Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

betasus

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

ఉగ్రవాదభూతం పీచమణచాలి

దేశంలో ఒకే రోజు చోటు చేసుకున్న రెండు భయానక సంఘటనలు జాతి యావత్తును దిగ్భ్రాంతి గొలిపాయి. అంతకుమించి, ఉగ్రవాదులు తమ విధ్వంసకాండను అమలుపరిచేందుకు అనుసరిస్తున్న కొత్త తరహా పోకడలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో ఓ మెట్రోస్టేషన్ వద్ద మొన్న రాత్రి పొద్దుపోయాక ఒక కారులో జరిగిన భారీ పేలుడు పదమూడు మందిని బలిగొనగా, మరో 24మందిని గాయాలపాలు చేసింది. పేలుడు తీవ్రత పరిసర జనాలను కకావికలం చేసింది. అనేక వాహనాలు ధ్వంసం కాగా, చుట్టుపక్కల దుకాణాలు సైతం దెబ్బతిన్నాయి. ఇంతటి భారీ పేలుడుకు కారణం ఉగ్రవాదమే అయి ఉంటుందనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు చేపట్టాయి. మరోవైపు, అదే రోజు భారీ ఉగ్ర కుట్రను మన పోలీసులు భగ్నం చేశారు. మూడు రాష్ట్రాలలో ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసి, ఆరా తీయగా ఆశ్చర్యపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు భారీయెత్తున మందుగుండు సామగ్రిని సమకూర్చుకోవడమే కాదు, విద్యావంతుల్ని తమవైపు తిప్పుకుని, వారి సహాయంతో విధ్వంసకాండకు ఉగ్రవాదులు పథక రచన చేస్తున్నారని తేలడం విస్తుగొలుపుతోంది. హస్తినలో కారుబాంబు పేలుడుకు పాల్పడినది ఉమర్ అనే ఒక వైద్యుడని, శక్తిమంతమైన అమోనియం నైట్రేట్‌ను ఉపయోగించి ఆత్మాహుతికి పాల్పడి ఉండవచ్చునని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఈ రెండు సంఘటనలకూ ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే, ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులకు లభించిన పేలుడు పదార్ధాలలో భారీయెత్తున అమోనియం నైట్రేట్ ఉండటమే కాదు, ఆ కేసులో అరెస్టయిన వైద్యులతో ఆత్మాహుతి చేసుకున్న వైద్యుడికీ సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజధాని హస్తినలో విధ్వంసం సృష్టించి, దేశంలో శాంతిభద్రతలకు సవాల్ విసిరేందుకు ఉగ్రవాదులు సాగిస్తున్న ప్రయత్నాలు ఈనాటివి కావు.

1985లో ట్రాన్సిస్టర్ బాంబులతో 49మందిని బలిగొనడం ద్వారా తమ దాడులను ఆరంభించిన ముష్కరులు, పార్లమెంటుపై దాడి సహా పలుమార్లు హింసాకాండకు తెగబడ్డారు. ఈ నలభయ్యేళ్లలో ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 92 మందికి పైగానే అసువులు బాసినట్లు ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ చేపట్టిన అధ్యయనంలో తేలింది. అయితే కొంతకాలంగా ఉగ్రవాదం కోరలు పెరికివేసేందుకు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఇంటా బయటా చేస్తున్న ప్రయత్నాలతో ఊపిరి సలపని ఉగ్రవాదులు కొత్త పంథాను ఎంచుకున్నట్లుగా తాజాగా వెలుగుచూసిన ఉగ్రకుట్రతో వెల్లడైంది. భారతదేశంలో తమ ఆటలు ఇక సాగవని తెలుసుకున్న జైషే మహమ్మద్, ఐఎస్‌ఐఎస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఎజియుహెచ్ ఉగ్ర సంస్థ.. ఉన్నత విద్యావంతులను లోబరచుకుని, వారి సహాయంతో ధ్వంసరచన అమలుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ మహిళా వైద్యురాలితో సహా ముగ్గురు డాక్టర్లను అరెస్టు చేసి, వారినుంచి భారీయెత్తున పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఫరీదాబాద్‌లో అరెస్టయిన ఒక డాక్టర్ ఇంట్లో 360 కిలోల పేలుడు పదార్ధాలు లభ్యం కావడాన్ని చూస్తే, విద్యావంతులు సైతం ఉగ్రవాదం వైపు ఎంతలా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతుంది. హైదరాబాద్‌కు చెందిన మరో డాక్టర్ స్వయంగా ఒక విషాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడైంది.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషాలలో ఒకటిగా పేర్కొనే రిసిన్ అనే విష ద్రావకాన్ని ఆలయ ప్రసాదాలలోనూ, మంచినీళ్లలోనూ కలిపి అమాయకుల ప్రాణాలు హరించడమే సదరు వైద్యుడి పథకమని వెల్లడి కావడం గమనార్హం. అంటే, బాంబులు, ఆత్మాహుతి దాడులతోనే కాకుండా, సామూహిక విషప్రయోగాలు చేసి, వేలాదిమంది అమాయకుల ప్రాణాలను కబళించాలన్నది ఉగ్రవాదుల దుర్మార్గపుటాలోచనగా తెలుస్తోంది. దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం వేళ్లూనుకుంటున్నట్లు తాజా సంఘటనలను బట్టి విశదమవుతోంది. ప్రాణాలను రక్షించవలసిన వైద్యులే ఉగ్రవాదులై అమాయకుల ప్రాణాలను కబళించబూనడం అమానుషం. మొక్కై వంగనిది మానై వంగదన్నట్లు మొగ్గ దశలోనే ఈ తరహా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టకపోతే, భరతజాతి ప్రమాదపుటంచుల్లోకి జారుకుంటుందనడంలో సందేహం లేదు. ముందుగా, ఢిల్లీ పేలుళ్లకు కారకులెవరో, వారివెనుక ఉన్నదెవరో కూపీలాగి, వారి భరతం పట్టాలి. ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని, వారికి ఊతమిచ్చింది దాయాది దేశమేనని తేలిన పక్షంలో అంతర్జాతీయ సమాజాన్ని జాగృతం చేసి, గట్టి గుణపాఠం చెప్పాల్సిందే. భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఫలితమెంత దారుణంగా ఉంటుందో ఈసారి దాయాదికి మరింత స్పష్టంగా తెలియజేయాలి.  

బీహార్‌లో ఎన్‌డిఎకే విజయహారం

జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో బిజెపికి పూర్తి మెజార్టీ లేకపోవడం తో నరేంద్ర మోడీ ప్రభుత్వం టిడిపి, జెడి(యు) పార్టీలపై ఆధారపడిన నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికలు దేశరాజకీయలపై ప్రభావం చూపనున్నాయి. బీహార్‌లో బిజెపి, జెడి(యు) పార్టీల మధ్య మైత్రి కొనసాగింపుకు ఈ ఎన్నికలు కొలమానంగా నిలువనున్నాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా ఏ ఒక్క పార్టీకి ఏకఛత్రాధిపత్యంగా అధికారం ఇవ్వకుండా సంకీర్ణ ప్రభుత్వాలకు పట్టం గడుతున్న బీహార్ ప్రజలు మరోసారి ఎన్‌డిఎకే జైకొట్టనున్నారని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్గిట్ పోల్ సర్వేల్లో వెల్లడైంది. రాష్ట్రంలో మరోసారి అధికారం రావడానికి ఎన్‌డిఎకి నిమో (నితీశ్+మోడీ) ఫార్ములా దోహదపడింది. నితీశ్ ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్రంలో మహిళా రోజ్‌గార్ యోజన పథకం కింద దాదాపు కోటి 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ చేయడం ఎన్‌డిఎ విజయానికి కీలకంగా మారింది.

బీహార్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జెడి(యు) నేతృత్వంలోని ఎన్‌డిఎ, కాంగ్రెస్, ఆర్‌జెడి నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌పై భారీ ఆధిక్యంతో అధికారం చేపడుతుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్‌డిఎ దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్‌బంధన్ కూటమి మీద పైచేయి సాధిస్తోంది. ఎన్‌డిఎకి 46.2 శాతం ఓట్లు, మహాఘట్‌బంధన్‌కు 37.9%, కొత్తగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, ఇతరులకు 6.2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ‘ప్లస్ ఆర్ మైనస్’ ఉండే అవకాశాలున్నాయి. 243 స్థానాలు ఉన్న బీహార్ లో అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎన్‌డిఎకు 133- 159 స్థానాలు వచ్చే అవకాశాలుండగా, మహాఘట్ బంధన్ 75 -101 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇతరులకు 2 8 స్థానాలు, జన్‌సురాజ్ పార్టీకి 0 -5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. పార్టీల వారీగా సాధించే స్థానాలను పరిశీలిస్తే ఎన్‌డిఎ కూటమిలో బిజెపి 63- 70, జెడి(యు) 55- 62, ఎల్‌జెపి (ఆర్‌వి) 12-17, హెచ్‌ఎఎమ్ 2-5, ఆర్‌ఎల్‌ఎం 1-4 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. మహాఘట్ బంధన్‌లో ఆర్‌జెడి 62-69, కాంగ్రెస్ 9- 18, సిపిఐ (ఎంఎల్) 4-9 గెలిచే అవకాశాలున్నాయి. కొత్తగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 0-5 స్థానాలు, ఎఐఎంఐఎం పార్టీ 0-2, సిపిఐఎంకి 0-3, విఐపికి 0- 5, సిపిఐ 0- 2, ఇతరులు 2- 8 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. ఒక్కొక్క పార్టీ పొందే ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే బిజెపికి 21.4 శాతం, ఆర్‌జెడికి 23.3 శాతం, జెడి(యు)కి 17.6 శాతం, జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, కాంగ్రెస్ పార్టీకి 8.7 శాతం, ఎల్‌జెపికి 5%, ఇతరులకు 7.2%ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 19.46% ఓట్లతో 74 స్థానాలు, జెడి(యు) 15.39 శాతం ఓట్లతో 43 స్థానాలు, ఆర్‌జెడి 23.11% ఓట్లతో 75 స్థానాలు, కాంగ్రెస్ 9.48% ఓట్లతో 19 స్థానాల్లో గెలిచాయి.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ మహాఘట్ బంధన్ కూటమిపై కేవలం 0.03 ఓట్ల వ్యత్యాసంతో సుమారు 11 వేల ఓట్ల ఆధిక్యంతోనే అధికారం చేపట్టగా, ప్రస్తుత ఎన్నికల్లో ఎన్‌డిఎ భారీ ఆధిక్యత పొందడానికి ప్రధాన కారణం జెడి(యు) మంచి ఫలితాలు సాధించడమే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని ఓటర్లను ప్రశ్నించినప్పుడు ఆర్‌జెడి యువ నేత తేజస్వి యాదవ్ 32 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. 2005 నుండి కొన్ని నెలలు మినహా 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్ కుమార్ 30 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 8%, ఎల్‌జెపి నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ 8 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. బిజెపి నేత సామ్రాట్ చౌదరికి 6%, కాంగ్రెస్ నేత రాజేశ్ కుమార్‌కి 2% మంది మద్దతిచ్చారు. సామాజిక వర్గాలవారీగా పరిశీలిస్తే అగ్రవర్ణాలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఇబిసి వర్గాలు ఎన్‌డిఎకు మద్దతుగా నిలుస్తున్నారు. ముస్లిం, బుద్ధిస్టులు, ఒబిసి సామాజిక వర్గాల్లో అధిక శాతం మహాఘట్‌బంధన్ వైపు ఉన్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. బీహార్‌లో ఎన్‌డిఎకు పట్టంకట్టడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.

రాష్ట్రంలో 66.8% మహిళలు ఎన్‌డిఎ వైపుఉండగా, మహాఘట్‌బంధన్‌కు 24.8% ఓటర్లు మాత్రమే మద్దతిస్తున్నారు. బ్రాహ్మణ, కుశ్వ, పాశ్వాన్, రాజ్‌పుత్, కుర్మి, చమార్, భూమియార్, మల్లా, తేలి, బనియా, కాను, నోనియా సామాజిక వర్గాల్లో ఎన్‌డిఎకు బాసటగా నిలుస్తున్నాయి. మహాఘట్ బంధన్ కేవలం యాదవ్, ముస్లిం, ఒబిసిల్లోని కొన్ని వర్గాల్లో మాత్రమే కొంత ఆధిక్యత కనబరుస్తోంది. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి ఉన్న జనాకర్షణ, రాష్ట్రంలో నితీశ్ కుమార్‌పై ఉన్న ప్రజాదరణ బీహార్ లో ఎన్‌డిఎ గెలుపుకు అనుకూలంగా మారాయి. బీహారీలను ఆకర్షించడంలో నితీశ్ కుమార్ వంటి జనాకర్షణ కలిగిన నాయకుడు తమ పార్టీలో లేకపోవడంతో బిజెపి ఆయనపైనే ఆధారపడాల్సి వచ్చింది. అందుకే మోడీ ప్రచారంలో నితీశ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. 75 ఏళ్ల వయసులోనూ నితీశ్ ఎన్‌డిఎకు ట్రంప్ కార్డుగా ఉన్నారు. ఆయనకున్న క్లీన్ చీట్ ఇమేజీ ఎన్‌డిఎకు బలంగా మారింది. రెండు దశాబ్దాలుగా సిఎంగా ఉన్నా నితీశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఎంఎల్‌సిగా ఎన్నికవుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారు. సిట్టింగ్ ఎంఎల్‌ఎలు అభివృద్ధిని పట్టించుకోలేదని, అవినీతికి పాల్పడ్డారనే వ్యతిరేకత ప్రజల్లో కనిపించినా ‘నిమో’ ఫార్ములా ఎన్‌డిఎకు అనుకూలించింది. 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నా నితీశ్ ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని నిలబడడానికి ప్రధాన కారణం మహిళల ఆశీర్వాదమే. ఎన్‌డిఎతో పోలిస్తే మహాఘట్‌బంధన్ బలహీనంగా ఉంది. ఆ కూటమి సిఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌లో 2020 ఎన్నికల్లో ఉన్న ఉత్సాహం 2025 ఎన్నికల్లో కనిపించలేదు.

ప్రస్తుత ఎన్నికల్లో తేజస్వీయాదవ్ నిరుద్యోగం, వలసలు అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకున్నా 2020లో ఆయనకు యువతలో ఉన్న క్రేజీ ఇప్పుడు తగ్గింది. నిరుద్యోగం, వలసలపై యువతలో అసంతృప్తి ఉన్నా అది పూర్తిగా తేజస్వి యాదవ్‌కు అనుకూలంగా మారలేదు. జన్‌సురాజ్ పార్టీ, బిజెపి కూడా యువత ఓట్లను ఆకర్షించాయి. మహాఘట్‌బంధన్ కూటమి ముస్లిం, యాదవ్ సామాజికవర్గాల్లో ఇప్పటికే 33% మద్దతున్నా, దాన్ని 40 శాతానికిపైగా దాటించడమే తేజస్వి యాదవ్‌కు ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు తేజస్వి యాదవ్‌కు తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఉన్న ‘జంగల్ రాజ్’ అభియోగం పెద్ద గుదిబండగా మారింది. లాలూప్రసాద్ పాలనలో యాదవ్ సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని ఇప్పటికీ దళితులు, అగ్రవర్ణాలు మరవకపోవడం తేజస్వి యాదవ్‌కు ప్రతికూలమైంది.మహాఘట్‌బంధన్‌లో ప్రధాన భూమిక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీవలే ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యారు. ఆయన ఎత్తుకున్న ‘ఓట్ చోరీ’ నినాదం బీహార్‌లో ఓట్లను రాల్చలేకపోయింది. రెండు కూటములు సంక్షేమ పథకాలపై పోటాపోటీగా హామీలిచ్చాయి.

మహాఘట్‌బంధన్ నిరుద్యోగం, వలసలను ప్రచారాస్త్రాలుగా చేసుకుంటే, ఎన్‌డిఎ ‘జంగల్ రాజ్’ తో పాటు అభివృద్ధిపై ప్రచారం చేసింది. ప్రధాని మోడీ లాలూప్రసాద్ యాదవ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలుచేస్తూ ‘జంగల్ రాజ్’ను ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. రాష్ట్రంలో ఎన్‌డిఎ చెబుతున్నట్టు అభివృద్ధి జరిగితే బీహారీలు ఎందుకు వలసెళ్తున్నారని మహాఘట్ బంధన్ ప్రచారం చేసింది. ఇతర పార్టీలతో పోలిస్తే బిజెపికి వనరులు అధికంగా ఉండడం ఎన్‌డిఎకు అనుకూలంగా మారింది. డిజిటల్ ప్రచారంలో అన్ని పార్టీలు చేసిన ఖర్చులను కలిపినా ఒక్క బిజెపి చేసిన ఖర్చు కంటే తక్కువే. 2020 ఎన్నికలకు ప్రస్తుత 2025 ఎన్నికలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దళితులలో ఆదరణ ఉన్న ఎల్‌జెపి 2020లో విడిగా పోటీ చేయగా ప్రస్తుతం ఎన్‌డిఎలో ఉండడంతో ఎన్‌డిఎ మరింత బలపడింది.

యావత్ దేశాన్ని ఆకర్షించిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ యువతను ఆకర్షించడంలో విజయవంతం అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు చెప్పుకోదగ్గ సీట్లు రాకపోయినా భవిష్యత్‌లో బీహార్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే పార్టీగా జన్‌సురాజ్ ఎదగడం ఖాయమని పీపుల్స్‌పల్స్ అధ్యయనంలో స్పష్టమైంది. ఎన్‌డిఎలో బిజెపి, జెడి (యు) భారీగా సీట్లు పొందే అవకాశాలు కనిపిస్తుండగా, ఆర్‌జెడి చెప్పుకోదగ్గ స్థానాలు సాధిస్తున్నా, కాంగ్రెస్‌కు ఆశించిన మేరకు సీట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతో మహాఘట్‌బంధన్‌కు నష్టం జరుగుతోంది. ప్రధానంగా మహిళా ఓటర్లు ఆదరిస్తుండడంతో బీహార్‌లో మరోసారి ఎన్‌డిఎ జయకేతనం ఖాయంగా కనిపిస్తోంది.

జి. మురళీ కృష్ణ

న్యుమోనియా రహిత భారతాన్ని నిర్మించుకోలేమా?

న్యుమోనియా అంటువ్యాధితో 2021లో 2.2 మిలియన్లు మరణించగా, అందులో 5.02 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల అధిక మరణాలకు కారణమైన వ్యాధి న్యుమోనియా. కొవిడ్- 19 కారణంతో మరో 10 మిలియన్లు కూడా అదనంగా మరణించినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అధిక ప్రాణాలను గైకొంటున్న వ్యాధుల్లో న్యుమోనియా ప్రధానమైనదని తేలింది. వాతావరణ ప్రతికూల మార్పులు, గాలి కాలుష్యం కోరలు చాచడంతో శ్వాసవ్యవస్థ, ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నం కావడం, న్యుమోనియా మహావిపత్తు వస్తుందనే భయం కూడా ఉందని, పది లక్షలమందికి న్యుమోనియా సోకే ప్రమాదంలో ఉన్నారని వైద్యులు అంచనా వేస్తున్నారు. న్యుమోనియా వ్యాధి ఐదేండ్ల లోపు పిల్లలకు, వృద్ధులకు వస్తుంది. టీకాలు వేయించుకోనివారు, పోషకాహార లోపాలు, ఇంట్లో వంట చెరుకువాడేవారు, కలుషిత గాలి పీల్చే పెద్దలు, పొరతాగే దురలవాటు ఉన్నవారు అధికంగా న్యుమోనియా బారినపడే ప్రమాదం ఉంటుంది. న్యుమోనియా వ్యాధి తీవ్రత, ప్రమాదాన్ని గుర్తించిన అంతర్జాతీయ సమాజం 2009 నుంచి ఏటా 12 నవంబర్ రోజున ప్రపంచ న్యుమోనియా దినం పాటిస్తూ ఆ వ్యాప్తిపట్ల కనీస అవగాహన కల్పించడం జరుగుతోంది.

బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగీ సంక్రమణ కారణంగా తాపజనక శ్వాస రుగ్మత (ఇన్‌ఫ్లమేటరీ రెస్పిరేటరీ డిసార్డర్) లేదా న్యుమోనియా వ్యాధి అంటుకుంటుంది. ఈ సూక్ష్మజీవులు ఊపిరితిత్తుల్లో చేరి ఎల్వియోలి అనే భాగంపై ప్రభావాన్ని చూపి న్యుమోనియాకు దారి తీస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. బలహీన వ్యాధి నిరోధకశక్తి కలిగిన పిల్లలు, వృద్ధులకు న్యుమోనియా సోకి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ప్రపంచ న్యుమోనియా దినం -2025 ఇతివృత్తంగా పిల్లల మనుగడ (చైల్ సర్వైవల్) అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. న్యుమోనియా నివారించదగిన అంటువ్యాధి. వ్యాధిగ్రస్థులు తుమ్మడం, దగ్గడం, ముక్కు చీదడం లాంటి సందర్భాల్లో మరొకరికి సంక్రమిస్తుందని తెలుసుకోవాలి. పిల్లల్లో బ్యాక్టీరియా కారణ స్ట్రెప్టోకోకల్ న్యుమోనియా అతి ప్రధానమైనది. దాని తర్వాత హిమోఫిలస్ ఇన్‌ఫ్లుయెంజా రెండవ ప్రధానమైనది. న్యుమోనియాలో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ వ్యాధి వైరస్ వర్గంలో ముఖ్యమైనది. న్యుమోనియా వ్యాధికి చికిత్స కూడా అందుబాటులో ఉన్నది. ప్రపంచ న్యుమోనియా దినం వేదికగా ప్రభుత్వాలు, వైద్యఆరోగ్యశాఖ, ఎన్‌జిఒలు, ఇతర సంస్థలు కలిసి న్యుమోనియా పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, రోగగ్రస్థులకు చికిత్సా పద్ధతులు వివరించడం మంచి ఫలితాలను ఇస్తాయి. న్యుమోనియాను తొలిదశలో గుర్తించడం, చికిత్స తీసుకోవడం, నివారణ మార్గాలను తెలుసుకోవడం లాంటి అంశాలను గుర్తుంచుకోవాలి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ఏట 14 లక్షల పిల్లలు న్యుమోనియా సోకి చనిపోవడం, పిల్లల మరణాల్లో 18% వరకు న్యుమోనియా కారణం కావడం గమనార్హం. యూనిసెఫ్ వివరాల ప్రకారం ప్రతి 39 సెకన్లకు ఒక పిల్లవాడు న్యుమోనియాతో మరణిస్తున్నాడు. వృద్ధుల్లో న్యుమోకోకల్ న్యుమోనియా అధికంగా సోకుతుంది. న్యుమోసిస్టిక్ జిరోవెస్సీ వ్యాధి ఫంగస్ సోకడంతో వస్తుంది. గాలి కాలుష్యం, స్మోకింగ్ వల్ల 16 లక్షల వృద్ధులు మరణిస్తున్నారు. డబ్ల్యుహెచ్‌ఒ, యూనిసెఫ్‌లు సంయుక్తంగా న్యుమోనియా, డయేరియా వ్యాధుల కట్టడికి గ్లోబల్ ఆక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏండ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న రోగులు, పర్యావరణ కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్న జనులు, హెచ్‌ఐవి/కేన్సర్ లాంటివి సోకిన వ్యాధిగ్రస్థులు న్యుమోనియా ప్రమాదంలో పడే అవకాశాలే ఎక్కువ.

టీకాలు వేయించడం, పోషకాహారం అందిచడం, గాలి కాలుష్యాన్ని తగ్గించడం వల్ల న్యుమోనియా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. ఆంటీబ్యాక్టీరియల్, అంటీ వైరల్, ఆంటీ ఫంగల్ ఔషధాలతో న్యుమోనియా కట్టడి జరుగుతుంది. భౌతిక దూరాలు పాటించడం, మాస్కులు ధరించడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకుండా ఉండడం, దగ్గినపుడు లేదా తుమ్మినపుడు కండువా కప్పుకోవడం వంటి పలు జాగ్రత్తలు న్యుమోనియా కేసులను తగ్గిస్తాయి. పిల్లలకు, పెద్దలకు అతి ప్రమాదకరమైన అంటువ్యాధిగా నిలిచిన న్యుమోనియా పట్ల సరైన అవగాహన పెంచుకొని అలాంటి ప్రాణాంతక రుగ్మతకు చరమగీతం పాడదాం, న్యుమోనియా కానరాని భారతాన్ని నిర్మించుకుందాం. 

డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి

9949700037

ఉద్యమ జనజాతర అందెశ్రీ

బడికి వెళ్లి ఆయన అక్షరాలు చదవలేదు.. కానీ సమాజాన్ని ఆయన తన అంతర్‌హృదయంతో చూశారు. సమాజంలో జరుగుతున్న ప్రజల వ్యథలు, పోరాటాలను కళ్లతో చూసి.. ఆ బాధలే ఆయనను ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా నిలబడేలా చేసింది. చిన్నతనం నుంచే అనాథగా బతికిన ఆయన గుండెకు తాకిన గాయాలు ఎన్ని ఉంటాయో.. గొడ్లకాపరిగా పని చేస్తూ ప్రకృతి.. మూగజీవాలతోనూ మమేకం అయ్యారు. ప్రకృతి ఎదుర్కొనే ముప్పును సైతం పదాల అల్లికతో జత కట్టి పాటలు, పద్యాలు పాడుకున్నాడు. సమాజంలో భిన్నమైన సమస్యలతో సతమతమవుతున్న ప్రజల బతుకులను చూశాడు. కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా.. మానవ సంబంధాలకు కనీస విలువనివ్వని సమాజాన్ని కళ్లారా చూశారు. ఆయన కళ్లతో చూసిందే.. పదాల అల్లికతో గేయంగా మారి ఆ గాయాన్ని మాన్పింది. అణచివేతలమీద ఆయన పాట ఉక్కు పిడికిళ్లుగా మారాయి.

అన్యాయంపై గళమెత్తే జనగర్జన అయింది. అందెశ్రీ ఉద్యమ జన జాతర. తెలంగాణ మలివిడత ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో అందెశ్రీ పాటలు ప్రజల్లో గొప్ప పోరాట పటిమను చూపాయి. జనజాతరలో మనగీతం జయకేతనమై ఎగరాలి.. జంజవారుతా జననినాదమై సాగాలి.. అంటూ మలివిడత ఉద్యమంలో ఆయన కవిత్వాలు లక్షలాది మందిని కదిలించాయి. చిన్నతనంలోనే కష్టాలు చూసిన అందె శ్రీ ప్రజల బతుకుల్లో గుణాత్మక మార్పు, సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో రచనలు చేశారు. చదువు లేకపోయినా ప్రజల అంతర్ హృదయాలను అందెశ్రీ చదివారు. రవి చేరనిచోటు ఉంటుంది కానీ కవి చేరనిచోటు ఉండదు అన్నట్లుగా ఆయన కవిత్వం, పాటల రూపంలో ప్రతీ గుండెను తాకారు. ఆవేదనల గుండెలకు బలయ్యారు. అణచివేతపై తిరుగుబాటు గళం అయ్యారు. పోరాట పిడికిళ్లకు పదునైన గీతంగా మారాడు అందెశ్రీ.

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అనాథగా పెరిగిన అందెశ్రీ చిన్నతనంలోనే కష్టాలు వెంటాడాయి. తన కష్టాలను ప్రజల్లో, సమాజంలో చూసిన ఆయన తన పల్లెతో, ప్రకృతితో, మనుషుల హృదయాలతో మమేకం అయ్యారు. పల్లె జీవన బతుకులు తెలిసిన వ్యక్తిగా ‘పల్లె నీకు వందనాలమ్మో… తల్లీ నీకు వందనాలమ్మో.. అంటూ పల్లెను తల్లితో పోల్చి బతుకు విలువను నేర్పిన పల్లెలలపై మమకారాన్ని చాటారు. ‘కొమ్మ చెక్కితే బొమ్మరా… కొలిసి మొక్కితే అమ్మరా’ మాయమైపోతున్నాడమ్మా మనిషిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ సమాజంలో మంట కలుస్తున్న మానవ సంబందాలపై రాసిన పాటలన్నీ అయన గుండెల నుంచి సమాజం కోసం ఉప్పొంగిన గొప్ప అక్షరాలు.. తెలంగాణ మలివిడత ఉద్యమం ఉధృతంగా మారిన తరుణంలో ఆ గేయం ఓ పోరాట తిలకంగా నిలిచింది.

జనజాతరలో మనగీతం జయకేతనమై ఎగరాలి.. ఒకటే జననం.. ఓహో ఒకటే జననం.. జీవితమంతా జనమే మననం.. కష్టానష్టాలు ఎన్ని ఎదురైనా కార్యదీక్షలో తెలంగాణ అంటూ ఉప్పొంగిన గేయం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారానికి ఎంతో భూమిక పోషించింది. అనేక రచనలు, కవిత్వాలతో ఆయన ఎంతోమంది సాహిత్యకారులకు, ప్రజాపోరాటాలకు ఓ చైతన్య గొంతుకగా నిలిచారు. ఆయన చేసిన అనేక రచనలకు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను సైతం ప్రదానం చేసింది. దాశరథీ పురస్కారం, వాషింగ్టన్ డిసి వారి గౌరవ డాక్టరేట్‌తోపాటు లోకకవి అన్న బిరుదు పొందారు. 2015లో డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్టు వారి ఆధ్వర్యంలో జ్ఞాన పీఠ్ పురస్కార గ్రహీత ఆధ్వర్యంలో భరద్వాజ సాహితీ పురస్కారం.. దాంతో నంది అవార్డుతో పాటు ఎంతో మంది ప్రజల గుండెలను గెలుచుకున్నారు. తెలంగాణ మలివిడత ఉద్యమంలో ధూంధాంకు ఉన్న సాంస్కృతిక ఉద్యమ పాత్ర గొప్పది.

ఆ సమయంలో నాటి ఉమ్మడి పది జిల్లాలో తెలంగాణ ధూంధాం వేదికల మీద అందెశ్రీ పాటలు తెలంగాణ పల్లె బతుకులను కళ్లకుకట్టేలా చూపాయి. చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి.. నవ్వుల్లో నాగమల్లి నా ఊరు పాలవెల్లి.. మళ్లీ జనమా ఉంటే సూరమ్మో.. మళ్లీని కడుపున పుడతా మయమ్మో అంటూ తెలంగాణ పల్లె ఆత్మీయతను గొప్పగా ప్రదర్శించారు. సమాజం హితం కోసం అనేక రచనలు చేసి సాహితీ శిఖరంగా ఎదిగిన ఆయన నేడు తెలంగాణ గీతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవనున్నారు. అందె శ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాట నేడు రాష్ట్ర గీతంగా మారింది. సాహితీ లోకానికి, అటు గుణాత్మక సమాజం కోసం పరితపించిన అందెశ్రీ అకాల మృతి తీరని లోటు. అయినప్పటికీ ఆయన తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో తెలంగాణ ఉద్యమంలో జన జాతరను కదిలించిన సాహితీ శిఖరంగా కొలువై ఉంటాడు.

– సంపత్ గడ్డం

78933 03516

పిల్లల ఆస్తమాకు కాలుష్యం చిక్కులు

ప్రపంచ జనాభాలో దాదాపు 30 కోట్ల మంది, భారతదేశంలో 1.5 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వీరిలో సగానికి సగం పిల్లలే బాధితులు కావడం విశేషం. తెలంగాణలో 18 లక్షల ఆస్తమా కేసులు నమోదు కాగా, వీరిలో పిల్లలే ఎక్కువగా ఉన్నారని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినప్పటికీ సకాలంలో వైద్యచికిత్స అందించకుంటే ఎన్నోఇబ్బందులు తెచ్చి పెడుతుంది. ఆస్తమాకు వ్యాక్సిన్ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. ఫ్లూ వల్ల ఇది ఎక్కువవుతుంది కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ ఉపయోగిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. ఆస్తమా ఒక ఇన్‌ప్లెమేటరీ జబ్బు. ఇన్‌ఫ్లమేషన్ అనేది శరీరంలో ఎక్కువ తక్కువై సహజమైన రక్షణ గుణం తగ్గుతుంది. మన దేశంలో వాయు కాలుష్యం వల్ల ఆస్తమా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలతో గాలి కలుషితం కావడమే వాయు కాలుష్యం. గాలిలో ఉండే చిన్న కణాలను పర్టిక్యులేట్ మాటర్ (పిఎం) అంటారు. అతి చిన్న కణాలు (పిఎం 2.5) అత్యంత ప్రమాదకరమైనవి. అవి ఊపిరితిత్తుల్లోకి, రక్తంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. ఆస్తమా ఉన్నవారు ఈ చిన్నకణాలను పీల్చడం వల్ల ఆరోగ్యానికి చిక్కులు ఎక్కువవుతుంటాయి.

చిన్నతనంలో వాయు కాలుష్యానికి గురికావడం బాల్యం, కౌమారదశల్లో, ముఖ్యంగా నాలుగేళ్ల తరువాత ఆస్తమా వ్యాప్తి చెందడానికి వీలవుతుంది. శీతాకాలం వచ్చిందంటే ఈ సమస్య మరీ తీవ్రమవుతోంది. శీతాకాలంలో ఢిల్లీ, హర్యా నా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వాయు కాలుష్యంతో ఎలా అల్లాడిపోతున్నాయో మనకు తెలిసిందే. దేశంలో 70 శాతం కన్నా ఎక్కువ మంది ఇంకా కిరోసిన్, కట్టెల పొయ్యి వాడుతున్నారని, వీటి నుంచి వెలువడే బొగ్గుపులుసు వాయువులతోపాటు అనేక వ్యర్థ వాయువులు శ్వాసకోశాలపై తీవ్రప్రభావం చూపుతున్నాయని అధ్యయనంలో తేలింది. నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతుండడానికి సమీప ప్రాంతాల్లో పంట వ్యర్థాలను మండించడం ఒక కారణం కాగా, వాహనాల నుంచి వెలువడే దుమ్ము, ధూళి కూడా కారణమవుతోంది. వాయు కాలుష్యం మనుషులకు ఊపిరి సలపనీయడం లేదు. అభివృద్ధి పనుల పేరిట రోడ్లు విస్తరించడం, చెట్లను నరికివేయడం, నదులు, వాగులు పూడ్చుకుపోవడం ఇవన్నీ పర్యావరణ సమతుల్యానికి హాని కలిగిస్తున్నాయి.

దీంతో కాలుష్యాలు అనేకరూపాల్లో కమ్ముకుంటున్నాయి. ఆస్తమా, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు మరింత పెరుగుతోంది. ఆస్తమా ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధి. దీని బారినపడిన వారిలో ఛాతీ బిగుసుకుపోవడం, ఊపిరితిత్తులు మూసుకుపోవడం, శ్వాసతీసుకోవడం కష్టం కావడం, విపరీతంగా దగ్గురావడం తదితర లక్షణాలు సంక్రమిస్తుంటాయి. ఛాతీ లో అధికంగా శ్లేష్మం చేరడం వల్ల గాలి మార్గాలు మూసుకుపోయి శ్వాసతీసుకోవడం ఇబ్బంది అవుతుంది. శ్లేష్మం ఎక్కువైతే న్యూమోనియా వంటి ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. వేసవికాలంలో ఆహారం విషయంలో నిర్లక్షంగా ఉంటే ఈ సమస్య మరింత తీవ్రమౌతుంది. శ్లేష్మం ఉత్పత్తి ఎక్కువై శ్వాసనాళాల్లో వాపువస్తుంది. అప్పటికే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్టయితే శ్లేష్మ సమస్య కలిగించని ఆహారాన్ని తీసుకోవాలి. పాలు తీసుకోరాదు. దీనివల్ల సమస్యలు పెరుగుతాయి. శ్లేష్మం ఎక్కువగా ఉంటే తేనెను తీసుకోవడం మంచిది. దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

తేనెతోపాటు నిమ్మకాయ తీసుకుంటే ఔషధంగా పనిచేస్తుంది. పసుపు రసాన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి పుక్కలించుకోవచ్చు. వేడి నీళ్లు, చికెన్ సూప్, వేడి యాపిల్ రసం, గ్రీన్‌టీ తీసుకోవచ్చు. పిల్లల్లో వచ్చే ఆస్తమాపై తరచుగా అధ్యయనాలు జరుగుతున్నాయి. చేపలు తినడంవల్ల ఆస్తమాను నివారించవచ్చని హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనే జర్నల్‌లో ఓ అధ్యయనం వెలువడింది. ఈ అధ్యయనంలో ఆస్తమా పిల్లలకు ఆరు నెలలపాటు రోజూ చేపల కూర తినిపించారు. ఇలా చేయడం వల్ల ఆస్తమా తగ్గుముఖం పడుతోందని కనుక్కొన్నారు. చేపల్లో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారంలో రెండు సార్లయినా చేపలు తింటేశ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయని చెబుతున్నారు. వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి సంక్రమించే పరిస్థితి ఉంది. వాతావరణంలో మార్పులు, పొగ, దుమ్ముతో నిండిన పరికరాలు, అగరుబత్తీ పరిమళాలు, దోమల నివారణకు వాడే కాయిల్స్, పెంపుడు జంతువుల బొచ్చు, టపాసుల పొగ, పూల పుప్పొడి, ఇవన్నీ ఆస్తమాకు దోహదం చేస్తుంటాయి.

ఒకప్పుడు వంశవారసత్వంగా ఆస్తమా వస్తుందని నమ్మేవారు. కానీ ఇప్పుడు దానికంటే గాలి కలుషితం కావడం ప్రధాన కారణమవుతోంది. ఆస్తమా రోగులకు ధూమపానం పనికి రాదు. శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, ఫ్రిజ్ వాటర్ వంటి చల్లని పదార్ధాలు తీసుకోకూడదు. ఇంట్లో బూజు దులపడం, చెత్తను తీయడం, పాతసామాన్లు చక్కబెట్టడం ఇలాంటి పనులు చేస్తే అలర్జీ పెరిగి ఆస్తమా ఎక్కువవుతుంది. ఇన్‌హేలర్ దగ్గర ఉంచుకోవడం మంచిది. నిత్యం వ్యాయామం చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. బరువు తగ్గుతుంది. బరువు తగ్గితే ఆస్తమా రిస్క్ తగ్గుతుంది. రక్తప్రసరణవల్ల అవయవాలన్నిటికీ ఆక్సిజన్ సరఫరా అయి మరింత శక్తి లభిస్తుంది. యోగా, ప్రాణాయామం కూడా ఆస్తమా రోగులకు మంచిదే. ఆస్తమా తొలిదశలో బ్రీతింగ్ ఎక్సర్‌సైజు, ప్రాణాయామం చేస్తే తగిన ఉపయోగం ఉంటుంది. సరైన వైద్యచికిత్సతో ఆస్తమా తగ్గుతుందన్నది మర్చిపోరాదు. ఆస్తమా రోగుల్లో ముఖ్యంగా పిల్లల్లో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో తల్లిదండ్రులు భయపడి, వారిని భయపెట్టకూడదు. ఎప్పటికప్పుడు వారికి ధైర్యం చెబుతుండాలి. ఆస్తమా పిల్లలు ఏదైనా ఆటపాటలపై మక్కువ చూపితే అడ్డుచెప్పవద్దు. ఈతకొట్టాలన్నా, మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయాలనుకున్నా వాళ్లను చేయనివ్వండి. 

– డాక్టర్ బి. రామకృష్ణ

99599 32323

మానవ మనుగడతో పర్యావ‘రణం’

ఇటీవల కాలంలో సంభవిస్తున్న తుఫానులు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను దాటిన మొంథా తుఫాను తీవ్రవిధ్వంసం సృష్టిస్తుందనే భయంకరమైన పరిస్థితులనుండి ప్రజలు బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుఫాను తీరం దాటిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వలన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ప్రకృతిలో ఎందుకు అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తున్నాయి? ఆకస్మిక వాతావరణ మార్పులకు కారణమేమిటి? ఇలాంటి కీలకమైన అంశాలపై తీవ్రమైన పరిశీలన, మేధో మథనం జరగాలి. మానవ చర్యల వలన ప్రకృతిలో సంభవించే విపత్తులనుండి ప్రజలను కాపాడుకోవాలి. ప్రకృతి విధ్వంస దుష్ఫలితాలను కనీసస్థాయికి తగ్గించాలి. ప్రకృతి భూమికి రక్షణ కవచం వంటిది. అలాంటి ప్రకృతిని విధ్వంసం చేయడం మనల్ని మనం ప్రమాదంలో పడేసుకోవడమే. మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతిని నిర్లక్ష్యం చేసి, పర్యావరణానికి ముప్పు కలగచేయడం క్షమార్హం కాదు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ, ఎన్నోఅవగాహనా సదస్సులు, ఎన్నో అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నా పర్యావరణ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది.

పర్యావరణ విధ్వంసంతో మానవ ప్రపంచం విలపిస్తున్నది. ప్రపంచాన్ని పచ్చదనంతో నింపితేనే భూగ్రహాన్ని కాపాడగలం. స్వీడన్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఐస్‌లాండ్, డెన్మార్క్, యు.కె, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు హరిత దేశాలుగా పేర్కొనబడుతున్నాయి. సహజ వనరులను పరిరక్షించి, కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా డెన్మార్క్ గ్రీనెస్ట్ కంట్రీ దిశగా పయనిస్తున్నది. ఖతార్, నైజర్, గ్రీన్ లాండ్ వంటి దేశాల్లో పచ్చదనం తక్కువగా ఉంది. ధరిత్రిని కలుషిత వ్యర్ధాలనుండి కాపాడడం, ప్లాస్టిక్‌ను నెమ్మదిగా తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రపంచాన్ని మళ్ళించడం, జీవవైవిధ్యాన్ని కాపాడడం, అడవులను సంరక్షించడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి చర్యలతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ప్రస్తుత కలుషితభరితమైన ప్రపంచంలో ప్రతీ చోట వినిపించే మాట ‘పర్యావరణం’. పర్యావరణం అనే పదానికి నిర్వచనం చాలా మందికి తెలియకపోవచ్చు. పచ్చదనమే పర్యావరణ పరిరక్షణకు నిజమైన పరిష్కారమన్న అవగాహన మాత్రం సామాన్య ప్రజల్లో కూడా ఏర్పడింది. కాని ఆచరణలో పర్యావరణ పరిరక్షణ అంశం విఫలమవుతూనే ఉంది.

పర్యావరణం శరవేగంగా విధ్యంసమవుతూనే ఉంది. మానవ ప్రపంచాన్ని పెను ప్రమాదం వెంటాడుతూనే ఉంది. మన చుట్టూ పంచభూతాలతో ఆవరించి ఉన్న సహజసిద్ధమైన ఏర్పాటును ‘పర్యావరణం’గా పేర్కొనవచ్చు. అలాంటి పర్యావరణం మానవ స్వార్థంతో, తప్పిదాలతో విధ్వంసం కావడం పెను ప్రమాదానికి సంకేతం-, మానవ మనుగడకు శరాఘాతం. సకల జీవరాశుల మనుగడకు ఏకైకఆధారం భూగ్రహం. మిగిలిన గ్రహాల్లో జీవించడానికి అనువైన పరిస్థితులు లేవు. ఇతర గ్రహాలపై పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటి వరకు జీవరాశుల జాడ కనిపించలేదు. వేలాది కోట్ల ధనం ఇతర గ్రహాలపై పరిశోధనలకు ఖర్చుపెడుతున్నా ఫలితాలు నిరాశాజనకంగానే ఉన్నాయి. ఇతర గ్రహాలపై తిష్ఠవేయాలనే మానవ జిజ్ఞాస కేవలం అత్యాశగానే మిగిలిపోతుందేమో అనే సంశయం కలగడం సహజం. సువిశాలమైన భూగ్రహాన్ని నాశనం చేసి, ఇతర గ్రహాలపై నివాసానికి కలలు కనడం హాస్యాస్పదం. ప్రకృతి హొయలతో అలరాడే అందమైన భూగ్రహాన్ని కాలుష్యంతో కురూపిగామార్చి, ఇతర గ్రహాలపై పరిశోధనలు చేయడం కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారింది. భూగ్రహం కూడా ఈ సమస్త విశ్వంలో ఒక భాగమే.

భూగ్రహంపై మూడొంతుల నీరు, ఒక వంతు భూమి కలదు. వృక్షాలతో, నదీనదాలతో, కొండలు, లోయలు, సముద్రాలతో పలు జీవరాశులతో, విభిన్నమైన భౌగోళిక నైసర్గీక స్వరూపాలతో, పచ్చని ప్రకృతి మధ్య జీవించే మహాద్భాగ్యాన్ని మానవుడే చెరిపేస్తున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం విచక్షణ కోల్పోయి ప్రకృతిని చెరబట్టి, వికృతంగా మారుస్తున్నాడు. అడవులను నరికి నివాసాలను ఏర్పాటు చేసుకోవడం, పంటభూములను మానవావసరాలకు వినియోగించడం, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఏర్పాటు చేయడం, శిలాజ ఇంధనాలను ఇబ్బడిముబ్బడిగా వినియోగించడం వలన ధరిత్రిపై కాలుష్యపు క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం వలన, అడవులను ధ్వంసం చేయడం వలన, పారిశ్రామిక విప్లవం వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల శాతం పెరిగి, భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే ‘గ్లోబల్ వార్మింగ్’ సమస్య పెరిగి భూమిపై మనుగడ సాగిస్తున్న పలు జీవరాశుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. భూ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ తప్పిదాలే కారణం. ప్రకృతిలో లభ్యమయ్యే వనరులను అవసరాలకు మించి వినియోగించడం, ధనాశతో, దురాశతో దూరదృష్టి కోల్పోయి, పర్యావరణానికి చేటుతేవడం మానవ మనుగడకు పెనుముప్పు.

పచ్చదనమే ప్రపంచ మానవాళికి నిజమైన ధనం. ఈ విషయాన్ని మరచిపోయి, కలుషితాల మధ్య జీవిస్తూ సుఖసౌఖ్యాలను ఆస్వాదిస్తున్నామని భ్రమించడం దురదృష్టకరం. పంచభూతాలు కలుషితమైపోయాయి. పర్యావరణం కాలుష్యంతో నిండిపోయింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రాబోవు ప్రళయానికి సంకేతాలు. సూర్యరశ్మి, గాలి, నీరు మొదలైన వనరులను పునరుత్పాదక శక్తివనరులుగా పిలుస్తారు. జంతువుల, మొక్కల వ్యర్ధాల నుండి ఉత్పత్తి కాబడే ఇంధనాన్ని బయోమాస్ ఎనర్జీ అంటారు. ఇది కూడా పునరుత్పాదక ఎనర్జీ. పునరుత్పాదక శక్తి వనరులను వినియోగించే కొద్దీ తిరిగి భర్తీ చేయబడతాయి. సౌరశక్తి, గాలి వంటి సహజసిద్ధమైన వనరులను వినియోగించుకుని కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వీటి వలన పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. సూర్యరశ్మి, గాలి వంటి ప్రకృతి సిద్ధమైన వనరుల నుండి లభ్యమయ్యే శక్తి కారకాలను ఇబ్బడి ముబ్బడిగా వినియోగించినా తిరిగి పొందగలం. వీటిని వినియోగించడం వలన కాలుష్యాన్ని తగ్గించవచ్చు.

పునరుత్పాదక శక్తివనరులతో వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించి, కాలుష్యాన్ని అరికట్టవచ్చు. దీనినే క్లీన్ ఎనర్జీ అంటారు. ప్రపంచంలో ప్రకృతి ప్రేమికులకు కొదవలేదు. అయినా ఆశించినంత ప్రయోజనం ఆచరణలో కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగకుండా, ప్రజల అవసరాలు తీర్చే ప్రణాళికలు చేపట్టకుండా పర్యావరణ విధ్వంసాన్ని ఆపలేం. పర్యావరణాన్ని పరిరక్షించి, భూతలాన్ని కాపాడేందుకు ‘రాచెల్ లూయీస్ కార్సన్’ వంటి పర్యావరణ వేత్తల ఆలోచనలు స్ఫూర్తి కావాలి. గేలార్డ్ నెల్సన్ లాంటి దూరదృష్టిగల పర్యావరణ ప్రేమికులను వర్తమాన ప్రపంచం తయారు చేయాలి. జాదవ్ పాయెంగ్, వనజీవి రామయ్య వంటి ప్రకృతి, పర్యావరణ సేవకులు సమాజం నుండి ఉద్భవించాలి. ప్రపంచ స్థాయి సంస్థలు, ప్రభుత్వాలు, పర్యావరణ వేత్తలు పర్యావరణ పునరుద్ధరణకు నడుంబిగించి, మానవాళిని పెను సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి వడివడి అడుగులు వేయాలి. సహజసిద్ధమైన, కలుషిత రహితమైన గత కాలం నాటి,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పునర్జీవింపచేయాలి. మానవ చర్యల వలన ఏర్పడుతున్న వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయాలి. ప్రకృతి వైపరీత్యాలనుండి ప్రజలను కాపాడాలి.

– సుంకవల్లి సత్తిరాజు

97049 03463

అన్నవస్త్రాల కన్నా అణ్వాయుధాలే మిన్న!

అమెరికాలో షట్‌డౌన్ ప్రభావం అనేక రంగాలను కల్లోల పరుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఆహార సంక్షోభానికి దారితీస్తోంది. వాణిజ్య రాజధాని న్యూయార్క్‌కు ప్రభుత్వం నుంచి ఆహార సాయం అందక ఆ రాష్ట్రం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ‘సప్లిమెంట్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ లేదా ‘ఫుడ్‌స్టాంప్స్’ ప్రయోజనాలు అందని ప్రమాదం ఏర్పడింది. మరోవైపు షట్‌డౌన్ ప్రభావం కారణం గానే విమాన సర్వీస్‌ల సిబ్బందికి జీతాలు చెల్లించలేక 10 శాతం సర్వీస్‌లను తగ్గిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు నుంచి పార్క్ వార్డెన్ల వరకు 1.4 మిలియన్ ఫెడరల్ వర్కర్లు శెలవుపై వెళ్లడమో లేదా వేతనం లేకుండా పని చేయవలసి రావడమో తేల్చుకోలేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు. ఇటువంటి తీవ్ర సంక్షోభం నేపథ్యంలో అన్నవస్త్రాలు ప్రజలకు ఎలా అందించాలన్న ప్రయత్నాలకు బదులు అణ్వస్త్రాల పోటీకి అమెరికా ప్రభుత్వం మొగ్గు చూపడం శాంతికాముక దేశాలను కలవరపరుస్తోంది. తాజాగా ఫ్లోరిడా లోని మయామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వైపు హితవచనాలు పలుకుతూ మరోవైపు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని బెదిరించడం ఫక్కా నియంతృత్వ ధోరణిని ప్రతిబింబిస్తోంది.

దక్షిణ కొరియాలో అక్టోబర్ 29న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కావడానికి కొన్ని నిముషాల ముందు అమెరికా అణ్వాయుధాల పరీక్షను ఇతర దేశాలతో సమానంగా ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించడం సంచలనం రేపుతోంది. ‘రష్యా, చైనా దేశాలు అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కానీ అవి వాటి గురించి ఎక్కడా ఎప్పుడు ప్రస్తావించడం లేదు. ఉత్తర కొరియా కచ్చితంగా అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉంది. పాకిస్థాన్ కూడా ఇదే దారిలో ముందుకు వెళ్తోంది’ అని ట్రంప్ బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ చెప్పింది అక్షరాలా సత్యం. నవశతాబ్దంలో ఉత్తరకొరియా బహుళ అణ్వాయుధాలను పరీక్షించింది. కానీ అణ్వాయుధ నిల్వలు కలిగిన అమెరికా, చైనా, రష్యా తదితర అగ్రరాజ్యాలతో సహా ఇతర దేశాలు 1990 నుంచి అణ్వాయుధ పరీక్షలపై తాత్కాలిక నిషేధాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణులను అవి పరీక్షించగలవు. ఇప్పుడు అణుశక్తితో నడిచే అస్త్రాన్ని రష్యా సిద్ధం చేసింది. 15 గంటల పాటు గాల్లోనే ఉండి, 14 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ‘బురెవెస్ట్‌నిక్’ అణుక్షిపణిని పరీక్షించింది. అలాగే సముద్ర గర్భ టార్పెడోను ప్రయోగించి పరీక్షించింది. ఈ పరీక్షలు విజయవంతమయ్యాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించగానే ట్రంప్ స్పందించి తమ దేశం కూడా అణ్వాయుధ పరీక్షలను తిరిగి చేపడుతోందని ప్రకటించడం విశేషం.

రష్యా ప్రయోగించిన ఆ రెండు అణుక్షిపణులు అమెరికా రక్షణ క్షిపణి వ్యవస్థలను అధిగమించేలా డిజైన్ చేశారు. అవి అణ్వాయుధాలను ఎక్కడికైనా తీసుకెళ్ల గలవు. కానీ అవి అణువిస్ఫోటన పరీక్షలు కావు. సోవియెట్ యూనియన్ ఉన్నప్పుడు 1990 లో రష్యా ఆఖరిసారి అణ్వాయుధ పరీక్ష నిర్వహించింది. అలాగే 1992 లో అమెరికా ఆఖరి అణుబాంబు పరీక్ష, 1996లో చైనా ఆఖరి అణుపరీక్ష నిర్వహించాయి. అన్ని అణుపరీక్షలను నిషేధిస్తూ 1996లో సమగ్ర నిషేధ ఒప్పందం (సిటిబిటి) కుదిరింది. కానీ అవసరమైన సంఖ్యలో దేశాలు దీనిని ఆమోదించకపోవడంతో ఆ ఒప్పందం అమలు లోకి రాలేదు. ఒప్పందంపై అమెరికా, చైనాలు సంతకాలు చేసినా దాన్ని ఆమోదించడం మాత్రం జరగడం లేదు. రష్యా ఒప్పందంపై సంతకం చేసి ఆమోదం తెలియజేసినా, 2023లో అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో ఒప్పందానికి కట్టుబడి ఉండకూడదని నిర్ణయించుకుంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టుల వివరాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద భారీ ఎత్తున అణ్వాయుధాలు కలిగిన రష్యాలో 4309 అణుక్షిపణులు ఉన్నాయి. తరువాత రెండోస్థానం అమెరికాలో 3700, చైనాలో 1000 అణుక్షిపణులు ఉన్నాయని అంచనా. చారిత్రకంగా అమెరికా అనేక సార్లు అణు పరీక్షలు నిర్వహించింది.

1030 అణు విస్ఫోటనాలను నిర్వహించింది. తరువాత సోవియెట్ యూనియన్ 715, ఫ్రాన్స్ 210, చైనా 45 అణువిస్ఫోటన పరీక్షలను చేపట్టాయి. ఒప్పందం తరువాత మొత్తం 2056 అణుపరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా మళ్లీ అణుపరీక్షలు కొనసాగించడానికి సిద్ధం కావడం చర్చకు దారి తీస్తోంది. దీన్ని సమర్థిస్తున్నవారు అణ్వాయుధాలు పనిచేస్తున్నాయో లేదో తిరిగి పరీక్షించుకోవడం అవసరమని చెబుతున్నారు. అయితే అమెరికా సెక్రటరీ ఆఫ్ ఎనర్జీ క్రిస్‌వ్రైట్ తమ దేశం అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించబోదని, ఎలాంటి అణు విస్ఫోటనం జరగకుండా కేవలం దేశవాళీ పేలుడు పదార్ధాలతోనే తక్కువ శక్తిగల ప్లుటోనియం 239పై ఒత్తిడి తీసుకొచ్చే పరీక్షలు చేస్తుందని నవంబర్ 2న చెప్పుకొచ్చారు. అంతరిక్షం, సముద్ర జలాలు మొదలుకొని ఎలాంటి పర్యావరణ వాతావరణంలో కూడా అణుపరీక్షలు చేయరాదని 1963లో పాక్షిక పరీక్ష నిషేధ ఒప్పందంపై సోవియట్ యూనియన్, అమెరికా, బ్రిటన్ దేశాలు సంతకం చేశాయి. ఇప్పుడు అమెరికా తిరిగి అణుపరీక్షలు ప్రారంభిస్తే ఇతర అణ్వాయుధ దేశాలపై కూడా ఆధిపత్య ప్రభావం పడుతుంది. ఇప్పటికే చైనా గతంలో 1964 లో మావో ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటన ప్రదేశం లాప్‌నూర్ వద్ద అణుపరీక్షలకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభావం మిగతా దేశాలపై చూపిస్తుంది. 

ఓటుహక్కుపై పడకూడదు వేటు

అమెరికానే కాదు, ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలబడి జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర్ మేయర్‌గా గెలిచాడు. ఇది ప్రపంచ దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. ఆధిపత్యం, అణచివేతలు ఎల్లకాలం సాగవనే సత్యాన్ని ఓటు శక్తి ద్వారా న్యూయార్క్ ప్రజలు నిరూపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహూల్ గాంధీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ హర్యానాలో జరిగిన గత ఎన్నికల్లో ఓట్ల గోల్ మాల్‌కు, ఓట్ల చోరికి పాల్పడి ఏ విధంగా గెలిచిందో అనేక ఉదాహరణలతో వివరించారు. అమెరికాలో జరిగిన జోహ్రాన్ మమ్దాని విజయంగానీ, ఓట్లను తొలగించి బిజెపి గెలిచిందనే వార్త గానీ ఈ రెండు ఓటు శక్తిని నిరూపిస్తున్నాయి. ప్రాచీన కాలంలో మధ్యయుగాల్లో కత్తులు, బాణాలు, తుపాకులు ఏ విధంగా రాజ్యాలను గెలుచుకోవడానకి ఉపకరించాయో ఆధునిక కాలంలో ఓటు హక్కు కూడా అటువంటి పాత్రను పోషిస్తుంది. జోహ్రాన్ మమ్దాని భారతీయ సంతతికి చెందినవాడు కావడం ఒక విశేషం. ఇదే విధంగా హైదరాబాద్‌కు చెందిన గజాలా హష్మి వర్జినియా గవర్నర్‌గా గెలిచింది. గజాలా హష్మి కూడా ట్రంప్ ప్రత్యర్థి పార్టీ డెమొక్రాట్ పార్టీకి చెందిన అభ్యర్థి.

ఆధునిక ప్రజాస్వామ్య వ్వవస్థలో ఓటు హక్కు అనేది సాదాసీదా పరికరం కాదు, ఇది ఒక వ్యవస్థ రూపురేఖలు మార్చగలిగే అధునాతన ఆయుధం. ఓటు హక్కు కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయితే మొదట్లో మన దేశంతో సహా ఏ దేశంలోనైన కేవలం సంపన్న వర్గాలకే ఓటు హక్కు ఉండేది. అప్పుడు అది ఒక రకంగా పాక్షిక ప్రజాస్వామ్యమే. ఒక రకంగా అది సంపన్న స్వామ్యమే. అయితే భారత దేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు సార్వజనీన ఓటు హక్కు కోసం అంటే కులం, మతం, ధనిక, పేద, అక్షరాస్యత, నిరాక్షరాసత, ఆడ, మగ తేడా లేకుండా వయోజనులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని పట్టుబట్టి సాధించిపెట్టారు. నిరక్షరాస్యులు, పేదలు ఓటు హక్కును సరైన పద్ధతిలో ఉపయోగించలేరని వాదించిన వాళ్ళున్నారు. అయితే భారత దేశంలో అనుభవం దానిని తప్పని రుజువు చేసింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రజావ్యతిరేక చర్యలకు పూనుకున్న ప్రభుత్వాలు నడిపిన పార్టీలను ఓడించి, ఓటు హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోసమేనని ప్రజలు రుజువు చేశారు.

అయితే గత పది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను చేర్చడం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. దీనికి రుజువులు కూడా చూపెడుతున్నారు. అయితే ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన అంశమని మనం భావిస్తున్నాం. అది రుజువైంది కూడా. రాజ్యాంగ రచనా సమయంలో కొంతమంది అప్పుడే పేదలు, చదవులేని వారికి ఓటు హక్కు వద్దని మాట్లాడారు. దానికి వాళ్ళు చూపెట్టిన కారణం, ఈ ఆధునిక పద్ధతులు వాళ్ళకు అర్థం కావని చెప్పారు. అయితే అప్పుడేమో కానీ ఇప్పుడు దీని అంతరార్థం అర్థమవుతున్నది. ఓటు ఒక హక్కు మాత్రమే కాదు, ఒక బలం. ఒక శక్తి. అది అందివస్తే పేదలు ముఖ్యంగా నిమ్నకులాలు తమ మాట వినవనే వాళ్ళుకు తెలుసు. అప్పుడేమో చట్టపరంగా, విధాన నిర్ణయంగా అడ్డుకోవాలని చూశారు. అయితే ఇప్పుడు ఓటు హక్కు శక్తి తెలిసి వచ్చింది. కాబట్టి, తమకు అనుకూలంగా లేని సమూహాల, కులాల, మతాల ఓట్లను తొలగిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది 75 ఏళ్ళ కింద ఆనాటి ఆధిపత్య కులాలు, సంపన్నవర్గాలు చేసిన కుట్రకు ఇది కొనసాగింపు మాత్రమే.

అయితే 75 ఏళ్ళ తర్వాత ఈ ఓట్ల మీద దాడి ఎందుకు జరుగుతుంది? ఓటు హక్కు అనే దానిని ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? ఇది కేవలం ఓటు హక్కుతో మొదలై ఓటు హక్కుతో ముగిసిపోయేది కాదు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో రాజకీయ సమానత్వానికి ప్రాతిపదిక. ప్రజలందరూ ప్రజాస్వామ్యంలో తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం. ఇది ప్రజలను పాలనలో భాగస్వాములు కావడానికి ఉన్న అవకాశం. కానీ ఇది ఈ రోజు ముగింపుకు వచ్చినట్టు కనపడుతున్నది. ఎవరైతే ప్రభుత్వాలకు అనుకూలంగా లేరో, ఎవరైతే ఈ పాలన మారాలని అనుకుంటున్నారో వారికి ఓటు హక్కు లేకుండా చేయడమంటే, రాజకీయ ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడడమే. బీహార్, అసోం, హర్యానాలలో ఇదే జరిగినట్టు విమర్శలున్నాయి. ఇది నూటికి నూరు పాళ్ళు అవాంఛనీయం.

ఇలా జరిగే ప్రమాదముందని, 75 ఏళ్ళ కిందట రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ హెచ్చరిక కూడా చేశారు. 1949, నవంబర్ 25వ తేదిన రాజ్యాంగ సభలో చివరి ఉపన్యాసం చేస్తూ ‘జనవరి, 26, 1950 నుంచి మనం వైరుధ్య జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ అనే విధానం ద్వారా రాజకీయ సమానత్వాని సాధించుకున్నాం. కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా అసమానతులు కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లోకి వెళ్లుతోంది’ బాబా సాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు ఈ రోజు అద్దంలో ప్రతిబింబం లాగా కనిపిస్తున్నాయి. దాని ఫలితమే ఓటు హక్కును దుర్వినియోగం చేస్తూ, ప్రజలను ఓటు హక్కుకు దూరం చేయడమే.

గత 75 సంవత్సరాలుగా ఆర్థిక ప్రగతి ఎంతో సాధించిందని మన దేశం గురించి మనం చెప్పుకుంటున్నాం. కానీ ప్రజలు అభివృద్ధికి దూరంగా జరిగిపోయారు. ఆర్థిక రంగం రోజు రోజుకు గుత్తాధిపత్యం సంపాదించుకుంటున్నది. గతంలో వృత్తులు ఉన్న సమూహాలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కలిగి ఉండేవి. ఈ రోజు అన్ని పారిశ్రామికాధిపతులు, కార్పొరేట్లు ఆక్రమించుకున్నారు. దీనితో ఆర్థిక స్వాలంబనను కలిగి ఉన్న ప్రజలు పరాధీన బతుకులు అనుభవిస్తున్నారు. గ్రామీణ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. రెండోది ఆధునీకరణ, యాంత్రీకరణ, కంప్యూటరీకరణ ద్వారా శ్రమ చేసే శక్తి ఉన్న యువతి యువకులు నిరుద్యోగులుగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సాంప్రదాయకంగా తరతరాలుగా అనుభవిస్తున్న ఆర్థిక స్వాతంత్య్రం ఈ రోజు కార్పొరేట్లు చెప్పుచేతుల్లోకి వెళ్ళాయి.

అంతేకాకుండా గతంలో కన్నా చాలా ఎక్కువ ఆర్థిక వ్యత్యాసాలు పెరిగాయి. ఇందులో ఆధిపత్య కులాలు ఆర్థికంగా లాభపడితే నిమ్న, వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసులు ఆర్థిక పరాన్నజీవులుగా తయారయ్యారు. గత పదేళ్ళలో అదానీ కంపెనీ ఆస్తుల పెరుగుదల చూస్తే మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో అర్థం కాగలదు. అంతేకాకుండా కేవలం 10 శాతం కుటుంబాలు దేశంలో సంతృప్తిగా ఉన్నాయి. మిగతా 90 శాతంలో పది శాతం పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న మధ్య తరగతి వర్గాలు, మిగిలిన 80 శాతం కుటుంబాలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నాయి. ఉచితాల పేరుతో చేతులు ఉన్న పని చేయని అవిటి వాళ్లులాగా తయారు చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువగా, బిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు, మైనారిటీలు ఉన్నారు. అదే విధంగా సామాజికంగా ఈ దేశం కులాలుగా విడిపోయి ఉన్నవి. కులాలు ఒకదానికొకటి విడివిడి ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువ, తక్కువ అనే సామాజిక సంబంధాలను కలిగి ఉన్నాయి. సనాతన పేరుతో నడుస్తున్న హిందూ వ్యవస్థ కులాలను పెంచి పోషిస్తుందే. కానీ వాటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదు. దానికి సాక్షాలుగా దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, కులాంతర వివాహాలు జరిగితే ఆ వ్యక్తులపై దాడుల, హత్యలు ఈ దేశంలో సామాజిక సమానత్వాన్ని ఒక అందుకోలేని ఆకాశంగా తయారు చేస్తున్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలలో వివక్షకు, అసమానతలకు, అణచివేతలకు గురవుతున్న ప్రజలు వ్యవస్థ మీద, ప్రభుత్వాలమీద తిరుగుబాటు చేస్తారేమోననే భయంతో ప్రభుత్వాల భవిష్యత్‌ను నిర్ణయించే ఓటు హక్కును దూరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. అందువల్ల సామాజిక, ఆర్థిక సమానత్వలు సాధించనంత వరకు రాజకీయ ప్రజాస్వామ్యం ఒక నిజమైన అబద్ధం.   

–  మల్లేపల్లి లక్ష్మయ్య ( దర్పణం)

గురునానక్ బోధనలు శిరోధార్యం

భారతదేశంలో మతం, అందులో నుంచీ పుట్టిన వర్ణ వ్యవస్థ, కులం వ్యవస్థ మనుషుల మధ్య అంతరాలకు కారణమైనవి. సామాజిక వైషమ్యాలను సృష్టించాయి. ప్రపంచ దేశాలతో పోలుస్తే ఇది భిన్నమైన కుట్రపూరితమైన అణచివేత అని చెప్పవచ్చు. వీటికి వ్యతిరేకంగా సమానత్వం, స్వేచ్ఛ, మానవ విలువల పునాదిగా ఆవిర్భవించిన భారతీయ మతం బౌద్ధం. అనంతరం ఈ విలువలకు దగ్గరున్నది సిక్కు మతం. ఈ రెండు కూడా భారతదేశంలో పుట్టిన మతాలు. సిక్కు మతం సమానత్వం, సామాజిక ఐక్యత, పరస్పర గౌరవానికి కృషి చేసింది. సిక్కు మత స్థాపకులు గురునానక్ దేవ్. ఆయన 1469లో నన్కానా సాహెబ్ జన్మించారు. ఏట కార్తీకమాసంలో గురునానక్ జయంతి జరుపుకుంటారు. ఆయన హిందూ, ఇస్లాం మత గ్రంథాలు అధ్యయనం చేసి, అన్ని మతాల సామరస్యాన్ని, ఏక దేవతా సిద్ధాంతాన్ని బోధించారు. కుల వ్యవస్థను, మతపరమైన వివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఏక్ ఓంకార్’ సిద్ధాంతాన్ని ఉద్బోధించారు. చివరికి ‘గురు గ్రంథ్ సాహిబ్’ అనే మత గ్రంథానికి ప్రేరణ ఇచ్చారు.

గురునానక్ ప్రత్యేకంగా అణచివేయబడిన వర్గాల విముక్తినీ కోరుకున్నారు. ఈ క్రమంలో గురునానక్ సిద్ధాంతాలను ప్రభావితమైన కొందరు దళితులు కూడా సిక్కు మతంలో చేరారు, వారు అక్కడ గౌరవం, సమానత్వం పొందగలిగారు. సిక్కు మత స్థాపకుడైన గురునానక్ సంత్ రవిదాస్ శిష్యుడే. సిక్కు మత గ్రంథమైన ఆదిగ్రంథ్‌లో చెప్పులు కుట్టే చమార్ సంత్ రవిదాస్ బోధనలే అధికంగా ఉన్నాయి. ఆయన బోధనలతో ఉత్తర భారతదేశంలో అట్టడుగు వర్గాలు ఆత్మగౌరవంగా జీవిస్తూ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. రవిదాస్ మాదిగలకు ప్రశాంతమైన జీవితం స్వరాజ్యంలో లేదంటే శ్మశానంలో లభిస్తుందనీ చారిత్రక వాస్తవాన్ని చెప్పాడు. గురునానక్, సంత్ రవిదాస్ వంటి మహనీయుల బోధనలతో ప్రభావితమై కాన్షిరాం విప్లవం సృష్టించాడు. బహుజన రాజ్యాధికారానికి పునాది వేశాడు. నేడు ఆయన చైతన్యంతోనే బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు. సిక్కు మతంలో పురుషుల పేరు చివర ‘సింగ్’ అనే పదం చేర్చి మానసిక పరివర్తనగావించారు. దీనర్థం ‘సింహ’ (lion). ఇది ఈ చారిత్రకంగా దేశమూలవాసులుగా సమానత్వం, ధర్మం, రాజసత్వం, బలహీనుల రక్షించడం, ధైర్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఈ క్రమంలో ప్రముఖ రాజకీయవేత్త డాక్టర్ విశారదన్ మహరాజ్ ఊరి బయట జీవిస్తున్న మాదిగలకు ‘మహారాజులు’గా నామకరణం చేశాడు. మాదిగలు ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించిన మహారాజులనే చారిత్రక వాస్తవాన్ని గుర్తు చేశారు. ఆత్మనూన్యత వీడి మళ్ళీ మహారాజులుగా (పాలకులుగా) పునర్జీవింపజేయడానికి 5 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. గురునానక్ కుల, మతాలను తిరస్కరించడం, సమానత్వాన్ని ప్రచారం చేయడం వంటి గొప్ప ఆదర్శాలతో అంబేద్కర్ ప్రేరేపితుడయ్యారు. గురునానక్ దళితులకు అత్యధిక గౌరవం ఇచ్చిన మత నాయకుడని, ఆయన బోధనలు దళితుల విముక్తి మార్గంగా ఉన్నాయని గుర్తించారు. చారిత్రకంగా భారత మనువాద సమాజంలో అట్టడుగు కులంగా దళితలు కులంపేరుతో తీవ్రంగా పీడనకు గురైనారు. ఈ క్రమంలో అంబేద్కర్ ‘కుల నిర్మూలన’ పోరాటంలో గురునానక్ నాయకత్వంలోని మత, సామాజిక విప్లవాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ముంబయిలో ఉన్న గురునానక్ ఖల్సా కళాశాల స్థాపన అంబేద్కర్ ఆలోచనతో ఏర్పడింది. అన్ని వర్గాల వారికీ ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో దీనికి ప్రోత్సాహించారు. భారతదేశంలో ఇప్పటికీ కుల, మత ఉన్మాదాలు హెచ్చరిల్లుతున్నాయి. వీటి పేరుతో చాపకింది నీరులా దుర్విచక్షణ కొనసాగుతుంది. దీంతో అట్టడుగు అణగారినవర్గాలు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అస్తిత్వం అణచివేయబడుతుంది. ఆధిపత్య సాంస్కృతిక భావజాలం, ప్రభుత్వ విధానాలే దీనికి ప్రధాన కారణం. ఇవీ ప్రజలను రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయి. అంతిమంగా సామాజిక సంఘర్షణలకు కారణమవుతున్నాయి. కావున దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, మానవ విలువలను కోసం ఉద్యమించాల్సిన అవశ్యకత ఉంది. దీనికి గురునానక్ సామాజిక ఐక్యత తత్వం అవసరం. మరోవైపు ఆయన సామాజిక చైతన్య స్ఫూర్తిని, అస్తిత్వ వాదాన్ని అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగం మెజారిటీ ప్రజల హక్కులకు ప్రాధాన్యమివ్వడం జరిగింది. దీనికి విరుద్ధంగా భారత పరిపాలన, విధానాలు కొనసాగుతున్నాయి. దీంతో పీడితవర్గాల హక్కులు, అవకాశాలకు నష్టం జరుగుతుంది. నేడు సామాజిక న్యాయ పోరాటానికి గురునానక్ విలువలు, భారత రాజ్యాంగ సూత్రాలతో ఉద్యమించాల్సిన అవసరం ఉంది.

– సంపతి రమేష్ మహారాజ్

– 7989579428

త్రిముఖం.. ఎవరికి సుముఖం?

తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల భవితవ్యానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక గీటురాయిగా మారనుంది. ఇది కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికగా కొట్టిపారేయలేని పరిస్ధితి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ఇది రెఫరెండమ్. రెండు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన భారత రాష్ట్ర సమితి జవజీవాలను నిర్ధారించే ఎన్నిక. అటు కేంద్రంలో పాలనతోనూ, ఇటు రాష్ట్రంలో అధికారంపైనా దృష్టిసారించిన బిజెపి భవిష్యత్తును ఖరారుచేసే ప్రజాభిప్రాయ వేదిక. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికను ఈ మూడు ప్రధాన పార్టీలు ఒక సవాలుగా తీసుకున్నాయి. అందువల్లే గతంలో హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ఓట్ల సమరాంగణంలో కోట్ల రూపాయిలను ఖర్చు చేసే పరిస్ధితి స్పష్టంగా కనిపిస్తోంది.ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీచేసేందుకు నవంబర్ 11న ఉప ఎన్నిక జరుగనుంది. 4 లక్షలకు పైగా ఓటర్లను కలిగిన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 58 మంది పోటీపడుతున్నారు. వీరిలో బిఆర్‌ఎస్ తరపున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బిజెపి పక్షాన లంకల దీపక్‌రెడ్డి ప్రధాన అభ్యర్థులు కాగా, వీరి మధ్యే పోటీ స్పష్టంగా కనిపిస్తోంది.

మిగిలిన 55 మందికి కనీసం డిపాజిట్ దక్కే అవకాశాలు లేవనే చెప్పాలి. ఈ ముగ్గురిలో సునీత, దీపక్ రెడ్డి ఒసిలు కాగా, నవీన్ యాదవ్ బిసి కులానికి చెందినవారు. హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం (నెంబర్ 61) సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి. ఈ నియోజవర్గంలో ఆరు డివిజన్లు, సుమారు 146 కాలనీలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే అత్యంత సంపన్నమైనదన్న ప్రచారానికి భిన్నంగా ఇక్కడ దినసరి కూలీలు, సినీ కార్మికులు, పేద మధ్య తరగతి ప్రజలే అత్యధికులు.నియోజకవర్గంలో ముస్లింలు బిసి కులాల తర్వాత ఒసి. ఎస్‌సి కులస్ధుల సంఖ్యే ఎక్కువ. 2009లో ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున పి. విష్ణువర్ధన్‌రెడ్డి ఎన్నిక కాగా, మాగంటి గోపీనాథ్ 2014 లో టిడిపి తరపున, 2018, 2023లో టిఆర్‌ఎస్ తరపున పాతినిధ్యం వహించారు. 2023 ఎన్నికల్లో గోపీనాథ్ 80,549 (43.95%) ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ 64,212 (35.03%) బిజెపి అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి 25,866 (14.12%) ఓట్లు, ఎంఐఎం అభ్యర్ధి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 (4.28%) ఓట్లు పొందారు. గోపీనాథ్ 16,337(8.91%)ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై విజయం సాధించగా, పోటీలో ఉన్న 19 మందిలో 16 మంది డిపాజిట్లు కోల్పోయారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 55 శాతం కంటే తక్కువగానే ఓట్లు పోల్ అవుతున్నాయి. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే వారిలో పేద మధ్య తరగతి వారే ఎక్కువ. అయితే ఈసారి ఉప ఎన్నికల అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినందున ఈసారి 4 లక్షల ఓట్లలో 75 శాతం వరకు ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఎవరు లక్షన్నర ఓట్లు సాధిస్తారో వారిని విజయం వరించే అవకాశాలున్నాయి.

ఇక అభ్యర్ధుల విషయానికి వస్తే.. బిజెపి అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ఈసారి కూడా అధిష్టానం ఆలోచించి చాలా ఆలస్యంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. బిజెపి తరపున కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందరరావు ముందుండి ప్రచారం సాగిస్తున్నారు. కిరాయికి జెండా పట్టుకునే వారు కాకుండా కేవలం కార్యకర్తలే ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా దీపక్ రెడ్డికి జనసేన పార్టీ కూడా మద్దతు తెలపడంతో త్రిముఖ పోటీలో ఒకరిగా ఈయన గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై అభిమానం ఉన్నప్పటికీ అసెంబ్లీ స్థాయిలో అంతగా ఆదరించకపోవచ్చునని పలువురి మాటలను బట్టి తెలుస్తోంది. అయితే గతంలో కంటే ఈసారి దీపక్‌రెడ్డి గణనీయంగా ఓట్లను సాధించగలరని అంచనా. వాస్తవానికి ఇక్కడ హిందూ ముస్లిం అనే పోటీ లేకుండా ఎంఐఎం ఏకంగా తమ అభ్యర్థిని నిలపకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో బిజెపి తన ట్రంప్ కార్డును వినియోగించే అవకాశం లేకుండాపోయింది. అయినప్పటికీ అజారుద్దీన్‌కు మంత్రి పదవిని ఇవ్వడం సరికాదంటూ కాంగ్రెస్‌ను, గత పదేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందంటూ బిఆర్‌ఎస్‌పైనా నిప్పులు కురిపించింది.

ఇవన్నీ ఆశించిన స్థాయిలో బిజెపికి ఈ ఎన్నికల్లో అనుకూలంగా మారే అవకాశాలు లేకపోయినా రానున్న కాలంలో మాత్రం తప్పకుండా ప్లస్ పాయింట్లగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ముస్లింలు అత్యధికంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 33% ముస్లిం ఓటర్లు ఉన్నందున బిజెపికి ఇక్కడ గెలుపు అందని ద్రాక్షగా మిగిలే సూచనలే కనిపిస్తున్నాయి. బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఆమెకు కుటుంబపరంగా కూడా ఇటు నామినేషన్ సమయంలోనూ, అటు ప్రచారాలు పరాకాష్టకు చేరుకున్న సమయంలోనూ సవాళ్లు తప్పలేదు. దివంగత గోపీనాథ్ రెండవ భార్య అయిన సునీత విషయంలో బిఆర్‌ఎస్ మొదటినుంచి స్ధిరాభిప్రాయంతోనే ఉంది.ఆమె పేరును బిఆర్‌ఎస్ బాస్ కెసిఆర్ స్వయంగా ప్రకటించి మరీ ఖర్చులకు డబ్బులిచ్చి పంపారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ప్రచారానికి రాకపోవడం ఒక విధంగా లోటే అని చెప్పాలి. కానీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్టార్ క్యాంపెయినర్‌గా మారి ఇటు కాంగ్రెస్, అటు బిజెపికి బదులిస్తూ ముందుకు సాగుతున్నారు. మరో స్టార్ హరీశ్ రావు కూడా ప్రచారం పీక్‌కు తీసుకువెళ్లే సమయంలోనే తండ్రి మృతి కారణంగా దాదాపు 11 రోజుల పాటు ప్రచారానికి దూరమయ్యారు. బిఆర్‌ఎస్ తరపున మిగిలినవారి ప్రచారం పెద్దగా ప్రభావం చూపకపోయినా మంచివ్యక్తిగా గోపీనాథ్ కుటుంబంపై సానుభూతి, గతంలో కెసిఆర్ అమలు చేసిన పెన్షన్లు ఇప్పటికీ చాలా మంది మదిలో ఉండిపోయాయి. అంతేగాక గోపీనాథ్ పెద్దకర్మ నుంచి దాదాపు ఈ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ చాపకిందనీరులా తమ ప్రచారానికి తెరతీసింది.

ఈసారి బిసిల ప్రతినిధిగా పోటీలోఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు.. ఈసారి అత్యధిక శాతం ముస్లింల, బిసిల మద్దతుతోపాటు యువత క్రేజీగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు దాదాపు మంత్రి వర్గం, పిసిసి కార్యవర్గం కాళ్లకు బలపంకట్టుకొని తిరుగుతున్నందున సహజంగానే కాంగ్రెస్ వైపు కొంత ఆర్భాటం కనిపిస్తోంది. మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్లతో పాటు 70 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించారు. ఆరు డివిజన్లకు మంత్రులను కేటాయించగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. ఈ నియోజక వర్గానికి 4వేల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, అంతకుముందే సుమారు 400 కోట్ల రూపాయిలతో అభివృద్ధి పనులు, 14 వేల కొత్త రేషన్ కార్డుల ఇలా కొన్ని జనాకర్షక పథకాలను ప్రజల్లోకి జొప్పించారు. వామపక్షాల మద్దతు, కోదండరాం వంటి ప్రముఖుల సహకారం, సినీ కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నాలు, హీరో సుమన్ ఇంటింటి ప్రచారం, దివంగత పిజెఆర్ తనయ, కార్పొరేటర్ విజయారెడ్డి ప్రచారాలు, మాలమహానాడు, 132 బిసి కులాల మద్దతు ఇవన్నీ నవీన్ యాదవ్‌కు కలిసొచ్చే అంశాలే. నవీన్‌యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తదితరులను రౌడీలుగా పేర్కొంటూ బిఆర్‌ఎస్ చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

గతంలో జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిని పెంచాయి. దీంతో వివిధ సంస్ధలు పోటీపడి సర్వేలు ప్రారంభించాయి. ఈ నియోజకవర్గంలో ఒక్కో ఓటరుకు రోజుకు కనీసం 10కిపైగా సర్వే కోసం ఫోన్లు వస్తూ ఎవరికి ఓటు వేస్తారంటూ వేధించాయి. ఈ నియోజకవర్గంలో పరిస్థితిని గమనిస్తే వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజూ కనిపించే అడ్డాకూలీలకు అడ్డగోలు డిమాండ్ ఏర్పడింది. ఒక్కొక్కరికి 600 రూపాయిల నుంచి 800 వరకూ ఇస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తూ జెండాలు మోసేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ భారీ ఖర్చుకు తెరతీశాయి. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పలు ప్రాంతాల్లో హైడ్రా బూచిని చూపిస్తూ కాంగ్రెస్‌ను అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కెసిఆర్ హయాంలోనే పెన్షన్లు వచ్చాయన్న కృతజ్ఞత కొంతమేర పెన్షనర్లలో ఉన్నా కాంగ్రెస్ మాత్రం కొత్త రేషన్ కార్డులు, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తోంది. కాగా ఎవరెంత ప్రచారం చేసినా ఆఖరి మూడు రోజుల్లో పోల్ మేనేజిమెంట్ కీలకం కానుంది. ఈ ప్రయత్నంలో సఫలమైన వారికి ఆధిక్యత లభించనుంది. ప్రస్తుత పరిస్ధితులను గమనిస్తే కనీసం 5 వేల మెజార్టీతోనైనా కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న ఊహాగానాలే వినిపిస్తున్నాయి. అయినా ఈ ఎన్నికల్లో గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా ప్రకటనలు ఇవ్వడానికి మూడు పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి.

–  దిమిలి అచ్యుతరావు

(సీనియర్ జర్నలిస్ట్)