన్నీ ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’లో భాగమని ఆరోపించారు. దేశీయ మీడియా ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది. ఎన్‌డిటివి ఎడిటర్ రవిష్ కుమార్ రాహుల్ గాంధీ ఆరోపణలు భారత ప్రజాస్వామ్యానికి ముప్పు. 25 లక్షల నకిలీ ఓట్లు అంటే ప్రతి 8 మందిలో ఒకరు నకిలీ. ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాలి అని కామెంట్ చేశారు.

ఇండియా టుడే చానెల్‌లో రజత్ శర్మ ‘హైడ్రోజన్ బాంబ్’ పేరు భయపెట్టేలా ఉంది. కానీ ఆధారాలు రుజువైతే, ఇది ఎన్నికల వ్యవస్థపై పెద్ద ప్రశ్న. బిజెపి ఖండన తప్పుడు మాత్రమే కాదు, విచారణ కావాలి అని మండిపడ్డారు. టైమ్స్ నౌ డిబేట్‌లో అర్నబ్ గోస్వామీ రాహుల్ ఓటు చోరీ ఆరోపణలు ఎక్కువ, ఆధారాలు తక్కువ అని అన్నారు. కానీ బ్రెజిల్ మోడల్ ఫోటో విషయం ఆసక్తికరం. ఎక్స్‌పోజ్ చేయాలి అని ప్రశ్నించారు. ఎబిపి న్యూస్‌లో ప్రణబ్ రాయ్ ‘కాంగ్రెస్ ఘన విజయాన్ని ఓటమిగా మార్చారు. ఎన్నికల కమిషన్ బిజెపి సాథీభావం చూపిందా? 35 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపణ తీవ్రమైంది’ అని అన్నారు. రిపబ్లిక్ టివిలో అర్ణబ్ మళ్లీ ‘రాహుల్ వైఫల్యాలను కవర్ చేసుకోవడానికి ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తున్నారు. కానీ నకిలీ ఓట్ల ఆధారాలు వెరిఫై అవుతే, దేశానికి షాక్’ అని హెచ్చరించారు. సిఎన్‌ఎన్ -న్యూస్18 లో రాఘవ్ బాపట్ల ‘పోస్టల్ ఓటింగ్ అసాధారణత్వం, ఒక ఇంట్లో 501 ఓటర్లు ఇవి రిగ్గింగ్ సంకేతాలు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి అని సూచించారు.

విదేశీ మీడియా కూడా ఈ ఆరోపణలను పట్టుకుని చర్చించింది. బిబిసి న్యూస్‌లో సౌమ్యా గుప్తా రాహుల్ గాంధీ చేసిన హైడ్రోజన్ బాంబ్ వ్యాఖ్యలు భారత ఎన్నికల సమగ్రతలో ఉన్న పగుళ్లను బహిర్గతం చేశాయి. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు బయటపడటంతో, ఎన్నికల కమిషన్ (ఇసిఐ) తటస్థతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది మోడీ ప్రజాస్వామ్య ప్రతిఛాయను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీయవచ్చు అని కామెంట్ చేసింది. అల్ జజీరాలో మెహ్దీ హసన్ ‘హర్యానాలో బిజెపి నకిలీ ఓటర్ల ద్వారా విజయాన్ని దొంగిలించిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ బ్రెజిలియన్ మోడల్ ఫోటోలతో నకిలీ ఐడిల ఆధారాలను చూపించారు. అంతర్జాతీయ పరిశీలన అవసరమయ్యే కుంభకోణం. భారత ఎన్నికల కమిషన్ కాదా అని ప్రశ్నించారు. రాయటర్స్ రిపోర్ట్‌లో ‘ఆపరేషన్ సర్కార్ చోరి’లో ప్రధాని మోడీ, సిఇసి కుట్రపూరితంగా వ్యవహరించారని గాంధీ ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది. కానీ బిజెపి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించింది. నకిలీల ద్వారా 125% ఓటర్ల ద్రవ్యోల్బణం ప్రజాస్వామ్యంపై ఎర్ర జెండాలు ఎగురవేస్తోంది’ అని పేర్కొన్నారు. న్యూస్ వీక్ మ్యాగజైన్‌లో ‘హర్యానాలో బిజెపి విజయంపై రాహుల్ గాంధీ హెచ్-బాంబ్’ పేల్చారు. 25 లక్షల బోగస్ ఓట్లను ఆరోపిస్తున్నారు.

యుపి వలసదారుల నుండి జీరో అడ్రస్ ఇళ్ల వరకు, ఆరోపణలు వ్యవస్థాగత మోసాన్ని చిత్రీకరిస్తున్నాయి. ఇసిఐ పారదర్శకంగా స్పందించాలి’ అని విశ్లేషించారు. గార్డియన్ పేపర్‌లో భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్ జరిగిందని పేలుడు ఆరోపణలు చేస్తున్నారు. 100 కార్డులలో ఒక ఫోటో ఆధారాలతో, ఈ ‘హైడ్రోజన్ బాంబు’ ఎన్నికల సంస్కరణల కోసం పిలుపులను రేకెత్తించవచ్చు’ అని రాశారు. సిఎన్‌ఎన్ ఇంటర్నేషనల్‌లో క్రిస్టియన్ అమపౌర్ ‘హర్యానా ఎన్నికల వివాదం భారతదేశ ఓటింగ్ వ్యవస్థలోని దుర్బలత్వాలను హైలైట్ చేస్తుంది. వీడియోలు, డేటా మద్దతుతో గాంధీ వాదనలు మోడీ పాలనలో న్యాయాన్ని సవాలు చేస్తున్నాయి. గ్లోబల్ వాచ్‌డాగ్‌లు దర్యాప్తు చేయాలి’ అని అన్నారు. ఫారిన్ పాలసీ మ్యాగజైన్‌లో ‘నకిలీ ఓటర్లపై రాహుల్ బహిర్గతం 5.2 లక్షల నకిలీలు, 98 వేల తప్పుడు చిరునామాలు బిజెపి 2024 హర్యానా విజయాన్ని ప్రశ్నిస్తుంది. నిరూపిస్తే, అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని తగ్గిస్తుంది’ అని విశ్లేషణ చేశారు. ఈ మీడియా కామెంట్స్ ఆరోపణల లోతును తెలియజేస్తున్నాయి. దేశీయ ఛానెల్స్ రాజకీయ డిబేట్‌లకు దారి తీశాయి. విదేశీ మీడియా భారత ప్రజాస్వామ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తోంది. బిజెపి ఈ ఆరోపణలను ‘తప్పుడు, ఆధారరహితం’ అని ఖండించింది.

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాహుల్ తన వైఫల్యాలను దాచుకోవడానికి ఎన్నికల వ్యవస్థను అసత్యాలతో ఆరోపిస్తున్నారు’ అని చెప్పారు.కానీ మీడియా ఆధారాలపై దృష్టి పెట్టింది. రాహుల్ చూపిన వీడియోలు, డేటా రిపోర్టులు విశ్వసనీయమని చాలా చానెల్స్ అభిప్రాయపడ్డాయి. ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. ఇది వివాదాన్ని మరింత పెంచుతోంది. ఈ ఘటన భారత ఎన్నికల వ్యవస్థపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. నకిలీ ఓట్లు, డూప్లికేట్ ఐడిలు ఎలా జరిగాయి? ఎన్నికల కమిషన్ స్వతంత్రమా? ఎగ్జిట్ పోల్స్‌తో ఫలితాల మధ్య తేడా ఎందుకు ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలి. రాహుల్ ఆరోపణలు నిజమైతే, ఎన్నికల సంస్కరణలు అవసరం. తప్పితే, కాంగ్రెస్ విశ్వసనీయతపై ప్రశ్నలు. ఇది రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి దారి తీస్తుంది. ప్రజాస్వామ్యం బలపడాలంటే, పారదర్శకత ముఖ్యం. ఈ ‘హైడ్రోజన్ బాంబ్’ పేలుడు దేశాన్ని మేల్కొల్పాలి.

కోలాహలం రామ్ కిశోర్

98493 28496

మార్పుకు న్యూయార్క్ నాంది

ప్రపంచ దేశాల్లో మార్పు తథ్యం అనిపిస్తున్నది. అమెరికాలో భారతీయ మూలాలున్న నాయకులు కీలక రాజకీయ పదవులు అధిరోహిస్తున్న నేపథ్యంలో ఇది మరింత బలపడుతోంది. ఇటీవలి ఎన్నికల్లో పలువురు భారతీయ- అమెరికన్లు విజయాలు సాధించడం, అమెరికాలో 44 లక్షలకు పైగా ఉన్న భారతీయ వంశీయుల రాజకీయ ప్రభావం పెరుగుతున్నదనే సంకేతాలు ఇస్తోంది. అత్యంత ప్రధానంగా న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలలో జోహ్రాన్ మమ్దాని విజయం సాధించి నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 34 ఏళ్ల వయసులో, ఒక శతాబ్దం తరువాత న్యూయార్క్‌కు అత్యంత యువ మేయర్‌గా ఆయన నిలవనున్నారు. ఉగాండా భారతీయ మూలాల తల్లిదండ్రులకు జన్మించిన మమ్దాని, గృహ వసతి, వలసదారుల హక్కులు, ప్రజారవాణా వంటి అంశాలపై పనిచేసినందుకు సిద్ధ్దపడుతున్నారు.

ప్రపంచంలో ఏది తప్పుగా జరుగుతోంది? ఏ అన్యాయానికి పరిష్కారం అవసరం? ఏ కథ లోకానికి చెప్పడం లేదు?’ అన్న అంశాలపై జోహ్రాన్ చర్చించారు. ఆ విశ్లేషణలను వింటూ పెరిగిన వాడు ఇప్పుడు ప్రపంచమంతా తన వైపు తిప్పుకునేంత ఎత్తు ఎదిగారు. అమెరికా గడ్డపై న్యూయార్క్ పట్టణ మేయర్‌గా తొలిసారి ఓ సోషలిస్టుగా ఎన్నికై తన పేరును చరిత్ర పుటల్లో లిఖించాడు. జోహ్రాన్ చిన్నవయస్సులోనే సమకాలీన అంశాలను విశ్లేషించే వారు. మతతత్వశక్తులపై నిరసనలు తెలియచేసారు. భారత్‌లో రామ్ మందిర్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, గాజాలోని ముస్లింలపై దాడులను నిరసన వ్యక్తం చేసారు. జోహ్రాన్ 1991లో ఉగాండాలోని కంపాలలో జన్మించారు. తల్లి మీరానాయర్, తండ్రి మహ్మద్ మమ్దానీ. ఇద్దరూ భారతీయులే. మీరా బాలీవుడ్ చిత్రరంగంలో అవార్డులు కొల్లగొట్టిన ప్రముఖ చిత్రాలు ‘సలాం బాంబే’, ‘మాన్‌సూన్ వెడ్డింగ్’ వంటి సినిమాలని తెరకెక్కించారు.

ఈ కుటుంబం జోహ్రాన్‌కి ఐదేళ్లప్పుడు దక్షిణాఫ్రికాకి వెళ్లి, ఆ తరువాత న్యూయార్క్ నగరంలో స్థిరపడ్డారు. బాల్యం నుండి న్యూయార్క్ వీధుల్లో పెరిగిన జోహ్రాన్ ఎన్నోసార్లు వివక్షని ఎదుర్కొన్నాడు. ఆ సందర్భాన్ని ఒకసారి ఆయన ఇలా చెప్పారు. ‘నా స్నేహితుడు ఒకసారి నన్ను ‘మీరు సనాతనవాదులు కారు’ అని చెప్పాడు. జోహ్రాన్ బదులిస్తూ మేము బుద్ధిమంతులం, తెలివిపరులమని తెలియజేసారు. మా కుటుంబంలో ప్రార్థన ఉంది. కవిత్వమూ ఉంది. మా ఇంట్లో ఉర్దూ గజల్స్ ఉంటాయి. ఆఫ్రికన్ జానపద కథలు వినిపిస్తాయి’ అని చెప్పాడు. ఎన్నో చేదు అనుభవాలు అతనికి ఎదురయ్యాయి. ‘తనని ఇంతటి శక్తిమంతుడిగా తీర్చిదిద్దింది అమ్మానాన్నే’ అని జోహ్రాన్ గర్వంగా చెబుతారు. ‘వలస వెతలు, బాల కార్మికులు, గుర్తింపు, సంస్కృతి వంటి ఇతివృత్తాలను అద్భుతంగా తెరకెక్కించిన తల్లి పెంపకంలో తాను ఉన్నతంగా ఎదిగానని జోహ్రాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరోసారి తన తల్లి గురించి ఆయన ఇలా అన్నారు. ‘హ్యారీ పోర్టర్ లాంటి సినిమాలని ఏ మంచి దర్శకుడైనా రూపొందిస్తారు.

కానీ అమ్మ తీసిన చిత్రాలు కేవలం ఆ వ్యక్తులు, వాళ్ల బాధలను పట్టించుకునే వ్యక్తులకు మాత్రమే సాధ్యం. సమాజంలో వివక్షకు గురవుతున్న వర్గాలపట్ల నా తల్లిదండ్రీ నిలబడడం నిజంగా నాకు గర్వకారణం. వాళ్లు చెప్పిన కథలు గ్లామర్‌గా ఉండవు. అవి సృజనాత్మకతని, విలువైన విషయాలు, ప్రపంచం చూడని కథలని ఎత్తి చూపుతాయి. వాటి శక్తిని అర్థం చేసుకోవడం అంటే ప్రజా విధానాన్ని అర్థం చేసుకోవడమే అని నా అభిప్రాయం’ అని చెబుతున్న జోహ్రాన్, తల్లిదండ్రుల సంరక్షణలో క్రియాశీలకమైన భావజాలంతో పెరిగారు. ప్రపంచంలో నెలకొన్న అసమానతలని చిన్నప్పటి నుండి అతను అవగతం చేసుకోవడం మొదలుపెట్టారు. జోహ్రాన్ మాటల్లో చెప్పాలంటే ‘కళ’, ‘క్రియాశీలత’ వేరు కాదని నేర్పించారు’ అంటారు. భారతదేశం, ఇజ్రాయెల్, పాలస్తీనా వంటి ప్రపంచ రాజకీయ అంశాలపై ఆయన వ్యక్తపరచిన అభిప్రాయాలు కొంత వివాదాస్పదంగా మారాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మమ్దాని పాలన శైలి, స్థానిక సమస్యలపై ఆయన ప్రాధాన్యత, రాబోయే కాలంలో ప్రధానంగా గమనించబడనుంది. ఇదిలా ఉండగా, వర్జీనియా రాష్ట్రంలో ఘజాలా హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై ఆ రాష్ట్రంలో తొలి ముస్లిం, దక్షిణాసియా మూలాల నాయకురాలిగా చరిత్ర సృష్టించారు. 61 ఏళ్ల డెమొక్రాట్ నాయకురాలు హష్మీ, 54%కు పైగా ఓట్లు సాధించారు. ఆమె తన లెజిస్లేచర్‌గా పనిచేసిన కాలంలో ప్రజా విద్య, ఓటు హక్కులు, ఆరోగ్య సేవలు, పర్యావరణ సంరక్షణ అంశాలపై చురుకుగా పని చేశారు.

అలాగే, ఓహియో రాష్ట్రం సిన్సినాటి నగర మేయర్‌గా అఫ్తాబ్ ప్యూరవాల్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన 2021లో తొలి ఆసియా మూలాల మేయర్‌గా ఎన్నికై, ఈసారి రిపబ్లికన్ ప్రత్యర్థిని ఓడించి రెండోసారి బాధ్యతలు కొనసాగిస్తున్నారు. ప్యూరవాల్ తల్లి టిబెటన్ శరణార్థి కాగా, తండ్రి పంజాబీ. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికన్ నగరాలు, రాష్ట్రాలలో భారతీయ మూలాల నాయకులు ఎదగడం, వలసదారుల కృషి, విద్య, సామాజిక సేవల రంగాలలో వారి బలమైన పాత్రను ప్రతిబింబిస్తోంది. ఈ నాయకుల ఎదుగుదల, అమెరికా రాజకీయ వ్యవస్థ పైనేకాక ప్రపంచ సమగ్రత వైపు సాగుతున్నదనే సంకేతాన్ని ఇస్తున్నది. మమ్దాని న్యూయార్క్ నగర పాలనలో అడుగుపెడుతుండగా, హష్మీ వర్జీనియా రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్యూరవాల్ తన రెండో పదవీకాలాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ముగ్గురు నాయకుల పాలనా నిర్ణయాలు రాబోయే సంవత్సరాల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. రాబోయే రోజుల్లో మెరుగైన పౌరసమాజం మూలస్తంభాలైన సామాజిక సమగ్రత, సోషలిజం,ప్రజాస్వామ్యం వైపు ప్రపంచం కదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డా. ముచ్చుకోట సురేష్ బాబు

99899 88912

పేదరిక నిర్మూలనలో కేరళ ఆదర్శం

సామాజిక, మానవ అభివృద్ధిలో రికార్డు సాధిస్తున్న ‘దేవభూమి’ కేరళ, తీవ్రమైన పేదరికం నుంచి విముక్తి పొందినట్టు 69వ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబరు 1న రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించడం దేశానికే ఆదర్శాన్ని చాటుతోంది. తమ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు రూ. 1000 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ఇదే సాఫల్యమైన కేరళ అసలు స్టోరీగా అభివర్ణించారు. అనేక రంగాల్లో కేరళ అభివృద్ధి సాధించడం ద్వారా ‘కేరళ మోడల్’ అన్న పేరు బాగా ప్రసిద్ధి చెందిందన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. పినరయి విజయన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మదాం నియోజకవర్గం ఇప్పటికే దేశం లో, పేదరిక రహిత నియోజకవర్గంగా ప్రకటించబడడం గమనార్హం. పేదరిక కుటుంబాలను గుర్తించడంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. వివిధ ఏజెన్సీల సహకారంతో ప్రణాళిక రూపొందించింది. స్థానిక స్వపరిపాలన శాఖ నేతృత్వంలో సామాజిక భాగస్వామ్యానికి ప్రణాళికలో చోటు కల్పించింది.

2021 మేలో రాష్ట్ర ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అత్యంత పేదరిక నిర్మూలన కార్యక్రమం (ఎక్స్‌ట్రీమ్ పోవెర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఇపిఇపి) ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు ఇటీవల సవరించిన అంతర్జాతీయ దారిద్య్రరేఖ ప్రకారం రోజుకు మూడు అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఖర్చుతో జీవించే వ్యక్తులను తీవ్ర పేదరికంతో ఉన్నట్టు పరిగణిస్తారు. ఈ లెక్కన కేరళ ప్రభుత్వం ప్రజా కేంద్రీకృత అభివృద్ధి, వికేంద్రీకృత ప్రణాళికతో పేదరికాన్ని తగ్గించగలిగింది. 1973 74లో 59.8% వరకు ఉన్న పేదరికం 201112 నాటికి 11.3 శాతానికి తగ్గింది. నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవెర్టీ ఇండెక్స్ 2023లో దేశం మొత్తం మీద అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంగా సూచించింది. కేరళ జనాభాలో కేవలం 0.55 శాతం మంది మాత్రమే బహుముఖ పేదరికంలో ఉన్నారని స్పష్టం చేసింది. ఇది జాతీయ తలసరి పేదరికం 14.96% కన్నా చాలా తక్కువ. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలను గుర్తించడంలో పూర్తిగా స్వీయ నమోదుపై ఆధారపడకుండా ప్రత్యేకంగా దాదాపు 4 లక్షల ఎన్యూమరేటర్లను నియమించింది. వీరికి స్థానిక పాలనా సంస్థలతోపాటు కుడుంబశ్రీ వర్కర్ల సహాయం కూడా అందించింది.

అనేక స్థాయిల్లో మధింపు జరిగిన తరువాత 64,006 అతి పేద కుటుంబాలకు చెందిన 1,03,099 మంది పేదలను గుర్తించింది. వీరిలో చాలా మందికి కనీస ధ్రువీకరణ పత్రాలు లేవు. నాలుగు అంశాల ఆధారంగా వీరి పేదరికాన్ని గుర్తించారు. వారు తింటున్న ఆహారం, ఆరోగ్య ప్రమాణాలు, ఉండడానికి ఇల్లు ఉందా లేదా, వారి చదువు తదితర వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కుటుంబాల్లో చాలా మందికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా లేవు. 21,263 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ అందేలా చేశారు. 4000 కుటుంబాలకు 5422 ఇళ్లు కట్టించి ఇచ్చారు. మరో 5522 ఇళ్లను తిరిగి నిర్మించారు. 1500 కుటుంబాలకు సాగుభూమి అందించారు. శిథిల స్థితిలో ఉన్న ఇళ్లల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ. 2 లక్షల వంతున సహాయం అందించారు. పేదరికం నుంచి ఒకసారి విముక్తి కల్పించడమంటే అన్ని సమస్యలు వారికి వెంటనే పరిష్కారమైనట్టు కాదు. పేదరికాన్ని ఎదుర్కోవడం ఎప్పటికీ అంతం కాని పని. రాష్ట్రప్రభుత్వం తీవ్ర పేదరిక నిర్మూలన ఆదర్శనీయమైన పద్ధతిలో కొనసాగించడంలో అసలు ఉద్దేశం కటిక పేదరికం మళ్లీ ఏర్పడకూడదని, కొత్తగా ఏ కుటుంబం పేదరికంలో పడకూడదని.. పేదరికం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికే ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

విద్య, ఆరోగ్య రంగాల్లోనూ స్థానిక ప్రభుత్వాలు గట్టిగా కృషి చేస్తున్నాయి. 2025 నాటికి కేరళలో అక్షరాస్యత 96 శాతం చేరుకుంది. ఆరోగ్య భద్రత విషయాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో 5415 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మహిళల ప్రసూతి సమయంలో శిశుమరణాల సంఖ్య జాతీయ స్థాయిలో ప్రతివెయ్యి కాన్పులకి 28 వరకు ఉండగా, కేరళలో వెయ్యి కాన్పులకు 5 మాత్రమే ఉండటం గమనార్హం. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో భారీ పరిశ్రమలు అంటూ లేవు. అయినా మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి సూచికల్లో అగ్రగామిగానే కేరళ ఉంటోంది. పేదరిక నిర్మూలన నిరంతర కార్యక్రమమని, 2026 మార్చి నాటికి పేదరికం 0.002 శాతానికి చేరేలా ప్రయత్నిస్తామని రాష్ట్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది.

అయితే కేరళ నమూనాను విమర్శించేవారు కూడా ఉన్నారు. అభివృద్ధి విషయంలో స్తబ్ధత నెలకొందని, నిరుద్యోగం పెరుగుతోందని ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు సాక్షాలన్న విమర్శలు వస్తున్నాయి. పేదరిక నిర్మూలన గణాంకాలు ఉత్త బోగస్ అని కాంగ్రెస్ నేతృత్వం లోని విపక్షం ఆక్షేపిస్తోంది. ఈ విమర్శలను సవాలుగా తీసుకొని ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను, సాంకేతిక హరిత ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. నిరుద్యోగాన్ని తొలగించడానికి విద్యావంతులకు నైపుణ్యాభివృద్ధిని చేపట్టింది. దేనికీ రాజీపడని ప్రగతిశీల పరిపాలన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ రెండిటినీ సమతుల్యం చేసుకోగలదని ‘ఇపిఇపి’ నిరూపిస్తోంది. సమాజం నడిపించే ఈ నమూనా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కేరళ స్టోరీ దేశం మొత్తంమీద ఆదర్శవంతమే కాక, విస్తృతంగా అనుసరించేలా ప్రచారం చేయదగిందనే చెప్పవచ్చు.  

బీహార్ ఓటరు ఎటువైపు?

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2005 నుండి మహిళా సంక్షేమానికి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, పంచాయతీ రాజ్, పుర పాలక సంఘాల అధ్యక్ష స్థానాలలో రిజర్వే షన్లు కల్పించి, పాఠశాల విద్యార్థినులకు 9వ తరగతి నుండే ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసి, పిజి వరకు చదివే విద్యార్థినులకు వివిధ స్థాయిలలో లక్ష వరకు స్కాలర్‌షిప్ ఇచ్చి వారి మన్ననలు చూరగొన్నారు. మహా దళితులకు, 36 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన (ఇబిసి) వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 15శాతం ఓటు బ్యాంకును స్థిరపరచుకు న్నారు. బిజెపికి అగ్రవర్ణాలు తదితరులతో కలిసి దాదాపు 20% ఓట్లున్నాయి.  

అత్యంత వెనుకబడిన వర్గాలలోని 112 ఉపకులాల వారు 120 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయనున్నారు. 10వేల కంటే తక్కువ మెజారిటీతో పార్టీలు గెలిచిన స్థానాలు 50. హిల్సా నియోజక వర్గంలో ఆర్‌జెడి అభ్యర్థిపై జెడియు అభ్యర్థి కేవలం 12 ఓట్లతో గెలిచారు. బర్భిగా స్థానంలో విజేత మెజారిటీ 113. 10 స్థానాలలో అభ్యర్థులు వెయ్యి ఓట్లలో పు మెజారిటీతో గెలిచారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేసినా 47 లక్షల మంది పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరలేదు. వీరిలో 16 లక్షల మంది మహిళలు, ఇబిసిలు దళితులే.  

బీహార్ 18వ శాసనసభ 234 స్థానాలకు రెండు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నితీశ్ నాయకత్వంలోని అధికార ఎన్‌డిఎ, రాహుల్ గాంధీ, ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ల నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ హోరాహోరీగా తలడుతున్నాయి. నవంబర్ 6న తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు సర్వం సిద్ధం కాగా, మలి విడత 122 స్థానాలకు 11న ఎన్నికలు జరగనున్నాయి. గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ సారథ్యంలోనే ఎన్‌డిఎ ఎన్నికలకు వెళుతుండగా, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభృతులు బీహార్ అంతటా కలియదిరిగి మహాఘట్‌బంధన్‌కు ఓటేస్తే 1990 నుండి 1995 వరుకు సాగిన లాలూ, రబ్రీదేవిల నాటి ఆటవిక పాలన, నేరాలు, ఘోరాలు మళ్ళీ వస్తాయని, బీహార్ అంధ యుగాలలోకి వెళుతుందని, డబుల్‌ఇంజిన్ సర్కార్ లాభాలు, సుపరిపాలన కావాలంటే మళ్ళీ నితీశ్ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికి పట్టం కట్టాలని పిలుపు ఇచ్చారు.

బిజెపి, ఆర్‌జెడి, ఎల్‌జెపి, హిందూస్తాన్ ఆవామీ మోర్చా, లోక్ సుమతా పార్టీలు పంచ పాండవుల వలె రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని హామీ ఇచ్చారు. కాగా రాహుల్, తేజస్విల నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూడా ఈసారి ఎలాగైనా ఎన్‌డిఎను చిత్తుచేసి, బీహార్‌ను చేజిక్కించుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. నితీశ్ వయోభారం, అనారోగ్యంవల్ల పాలన చేసే స్థితి లేరని, నేరాలు పెరుగుతున్నాయని, అందరి భాగస్వామ్యంతో బీహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలంటే యువకుడైన్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. లాలూ తొలిసారి ముఖ్యమంత్రి అయిన 1990లో తేజస్వి పురిటి పొత్తిళ్లలోని 4 నెలల పసికందు. ఢిల్లీలో 9వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన తేజస్వి 2020 ఎన్నికలలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి యువతను ఆకర్షించినా మహాఘట్ బంధన్ 110 స్థానాలకు పరిమితమైనది. ఆర్‌జెడి 75 స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా నిలిచింది. మజ్లిస్ పార్టీ వేరుగా పోటీ చేసి ఆరు స్థానాలు గెలిచి అనేక చోట్ల మహాఘట్‌బంధన్ విజయావకాశాలు దెబ్బ తీసింది. ఈ ఎన్నికలలో కూడా 30 స్థానాలకు పోటీకి దిగింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే రాష్ట్రమంతా చుట్టేసి పలువురు అభ్యర్థులతో తాను పోటీ చేయకుండా జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపారు.

ఒక్కసీటు గెలిచే వీలున్నా బహుముఖ పోటీల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలు దెబ్బతీయగలరని అంటున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2005 నుండి మహిళా సంక్షేమానికి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, పంచాయతీ రాజ్, పురపాలక సంఘాల అధ్యక్ష స్థానాలలో రిజర్వేషన్లు కల్పించి, పాఠశాల విద్యార్థినులకు 9వ తరగతి నుండే ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసి, పిజి వరకు చదివే విద్యార్థినులకు వివిధ స్థాయిలలో లక్ష వరకు స్కాలర్‌షిప్ ఇచ్చి వారి మన్ననలు చూరగొన్నారు. మహా దళితులకు, 36 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన (ఇబిసి) వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 15శాతం ఓటు బ్యాంకును స్థిరపరచుకున్నారు. బిజెపికి అగ్రవర్ణాలు తదితరులతో కలిసి దాదాపు 20% ఓట్లున్నాయి. వీరికి తోడు హిందూస్తాన్ అవామీ మోర్చా దళిత ఓట్లు, లోక్ సమతా పార్టీ ఓట్లతో కలిపి దాదాపు 38 శాతం ఓట్లున్నాయి. మహాఘట్ బంధన్‌కు బలమైన యాదవ, ముస్లిం (14 శాతం, 17 శాతం ముస్లిం) 32 శాతం ఓట్లున్నాయి. అయితే అధికారంలోకి ఈ ఓట్లు చాలవని గుర్తించి తేజస్వి యాదవ్ ఈ ఎన్నికల ముందు ఎన్‌డిఎను వీడిన నిషదుల వికాస్ సీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) నేత ముకేశ్ సహానీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించి ప్రచార సభలకు వెంటబెట్టుకొని వెళుతున్నారు.

ఓటర్లలో 4.5 మత్స్యకారులున్నారు. వారిలో మల్లా ఉపకులానికి 2.6 శాతం ఓట్లున్నాయి. ముకేశ్ సహాని మల్లనే. గత ఎన్నికల్లో మరో 12 స్థానాలు గెలిచి ఉంటే తేజస్వికి ముఖ్యమంత్రి పీఠం దక్కేది. సీమాంచల్‌లో మజ్లిస్ పార్టీ మహాఘట్‌బంధన్‌ను దెబ్బ తీసింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్‌కు 37.23 శాతం ఓట్లు రాగా, ఎన్‌డిఎకు 37.26 శాతం అంటే కేవలం 12,700 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. బీహార్‌లో దాదాపు 20 శాతం దళితులున్నారు. మహా దళితులు, చిరాగ్ పాశ్వాన్ ఎన్‌డిఎకు మద్దతుగా ఉన్నారు. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన కింద దాదాపు కోటిన్నర మంది మహిళలు ఒక్కొక్కరి ఖాతాలో రూ. పదివేలు జమచేసి, మెరుగైన ప్రతిభ కనబరచిన వారికి రూ. 2 లక్షల వరకు రుణాలు ఇస్తామని నితీశ్ ప్రభుత్వం వారి జేజేలు అందుకుంది. మహిళల ప్రాధాన్యత గుర్తించిన తేజస్వి మహాఘట్‌బంధన్ అధికారంలోకివస్తే ఒక్కో మహిళ ఖాతాలో నెలనెలా రూ. 2500 నగదు జమ చేస్తామని, సంక్రాంతి పండుగకు రూ.30 వేలు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఖచ్చితంగా ఇస్తామని పోటీ హామీ ఇచ్చి అధికార కూటమిలో గుబులు రేపారు.

అత్యంత వెనుకబడిన వర్గాలలోని 112 ఉపకులాల వారు 120 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయనున్నారు. 10వేల కంటే తక్కువ మెజారిటీతో పార్టీలు గెలిచిన స్థానాలు 50. హిల్సా నియోజక వర్గంలో ఆర్‌జెడి అభ్యర్థిపై జెడియు అభ్యర్థి కేవలం 12 ఓట్లతో గెలిచారు. బర్భిగా స్థానంలో విజేత మెజారిటీ 113. 10 స్థానాలలో అభ్యర్థులు వెయ్యి ఓట్లలోపు మెజారిటీతో గెలిచారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేసినా 47 లక్షల మంది పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరలేదు. వీరిలో 16 లక్షల మంది మహిళలు, ఇబిసిలు దళితులే. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి జెడియుపై కత్తి గట్టిన చిరాగ్ ఎల్‌జెపి ఈసారి అధికార కూటమిలో చేరగా, గతంలో ఎన్‌డిఎలో ఉన్న ముకేశ్ సహానీ ఈసారి మహాఘట్‌బంధన్‌తో జట్టు కట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కులాలు, ఉపకులాల ప్రాబల్యం, ఆ చైతన్యం ఎక్కువగా ఉన్న బీహార్‌లో పార్టీలు ఓట్ల కోసం అలవిగాని హామీలు ఇచ్చాయి. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటే మరో కోటికి పైగా ఉద్యోగాల కల్పనకు రూ. 6 లక్షల కోట్లు అవసరమంటున్నారు. ఇంటికి 200 యూనిట్ల విద్యుత్‌కు భారీగా నిధులు కావాలి. యువత, మహిళలను ఆకట్టుకుని అధికారంలోకి రావాలని యువకుడైన తేజస్వి ఆశ. ఈ ఎన్నికలలో మళ్లీ గెలిచి ఉత్తరాదిలో సత్తాచాటాలని మోడీ యత్నం. తేజస్వి తేజస్సు వెలుగుతుందా లేక మోడీ, నితీశ్‌ల ప్రభావం కొనసాగుతుందా అనేది 7.45 కోట్ల బీహార్ ఓటర్లు తేల్చనున్నారు.

పతకమూరు దామోదర్ ప్రసాద్

94409 90381

వలసలపై అమెరికన్ల గురివింద నీతి

వలసలపై అమెరికాలో ఇప్పుడు కొనసాగుతున్న వ్యతిరేకత చాలా చిత్రమైనది. నిజానికి వలసలపై వారి వైఖరి, ధోరణిపై అర్థమే లేదు. అమెరికన్లు అంతా ఇలాగే లేరు కాని, ప్రస్తుతం ఈ ధోరణిదే ఆధిపత్యం. వలసలపై మాట్లాడే చర్చించే నైతిక అర్హతలు ప్రస్తుతం అమెరికన్లుగా చలామణి అవుతున్న వారికి కనీస మాత్రంగా కూడా లేవు. చదువు, బతుకు దెరువు కోసం ఇతర దేశాలనుంచి అమెరికాకు వలస వచ్చిన విద్యార్థులు, యువతపై తీవ్రమైన వ్యతిరేకత, కోపం, ద్వేషం వ్యక్తం కావడం చాలా చిత్రమైన సంగతి. ఆశ్చర్యకరంగా ఇప్పుడు అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దొరవారు ఈ నినాదంపైనే గద్దెనెక్కారు. ఆయనతో సహా వలసలను వ్యతిరేకిస్తున్న వాళ్లు తన మూలాలు ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే వారి నోరు పెగిలే అవకాశం ఏమాత్రం లేదు. గొంతులో పచ్చి వెలక్కాయ పడిపోయి ఒక్కరికి కూడా మాటపెగలదు. 90 శాతానికి పైగా ప్రస్తుత అమెరికన్ పౌరుల మూలాలు అమెరికా భూభాగం వెలుపలివే. వీరెవ్వరు కూడా అమెరికా భూమి పుత్రులు ఎంత మాత్రంకారు. ఎక్కువగా యూరోపియన్ దేశాలకు చెందిన వీళ్ళ తాతలు, ముత్తాతలు ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి యూరప్ దేశాలకు చెందిన వారు.

దాదాపుగా వీళ్లంతా తెల్లతోలు కలిగిన ప్రజలే. ఆఫ్రికా నుంచి వచ్చిన నల్లతోలు ప్రజలు వారంతట వారుగా అమెరికాకు వచ్చిన వారు కాదు. బలవంతంగా తీసుకు రాబడిన వారే ఇప్పటి అమెరికన్ నల్లజాతీయులు. యూరప్ నుంచి అమెరికాకు వలస వచ్చిన తెల్లతోలు యూరోపియన్లు తమ వ్యక్తిగత సేవలు, ఆక్రమించిన వ్యవసాయ భూముల్లో వెట్టి కూలీలుగా పని చేయడానికి ఆఫ్రికా నుంచి బలవంతంగా బానిసలుగా తరలించబడిన వారే నల్లజాతీయులు. అసలైన భూమి పుత్రులు, నిజమైన అమెరికన్లు కేవలం రెడ్ ఇండియన్ల మాత్రమే. స్థానికులు, భూమి పుత్రులు అయిన ఈ రెడ్ ఇండియన్లు ఇప్పుడు అమెరికాలో కడు దయనీయ జీవితాలను వెళ్ల బుచ్చుతున్నారు. కేవలం కూలీలుగా, నాల్గవ తరగతి ఉద్యోగులుగా మాత్రమే వీళ్లు బతుకులను వెళ్లదీస్తున్నారు. వారి భూములు, అడవులను ఆక్రమించిన తెల్లతోలు యూరోపియన్లు మాత్రం ఆధిపత్యం చేస్తూ అమెరికన్లుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు అమెరికన్లుగా చలామణి అవుతున్న వారిలో 90 శాతం వాళ్లే.

ఇలాంటి వారికి ప్రస్తుత వలసలను ప్రశ్నించే నైతిక అర్హత ఎలా ఉంటుంది? ఒక్కమాటలో చెప్పాలంటే వారిది గురివింద తన కింది నలుపును కనపడనీయకుండా దాచుకొని నేను ఎర్రని దాన్ని, అందమైన దాన్ని అని విర్రవీగే గురివింద నీతి మాత్రమే అవుతుంది. అలాంటి వలస మూలాలున్న తెల్లతోలు అమెరికన్లు ఇప్పుడు చదువు కోసం, ఉపాధి కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులు, యువతపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. వారి ఉపాధికి అడ్డుపడుతున్నారు. భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఆ ధోరణిని రాజకీయ అస్త్రంగా మార్చుకున్న రిపబ్లికన్ పార్టీ నిన్నటి ఎన్నికల్లో ఏకంగా గద్దెనే స్వాధీనం చేసుకోగలిగింది. దీంతో ఇటీవల కాలంలో ఆ నేల వెలుపలి నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు.

నిజానికి అమెరికాలో ఉపాధి పొందగలుగు తున్నది అత్యంత ప్రతిభావంతులైన యువత మాత్రమే. స్థానిక అమెరికన్లు ఇతర దేశాల యువత ప్రతిభతో పోటీ పడలేని ఫలితంగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతున్నారనేది సత్యం. స్వయం కృషి, ప్రతిభలతో మాత్రమే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందే విదేశీ విద్యార్థులపై ఇలాంటి ధోరణి వ్యక్తం కావడం న్యాయమైతే కాదు. వ్యక్తమవుతున్న వలస వ్యతిరేక ధోరణి కారణంగా అమెరికా వెలుపల ఉన్న వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎంతో మానసిక క్షోభకు లోనవుతున్నారు. అమెరికా వెళ్లడం చదువుకోవడం, ఉపాధి సంపాదించడం అంత సులభమైన పని ఏమీకాదు. ఎంతో ప్రయాసతో కూడుకున్నది. డబ్బుతో ముడిపడింది. అత్యంత ప్రతిభావంతులు మాత్రమే అక్కడికి వెళ్లడానికి అర్హులు. తమ తమ దేశాల్లో మంచి ర్యాంకులతో రాణించి, అవసరమైన ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తరువాత మాత్రమే అమెరికాకు వెళ్లే అనుమతి పత్రమైన వీసాను పొందగలుగుతారు. అంతేకాదు, ప్రతిభ మాత్రమే చాలదు.

ఒక్కొక్క విద్యార్థి కనీస పక్షంగా రూ. 50 లక్షలు ఖర్చు చేయగలిగేతే తప్ప అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ (ఎమ్‌ఎస్) పొందలేరు. అలా పొందిన డిగ్రీతో అక్కడ ఉపాధి పొంది చదువు కోసం చేసిన రూ. 50 లక్షల అప్పును క్రమంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అప్పు తీరిన తరువాత కొంత మెరుగైన జీవితాన్ని పొందగలుగుతారు. ఇలా అక్కడికి వెళ్లిన ప్రతిభావంతులైన యువత మేధోశ్రమ ఫలితంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. అమెరికన్ యువతలో మేధస్సు, ప్రతిభా సామర్థ్యాలు ఉండి ఉంటే విదేశీ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావు కదా. ఈ వాస్తవాన్ని పక్కన బెట్టి వలస వ్యతిరేక ప్రచారాన్ని మొదలు పెట్టింది అక్కడి తెల్ల తోలు అహంకారం. ఈ ధోరణి తోడుగా అధ్యక్ష దొరవారు చిత్రవిచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవన్నీ విదేశీ యువతకు పెద్ద ప్రతిబంధకాలుగా మారిపోయాయి.

ఈ వలస వ్యతిరేక ధోరణి ప్రబలిపోయిన ఫలితంగా ఉపాధి అవకాశాలు చాలా వరకు అడుగంటాయి. ట్రంప్ నిర్ణయాల ఫలితంగా ఇప్పుడు అమెరికాలో షట్ డౌన్ (ప్రభుత్వ ఆర్థిక కార్యక్రమాల్లో స్తంభన) నడుస్తున్నది. 35 రోజులుగా షట్ డౌన్ కొనసాగుతున్నది. షట్‌డౌన్ ఫలితంగా ఇప్పటికే ఎన్నో బిలియన్ల డాలర్లను అమెరికా కోల్పోయిందని అమెరికా ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనసాగుతున్న ట్రంప్ మూర్ఖ ధోరణి కారణంగా షట్‌డౌన్ ఇంకెన్నాళ్లు ఉంటుందో తెలియని అనిశ్చితి అమెరికాలో ఇప్పుడున్నది. ఈస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ త్వరలో కుప్పకూలిపోయే ప్రమాదం సైతం ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే ఆయన గద్దెపై కూర్చొని తొమ్మిది నెలలు గడిచిపోయాయి. మరో 40 నెలల పాటు ఆయనకు పాలనా అధికారం ఉంటుం ది. ఆయన తీరు ఇంకా ఇలాగే కొనసాగితే 250 యేళ్ల మేధస్సు, శ్రమల ఫలితంగా నిర్మించబడిన అమెరికా ఆర్థిక వ్యవస్థ పాలిట ట్రంప్ భస్మాసురుడిగా మారిపోతాడని కూడా అంటున్నారు. ఎంఎజిఎ/ మాగా (మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్) నినాదం అర్థం లేనిదై పోవడం ఖాయం అని చెబుతున్నారు.

వలస వెళ్లిన చోటు అమెరికా అయినా, యూరప్ దేశాలు అయినా, పెట్రోలియం వనరులు అధికంగా లభించే అరబ్ దేశాల్లోనైనా శ్రమించి నాలుగు డబ్బులు సంపాదించవలసిందే తప్ప మరోమార్గం మాత్రం లేదు. తాను ఉన్న చోట లభించే వేతనం కంటే కొంత మెరుగైన వేతనం, ఇంకొంత మెరుగైన జీవితం లభించే ప్రాంతానికి వలస వెళ్లడానికే ఏ మనిషిఅయినా మొగ్గుచూపుతాడు. దాన్ని తప్పుగా చూడడం, అభ్యంతరం వ్యక్తం చేయడం అనుచితం. మానవ సమాజాలు దేశాలుగా మారిన తరువాత ఏ దేశానికి ఆ దేశం కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు, చట్టాలు ఏర్పరచుకున్నాయి. వాటిలో భాగమే వీసాల లాంటి అనుమతి పత్రాలు. అలాంటి అనుమతి పత్రాలను ఒక్కో దేశం ఒక్కో రీతిలో తమ తమ దేశాల అవసరాలకు అనుగుణంగా రూపొందించుకున్నాయి. తమ దేశ ఆర్థిక, సాంకేతిక అవసరాలను తీర్చుకునేందుకు ఇతర దేశాల పౌరులను రప్పించే, ఆకర్షించే అనేక ప్రయత్నాలను చాలా దేశాలు చేశాయి. అలా అనేక దేశాల మేధస్సును విస్తృతంగా ఆకర్షించింది అమెరికా. అలా అనేక దేశాల జాతుల ప్రజల రెండున్నర శతాబ్దాల నిరంతర శ్రమ, కృషి, మేధస్సుల వల్ల మాత్రమే నేటి అమెరికా నిర్మాణం సాధ్యమైంది. ప్రపంచం నలుమూలల నుంచి అనేక దేశాల ప్రజల వలసల శ్రమతో మాత్రమే ఆధునిక అమెరికా నిర్మాణం సాధ్యమైందనేది అందరూ అంగీకరించవలసిన సత్యం. నేటి అమెరికా అనేది ఎంతమాత్రం ఒక ఒకే ఒక్క జాతి సమూహం ఎంతమాత్రం కాదు. భిన్నజాతుల మిశ్రమం అయిన నానా జాతి సమితి లాంటి ఒక సంకరజాతి మానవ సమూహమే నేటి ఆధునిక అమెరికా. అలా అమెరికా ఒక గొప్ప దేశంగా మారిపోయింది. 

గోవర్ధన్ గందె

93470 56621

అవినీతికి అడ్డుకట్ట సాధ్యమేనా?

భూకబ్జాలు, కమీషన్లు, దౌర్జన్యాలకు పాల్పడే రాజకీయ నాయకులు, నకిలీ, కల్తీసరుకులు అమ్ముతూ, పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులు, చేతులు తడపందే ఫైల్ వైపు చూడని ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ మూడు వర్గాలు కూడబలుక్కొని దేశాన్ని పందికొక్కుల్లా మేస్తున్నారు. దృఢమైన గొలుసులా ఏర్పడి సొంత ఆస్తులను గుట్టలుగా పోగు చేసుకుంటున్నారు. వీరి ధనదాహం, అధికార అహం వల్ల దేశంలో వంద కోట్లకు పైగా సామాన్యుల జీవితాలు కష్టాల ఊబిలోకి జారుతున్నాయి. పని చేసి పెట్టేందుకు లంచంకోసం చేయి చాచే ఉద్యోగి ప్రజలకు ప్రత్యక్షంగా కనబడతాడు. వ్యాపారి మోసాలు మాత్రం సామాన్యుడి కంటికి అగపడవు. ఇక రాజకీయ నాయకుడు పెద్ద మాయలోడు. వారి సంపాదన అండర్ గ్రౌండ్ డ్రైనేజిలా ఎటునుంచి ఎటు వెళుతుందో అంతుపట్టదు. ఉద్యోగి పట్టుబడితే కష్టాలే. వ్యాపారి నష్టపోతే తిప్పలే. నాయకుడు ఓడిపోయినా దివాళా తీయడు. ఈ పోలిక ఆధారంగా దేశ సంపద, పౌరుడి శ్రమ ఈమేరకు ఎవరి జేబులోకి వెళుతుందో ఊహించవచ్చు.

ఈ మూడింటిలో అత్యంత బలమైనది వ్యాపార వర్గమే. ఒక రకంగా రాజకీయ, ఉద్యోగ వర్గాలు వ్యాపారికి ఊడిగం చేసేవే. వ్యాపారులు ఇచ్చే విరాళాలు రాజకీయ పార్టీలకు ఇంధనంలా పనికొస్తాయి. ఒక పరిశ్రమ తమ రాష్ట్రానికి రావడానికి పాలకులు పడే ఆరాటం చూస్తుంటే పారిశ్రామికవేత్తలు ఎంత శక్తిమంతులో అర్థమవుతుంది. మంత్రులను తమ కనుసన్నలపై ఆడించే వ్యాపారుల ఇంటి గేటు తాకడానికి కూడా అధికారులు వణికిపోతారు. ప్రభుత్వ బ్యాంకుల్లోంచి తీసుకొన్న వేల కోట్ల అప్పును గుర్తుచేయడానికి కూడా అధికారికి సాహసమే కావాలి. బ్యాంకుల్లోని ప్రజల పొదుపు సొమ్మును వేల కోట్ల దాకా ఎగ్గొట్టిన మన వ్యాపారులు విదేశాలకు వెళ్లి రాజాల్లా బతకగలరు. ఆ అప్పులకు మాఫీ చేస్తున్నట్లు మంత్రులతో ప్రకటనలు ఇప్పించగలరు. రాజకీయ, వ్యాపార వర్గాల చెప్పుచేతల్లో నడిచేవారు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు. ప్రతి దొంగపనిని చూసీచూడనట్లు ఉన్నందుకు వీరి టిప్పు వీరికి అందుతుంది. రెస్టారెంట్లు, బ్రాందీ షాపులు, పబ్బుల నుండి పోలీసులకు, మున్సిపాలిటీకి, కార్మిక, వాణిజ్య పన్నుల శాఖలకు నెలవారీగా లంచం సొమ్ము టంచనుగా అందుతుంది. పరిశ్రమల, వ్యాపారుల అక్రమ దందాలు ఎలాంటి అడ్డంకి లేకుండా యథేచ్ఛగా సాగడానికి ఎన్నో విభాగాల తనిఖీ అధికారులకు లంచం ముడుతుంది. డిపార్ట్‌మెంట్ వారీగా అందిన సొమ్ము హోదాల క్రమంగా జేబులోకి చేరుకుంటుంది. ఇలా నిశ్శబ్దంగా రోజుకు కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. రోజుకు సగటున లక్ష రూపాయలు ఇంటికి తీసికెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క రాష్ట్రంలో వేలల్లో ఉంటారు.

మాఫియాలో బ్లాక్ మనీ, స్మగ్లింగ్, హత్యలు ఉంటాయి. లంచగొండి వ్యవస్థ కూడా వైట్ కలర్ మాఫియానే. వారానికి ఒకరిద్దరు లంచగొండి అధికారులు అవినీతి శాఖకు చిక్కుతున్నారనే వార్తలు కనబడుతుంటాయి. అవినీతి నిరోధక శాఖ బాగా పనిచేస్తుందని చర్చ సాగుతుంది. వాస్తవానికి ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే ఎసిబి స్పందిస్తుంది. ఊర్లో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటుందో అందరికీ తెలుసు. అవినీతి నిరోధక స్టేషన్ మాత్రం ఎక్కడా కనబడదు. ఆ సిబ్బంది కూడా అందులోనే ఉంటే బయట బోర్డుపెట్టాలి. దాని మార్గం విడిగా ఉండాలి. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కౌంటర్ కనబడేలా పెట్టినట్లు లంచాలు అడిగే ఆఫీసుల వద్ద ఎసిబి కౌంటర్లు పెట్టాలి. ఈ వ్యవస్థ లేకపోవడం వల్లనే తమను లంచం అడిగారని ఆ శాఖ దృష్టికి తీసుకువెళ్లే వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోంది. సిబ్బంది కోరిన ప్రకారం సమర్పించుకొని తమ పనులు పూర్తి చేసుకొని బయట పడడానికే జనం ఇష్టపడుతున్నారు.

చాలా సందర్భాల్లో అధికారుల అత్యాశే విషయం ఎసిబి దాకా వెళ్లేలా చేస్తుంది. బిల్లు మంజూరుకు అధికారి లక్ష డిమాండ్ చేస్తాడు. అంత ఇవ్వలేము, 70 వేలతో సరిపెట్టుకోండి అని వేడుకుంటారు. ససేమిరా కుదరదు. లక్ష ఇవ్వాల్సిందే అని అధికారి మొండికేస్తాడు. చిర్రెత్తిన లబ్ధిదారు ఎసిబిని ఆశ్రయిస్తాడు. శ్రమలేకుండా ఎసిబి వారికి ఓ చేప పడుతుంది. దానికో వార్త. ఇదేం పెద్ద నేరమన్నట్లు ఉద్యోగి దర్జాగా ఫోటోకి పోజు ఇస్తాడు.లంచం తీసుకోవడం తప్పు అనే భావన సమాజంలోంచి ఎగిరిపోయింది. బాధితుల ఫిర్యాదుపైనే కాకుండా, ఉద్యోగుల ఇళ్లపై దాడి చేసి కూడా అవినీతి ఉద్యోగులను ఎసిబి పట్టుకుంటుంది. ఆ ఉద్యోగులకు ఆదాయాన్ని మించిన ఆస్తులున్నాయని లెక్కలేసి మరీ చెబుతుంది. మిగతా వారికి అక్రమాస్తుల లేవా అంటే వారికీ ఉన్నాయనే సమాధానం వస్తుంది. చాలా డిపార్ట్‌మెంట్లు పూర్తిగా అవినీతిలో మునిగేవే. వాటిపై చర్యలు తీసుకుంటే ఆఫీసులే ఖాళీ అవుతాయి. జైళ్లు సరిపోవు. బలమైన ఈ చక్రవ్యూహంలో సామాన్యుడు సర్దుకు బతకడమే తప్ప మరో మార్గం లేదు.

  బి.నర్సన్, 9440128169

బీహార్‌లో మహిళా ఓట్లపైనే గురి

బీహార్ రాష్ట్రం కొన్నేళ్లుగా నిరుద్యోగంతో అల్లాడుతుండగా ఎన్నికల జాతరలో నాయకులు, పార్టీలు ఇచ్చిన హామీల జల్లు నిరుద్యోగ యువతకు ఏమాత్రం ఊరట కలిగించడం లేదు. ఈ సమస్యను అంతగా పట్టించుకోని పాలక వర్గాలు, విపక్షాలు మహిళల ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ఆకర్షణీయ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళల ఓట్లు ఎంతవరకు గెలుపును నిర్ణయిస్తుందన్నదే ప్రశ్న. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రంలోని 21 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అయ్యేలా మొత్తం రూ. 2100 కోట్లు బదిలీ చేశారు. ఇది ప్రతి మహిళా ఓటరుకు రూ. 10 వేలు వంతున ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద ఆర్థిక సాయం చేయడమే. ఈ పథకాన్ని గత సెప్టెంబర్ నెలాఖరులో ప్రధాని మోడీ ప్రారంభించారు. దీనికి దీటుగా విపక్షం ఆర్‌జెడి తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చేలా ఓటు వేస్తే ఆర్థికంగా బలహీనులైన, వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతి మహిళకు నెలకు రూ. 2500 వంతున ఆర్థికసాయం అందేలా ‘మై బహిన్ మాన్ యోజన’ పథకాన్ని అమలు చేస్తామని హామీ ప్రకటించడం విశేషం.

ఈ రెండు భారీ ప్రకటనలు బీహార్ మహిళలపట్ల తమకున్న అచంచలమైన నిబద్ధతను చాటి చెబుతున్నాయి. కులగతిశీలత, పితృస్వామ్యంతో నిండిన రాష్ట్రంలో స్త్రీలను స్వతంత్రంగా చూసుకోవడం చాలా విడ్డూరంగా ఉంటోంది. ఈ విషయంలో ప్రతి నియోజకవర్గం రెండుగా చీలిపోవడం ఆశ్చర్యం కాదు. 2014 నుంచి మహిళల కేంద్రంగా ఓటు బ్యాంకు కొల్లగొట్టడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగని మహిళల ఓట్లే విజయావకాశాలను నిర్ణయిస్తాయని కాదు. బీహార్‌లోని మహిళలు తమ అభ్యర్థి ఎవరో ఎంచుకుని ఓటేసే స్వతంత్రత కూడా లేదు. నితీశ్ కుమార్ మొదటిసారి 2005 లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మహిళలను ఆకర్షించే పథకాలతో మహిళా కేంద్రీకృత రాజకీయాలనే నడుపుతున్నారు. ఫలితంగానే 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళా ఓటర్లు పోటెత్తారు. మహిళా ఓటింగ్ 54.5% ఉండగా, పురుషుల ఓటింగ్ 51.1% మాత్రమే ఉంది. ఈ వ్యత్యాసం జాతీయంగా 2019 ఎన్నికల్లో తీరింది. అయితే విచిత్రమే మంటే ఈసారి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) తుది జాబితాలో లేని 47 లక్షల ఓటర్లలో 16 లక్షల మంది మహిళా ఓటర్లే ఉండడం ప్రత్యేకంగా గమనించవలసి ఉంది.

వీరంతా ఇబిసిలు, దళితులే. ఇదిలా ఉండగా 2023 లో బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కులాల సర్వే రాజకీయ వైఖరులను శాశ్వతంగా మార్చివేసింది. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను నిర్ణయించడానికి వాస్తవంగా ఏ పార్టీలకూ ఆయా కుల సముదాయాల కచ్చితమైన సంఖ్యాబలం ఎంతో అవసరం లేదు. కానీ వెల్లడవుతున్న అంశాలను పరిశీలిస్తే కొన్ని అంచనాలు తెరపైకి వస్తున్నాయి. వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఇబిసి) జనాభాలో 36 శాతం ఉండగా, చాలా వెనుకబడిన ఇతర తరగతులు (ఒబిసి)తో కలుపుకుని 60% వరకు ఉన్నారు. ఇందులో ‘పెద్దల’కు తప్పనిసరిగా సర్దుబాటు చేయాల్సిందే. ఇబిసిలను గమనిస్తే ‘మహాఘట్‌బంధన్ (ఎంజిబి)’లోనే వికాస్‌షీల్ ఇన్సాన్ (విఎస్‌ఐపి) కె చెందిన ముకేష్ సహానీ, డిప్యూటీ సిఎం పదవికి తప్పనిసరి అయ్యారు. 2020లో కులాల సర్వేకు ముందు ఆయనకు నిరాకరించినప్పటికీ, తరువాత ఇవ్వక తప్పలేదు. దీన్ని బట్టి, ఇబిసి, ఒబిసి వర్గాల నిర్ణయాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర వహిస్తాయని తెలుస్తోంది.

ఏ ప్రభుత్వం వచ్చినా తమ స్థానాలు తమకు దక్కాలన్న పట్టుదల ఇబిసి, ఒబిసి వర్గాల్లో ప్రముఖంగా కనిపిస్తోంది. ఎన్‌డిఎలో ఇబిసి అభ్యర్థి నితీశ్ కుమార్ తన 2005లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సంక్షేమమే తన ప్రాధాన్యంగా నెగ్గుకు వస్తున్నారు. జెడియు పాప్యులారిటీని ఎన్‌డిఎ గ్రహించవలసి ఉంటుంది. నితీశ్‌పట్ల విధేయత చూపించవలసి ఉన్నప్పటికీ నిరుద్యోగ సమస్య తీవ్ర విఘాతంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తున్నారు. కానీ ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహించే పరీక్షల్లో పేపర్‌లీక్, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి, నోటిఫికేషన్లలో జాప్యం ఇవన్నీ యువతను కుంగదీస్తున్నాయి. కీలకమైన ప్రభుత్వ విభాగాల్లో రిక్రూట్‌మెంట్ ఆగిపోయింది. 2024, 2025 సంవత్సర మొదటి భాగంలో ఎగ్జామ్ పేపర్ లీక్ ఫలితంగా పోలీస్, స్టాఫ్ సెలెక్షన్, రెవెన్యూతోపాటు అనేక ప్రభుత్వ విభాగాల్లో రిక్రూట్‌మెంట్ ఆగిపోయింది.

ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చాలామంది యువ ఉద్యోగార్థుల్లో ఈ రిక్రూట్‌మెంట్‌ల్లో ఆలస్యాలు ప్రభుత్వ నమ్మకద్రోహమన్న నిర్లిప్తతను, నిరసనను మరింతపెంచాయి. తరచుగా ప్రభుత్వం ప్రకటనలు ఇస్తున్నా అనేక ఉద్యోగాలు, అనధికారికంగా, అస్థిరంగా ఉంటున్నాయి. ది పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం బీహార్‌లో నిరుద్యోగం రేటు 5% మించి ఉంది. కానీ కార్మిక భాగస్వామ్యం, వాస్తవానికి పనిచేస్తున్న లేదా పనికోసం నిరీక్షిస్తున్న వ్యక్తుల నిష్పత్తి దేశం మొత్తం మీద అత్యల్పంగా ఉంది. 15 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్న యువత వంద మందిలో కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అదే మహిళల్లో ఆ సంఖ్య చాలా చిన్నదిగా ఉంటోంది. నిరుద్యోగ సమస్య గ్రామాల్లో, పట్టణాల్లో యువత కుంగుబాటు పెంపునకు దోహదం చేస్తోంది. 

వందేమాతరం.. తరతరాలకు స్ఫూర్తిదాయకం

భారత స్వాతంత్య్ర పోరాటంలో సాధారణ భారతీయులను సైతం భావోద్వేగంతో ఉర్రూతలూగించి, స్వతంత్ర సమరం వైపు నడిపించి, విప్లవకారులు నవ్వుతూ ఉరికంభంల వైపు తీసుకెళ్లి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చివేసేందుకు స్ఫూర్తి ఇచ్చిన అసాధారణమైన గేయం ‘వందేమాతరం’. ఇప్పటికి కూడా భాష, ప్రాంతం, మతం, కులం, వర్గం వంటి అన్ని విభేదాలతో సంబంధం లేకుండా భారతీయులు అందరికీ ఉత్తేజం కలిగించే గీతం ఇది. భారత మాతను ఇంతకన్నా ఘనంగా కీర్తించి, సమర్పించుకొనే గేయం మరొకటి లేదని చెప్పవచ్చు. ఇది మన దేశ జాతీయ గేయం. దీన్ని 1875లో నవంబరు 7న బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ కూర్చారు. ఆయన రచించిన బెంగాలీ నవల ‘ఆనంద్ మఠ్’లో ఈ గేయాన్ని పొందుపరిచారు. వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవం ఈ ఏడాది నవంబరు 7న మొత్తం దేశ ప్రజలు జరుపుకుంటున్నారు. ఆ రోజున ఒక నిర్ణీత సమయంలో దేశ ప్రజలు అందరూ ఈ గేయాలాపన జరపాలని కేంద్ర ప్రభుత్వం పిలుపిచ్చింది. ఈ వేడుకను అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. నాడు, నేడూ కోట్లాదిమంది భారతీయులను ఏకం చేస్తున్న వందేమాతరం పాట స్వాతంత్య్ర సమరయోధుల నినాదం, స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో నిరసనలు, సమావేశాలు, కాంగ్రెస్ సమావేశాల ద్వారా ప్రతిధ్వనించింది. ప్రజలలో అంతులేని ధైర్యం, ఐక్యతలను సూచిస్తుంది.

స్వేచ్ఛ కోసం తహతహలాడే ప్రతి భారతీయ హృదయాన్ని కలుపుతుంది. చరిత్రపుటల్లోకి వెళితే 1769 నుంచి 1773 మధ్యకాలంలో బంగాల్‌లో దారుణమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటి బంగాల్ ప్రాంతం భౌగోళికంగా చాలా పెద్ద పరిణామంలో ఉండేది. తూర్పు భారత్‌లోని పలు రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్ కూడా అప్పటి బంగాల్‌లోనే భాగంగా ఉండేవి. ప్రత్యేకించి 1770లో కరువుతో బంగాల్ ప్రజానీకం అల్లాడిపోయారు. ఈ పరిస్థితుల్లో దాదాపు కోటి మందికిపైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో 1770 నుంచి 1775 వరకు బ్రిటీష్ పాలకులు, భూస్వాములపై హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు ఎక్కడికక్కడ తిరుగుబాటు చేశారు. బ్రిటీష్ పాలకులకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆహార గోదాములు, కోశాగారాలు, సంపన్న ఉన్నతాధికారుల ఇళ్లపై తిరుగుబాటుదారులు దాడులు చేశారు.

అక్కడి నుంచి సేకరించిన డబ్బు, ధాన్యాలను పేదలకు పంచారు. ‘ఆనంద్ మఠ్’ నవలను బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ రచించేందుకు హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్ల తిరుగుబాటు ఉద్యమమే స్ఫూర్తిని ఇచ్చింది. దేశభక్తిని, జాతీయతా వాదాన్ని రగిల్చేలా సాగిన ఆ ఉద్యమ ఘటనల గురించి ‘ఆనంద్ మఠ్’ నవలలో కళ్లకుకట్టేలా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. బంగాలీ భాషలోని ఈ నవలలోనే వందేమాతర గేయం ఉంది. ‘ఆనంద్ మఠ్’ నవల 1882లో ప్రచురితమైంది. ‘వందేమాతరం’ అంటే ‘మాతృభూమికి నమస్కారం’ అని అర్థం. ‘ఆనంద్ మఠ్’ రచన ద్వారా ఆధునిక భారతీయ నవలా సాహిత్యానికి బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ బలమైన పునాదులు వేశారు. సామాజిక, కుటుంబ, చారిత్రక అంశాలపైనా ఆయన పలు నవలలు రాశారు.

‘ఆనంద్ మఠ్’ లోని వందేమాతర గేయమే బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్‌కు విశేషమైన ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. 1905లో జరిగిన బంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమానికి కూడా వందేమాతర గేయమే స్ఫూర్తిని ఇచ్చింది. అది భారతీయులందరి మదిలో దేశభక్తి భావాన్ని రగిల్చింది. బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ 1838 సంవత్సరం జూన్ 26న కోల్‌కతా సమీపంలోని నహాతీ పట్టణంలో జన్మించారు. ప్రఖ్యాత కోల్‌కతా యూనివర్శిటీ తొలి గ్రాడ్యుయేట్లలో ఆయన కూడా ఒకరు. 1858లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తయింది. లా కోర్సు చేసిన అనంతరం బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్‌కు బ్రిటీష్ ప్రభుత్వంలో డిప్యూటీ మెజిస్ట్రేట్‌గా ఉద్యోగం వచ్చింది. దాదాపు 30 ఏళ్లపాటు (1891 వరకు) ఆయన ప్రభుత్వ సర్వీసుల్లో కొనసాగారు. అయినప్పటికీ జాతీయతా వాదంతో రచనలు చేయడాన్ని బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ ఆపలేదు. బ్రిటీష్ ప్రభుత్వ సర్వీసులో ఉండగానే వందేమాతర గేయంతో కూడిన ఆనంద్ మఠ్ నవలను రాయడం, ప్రచురించడం జరిగాయి.

మన భారత దేశానికి, యావత్ భారతీయులకు గొప్ప గేయాన్ని అందించి 1894 ఏప్రిల్ 8న బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ తుదిశ్వాస విడిచారు. 1950 జనవరి 24 న భారత రాజ్యాంగ సభ ‘వందేమాతరం’ను జాతీయ గేయంగా అధికారికంగా స్వీకరించింది. భారతదేశ తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ 1950లో దీనికి జాతీయ గీత హోదాను ఇచ్చారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఇది కీలక పాత్ర పోషించిందని, ‘జన గణ మన’తో సమానంగా దీనిని గౌరవించాలని అప్పట్లో రాజేంద్రప్రసాద్ తెలిపారు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్య్రం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓమ్‌ప్రకాశ్ వందేమాతర గీతాన్ని పార్లమెంటులో ఆలపించారు. ఏ వాద్య సంగీతమూ లేకుండా అచ్చమైన గాత్రంతో పాడి వినిపించారు. పాట లోని మాధుర్యం, పదాల్లోని భావతీవ్రత సంగీతం మాటున మిగిలిపోకూడదని అలా పాడించారని చెబుతారు. అందుకనే దూరదర్శన్‌లో ప్రతిరోజూ సుప్రభాత గీతంగా వినిపించే వందేమాతరానికి నేపథ్య సంగీతం ఉండదు. స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్ వారు ‘గాడ్ సేవ్ అవర్ క్వీన్’ ను బ్రిటిష్ ఇండియా జాతీయ గీతంగా ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ‘వందేమాతరం’ అనధికారికంగానే జాతీయ గీతంగా ప్రసిద్ధి చెందింది.

1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని పఠించిన తర్వాత దీనికి ప్రాముఖ్యత లభించింది. మాతృభూమికి ఉత్తేజకరమైన గీతం, ఇది ఇలా ఉంటుంది. వందేమాతరం! సుజలం, సుఫలం, మలయజ శీతలం, సస్యశ్యామలం, మాతరం! వందేమాతరం! బిబిసి వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్‌లో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో రెండో స్థానం అందుకుంది వందేమాతరం. మొదటిస్థానం ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవ గీతానికి దక్కింది. విప్లవ నాయకుడు అరబిందో ఘోష్ 1909 1910 మధ్య కాలంలో ఈ నవలను ఆంగ్లంలోకి అనువదించారు. ఆయన రాసిన కవితా ఇలా ఉంది, అమ్మా, నేను నీకు నమస్కరిస్తున్నాను! నీ ఉప్పొంగే ప్రవాహాలతో సమృద్ధిగా, నీ పండ్ల తోట మెరుస్తున్న ప్రకాశవంతంగా, ఆనందపు గాలులతో చల్లగా, ఊగుతున్న చీకటి పొలాలతో, శక్తి యొక్క తల్లి, స్వేచ్ఛా తల్లి!

1906లో పాథే ఫోన్స్ కంపెనీ వందేమాతర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గళంలో గ్రామఫోన్ రికార్డుగా తెచ్చింది! ఆ తర్వాతి సంవత్సరమే ఆ కాపీలన్నింటినీ బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేసేశారు. దానికి సంబంధించిన ఒరిజినల్ ప్రతి చాలా రోజులు పారిస్‌లోనే ఉండిపోయింది. 1966 లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని మళ్లీ కాపీ చేయించి మన దేశానికి తెప్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది. సామాన్యులనూ సమరయోధులుగా మార్చింది. బెంగాల్ సాయుధ పోరాట దళం నుంచి ఉరిశిక్షకి గురైన తొలి యోధుడు కుదిరామ్ బోస్. బ్రిటిష్ మేజిస్ట్రేట్ కింగ్స్‌ఫోర్డ్ హత్యాయత్నం కేసులో అతను దోషిగా అరెస్టయ్యా డు. 1908, ఆగస్టు 11న ఉరిశిక్ష ఖరారైంది. ఆ సందర్భంగా న్యాయమూర్తి, ‘నువ్వేమైనా చెప్పదలచుకున్నావా?’ అని అడిగాడు.

తల అడ్డంగా ఊపి, ‘వందేమాతరం!’ అంటూ చిరునవ్వుతో ఉరికొయ్య వైపు నడిచాడు కుదిరామ్. అప్పటికి అతని వయసు పద్దెనిమిదేళ్లే! ఆ వీరుడి భౌతికకాయాన్ని తీసుకెళ్తుంటే కోల్‌కతా వీధులు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. అందరి నినాదం వందేమాతరం. ‘దేశభక్తి… భారత మాత పట్ల ప్రేమ… ఇది మాటలకు అతీతమైన భావోద్వేగం అయితే, వందేమాతరం అనేది ఆ అమూర్త భావనకు స్పష్టమైన స్వర రూపాన్ని ఇచ్చే పాట. శతాబ్దాల దాస్యం వల్ల బలహీనపడిన భారతదేశంలోకి కొత్త జీవితాన్ని నింపడానికి బంకిం చంద్ర ఛటోపాధ్యాయ్ దీనిని స్వరపరిచారు(రాశారు). వందేమాతరం 19వ శతాబ్దంలో రాయబడి ఉండవచ్చు, కానీ దాని ఆత్మ వేల సంవత్సరాల నాటి భారతదేశపు అమర చైతన్యంతో ముడిపడి ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా, పెరుగుతున్న సామాజిక విభజనల మధ్య, పౌరులు ఈ పాట స్ఫూర్తిని స్వీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే కోరారు. ‘భారతదేశ దేశభక్తి నిఘంటువులో అంతర్భాగంగా, ‘వందేమాతరం’ స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చింది. పత్రికా, సాహిత్యంలో శాశ్వత వారసత్వాన్ని పొందింది’ అని కొనియాడారు.

– చలసాని నరేంద్ర

– 98495 69050

ప్రమాద భారతం!

తెలుగు రాష్ట్రాలను ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోకముందే మరో ఘోరం వెంటాడుతోంది. 2025 సంవత్సరం తెలుగు రాష్ట్రాలకు ఎంతో మందికి కలిసి వచ్చిందో తెలియదు గానీ, అనేక కుటుంబాల్లో మాత్రం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు వరుస విషాద ఘటనల్లో పదుల సంఖ్యలో అమాయకులు బలైపోయారు. మొత్తం వంద మందికిపైగా ప్రాణాలు ఇలాంటి దుర్ఘటనలకు బలయ్యాయి. నిర్లక్ష్యం, విధుల్లో వైఫల్యం లేదా కేవలం ప్రమాదాలు.. కారణం ఏదైనా సరే, సంభవించిన మరణాలు మాత్రం అత్యంత బాధాకరం. కనీసం ఐదుగురి కంటే ఎక్కువ మరణాలు సంభవించిన ప్రధాన దుర్ఘటనలు పది ఉన్నాయి. జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటతో విషాదాల పరంపర మొదలైంది. ఏకాదశి పర్వదినం సందర్భంగా దర్శన టిక్కెట్లు తీసుకోవడానికి బైరాగి పట్టెడ వద్ద క్యూ లైన్‌లోకి ప్రజలు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు.

శ్రీశైలం ఎడమగట్టు కాలువకు అనుసంధానంగా దోమలపెంట వద్ద నిర్మిస్తున్న టన్నెల్‌లో ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. మట్టి పెళ్లలు పడిపోవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు ఊపిరాడక సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది మృత్యువాత పడ్డారు. టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ప్రమాద తీవ్రతకు ధ్వంసమైంది. మార్చి 28న ఒంగోలు తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగిపోయింది. మొత్తం 12 మందితో వెళ్లిన బోటు తిరగబడి ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మరణించారు. ఏప్రిల్ 29న సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మే 18న హైదరాబాద్‌లోని చార్మినార్ దగ్గరున్న గుల్జార్ హౌస్‌లో ఉదయం 6:00 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటల్లో 17 మంది ఆహుతైపోయారు. మృతుల్లో ఎనిమిదిమంది చిన్నారులు, నలుగురు వృద్ధులు ఉండడం అత్యంత విషాదకరం.

జూన్ 30న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలంలోని పాశమైలారంలో ఉన్న సికాచి పరిశ్రమలో రియాక్టర్ పేలింది. భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి.పేలుడు ధాటికి రియాక్టర్ దగ్గర పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో 46 మంది దుర్మరణం పాలవ్వగా, 30కి పైగా క్షతగాత్రులయ్యారు. జూన్ 14న అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళుతున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తాపడింది. ఘటన జరిగిన సమయంలో లారీలో 18 మంది కూలీలు ఉండగా, ఎనిమిది మంది మృతి చెందారు. కర్నూలు హైవేపై తెల్లవారుజాము 3:00 గంటల ప్రాంతంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొని అగ్నిప్రమాదానికి కారణమైంది. మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వరాలయంలో జరిగిన తొక్కిసలాట మాటల్లో వర్ణించలేనిది. రైలింగ్ ఊడిపడటంతో భక్తులు ఒక్కసారిగా కిందపడిపోయారు.

ఏకాదశి కావడంతో భారీగా తరలివచ్చిన భక్తుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఆలయంలో భద్రతా చర్యలు లేకపోవడం ఈ ఘటనకు కారణమైంది. నవంబర్ 3న చేవెళ్ల దగ్గరలోని మీర్జాగూడ వద్ద ఘోరం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఆర్‌టిసి బస్సు, ఓవర్‌లోడ్, ఓవర్‌స్పీడ్‌తో వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. స్పాట్‌లో 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్ కూడా మృతి చెందారు. ఈ విషాదంలో విద్యార్థులు, మహిళలు ఎక్కువగా చనిపోయారు, వారిలో రెండు నెలల పసికందు కూడా ఉంది. బంధువుల రోదనలతో చేవెళ్ల ఆస్పత్రి ప్రాంగణమంతా గంభీరంగా మారింది. ఈ వరుస ఘటనలు తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మరో వైపు భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని కేంద్రం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాలవారీగా రోడ్డు ప్రమాదాల సంఖ్యను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 8,276 రోడ్డు ప్రమాదాలు జరిగి, దేశంలో ఏడో స్థానంలో నిలవగా, తెలంగాణలో 8,103 ప్రమాదాలు జరిగి ఎనిమిదో స్థానంలో ఉంది. మరణాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 3,806 మంది, తెలంగాణలో 3,508 మంది మరణించారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా అత్యధిక మరణాలు సంభవించిన రాష్ట్రాల జాబితాలో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయి.

– ఐనం ప్రసాద్

98489 28787

నిజాంను అల్లాడించిన నల్లా నరసింహులు

తెలంగాణ స్వాతంత్య్రోద్యమ పుటల్లో శాశ్వతంగా చెరగని అక్షరాలతో నిలిచిపోయిన పేరు నల్లా నరసింహులు. అణచివేత, దోపిడీ, బానిసత్వం నిండిన నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా ప్రాణాలర్పించి పోరాడిన మహావీరుడు ఆయన. ఆయన జీవితం ప్రజాస్వాతంత్య్రం కోసం అహర్నిశలు నడిచిన త్యాగయాత్ర. ప్రజల విముక్తి కోసం శస్త్రం ఎత్తి, న్యాయంకోసం గొంతుఎత్తిన ఆ ధీరుని పోరాట చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గాథలో ఒక అజేయ అధ్యాయం. 1940 దశకంలో తెలంగాణ ప్రజల జీవితం దుర్భరంగా ఉండేది. భూస్వాములు, దేశముఖ్‌లు, సర్దేశ్‌ముఖ్‌లు, దేశాయిలు, రజాకార్లు కలిసి ప్రజలపై అమానుష దోపిడీ సాగించారు. రైతులు తమ కష్టార్జిత పంటను భూస్వాముల కడుపు నింపేందుకు మాత్రమే పండించేవారు. నిజాం పాలనలోని 7430 గ్రామాలు ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీ కింద ఉండగా, రైతు కేవలం కూలీగా, బానిసగా మిగిలిపోయాడు. ఈ అన్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా పెల్లుబికిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రజాచరిత్రలో గొప్ప మైలురాయి అయింది. ఈ మహా సమరానికి దళ నాయకుడిగా ముందుండి పోరాడిన యోధుడు నల్లా నరసింహులు. నల్లా నరసింహులు 1926 అక్టోబరు 2న తెలంగాణలోని కడవెండి, జనగామ జిల్లా, దేవరుప్పులలో జన్మించారు.

జనగామ ప్రాంతంలో సాయుధ దళాలను ఏర్పాటు చేసి భూస్వామ్య వ్యవస్థకు గట్టి ప్రతిఘటనగా నిలిచారు. ప్రజలలో ధైర్యం నింపి రజాకార్లపై, దోపిడీదారులపై గెరిల్లా దాడులు నిర్వహించారు. నరసింహుల కేక దోపిడీదారుల పాలనకు ఇక అంతం! అని అణగారిన ప్రజల గుండెల్లో మంటగా మండింది. ఆ కాలంలో తెలంగాణలో కమ్యూనిస్టు భావజాలం విస్తరిస్తున్నది. ఆంధ్ర మహాసభ అనే వేదిక ద్వారా పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి వంటి నేతలు ప్రజలను సంఘటితం చేశారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామగ్రామంలో కమిటీలు, దళాలు ఏర్పాటయ్యాయి. నరసింహులు ఈ పోరాటానికి తమ జీవితం అంకితం చేశారు. జనగామ తాలూకాలోని గ్రామాల్లో ఆయుధ దళాలను నిర్మించి స్వయంగా నాయకత్వం వహించారు.

భూస్వాములు, రజాకార్లు, నిజాం సైన్యం ఈ మూడింటి మధ్యలో ప్రజల పక్షాన నిలిచిన నరసింహులు శత్రువుల నిద్రను చెడగొట్టారు. 1947 సెప్టెంబర్ 11న ఆయన స్వగ్రామమైన కడవెండి నుంచే మొదటి తిరుగుబాటును ప్రారంభించి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ఆ పిలుపు యుద్ధభేరీగా మారి తెలంగాణ అంతటా విప్లవ జ్వాలలు వ్యాపించాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆయన ఆదేశాలపై ఎర్రజెండాల కింద పోరాట రంగమయ్యాయి. వేల ఎకరాల భూములు భూస్వాముల పంజానుండి విడిపించబడి, దున్నేవాడికే భూమి హక్కు! అన్న నినాదం ప్రతిధ్వనించింది. సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతుండగా, నరసింహులు అనేకసార్లు అరెస్టుకాబడి చిత్రహింసలు అనుభవించారు. మూడుసార్లు ఉరిశిక్ష విధించబడ్డా ఆయన ధైర్యం ఒక్క క్షణం తగ్గలేదు. అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థలు, భారత ట్రేడ్ యూనియన్ సంఘాల ఆందోళనల ఫలితంగా ఆయన ఉరిశిక్ష చివరి నిమిషంలో నిలిపివేయబడింది. నల్లగొండ జైలులో బంధితుడిగా ఉన్న నరసింహులను చూడటానికి వచ్చిన యూనియన్ సైనిక జనరల్ జె.ఎస్. చౌదరికి జిల్లా ఎస్.పి. ధన్‌రాజ్ నాయుడు పరిచయం చేస్తూ ఈయనే తెలంగాణ టైగర్ నల్లా నరసింహులు అని చెప్పడం చరిత్రలో నిలిచిపోయింది.

1948లో ‘పోలీస్ యాక్షన్’ అనంతరం కమ్యూనిస్టులపై నిషేధం విధించబడింది. నెహ్రూ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారనే తప్పుడు ఆరోపణలతో అనేక మంది నేతలు అణచివేతకు గురయ్యారు. నరసింహులు వంటి యోధులు అరణ్యాలలో ఆశ్రయం పొందారు. చివరికి 1951 అక్టోబరులో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం విరమిస్తున్నట్లు ప్రకటన చేయడంతో ఉద్యమం చల్లారిపోయింది. అయినా నరసింహులు పోరాట భావజాలాన్ని విడిచిపెట్టలేదు. 1959 జనవరి 26న దీర్ఘ నిర్బంధ జీవితం ముగించి ఆయన తిరిగి స్వేచ్ఛా లోకంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో పేదల హక్కుల కోసం ఆలోచనాత్మకంగా పనిచేశారు. నల్లా నరసింహులు పేద పద్మశాలి కుటుంబంలో జన్మించి చేనేత పనిని జీవనాధారంగా చేసుకున్నారు. ఉర్దూ మీడియంలో ఏడవ తరగతి వరకు మాత్రమే చదివినా ప్రజల బాధలను అర్థం చేసుకున్న చైతన్యవంతుడు.

భార్య వజ్రమ్మతో కలిసి జీవితాంతం ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించారు. ఆయన తన చివరి వరకు కూడా పోరాట మిత్రులను, రైతాంగ యోధులను స్మరించుకుంటూ ప్రజా హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ గడిపారు. 1993 నవంబర్ 5న ఆయన జీవన యాత్ర ముగిసింది. కానీ ఆయన త్యాగం, ధైర్యం, ప్రజా సంకల్పం తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. వేలాది మంది వీరుల త్యాగానికి ప్రతీకగా, పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిన విజయానికి చిహ్నంగా ఆయన పేరు ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. నల్లా నరసింహుల జీవితం ఒక పాఠం. స్వేచ్ఛ అనేది ఇచ్చేది కాదు, పొందేది. అణచివేతకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యమే నిజమైన విముక్తి శక్తి. తెలంగాణ రైతాంగ పోరాటం, భూస్వామ్య వ్యవస్థ కూల్చివేత, పేదల భూ హక్కుల సాధనలో ఆయన చూపిన త్యాగపథం తరతరాలకు మార్గదర్శకం. నవంబర్ 5 నల్లా నరసింహుల వర్ధంతి రోజున ఈ ప్రజా వీరుడిని స్మరించుకుంటూ తెలంగాణ నేల తన గర్వకారణాన్ని మరలా గుర్తు చేసుకుంటుంది. ఆయన త్యాగజ్వాల ఎప్పటికీ మసకబారదు. ఆ జ్వాలే తెలంగాణ ప్రజా చైతన్యానికి చిరస్ఫూర్తి.

– రామకిష్టయ్య సంగనభట్ల

94405 95494