Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Restbet

Restbet giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Restbet

Restbet giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom

bahislion

Marsbahis

1xbet

vbet

olabahis

betmoon

betmoon

holiganbet giriş

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

sekabet

sekabet

vdcasino giriş

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

matbet

bets10

pusulabet

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

meritking

1xbet

padişahbet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

milanobet

gallerbahis

galabet

betkolik

betticket

süratbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

betasus

bahiscasino

casinoroyal

sekabet

jojobet

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

betlike

vdcasino

ultrabet

tlcasino

galabet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

casinoas

berlinbet

dinamobet

artemisbet

casinolevant

enbet

madridbet

vdcasino

sonbahis

casibom

betturkey

atlasbet

grandpashabet

అగ్రనేతల్లో ఐక్యతారాగం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో ఓ వ్యూహాత్మక మార్పు కు ప్రతిబింబంగా నిలిచింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కన్పించని ఓ పాజిటివ్ మార్పుకు ఈ ఎన్నిక వేదిక అయింది. జాతీయ పార్టీ కావడంతో సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఐక్యత అంతగా ఉండదు. ఎవరికివారే గొప్ప లీడర్లుగా చెలామణి అయ్యారు. నాయకత్వానికి కిందిస్థాయి నుంచి ఏకరీతిలో ఎప్పుడూ సహకారం అందదు. గతంలో ఒక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే నాయకత్వానికి అన్ని వర్గాల నుంచి బాసట లభించింది. అంతకు ముందు ఏ నేత కూడా పట్టుమని పది ఇరవై నెలలకు మించి ముఖ్య పదవిలో ఉండలేకపోయేవారు. ఈ సంస్కృతికి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెక్‌పెట్టారు. తనదైన శైలిలో రాజకీయాలు నడిపి.. ఇటు ప్రజల మద్దతు.. అటు అధిష్టానం మద్దతు.. మధ్యలో స్థానిక అగ్రనేతల మద్దతు కూడగట్టి ఆయన లీడర్‌గా వెలుగు వెలిగారు. ఆ తర్వాత.. ఇన్ని రోజులకు మళ్లీ కాంగ్రెస్‌లో ఓ ఐక్యతా స్ఫూర్తి కన్పించింది. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అంత ప్రాధాన్యమైనది ఏమీ కాదు.కానీ సిఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన రెండేళ్ల పాలనను పరీక్షించుకున్నారు. బిఆర్‌ఎస్ దూకుడుకు కల్లెం వేయాలని భావించారు.

అందుకు ఆయనకు పార్టీ నేతలంతా పూర్తిగా సహకరించడం ఇక్కడ కీలక అంశంగా చెప్పొచ్చు. రేవంత్ కంటే సీనియర్లు అయిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంటి అగ్రనేతలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌లోని ఇగో సంస్కృతికి ఇది విరుద్ధం. అదృష్టం కలిసొస్తే మేమే ముఖ్యమంత్రి అయ్యే వాళ్లం అనుకునే నేతలు భట్టి, ఉత్తమ్. కానీ వారు తమ ఇగోలను.. సీనియర్ అనే భేషజాలను పక్కనపెట్టారు. ‘జూబ్లీహిల్స్‌లో గెలిస్తే రేవంత్‌కు క్రెడిట్ దక్కుతుంది.. మాకేం వస్తుంది’ అనుకోకుండా భట్టి, ఉత్తమ్, పొన్నం, పొంగులేటి, తుమ్మల, సీతక్క వంటి అగ్రనేతలు, పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్‌లో అన్ని డివిజన్లలో కలియతిరిగి నవీన్ యాదవ్ గెలుపుకోసం విస్తృత కృషి చేశారు. ఇది కాంగ్రెస్ గత సంస్కృతికి విరుద్ధమే. గతంలో ఎన్నడూ ఇలా కాంగ్రెస్ అగ్రనేతలు ఏకం కాలేదు. ఇది తెలంగాణ కాంగ్రెస్‌లో గొప్ప పరిణామమే అని చెప్పొచ్చు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అయినా.. ఆ క్రెడిట్‌ను అడ్డం పెట్టుకుని ప్రజల మనసులు గెలవలేకపోయారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించలేకపోయారు.

ఈ క్రమంలో అప్పట్లో టిపిసిసి నేతగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చాలా అపవాదులు మూటగట్టుకున్నారు. ఆయన నాయకత్వంపై అంతటా అసంతృప్తి వ్యక్తమైంది.ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ గెలవడం అసాధ్యమని తేల్చారు. అందుకు తగ్గట్టు పాపం ఆయన టిపిసిసి పదవిని త్యాగం చేశారు కూడా. అనంతర పరిణామాలతో కాంగ్రెస్‌లో పూర్తి స్తబ్ధత నెలకొంది. వ్యూహాలను మార్చినా రెండోసారీ కెసిఆర్ సిఎం కావడంతో ఇక మూడో సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం మార్చింది. తన వాగ్ధాటి, ఆర్థిక, అంగబలం, ప్రజాకర్షక శక్తితో అకస్మాత్తుగా తెరపైకివచ్చి.. కెసిఆర్ ను తీవ్రంగా విమర్శించి టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారిన ఎనుముల రేవంత్‌రెడ్డిని టిపిసిసి అధ్యక్షుడిగా ప్రకటించడంతో కాంగ్రెస్‌లో మళ్లీ కదలిక వచ్చింది. కెసిఆర్‌ను ఎదుర్కొనేశక్తి రేవంత్‌రెడ్డికి ఉందని భావించడంతో ఆయనకు అప్పటి వరకు సీనియర్లుగా ఉన్న నేతలు సైతం మద్దతు తెల్పక తప్పలేదు.

ముఖ్యంగా అధిష్టానం నిర్ణయం కాబట్టి అందరూ ఆమోదించారు. ఈక్రమంలో రేవంత్‌రెడ్డి అనూహ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం.. సీఎం పీఠం అధిష్టించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో సీనియర్లు అందరికీ మంచి పదవులే దక్కాయి. కెసిఆర్ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలంతా.. రేవంత్ సిఎం అయ్యాక మంచి పదవులు మూటగట్టుకుని మళ్లీ రాజకీయంగా ప్రజా జీవితం చవిచూశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు అనుభవించారు. మనలో మనం పోట్లాడుకుంటే ఈ పదవులుకూడా దక్కేవి కావేమో అనుకుంటూ ఓ రాజకీయ మార్పుకు నాంది పలికారు. అందరూ ఏకమై.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోప్రత్యర్థి గెలుపును శాసించారు. ఈ క్రెడిట్ ఏ ఒక్కరిదీ కాదు.. అందరి సమష్టి శ్రమ అని చాటి చెప్పారు. ఇదే మార్పు మరో రెండున్న ఏళ్ల వరకూ కొనసాగితే.. 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

-ఎన్. మల్లేష్‌బాబు

– 70133 59750

తిరుగు‘బాట’ వేసిన గిరిజనం

అడవులు, పర్వత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న గిరిజన సమూహాలు భారత ఉపఖండ నాగరికతలో అత్యంత పురాతన దశలను ప్రతిబింబిస్తాయి. వీరు భూమి, నీరు, అటవీ వనరుల అసలైన సంరక్షకులు. ప్రకృతి ఆధారిత ప్రత్యేక సామాజిక వ్యవస్థలు, పర్యావరణ పరిజ్ఞానం, ఆధ్యాత్మిక జీవన విధానాలను వీరు రూపొందించారు. శతాబ్దాల తరబడి తక్కువగా చూడబడినప్పటికీ వీరు తమ ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకొని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారు. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో వీరి కృషిని చరిత్రకారులు సముచిత రీతిలో ప్రస్తావించలేదు. నిజానికి బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా, భూస్వామ్య దోపిడీకి ఎదురు నిలిచిన మొదటి తిరుగుబాట్లను వీరే ప్రారంభించారు. ఈ గిరిజన పోరాటాలు భారతదేశంలో జాతీయ చైతన్యానికి పునాది వేశాయి.

గిరిజన సాంస్కృతిక వారసత్వం: గిరిజన సంస్కృతి కేవలం గతానికి చెందినదే కాదు; అది నేటికీ జీవిస్తున్న, ప్రకృతి సమన్వయంతో కూడిన, సామూహిక ఐక్యతను ప్రతిబింబించే జీవన విధానం. గిరిజన సమాజాలు సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు, అటవీ వనరుల వినియోగంలో శతాబ్దాల అనుభవాన్ని గడించాయి. పోడు సాగు, పవిత్ర అరణ్యాలు, టోటెమిక్ ఆరాధన వంటి ఆచారాలు వారి పర్యావరణ నైతికతను సూచిస్తాయి. ఆదివాసులు వర్లీ (మహారాష్ట్ర), సవర (ఒడిశా), గోండు (మధ్యప్రదేశ్), కోయ (తెలంగాణ) చిత్రకళలతో ప్రసిద్ధి చెందారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఓజాల లోహకళ, ఖమ్మం జిల్లాలోని నాయకపోడ్ల దారు పనులు (మాస్కులు), మైదాన ప్రాంత లంబాడీల వస్త్ర కళ (ఎంబ్రాయిడరీ) -ఇవన్నీ దైనిక, దైవిక ప్రయోజనాలతో పాటు వారి కళాత్మకతకు నిదర్శనాలు. ప్రతి గిరిజన పండుగ జీవనోత్సవం. ఢోల్, తుడుం, ఔజం, తప్పెటగూళ్ళు (డప్పులు) వంటి వాద్యాలతో చేసే గుస్సాడి, డెమ్సా, కొమ్ముకోయ (తెలంగాణ- ఆంధ్ర), కర్మ (చత్తీస్‌గఢ్), గోటిపువా (ఒడిశా) వంటి వారి నృత్యాలు వారి సామూహిక ఐక్యతను, ప్రకృతిపట్ల గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. సంతాళ్ల మంజీ-పర్గణ వ్యవస్థ, గోండుల దొర్ల గుట్ట పంచాయితీ, భిల్లుల గమేటి సభ వంటి సంస్థలు వలస పాలనకు ముందే మనుగడలో ఉన్న ప్రజాస్వామ్య పరిపాలనా వ్యవస్థలకు నిదర్శనాలు.

గిరిజన తిరుగుబాట్లు: జాతీయ స్వాతంత్య్ర ఉద్యమం పుట్టకముందే గిరిజన సమాజాలు వలస పాలన, దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేపట్టాయి. చువార్, భూమిజ తిరుగుబాట్లు (1760- 1830, బెంగాల్): జంగల్ మహల్ ప్రాంత గిరిజనులు అధిక పన్నులు, అరణ్య భూములపై బ్రిటిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా ఉద్యమించారు. కోల్ తిరుగుబాటు (183132, ఛోటానాగ్‌పూర్): కోల్ గిరిజనులు వడ్డీ వ్యాపారులు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సంతాల్ హుల్ (1855- 56): సిద్ధూ, కన్హు ముర్ము నాయకత్వంలో సంతాళ్లు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవాన్ని ప్రారంభించారు. ఇది 1857 తిరుగుబాటుకు ముందున్న అతి పెద్ద ఆదివాసీ ఉద్యమం.

బిర్సా ముండా ఉద్యమం (1899 -1900): బిర్సా ముండా ఛోటా నాగ్‌పూర్ ప్రాంతానికి చెందిన యువ ఆదివాసీ నాయకుడు. బ్రిటిష్ పాలన, క్రైస్తవ మిషనరీ జోక్యానికి వ్యతిరేకంగా ఉల్గులాన్ (మహా తుఫాను)ను నడిపించాడు. ఆయన అబువా దిశుమ్, అబువా రాజ్ (మన భూమి, మన రాజ్యం) అనే నినాదం ద్వారా స్వాతంత్య్రం, సమానత్వం, స్వదేశ విశ్వాస సంరక్షణకై పోరాడాడు. భిల్ తిరుగుబాట్లు (1818-1858): పశ్చిమ భారతదేశంలోని భిల్లులు తమ అరణ్య హక్కుల రక్షణకై, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. రంపా తిరుగుబాట్లు (1879, 1922- 24, ఆంధ్రప్రదేశ్): తమన్ దొర, అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో కోయ, ఇతర తెగలు బ్రిటిష్ అటవీ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. రాజు గాంధేయ సిద్ధాంతాలను గెరిల్లా యుద్ధ పద్ధతులతో కలిపి పోరాటం చేశారు.

గోండు తిరుగుబాట్లు (జోడేఘాట్, ఆసిఫాబాద్, 1940): కుమ్రం భీమ్ నిజాం అధికారుల దోపిడీకి వ్యతిరేకంగా జల్, జంగల్, జమీన్, ‘మావె నాటే మావె రాజ్‘ (మా ప్రాంతంలో మా రాజ్యం) అనే నినాదాలతో అసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ లో పోరాడాడు. ఆయన త్యాగం తెలంగాణ గిరిజన గౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఖాసీ, గారో తిరుగుబాట్లు (ఈశాన్య భారతం): టిరోట్ సింగ్, పా టోగన్ నెంగ్‌మింజా సంగ్మా వంటి నాయకులు మేఘాలయ -అస్సాం పర్వత ప్రాంతాల్లో బ్రిటిష్ విస్తరణను ప్రతిఘటించారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో గిరిజనుల పాత్ర (1857- 1947): 1857 తర్వాత భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గిరిజనులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు. భిల్, గోండు దళాలు 1857 తిరుగుబాటులో పాల్గొన్నాయి. 1857 నాటి సిపాయి తిరుగుబాటు పిలుపునందుకొని నిర్మల్‌లో రాంజీ గోండ్ 500 ల మంది గిరిజనులు, రోహిల్లా సైనికులను వెంటేసుకుని ఆనాటి నిజాం, బ్రిటీష్ సైన్యాలకు వ్యతిరేకంగా నిర్మల్ ఘాట్ లో పోరాడి అసువులు బాసాడు. సహాయ నిరాకరణ, భారత్ విడిచి పో (క్విట్ ఇండియా) ఉద్యమాలలో గిరిజన కార్యకర్తలు ప్రజలను సంఘటితం చేశారు. హైదరాబాద్, మధ్య ప్రదేశ్ ప్రాంతాలలో లంబాడీలు, కోయలు భూస్వామ్య, వలస వ్యతిరేక పోరాటాలకు మద్దతు ఇచ్చారు. స్వాతంత్య్రం అనంతరం జైపాల్ సింగ్ ముండా వంటి గిరిజన నాయకులు రాజ్యాంగ సభలో గిరిజన హక్కులు, స్వపాలన, భూస్వామ్య రక్షణ అంశాలను ప్రవేశపెట్టారు.

ఆధునిక భారతదేశానికి గిరిజనుల చేర్పులు: గిరిజన సంప్రదాయాలు భారతదేశపు బహుళ సంస్కృతికి అందాన్ని అద్దాయి. గిరిజన జానపద కళలు, సంగీతం, జానపద గాథలు, పర్యావరణ పరిజ్ఞానం వంటి రంగాల్లో వీరి పాత్ర అపారమైనది. భారత రాజ్యాంగంలోని ఐదవ, ఆరవ షెడ్యూల్స్ గిరిజన స్వపరిపాలన, సాంస్కృతిక హక్కులను కాపాడుతున్నాయి. భూమిని తల్లిగా, అడవిని పవిత్రంగా భావించే గిరిజన దృక్పథం సుస్థిర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుంది. భారత గిరిజన సమాజ చరిత్ర అంటే వారి పోరాటాలు, ఆత్మగౌరవ ప్రకటనల చరిత్ర. జార్ఖండ్ అడవుల నుండి తెలంగాణ కొండల వరకు, ఈశాన్య పర్వతాల వరకు, ఆదివాసులు తమ భూమి కోసం, తమ ఆత్మ గౌరవ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడారు. వీరి తిరుగుబాట్లు కేవలం ప్రాంతీయ ఉద్రిక్తతలు కావు అవి స్వాతంత్య్రం, న్యాయం, ఆత్మగౌరవం కోసం చేసిన తొలి జ్వాలలు. బిర్సా ముండా జయంతి సందర్భంగా జరుపుకునే జనజాతీయ గౌరవ దివస్ (నవంబర్ 15) గిరిజన వీరుల త్యాగం, ధైర్యం, స్వాభిమానం పట్ల జాతీయ నివాళి. భారత స్వాతంత్య్రం సంపూర్ణత.. గిరిజన సమాజాల గౌరవం, స్వాతంత్య్రంతోనే సాధ్యమవుతుంది.

– డా. ద్యావనపల్లి సత్యనారాయణ

– 94909 57078 

ప్రాణదాతలే యమకింకరులైతే..

వైద్యో నారాయణో హరి అన్న సూక్తి ప్రకారం రోగుల ప్రాణాలను కాపాడవలసిన వైద్యులే మారణకాండకు పాల్పడే ఉగ్రవాద భూతానికి ఆయుష్షు పోయడం విపరీతం. ఢిల్లీ ఎర్రకోట సమీపాన ఉగ్రవాద ఆత్మాహుతి బాంబు దాడి వెనుక కొంతమంది డాక్టర్ల పాత్ర ఉండడం దేశచరిత్రలో అత్యంత సంచలనాత్మక సంఘటన. ఇది పూర్తిగా ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కుట్రయే. దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో దాడులు సాగించడానికి ఫక్కా ప్రణాళిక సిద్ధమైంది. దీనికోసం ఎనిమిది మంది ఆత్మాహుతి బాంబర్లను సిద్ధం చేసినట్టు బయటపడింది. ఈ కుట్ర ప్రణాళికలో డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ కీలక పాత్ర పోషించినట్టు వారి డైరీల ద్వారా తేలింది. ఫరీదాబాద్‌లో అల్ ఫలా యూనివర్శిటీ లోని మెడికల్ కాలేజీ లోని బాయ్స్ హాస్టల్ గది ఒకటి కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలకు వ్యూహం రూపొందిందని దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఈ కుట్రకు నిందితులు దాదాపు రూ.20 లక్షల వరకు నిధులు సేకరించినట్టు తాజా సమాచారం. ఇంతవరకు కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతుండడం వాటిని భద్రతా దళాలు భగ్నం చేయడం పరిపాటిగా వస్తోంది. కానీ ఇప్పుడు దేశం లోపలే నగరాల్లో ఉగ్రకార్యకలాపాలకు సన్నాహాలు సాగుతుండడం కొత్తమలుపు.

గత రెండు దశాబ్దాలుగా వందలాది ఉగ్రవాద పన్నాగాలను ఛేదించి దేశభద్రతను సంరక్షించడంలో భద్రతా దళాలు ముందంజ వేస్తున్నాయని ఘనతను సాధించుకున్నాయి. అయితే ఢిల్లీ ఎర్రకోట వద్ద ఉగ్రవాద ఆత్మాహుతి బాంబు దాడి గురించి లభించిన సాక్షాధారాల ప్రకారం ఇది తొందరపడి చేసిన చర్యగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ దురాగతానికి పాల్పడే వారిలో ఒకరు ముందుగానే అరెస్ట్ అయ్యారని తెలిసి ఈ వల నుంచి తప్పించుకుని పారిపోడానికి చేసిన ప్రయత్నమే ఆత్మాహుతి బాంబు దాడికి దారితీసిందని తేలింది. అయినప్పటికీ అనుకోలేని ఘోర విపత్తు జరిగిపోయింది. కుట్రదారుడు ఒకరు తప్పించుకుపోయాడంటే భద్రతా సంస్థల నిఘా ఎలా నిద్రపోతోందో స్పష్టంగా చెప్పవచ్చు. జమ్మూకశ్మీర్ ప్రాంతంలోపల, బయట నుంచి చొరబాట్లను రెగ్యులర్‌గా నియంత్రించే ఆపరేషన్లు సాగుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ కాకుండా ఫరీదాబాద్ వంటి నగర ప్రాంతాల్లో ఉగ్ర సంఘటనను నివారించడంలో భద్రతా సంస్థల ఘోరవైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. దేశంలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా వాయువేగంలో భద్రతా సంస్థలు నివారించి దేశ ప్రజల ప్రాణాలకు రక్షణ కలిగిస్తుంటాయి.

అలాంటిది దేశ రాజధానిలో ఆత్మాహుతి బాంబు కదలాడుతుండడం గమనించలేకపోవడం శోచనీయం. కశ్మీర్ లోయలో జరిగే ఉగ్రకార్యకలాపాలకు ఫరీదాబాద్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉందని అనుమానించవలసి వస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఒకె)లోను, పాకిస్థాన్ లోనూ ఆపరేషన్ సిందూర్ ప్రకంపనలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విష సర్పాలకు మరింత ద్వేషాన్ని రెచ్చగొట్టాయి. ప్రతీకార పన్నాగాలతో మూడు టన్నుల ప్రాణాంతక పేలుడు పదార్థాలతో దాడులకు సిద్ధమయ్యాయని భావిస్తున్నారు. వాటిని కానీ పట్టుకొనకపోతే మరీ భారీ విధ్వంసం జరిగి ఉండేది. అంతకు ముందే కశ్మీర్ లోయలో బెదిరిస్తూ పోస్టర్లు వెలిశాయి. కానీ భద్రతా దళాలు అంతగా పట్టించుకోలేకపోవడంతో ఫరీదాబాద్ ఉగ్రవాద పన్నాగం కొంతవరకు నెరవేరిందని చెప్పవచ్చు. దీనిని బట్టి నిఘా అన్నది అణువణువూ గాలించే నిరంతర చర్యగా ఉండాలన్నది తెలియజెప్తోంది. ఇవన్నిటి కన్నా కంపరం కలిగించేది ఈ భారీ కుట్రలో మెడికల్ ప్రొఫెషనర్లే కీలక పాత్ర వహించడం. వైద్య ధర్మ ప్రమాణ స్వీకారం చేసిన ఈ వైద్య గ్రాడ్యుయేట్లు ఉగ్రకుట్రలో భాగస్వాములు కావడం, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింప చేసి ఇతరులను మార్చడానికి నిరంతరం పనిచేయడం అనూహ్య పరిణామాలు. కనీసం ఐదుగురు డాక్టర్లు ఇందులో ప్రధాన బాధ్యత వహించారు. వీరిలో నలుగురు కశ్మీర్‌లో పుట్టి పెరిగిన వారే. ఇది పెద్ద సమస్యకు సంకేతం. విద్యావంతులైన వారు రహస్యంగా దేశ విద్రోహ చర్యలకు పూనుకుని వాటి కమ్యూనికేషన్‌కు సంబంధించిన అత్యంత ఆధునిక పరికరాలను సమకూర్చుకుని, వివిధ రకాల బాంబులను ఏయే రసాయనాలతో తయారు చేయవచ్చునో ఆన్‌లైన్ ద్వారా తెలుసుకుని, రిమోట్ కంట్రోలు ద్వారా వాటిని పేల్చడంలో తర్ఫీదు పొందడం, ఆయా కార్యకలాపాల్లో చేరడం ఇవన్నీ భద్రతా వ్యవస్థలకు పెద్ద సమస్య కావడమే కాక, అమాయక ప్రజల ప్రాణాలకు గండంగా తయారైంది.

ఈ విధమైన వైట్‌కాలర్ టెర్రరిజం అనాగరిక చర్యల్లో కూడా విద్యావంతులు చురుకుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలకు రావడం భద్రతా సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో భౌగోళిక రాజకీయాల్లో మార్పు వచ్చింది. ఉగ్రవాద బెదిరింపులు ఇంతటితో సమసిపోవు. కశ్మీర్ లోయకు అతీతంగా తమ వేయితలలు అటూఇటూ చూస్తుంటాయి. ఉగ్రవాదులను లక్షంగా చేసుకుని దాడులు సాగించడంతో భద్రతా దళాల బాధ్యత తీరిపోదు. ఆయా ప్రాంతాల వారి మనుషులతో, వారి జీవన పరిస్థితులతో, వనరులతో మమేకమై జాతీయ స్థాయిలో ప్రయత్నాల సమన్వయంతో నిఘా సమాచారాన్ని సేకరించగలిగే సామర్థం పెంపొందించుకోవాలి. దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్రలు రూపొందుతున్నా తక్షణం భగ్నం చేసేలా వ్యవస్థలను తీర్చిదిద్దాలి. దీనికి సమయం అనుకూలించకపోవచ్చు. కానీ రాజకీయ కోణంలో భద్రతా విషయంలో పూర్తి నియంత్రణ కొనసాగిస్తూ జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి కట్టబెట్టడం సముచితం కావచ్చు. 

గాజాపై అమెరికా కొత్త ఎత్తుగడ

పాలస్తీనాను ఇప్పటికే 150 దేశాల వరకు గుర్తించాయి. అటువంటి పరిస్థితులలో ఆ సమస్య పరిష్కారం కావాలనే ఆలోచన ట్రంప్‌కు నిజంగా ఉన్నట్లుయితే చేయవలసింది గాజా నుంచి, వెస్ట్‌బ్యాంక్ నుంచి ఇజ్రాయెల్ తన సేనలను, ఇతర ఆక్రమణలను, వేలాదిమంది అక్రమ సెటిలర్లను వెంటనే నిష్క్రమించేట్లు చేయటం. తర్వాత, ఇజ్రాయెల్ గుర్తించినా లేకున్నా తాము పాలస్తీనాను గుర్తించటం. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో అవసరమైన చర్యలు తీసుకోవటం. ఇది జరిగితే సమస్య ఆ గంటలోనే పరిష్కారమవుతుంది. పాలస్తీనా ప్రజలతో పాటు ప్రపంచం కోరుతున్నది అదే. గాజా, వెస్ట్‌బ్యాంక్ పునర్నిర్మాణాలు, అభివృద్ధి క్రమంగా జరుగుతాయి. అందుకు సహాయ పడేందుకు అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయి. 

గాజాపై 75 సంవత్సరాల ఇజ్రాయెల్ ఆక్రమణ ‘సంతృప్తికరంగా’ సాగటం లేదని, సమస్యలు ఎదురవుతున్నాయని భావించి కావచ్చు ఇపుడు తానే నేరుగా రంగప్రవేశం చేయాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇజ్రాయెల్ ఆక్రమణను స్థానిక పాలస్తీనా ప్రజలు తీవ్రంగా, సాయుధంగా, మునుపెన్నడూ లేని స్థాయిలో ప్రతిఘటిస్తుండగా, అమెరికా తోడ్పాటుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమాన్ని ప్రపంచం అంతే తీవ్రంగా ఖండిస్తున్నది. అమెరికా మిత్ర దేశాలు సైతం అందుకు గొంతు కలుపుతూ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించటం మొదలుపెట్టాయి. మరొక వైపు ఐక్యరాజ్యపమితి, భద్రతా సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ నేర న్యాయస్థానం, మానవహక్కుల సంస్థలు ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరిని స్పష్టంగా తీసుకుంటున్నాయి. వీటన్నింటి ఫలితంగా ఇజ్రాయెల్ దాదాపు ఏ కాకిగా మారింది. ఇజ్రాయెల్ ఆక్రమణ ‘సంతృప్తికరంగా’ లేదని అమెరికా భావించటానికి ఇవన్నీ కారణాలు.

ఇటువంటి పరిస్థితుల వల్లనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలి వారాలలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పట్ల కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఖతార్‌పై దాడికి ఆగ్రహించిన ట్రంప్, అందుకు నెతన్యాహూ చేత ఖతార్ ప్రధానికి క్షమాపణలు చెప్పించటాన్ని ఇందుకు ఒక ఉదాహరణగా చెప్తున్నారు. అయితే, నెతన్యాహూ చర్యల మూలంగా ఆ ప్రాంతంలో తమ ప్రయోజనాలను అమెరికా కోల్పోబోదు. నెతన్యాహూ తాత్కాలికం. తమ ప్రయోజనాల దీర్ఘకాలికం. ఆ ప్రయోజనాల కోసమే పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్‌ను సృష్టించాయి. అందు కోసమే ఇతరత్రా ఎన్ని సమస్యలు ఎదురైనా ఇజ్రాయెల్‌ను కాపాడుతూ వస్తున్నాయి. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు ఆటంకాలు సృష్టిస్తూ వస్తున్నది కూడా అందుకోసమే. కనుక, ఇజ్రాయెల్ అనే ఒక సాధనం వల్ల సమస్యలు మొదలైనపుడు కొత్త సాధనాలను తయారు చేసుకోవాలి. ట్రంప్ అదే చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

ఆ మేరకు ఆయన ఒక ప్రతిపాదన తయారు చేసి భద్రతా సమితి సభ్యదేశాలు కొన్నింటికి మాత్రం పంపారు. ఆ పత్రం ఇపుడు వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం, గాజా నియంత్రణ, పరిపాలన కోసం ఒక అంతర్జాతీయ సైనిక దళం ఏర్పడి, అది ట్రంప్ అధ్యక్షతన ఏర్పడే ‘బోర్డ్ ఆఫ్ పీస్’ నిర్దేశాల ప్రకారం పని చేస్తుంది. ఆ దళం ఏమిటి, బోర్డు ఏమిటనే వివరాలలోకి వెళ్లేముందు కొన్ని విషయాలు చెప్పుకోవాలి. పాలస్తీనా ప్రజలు, ప్రపంచ దేశాలు కోరుతున్నది గాజా, వెస్ట బ్యాంక్‌లతో కూడిన స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు. దానితో పాటు ఇజ్రాయెల్ మరొక దేశం కావటం. అక్కడ పోరాటాలు 75 సంవత్సరాలుగా అందుకోసమే సాగుతున్నాయి. అందుకు ఏకైక ఆటంకం ఇజ్రాయెల్, అమెరికాలు. పాలస్తీనాను ఇప్పటికే 150 దేశాల వరకు గుర్తించాయి. అటువంటి పరిస్థితులలో ఆ సమస్య పరిష్కారం కావాలనే ఆలోచన ట్రంప్‌కు నిజంగా ఉన్నట్లుయితే చేయవలసింది గాజా నుంచి, వెస్ట్‌బ్యాంక్ నుంచి ఇజ్రాయెల్ తన సేనలను, ఇతర ఆక్రమణలను, వేలాదిమంది అక్రమ సెటిలర్లను వెంటనే నిష్క్రమించేట్లు చేయటం. తర్వాత, ఇజ్రాయెల్ గుర్తించినా లేకున్నా తాము పాలస్తీనాను గుర్తించటం. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో అవసరమైన చర్యలు తీసుకోవటం. ఇది జరిగితే సమస్య ఆ గంటలోనే పరిష్కారమవుతుంది. పాలస్తీనా ప్రజలతో పాటు ప్రపంచం కోరుతున్నది అదే. గాజా, వెస్ట్‌బ్యాంక్ పునర్నిర్మాణాలు, అభివృద్ధి క్రమంగా జరుగుతాయి. అందుకు సహాయ పడేందుకు అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయి.

కాని అమెరికా అధ్యక్షుడు ఈ సూటి మార్గాన్ని అనుసరించే బదులు నిజాయితీలేని సరికొత్త ఎత్తుగడలు అనేకం వేస్తున్నారు. ట్రంప్ కన్నా ముందు కాలపు అధ్యక్షులు స్థూలంగా అనుసరించినవే అవన్నీ. ట్రంప్ విషయానికి వచ్చే సరికి, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినందున ఒక కొత్త పథకం గురించి మాట్లాడటం తెలిసిందే. అది, గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా ఖాళీ చేయించి అక్కడ రిసార్ట్ ఒకటి అభివృద్ధి పరచటం. దానిపై తీవ్ర విమర్శలు రావటంతో కొంత ఊగిసలాడి, మాటలు మార్చి అవే లక్షాల కోసం ఇపుడు ఒక కొత్త నమూనాను ప్రతిపాదించారు. దాని ప్రకారం, ఇజ్రాయెల్ దశల వారీగా ఉపసంహరించుకోగా హమాస్ వెంటనే అస్త్ర సన్యాసం చేస్తుంది. రాజకీయాలలో, పాలనలో ఎంత మాత్రం పాల్గొనదు. దాని ఆయుధ కర్మాగారాలను, టన్నెళ్లను పూర్తిగా ధ్వంసం చేస్తారు. అమెరికా ఎంపిక చేసే అంతర్జాతీయ వ్యక్తులతోపాటు రాజకీయాలతో సంబంధం లేని పాలస్తీనియన్లతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. అంతర్జాతీయ దళాలతో తాత్కాలిక సైనిక దళం ఏర్పడుతుంది. గాజాలో ఎటువంటి అభివృద్ధి ఎట్లా జరగాలో ట్రంప్ బోర్డు నిర్ణయిస్తుంది. ఆ ఏర్పాటు ఎన్నేళ్లు ఉండాలో వారే నిర్ణయిస్తారు. దీనంతటిలో వెస్ట్ బ్యాంక్ ప్రస్తావన, భవిష్యత్తు ఏమిటో మాత్రం ఏమీ చెప్పరు. అక్కడి పాలస్తీనా అథారిటీ పాత్ర ఉండదు. ఇక చివరిగా, పాలస్తీనా దేశం ప్రస్తావన అత్యంత అస్పష్టంగా మాత్రమే, ఒక కాలవ్యవధి అంటూ ఏమీ లేకుండా ఉంటుంది. మరొక వైపు, ఇజ్రాయెల్ సేనల పూర్తి ఉపసంహరణ మాట కూడా కన్పించదు. మరొక వైపు నెతన్యాహూ, తాము పూర్తిగా ఉపసంహరించుకోబోమని తమ పార్లమెంటులో ఇప్పటికే ప్రకటించారు. అందుకు ట్రంప్ కాదనలేదు.

దీనంతటి సారాంశం ఏమిటో అర్థమవుతున్నదే గనుక మళ్లీ చెప్పనక్కరలేదు. ట్రంప్ వేసిన మొదటి పథకంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దానితో ఆయన రచించిన తాజా పథకమే, పైన పేర్కొన్న భద్రతా సమితి తీర్మాన ప్రతిపాదన. విచిత్రం ఏమంటే, అందులోనూ కొత్తదనం ఏమీ లేదు. ముసుగు మాత్రం కొత్తది. కాకపోతే అటువంటి ప్రతిపాదన తాము ప్రైవేటుగా చేసిన దానికన్న భద్రతా సమితి ద్వారా చేయించగలిగితే శంఖులో పోసి తీర్థంగా మార్చినట్లు అవుతుంది. అదిగాక, వివాదాస్పద భూభాగాలను ఏదో ఒక దేశానికో, కొన్ని దేశాలకో తాత్కాలిక పాలన కోసం ఉండేట్లుగా అప్పగించే సంప్రదాయం ఒకటి ఐక్యరాజ్య సమితిలో ఉంది. కనుక, ఆ నిబంధనను సౌకర్యవంతంగా ఉపయోగించుకున్నట్లుయితే, తమను విమర్శించేందుకు ఏమీ ఉండదన్నది ట్రంప్ ఎత్తుగడ. ఇజ్రాయెల్ ఏర్పాటుకు ముందు కూడా ఆ ప్రాంతంపై ఇంగ్లాండ్‌కు ఇటువంటి బాధ్యతనే సమితి ద్వారా అప్పగించారు. కనుక ట్రంప్ ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆ మాండేట్ ఎంత కాలం సాగేదీ ఎవరూ చెప్పజాలరు. పాలస్తీనా ఏర్పాటు ఏమయేదీ అంతకన్న తెలియదు. మొత్తానికి ఆ విధంగా అమెరికా, ఇజ్రాయెల్ కూటమి నియంత్రణ నిరాటంకంగా నిరవధికంగా సాగుతుందన్న మాట. ఈలోగా హమాస్‌ను ధ్వంసం చేస్తారు. అమెరికా పట్ల ప్రేమ గనుక అరబ్ దేశాలు మొక్కబడిగా తప్ప నోరెత్తవు.

ఇపుడిక అమెరికా అధ్యక్షుని తాజా తీర్మానంలోని వివరాలను చూద్దాం. అమెరికాకు, ఆ బృందంలోని ఇతర దేశాలకు గాజాను 2027 చివరి వరకు పాలిస్తూ, భద్రత కూడా కల్పించే అధికారం లభిస్తుంది. ఆ గడువును పొడిగించే అవకాశమూ ఉంటుంది. మొదటి సైనిక దళాలను జనవరి నాటికి పంపుతారు. ఆ దళాలు శాంతిని కేవలం ‘పరిరక్షించటం’ గాక ‘అమలు’ పరుస్తాయి. అంటే బలప్రయోగంతో వేర్వేరు దేశాల సైనిక బృందాలు ట్రంప్ అధ్యక్షతన గల బోర్డ్‌తో సంప్రదింపుల ద్వారా నియామకమవుతాయి. ఆ దళాలు గాజాకు ఇజ్రాయెల్‌తో, ఈజిప్టుతో గల సరిహద్దులను కాపలా కాయటంతోపాటు పౌరులకు భద్రత కల్పించటం, ఒక కొత్త పాలస్తీనా పోలీసుకు శిక్షణ ఇవ్వటం చేస్తాయి. గాజాను నిస్సైనికంగా మార్చి, హమాస్ వంటి శక్తులను నిరాయుధం చేసి వాటి సైనిక సంపత్తిని టన్నెల్ నిర్మాణాలను ధ్వంసం చేస్తాయి. గాజా ఒప్పందం అమలుకు అవసరమైన ఇతర చర్యలు కూడా తీసుకుంటాయి. మరొక వైపు ఇజ్రాయెలీ సేనలు ‘క్రమక్రమంగా’ ఉపసంహరించుకుంటాయి. వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ ‘సంస్కరణలను’ చేపట్టి తనను తాను కూడా సంస్కరించుకుంటుంది. ఆ పనులు జరిగితే ‘దీర్ఘకాలంలో’ గాజా పాలనను కూడా చేపట్టగలదు. అంతే తప్ప స్వతంత్ర పాలస్తీనా ప్రస్తావన లేదు. ట్రంప్ బోర్డుకు ఆమోదయోగ్యమైన విధంగానే అంతర్జాతీయ దళాల ఏర్పాటు జరుగుతుంది. ఆ విషయంలో ఈజిప్టు, ఇజ్రాయెల్‌లను సంప్రదిస్తారు. గాజా పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను బోర్డు సమీకరిస్తుంది. పునర్నిర్మాణంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో బోర్డు నిర్ణయిస్తుంది. స్థూలంగా ఇవీ అమెరికా ప్రతిపాదిత తీర్మానంలోని అంశాలు. వీటిపై పాలస్తీనియన్ల స్పందన ఏమిటో చూడవలసి ఉంది. అట్లాగే భద్రతా సమితిలో ఎవరైనా వీటో చేయగలరేమో తెలియదు. ఒకవేళ ఆమోదం పొందితే మాత్రం జరగగలది ఏమిటో ఊహించటం కష్టం కాదు. ప్రత్యక్షంగా అమెరికా, పరోక్షంగా ఇజ్రాయెల్ కలిసి గాజాను, వెస్ట్‌బ్యాంక్‌ను దీర్ఘకాలం పాటు నియంత్రిస్తూనే ఉంటాయన్న మాట.  

టంకశాల అశోక్

దాతృత్వంలో మేటి శివనాడార్

మన దేశంలో చాలా మందికి అత్యంత ధనవంతులు ఎంత దానం చేస్తున్నారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక దీనిపైనా పలు సంస్థలు ఎప్పటికప్పుడు డేటా విడుదల చేస్తుంటాయి. ఈ సంవత్సరంలో ఏకంగా రూ. 10,380 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందులో మొత్తం 191 మంది దాతలు ఉన్నారు. వీరిలో 12 మంది కొత్తవారే ఉన్నారు. గత మూడేళ్లలో చూస్తే వీరి విరాళాల మొత్తం 85 శాతం పెరగడం గమనార్హం. టాప్-10 లిస్టులో ఉన్న వారి విరాళాల మొత్తమే రూ. 5,834 కోట్లుగా ఉంది. అత్యంత ధనవంతుల్లో అంబానీ, అదానీ వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ.. దాతృత్వంలో మాత్రం తొలి స్థానం శివనాడర్ దే. మనిషి సంఘజీవి. ఇతరులతో వ్యవహరించే క్రమంలో మనిషి.. ఆయా పరిస్థితుల్లో వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తుంటాడు. వీటిలో కొన్ని అనుకూల ధోరణికి ప్రతిబింబాలయితే, కొన్ని ప్రతికూల స్పందనలు. సుగుణాల విషయానికి వస్తే.. అందులో దయాగుణానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. సాటి మనిషితో దయతో వ్యవహరించాలని మన సంస్కృతి మనకు బోధిస్తుంది. మనం ఒక తల్లి బిడ్డలుగా మసలుకోవాలని, తోటివారి కష్టసుఖాలను ఓ కంటకనిపెట్టి వారిని ఆదుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్కృతుల్లోనూ ఈ భావన కనిపిస్తుంది. అయితే మానవుడి జీవన వేగం పెరగటం, ప్రపంచీకరణ వంటి పలు ప్రభావాలవల్ల మనిషి జీవన వేగం పెరిగింది. ఈ క్రమంలో తోటివారి సంగతి కాసేపు పక్కన పెడితే.. సొంత తోబుట్టువులు, తల్లిదండ్రులనే పట్టించుకోవటం లేదు. ఈ నేపథ్యంలో సొంతలాభం కొంత మాని.. పొరుగువారి గురించి ఆలోచించాలని మనకు గుర్తుచేస్తోంది..

1997లో జపాన్‌లోని టోక్యోలో వరల్డ్ కైండ్‌నెస్ మూవ్‌మెంట్ మొదలైంది. వ్యక్తుల మధ్య మాత్రమే కాదు, జాతుల మధ్య, సమాజాల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య కూడా వెల్లివిరిసి ‘వసుధైక కుటుంబం’ అనే స్వప్నం సాకారం కావాలని జరిగిన తొలిసమావేశంలో నిర్వాహకులు ప్రకటించారు. మనకు అన్నీ ఇచ్చిన సమాజానికి మనవంతుగా ఏమైనా తిరిగివ్వాల్సిన బాధ్యత ప్రతి మనిషి మీదా ఉందనే సంకల్పాన్ని ఆ సమావేశంలో ప్రకటించారు. క్రమంగా ఈ సందేశం ఆస్ట్రేలియా, కెనడా, నైజీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అనేక దేశాలకు చేరింది. దీంతో ఆయా దేశాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. 1998 తర్వాత ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది, 2005లో యుకెలో, 2009 నాటికి సింగపూర్, 2010లో ఫ్రాన్స్, అమెరికా ఇలా 2019 నాటికి, ఈ ఉద్యమం 27 దేశాలకు వ్యాపించింది. 2025 నాటికి మరిన్ని దేశాలు ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన సమాజంలో ఆర్థికపరమైన అంతరాలు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతుండగా, ధనికుల వద్ద మరింత సంపద పోగుపడుతోంది. ఈ అంతరాలను గుర్తించిన ప్రభుత్వాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో సంపన్నుల నుంచి కొంత పన్ను వసూలు చేసి పేదలకు వెచ్చిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎపిలోని కూటమి సర్కారు ఈ ఏడాది ఉగాది నాడు.. పీ4 అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్ షిప్ అనే నాలుగు అంశాలతో కూడిన ఈ కార్యక్రమం కింద జనాభాలోని అత్యంత సంపన్నులైన 10% మంది పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్న 20 శాతం మందికి నేరుగా సాయం చేయనున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో విరాళాలు ఇచ్చే సంపన్న వ్యక్తులను మార్గదర్శకులుగా, పేద లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తారు. ప్రభుత్వం డిజిటల్ డాష్ బోర్డుల ద్వారా ఈ సాయం పురోగతిని గుర్తిస్తూ ఒక ఫెసిలిటేటర్ గా వ్యవహరిస్తోంది. సంపన్నుల నిధులను ఇళ్ల నిర్మాణం, పారిశుధ్యం, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, సోలార్, స్వయం ఉపాధి అందించటం వంటివాటికి ఖర్చు చేస్తున్నారు.

అలాగే, మన దేశంలోని అనేక మంది సంపన్నులు దయాగుణంతో పేదల సేవకై ముందుకొస్తున్నారు. విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ ఒక్క ఏడాదిలో వారు రూ. 10 వేల కోట్లకు పైగా వెచ్చించారు. ‘ఎడెల్‌గివ్ హురున్ ఇండియా’ తాజాగా విడుదల చేసిన దాతృత్వ సంపన్నుల జాబితాలో ఈ ఏడాది కూడా నాడార్ కుటుంబమే అగ్రస్థానంలో ఉంది. 2024- 25లో శివ్ నాడార్ ఫౌండేషన్ అత్యధికంగా రూ. 2,708 కోట్ల విరాళాలు ఇచ్చింది. అంటే రోజుకు సుమారు రూ.7.4 కోట్లు అన్నమాట. తరవాతి స్థానాల్లో రూ. 626 కోట్లతో ముకేష్ అంబానీ, రూ. 446 కోట్ల విరాళాలతో మూడవస్థానంలో బజాజ్ కుటుంబం నిలిచాయి. హురున్ ఇండియా నిరుటి జాబితాలో 203మంది నిలవగా, తాజా జాబితాలో 191మంది చోటు దక్కించుకున్నారు.అయితే, సగటు విరాళం గతంతో పోలిస్తే రూ. 43 కోట్ల నుంచి రూ. 54 కోట్లు పెరిగింది. కాగా, తాజా జాబితాలోని దాతలు ఇచ్చిన విరాళం మొత్తం రూ.10,380 కోట్లు అని నివేదిక వెల్లడించింది. మన పొరుగుదేశం చైనా జిడిపి దాదాపు 20 ట్రిలియన్ డాలర్లు కాగా, ఇండియా జిడిపి 4 ట్రిలియన్ డాలర్ల మాత్రమే. కానీ, మనం దాతృత్వంలో చైనాతో సరితూగుతున్నామని, భవిష్యత్తులో దాతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా ఉంటుందని నివేదిక ప్రశంసించింది. ఇతరులకు సాయం చేయటానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని మన సమాజం వీలయిన మేర వినియోగించుకోవాలి. దానినో అరుదైన అవకాశంగా భావించాలి. మనకు అన్నీ ఇచ్చిన సమాజానికి మనం ఆ మాత్రం చేయలేకపోతే..మన సమాజంలో ఎంత సంపద, జ్ఞానం ఉన్నప్పటికీ,అది నరకప్రాయంగానే మారుతుంది.


ఐనం ప్రసాద్, 98489 28787

బాలలతోనే భవిష్యత్

జాతికి నిజమైన సంపద బాలలే. వారిపై ఖర్చు పెట్టుబడిగా భావించాలి. బాలల అభివృద్ధి, వారికి లభించే నాణ్యమైన ఆహారం, ఆరోగ్యం, విద్య, వినోదం, కుటుంబ జీవనంపై ఆధారపడి ఉంటుం ది. అప్పుడే ఉత్తమ పౌరసమాజం నిర్మితమవుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఏటా జవహర్ లాల్ నెహ్రూ పుట్టి రోజైన నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. వాస్తవంగా భారతదేశంలో మొట్టమొదట విద్యాభివృద్ధికి కృషి చేసిన ఆదిదంపతులు జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలు. వారి కృషి వల్లనే నేడు బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే అవకాశం లభించింది. ఆ చదువును భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ చట్టబద్ధం చేశారు. భారతదేశంలో నేడు భారత రాజ్యాంగం, చట్టాల ద్వారా బాలలకు ప్రత్యేక రక్షణలు కల్పించారు.

ఉన్నత వర్గాల బాలలతో పోలిస్తే… అట్టడుగు వర్గాల బాలల ఎదుగుదల నేటికి సవాల్ గానే నిలిచింది. బాలల అభివృద్ధికి మూలం విద్య. ఇందుకోసం విద్య హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. పేదరికంలో, ఆర్థికంగా ఇంకా దాదాపు 10 శాతానికి పైగా పిల్లలు విద్యకు దూరంగానే ఉన్నారు. మరోవైపు సంపన్న, పేద విద్యార్థుల మధ్య విద్య అంతరం కూడా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 92 శాతం బిసి, ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవగా.. సంపన్న శ్రేణి నుంచి కేవలం 8 శాతం మాత్రమే ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ అంతరాలు కనబడుతున్నాయి. మొన్న మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని పేపర్లో తినడం పలువురిని కలచివేసింది. మన దేశంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దుస్థితికి ఇది అద్దం పడుతుంది. భారతదేశం అభివృద్ధిలో దూసుకు పోతున్నప్పటికీ బాలల హక్కుల రక్షణలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. సామాజిక మాధ్యమాలతో పిల్లలో దుస్సంస్కృతి పెచ్చిరిల్లుతుంది. నైతిక విలువలు, క్రమశిక్షణ లోపిస్తోంది. దేశీయంగా పిల్లలపై ఒత్తిడి, వేధింపులు, దౌర్జన్యాలు, పిల్లల అపహరణ, అక్రమ రవాణా, వెట్టిచాకిరి, బాల్య వివాహాలు, లైంగిక దాడులు లాంటివి నిత్యకృత్యంగా కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి 2023లో దేశవ్యాప్తంగా 1.77 లక్షల కేసులు వెలుగుచూశాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి.

ప్రపంచ ఆకలి సూచిక 2024 ప్రకారం ఇప్పటికీ మనదేశంలో 13.7% పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మరోవైపు 5 ఏళ్ళ లోపు పిల్లలు 35.5 శాతం మంది వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోగా, 18.7 శాతం ఎత్తుకు తగిన బరువు లేరు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 5 ప్రకారం ఇప్పటికీ భారతదేశంలో 23 శాతం బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాలలో 41 శాతం బాల్య వివాహలు జరగడం ఆందోళనకరం. బాల్య దశలో ఎదుర్కొని అనేక సామాజిక రుగ్మతలకు అట్టడుగు వర్గాల పిల్లలే బాధితులవుతున్నారు. ఇవి వారి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. కావున బాలల శారీరక, మానసిక అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశ జనాభాలో 37 శాతం బాలలున్నారు. బాల్య దశలో పిల్లలు ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలకు పేద, బడుగు బలహీన పిల్లలే బలవుతున్నారు. వీరందరికీ ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి. పిల్లలను పేదరికంనుండి విముక్తి చేయడానికి కుటుంబ సామాజిక భద్రత కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. ఆడపిల్లల అభివృద్ధికి సుకన్య సమృద్ధి, మిషన్ వాత్సల్య వంటి ఆర్థిక సాధికారక కార్యక్రమాలు అమలుచేయాలి. పిల్లల్లో ఒత్తిడి, భయం, అభద్రత తదితర ప్రతికూల ప్రభావాలు తొలగించడానికి ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి మంచి నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలి. బాలల అభివృద్ది శిశుదశలోనే మొదలవ్వాలి. ఇందుకోసం ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయాలి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సమీకృత గురుకులాలు, మండలానికొక ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నది. వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు.

అధిక జనాభా గల భారతదేశం పిల్లల హక్కుల సంరక్షణకు చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. బాలల సహాయ కేంద్రానికి (1098) ప్రాచుర్యం కల్పించాలి. బాలల సంరక్షణ కోసం పోక్సో చట్టం 2012, బాలల న్యాయ చట్టం 2015, బాల హక్కుల పరిరక్షణ కమిషన్- 2005 లాంటివి ఉన్నాయి. ఇవి బాలల పట్ల కొనసాగుతున్న దుర్విచక్షణను అంతమొందించడానికి గట్టి కృషిచేయాలి. బాలల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యతనివ్వాలి. పేద బడుగు బలహీన వర్గాలు చదివే ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక భవనాలు, ప్రయోగశాలు, బస్ సౌకర్యం, కంప్యూటర్ విద్య, సరిపడా ఉపాధ్యాయులు కొరత వేధిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల బిసి, ఎస్‌సి, ఎస్‌టి, జెఎసి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, మౌలిక సదుపాయాలు కల్పనకు డిమాండ్ చేశారు. అట్టడుగు వర్గాలు చదివే ఈ పాఠశాలలో గౌరవప్రదమైన విద్యలో భాగం ఇవి. ఇప్పుడు తల్లిదండ్రులు కోరుకునేది కూడా గౌరవప్రదమైన విద్యనే. పిల్లలకు బాల్య దశ నుంచి ప్రశ్నించే తత్వం పెంపొంచే విద్యనందించాలి. వారి హక్కుల పట్ల ప్రభుత్వం, పౌర సమాజం విస్తృతంగా ప్రచారం చేయాలి. అప్పుడే బాలల సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడతాయి.

సంపతి రమేశ్ మహారాజ్

7989579428

ఆశల పల్లకిలో ఎన్‌డిఎ కూటమి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మంగళవారం (11.11.25) ముగియగానే వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ కూటమియే మళ్లీ అధికార పగ్గాలు చేపట్టే అవకాశం బాగా ఉందని అంచనాలు వెలువడడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించడం లేదు. అసెంబ్లీ మొత్తం స్థానాలు 243 లో ఎన్‌డిఎ కూటమికి మ్యాజిక్ ఫిగర్ 122 మించి 130 నుంచి 150 వరకు స్థానాలు కైవసం అవుతాయని, విపక్ష ఇండియా కూటమికి 108 మించి స్థానాలు రావని ఎగ్జిట్ పోల్స్ ముందస్తు అంచనాలు వెలువరించడంతో ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వం ఆశల పల్లకీలో ఊరేగుతోంది. మొదటి దశ పోలింగ్ 65.09 శాతం నమోదు కాగా, తుది దశ పోలింగ్ అంతకన్నా ఎక్కువగా రికార్డు స్థాయిలో 68.79 శాతం నమోదు కావడం విశేషం. 1951 తరువాత ఈ రాష్ట్రంలో ఇంతవరకూ ఇంత అధికంగా పోలింగ్ నమోదు కాలేదు. మలి విడత పోలింగ్‌పై సోమవారం ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి కారు బాంబు దాడి ప్రభావం కూడా కనిపించింది. 20 జిల్లాల్లోని 122 స్థానాల్లో ముస్లిం ఆధిపత్యం కలిగినవి, నక్సల్ ప్రభావితమైనవి ఉన్నప్పటికీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

ఆక్సిజన్ సిలిండర్ అమర్చుకుని కూడా ఓటర్లు కొంతమంది పోలింగ్‌కు హాజరయ్యారంటే ఓటర్లలో ఎంత ఆసక్తి ఉందో తెలుస్తుంది. కొన్ని చోట్ల ఓటర్లకు పండగ వాతావరణం కనిపించింది. దేశంలోని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ పెద్ద రాష్ట్రాలు. ఈ మూడు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా దేశం మొత్తం మీద ఎంతో ఉత్కంఠ కలుగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు గత సంవత్సరం జరగ్గా, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ఇక మిగతా రాష్ట్రాల పరిస్థితి వేరు. బీహార్ తరువాత తమిళనాడు అత్యంత జనాభా కలిగిన ఆరో రాష్ట్రంగా ఉన్నప్పటికీ, విజేతలెవరో ముందుగా ఒక కొలిక్కి అంచనా వేయడం కష్టం. తమిళనాడు రాజకీయాలకు జాతీయ స్థాయి రాజకీయాలతో సంబంధం ఉండదు.

2024 నవంబరులో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే శివసేన, ఎన్‌సిపి చీలికలు ఎన్నికల్లో విపరీత ప్రభావాన్ని చూపించాయి. బీహార్‌లో అలా కాదు. పక్కా జాతీయ స్థాయి అంశాలతో ముడిపడి ఉంది. కులం, మతం, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగం, శాంతిభద్రతలు, సంక్షేమ పథకాల అమలు ఇవన్నీ కీలకపాత్ర వహిస్తుంటాయి. కుల మత స్త్రీ, పురుష లింగ ఆధారిత సమాజాలు చాలా ఉన్నాయి. ఈ సవాళ్లన్నిటినీ మిగతా రాష్ట్రాల మాదిరిగా రాజకీయ పార్టీలు ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల బీహార్‌లో ఏం జరిగినా అది బిజెపి జెడి(యు) కూటమిపై జాతీయస్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుందని గతంలో నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే డేటా వెల్లడించిన సంగతి తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చాలా ముఖ్యమైనవిగా రూపొందడానికి ప్రధాన కారణం కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం జెడి(యు) మద్దతుతో నడుస్తుండడమే. బీహార్ ఎన్నికల ఫలితాలు కేంద్రంతో పొత్తు రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయి.

అందుకని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బిజెపి అగ్రస్థాయి నాయకులు నిర్విరామంగా బీహార్ ఎన్నికల ప్రచారంలో తలమునకలవ్వడం కనిపించింది. జాతీయ స్థాయిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని కలిగించడానికి అనేక ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి ఈ రాష్ట్రం గణనీయమైన పరిమాణం కలిగి ఉంది. రెండోది స్పష్టంగా ఎవరు గెలుస్తారో ముందుగా ఊహలకు అందకపోవడం ఎన్నికల గతి శీలత విశాల భారత దేశ సూక్ష్మరూపాన్ని సూచించడం, ఇవన్నీకాక ఎవరు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో అన్న అంచనాలకు మించి వెలువడే ఫలితాలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేస్తుంటాయి. అందుకని బీహార్ అసెంబ్లీ ఎన్నికలను పార్టీలన్నీ జాతీయస్థాయిలో సవాలుగా తీసుకున్నాయి. రెండవ అంశం విషయానికి వస్తే స్పష్టమైన ముందంజలో ఉన్నట్టు ఎవరూ కనిపించలేదు. ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో పనిచేస్తుందని విపక్ష కూటమి మహాఘట్‌బంధన్ ఊహించింది. కానీ చాలా మంది మోడీ బిజెపి నితీశ్ జెడి(యు)ఎన్‌డిఎ బ్రాండ్ కాంబినేషన్‌పై ఇంకా భారీ నమ్మకాన్ని చూపించారు. ప్రశాంత్ కిషోర్ కొత్త జన్ సురాజ్ పార్టీ సంక్లిష్టత ఫలితాల్లో ఉంటుందని కొంతమంది అనుకున్నా ఈ పార్టీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ కు, మహాఘట్‌బంధన్ (ఎంజిబి)కు దాదాపు చెరిసమానంగా 37.9 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్‌డిఎ 125 సీట్లను (మెజార్టీ మార్కు 122) గెల్చుకోగా, ఎంజిబి 110 సీట్లను గెల్చుకుంది. జెఎస్‌పి వంటి అనేక కొత్త చిన్నచిన్న పార్టీలు ఈసారి ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాల ప్రకారం ఎన్‌డిఎ మళ్లీ అధికారం లోకి వస్తే బిజెపి తాను చేసేది ప్రజల ప్రశంసలను పొందుతోందని ముఖ్యంగా హిందీ బెల్టులో ప్రశాంతంగా ఉండగలదు. జెడి(యు) కూడా తమ పాలనా విధానాలను, ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఎంపికను బీహార్ ఓటర్లు స్వాగతిస్తున్నారని నిబ్బరం పడుతుంది. ఒకవేళ ఎంజిబి విజయం అధికారంలోకి వస్తే జాతీయ స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపిస్తుంది. బీహార్ లో తాము ఏం సాధించిందో అదే ప్రామాణిక నమూనాను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి విపక్ష కూటమి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ నవంబర్ 14న వెలువడనున్న ఫలితాల కోసం నిరీక్షిస్తున్నాయి. 

ఉగ్రవాదం.. ఇంకెంత కాలం?

తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామని కేంద్రంలోని ప్రభుత్వ నేతలు ఘనంగా ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఢిల్లీలో దేశ సార్వభౌమత్వానికి చిహ్నంగా భావించే ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఉగ్రదాడి దేశప్రజలను గగుర్పాటుకు గురిచేసింది. దేశరాజధాని కేవలం ప్రపంచంలో దారుణమైన కాలుష్యాన్ని ఆవహించిన నగరమే కాకుండా ఉగ్రభయం తో వణికిపోతున్న రాజధానిగా మారిపోతుంది. విదేశీ ఉగ్రవాదులతో సంబంధం గల నలుగురు వైద్యులను నాలుగు రోజుల్లో అరెస్ట్ చేసిన సమయంలో మరో వైద్యుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు వెల్లడికావడం ఆందోళన కావిస్తుంది. అదృష్టవశాత్తు ఆ రోజు ఎర్రకోటకు సెలవు రోజు కావడంతో, అక్కడ జనసమర్ధన తక్కువగా ఉండడంతో ప్రాణనష్టం తక్కువగా జరిగింది. లేనిపక్షంలో ఎవ్వరూ ఊహించని దారుణం చోటుచేసుకొని ఉండెడిది.

పేదరికం, అక్షరాస్యత లేకపోవడం, నిరుద్యోగం వల్లే కొందరు ఉగ్రవాదులుగా మారుతున్నారని దేశంలో పలువురు రాజకీయ వేత్తలు, విద్యావంతులు వారిపట్ల ఒక విధమైన సానుభూతితో మాట్లాడుతూ ఉంటారు. అయితే డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత విద్యావంతులు ఉగ్రవాద సంస్థలలో కీలక భూమిక వహిస్తున్నట్లు గత రెండు దశాబ్దాలుగా దేశంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అరెస్టులు స్పష్టం చేస్తున్నాయి. కేరళ వంటి ప్రాంతాల నుండి ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు అఫ్ఘానిస్తాన్‌కు వెళ్లిన వారి నుండి, దేశంలో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలలో క్రియాశీలంగా వహిస్తున్న వారిలో పలువురు ఉన్నత విద్యావంతులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహీయుద్దీన్ సయ్యద్ (35) ను గుజరాత్‌లో అరెస్టు చేయడం భద్రతా దళాలలో ప్రకంపనలు సృష్టించింది. చైనా నుండి మెడికల్ డిగ్రీ అందుకొన్న అతను ఆముదం గింజల నుంచి రిసిన్ అనే విషపూరిత పదార్థాన్ని చేస్తున్నట్లు గుర్తించారు. ప్రసాదాలలో ఆ విషపదార్ధాన్ని కలిపి భారీ సంఖ్యలో జనాన్ని మట్టుపెట్టాలని అతను పథకాలు వేసుకున్నట్లు కనుగొన్నారు.జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 అమలు రద్దు చేయడంతో అక్కడి ఉగ్రవాదంను కట్టడి చేసినట్లే అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే, తాత్కాలిక చర్యగా పేర్కొన్న జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని ఆరేళ్ళు దాటినా ఎందుకు వెనుకకు తీసుకొని, తిరిగి రాష్ట్ర హోదా కల్పించలేకపోతున్నారు? కేంద్ర హోం శాఖ ప్రత్యక్ష పర్యవేక్షణలో అక్కడ శాంతిభద్రతలు నిర్వహిస్తున్నారు.

అయితే, సీమాంతర ఉగ్రవాదం ఇంకా అదుపులోకి రాలేదని ప్రభుత్వ చర్యలే స్పష్టం చేస్తున్నాయి.గతంలో యుపిఎ ప్రభుత్వం గాని, ప్రస్తుతం మోడీ ప్రభుత్వం గాని ఉగ్రవాదాన్ని రాజకీయ ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోవడం లో చూపిన శ్రద్ధ దానిని అణచివేయడంపట్ల చూపడం లేదు. ఆపరేషన్ సిందూర్‌ను అర్ధాంతరంగా ఎందుకు ఆపివేసారో ఇప్పటి వరకు ప్రభుత్వం దేశప్రజలకు నమ్మకమైన సమాధానం చెప్పలేకపోయింది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ వణికిపోయిందని, తిరిగి భారత్ వైపు చూసే సాహసం చేయబోదని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నిత్యం చెబుతున్నారు. అయితే ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగానే ఢిల్లీ పేలుడు జరుగుతున్నట్లు వార్తలు వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.

25 ఏళ్ల క్రితం నాటి బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ తిరిగి ‘జంగిల్ రాజ్’ వస్తుందని బీహార్ ప్రజలను ఎన్నికల సందర్భంగా భయపెడుతున్న ప్రధాన మంత్రి మోడీ ఎన్‌డిఎ పాలనలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారమే నేరాల సంఖ్య పెరిగిన విషయాన్ని మరచిపోతున్నారు. 60 క్రితం చనిపోయిన మాజీ ప్రధాని నెహ్రూ విధానాలను ఇప్పటికీ నిత్యం విమర్శిస్తూ తమ ప్రభుత్వంలో దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోతూ ఉండటం, వైషమ్యాలు పెరిగిపోతూ ఉండటం గురించి నోరు విప్పడంలేదు. యుపిఎ ప్రభుత్వం ఉగ్రవాదులపట్ల రాజీధోరణి అవలంబించిందని విమర్శలు చేస్తుండే నేతలు తమ హయాం లో జరుగుతున్న ఉగ్రదాడుల గురించి నోరెత్తరు. 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను బలి తీసుకున్న పుల్వామా ఉగ్రదాడికి దారితీసిన పరిస్థితులపై ఇప్పటివరకు దర్యాప్తు నివేదికను బయటపెట్టలేదు. గత 11 ఏళ్లలో దేశంలో 68 ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడులలో 600మంది వరకు మృతి చెందారు. వారిలో సగంమందికి పైగా 360 మంది వరకూ సైనికులు, పోలీసులు అమరులవ్వగా, 230 మంది పౌరులు మృతి చెందారు. గతంలో లేని విధంగా తరచూ సైనికులను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరుగుతున్నాయి. నోట్ల రద్దుతో ఉగ్రవాదులకు ఆదాయ వనరులను కట్టడి చేశామని చెప్పారు. కానీ అటువంటి పరిస్థితులు కనబడటం లేదు. మెరుపు దాడులలో ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పారు. కానీ, సైనిక అధికారులే నియంత్రణ రేఖ అవతల దేశంలో ప్రవేశించేందుకు పెద్ద సంఖ్యలో చొరబాటుదారులు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. గత ఐదేళ్లుగా సైన్యంలో కొత్త నియామకాలు దాదాపు ఆగిపోయాయి. కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ కార్యక్రమం గురించి స్పష్టమైన సమీక్షలు జరగడం లేదు. ఈ విషయంలో సైనికాధికారులకు, ప్రభుత్వంకు మధ్య దూరం పెరుగుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. యుపిఎ హయాంలో అమెరికా ఒత్తిడి కారణంగానే బొంబాయి పేలుళ్ల తర్వాత భారత్ పాకిస్థాన్‌పై దాడి చేయలేదని అప్పటి కేంద్ర మంత్రి పి చిదంబరం వెల్లడించారు.

కానీ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అర్ధాంతరంగా ‘కాల్పుల విరమణ’ ఎందుకు జరపాల్సి వచ్చిందే పార్లమెంట్‌లో సైతం ప్రభుత్వం నోరువిప్పడం లేదు. తానే భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ చెప్పుకొంటున్నారు. ఆయనను నేరుగా ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఆయన వ్యాఖ్యలపట్ల అమెరికా రాయబారిని పిలిచి భారత్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు? తన ఒత్తిడులకు లొంగి భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు తగ్గిస్తున్నట్లు తాజాగా ట్రంప్ ప్రకటించారు. అయినా భారత్ మౌనం వహిస్తున్నది. తాజా అరెస్ట్‌లతో సుదీర్ఘకాలంగా బిజెపి పాలనలో ఉన్న హర్యానా ఉగ్రవాదులకు కీలక ప్రాంతంగా మారుతున్నట్లు అనుమానించే పరిస్థితులు నెలకొంటున్నాయి. ముంబైలో ఉగ్రదాడి జరగగానే అప్పటి యుపిఎ ప్రభుత్వం నాటి హోం మంత్రి శివరాజ్ పాటిల్ ను బాధ్యుడిని చేస్తూ పదవినుండి తొలగించింది. పలువురు అధికారులపై చర్యలు తీసుకుంది. అయితే, పాకిస్తాన్ నుండి నేరుగా ఉగ్రవాదులు ముంబై వచ్చి ఉగ్రదాడి జరిపే అవకాశం లేదని, స్థానికంగా వారికి పెద్ద ఎత్తున మద్దతు ఉంది ఉంటుందని అప్పట్లో అనేక మంది నిపుణులు స్పష్టం చేశారు. కనీసం నరేంద్ర మోడీ ప్రభుత్వమైనా అప్పట్లో ఉగ్రదాడి జరిగిన సమయంలో శివరాజ్ పాటిల్ వివాదాస్పదమైన ప్రవర్తన గురించి గాని, ఆ దాడిలో స్థానికుల ప్రమేయం గురించి గాని ఎటువంటి దర్యాప్తు జరిపిన దాఖలాలు లేవు.

గతంలో వాజపేయి ప్రభుత్వంలో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన సమయంలో, మోడీ ప్రభుత్వంలో ఢిల్లీ అల్లర్ల సమయంలో గాని, పుల్వామా దాడి సమయంలో గాని ప్రభుత్వంలో ఎవ్వరినీ బాధ్యులను చేసే ప్రయత్నం చేయలేదు. యుపిఎ ప్రభుత్వం సైతం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం హడావుడిగా పార్లమెంట్ పై దాడిలో అఫజుల్ గురును, ముంబై దాడిలో కసబ్‌ను ఉరితీశారు. అయితే లోతయిన దర్యాప్తులు జరగకపోవడంతో ఉగ్ర ఘటనలకు బాధ్యులైన కీలక వ్యక్తులు తప్పించుకుపోతున్నట్లు తెలుస్తున్నది. ఆయా దాడులకు స్థానికంగా అండగా ఉండి, కీలకమైన మద్దతు అందించినవారిని వదిలివేస్తున్నారు. అందుకు రాజకీయ అంశాలే కారణంగా భావించాల్సి వస్తుంది. ఈశాన్య ప్రాంతంలో సైతం తీవ్రవాద బృందాలు చాలా వరకు ఆయుధాలను వదిలిపెట్టి ప్రధాన స్రవంతిలో కలిసిపోయాయని, ఇక ఆ ప్రాంతంలో శాంతి నెలకొందని అమిత్ షా తరచూ చెబుతున్నారు. అయితే మణిపూర్‌లో రెండేళ్లకు పైగా కల్లోలకర పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే సాహసం చేయడం లేదు. మిగిలిన ప్రాంతాలలో సైతం పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. మొన్నటి పహల్గామ్, తాజాగా జరిగిన ఎర్రకోట పేలుడు ఘటనలు దేశప్రజలు ఎటువంటి ఉగ్రభయం నీడలో ఉన్నారో వెల్లడి చేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ఎన్నికల ప్రయోజనంకోసం ఓ ఆయుధంగా కాకుండా, దానిని కట్టడి చేసేందుకు పారదర్శకతతో, వ్యూహాత్మకంగా అడుగు వేయాల్సి ఉంటుంది. అటువంటి విషయాలలో ప్రభుత్వం విధానపరమైన దివాళాకోరుతనం ప్రదర్శిస్తున్నట్లు భావించాల్సి వస్తుంది.

మీడియా సంస్థలను కట్టడి చేయడం, రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ద్వారా వాస్తవాలు ప్రజలకు చేరకుండా అడ్డుకోవచ్చని అధికారంలో ఉన్నవారు భావించవచ్చు. కానీ ఉగ్రవాదంపట్ల రాజీలేని వైఖరి అవలంబించేందుకు విధానపరమైన క్రియాశీలత చాలావసరం. అందుకు అనువుగా జాతీయ భద్రతా విధానం రూపొందించాలి. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద సైన్యం రక్షణ వ్యవస్థ గల భారత దేశంకు ఇప్పటి వరకు ‘జాతీయ రక్షణ విధానం’ లేకపోవడం దురదృష్టకరం. కార్గిల్ యుద్ధం తర్వాత నియమించిన సుబ్రహ్మణ్యం కమిటీ ప్రధాన సిఫార్సులతో జాతీయ రక్షణ విధానం రూపొందించడం అని గుర్తుతెచ్చుకోవాలి. దేశ ప్రజలను ఉగ్రవాద భయం నుండి ఆదుకునేందుకు ప్రభుత్వం రాజకీయ సంసిద్ధత ప్రదర్శించాలి. సంకుచిత ఎన్నికల రాజకీయాలకు అతీతంగా విధానపరమైన చొరువలు తీసుకోవాలి. ముందుగా దేశ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి. పార్లమెంట్‌లో పారదర్శకమైన చర్చలు జరగాలి. కేవలం బహిరంగ సభలలో కాకుండా పార్లమెంట్‌లో, మీడియా సమావేశాలలో, అఖిలపక్ష సమావేశాలలో విధానపరమైన అంశాలపై చర్చలకు ముందుకు రావాలి. ప్రభుత్వం నుండి జవాబుదారీతనం అత్యవసరం. విదేశాంగ, రక్షణ విధానాలపై దృష్టి సారించాలి.


చలసాని నరేంద్ర

98495 69050

తిరుగుబాట్లు లేని కాలముందా?

గడ్డిపోచలు ఏకమైతే వాటికి మదపుటేనుగును కట్టిపడేసే బలమొస్తుందని కొత్తగా చెప్పనవసరం లేదు. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చస్తుందని చెప్పే పద్యం ఏనాటినుంచో ఉంది. పీడిత జనుల సమూహశక్తి ఎంత బలీయమైనదో సుదీర్ఘ మానవ చరిత్రలో ఎన్నో నిరూపణలు ఉన్నాయి. మనుషులంతా ఒక్కలా ఉండరు. వారిలో పీడనను సహిస్తూ తలవంచుకొనిపోయేవారు ఎక్కువే అయినా, తెగిపడినా పర్వాలేదు తలవంచను అనేవారు కూడా ఉంటారు. సహజంగా ఇలాంటి వారి సంఖ్య తక్కువే అయినా చరిత్రను మలుపు తిప్పే శక్తి వారికే ఉంటుంది. మనిషి ఆలోచనాపరుడు, ఆవేశపరుడు, తాత్వికుడు, ఆత్మాభిమాని, పరోపకారి అయినపుడు పరిస్థితులకు తలవంచడు. ఇలా బతకడం తనవల్ల కాదు అనుకుంటాడు. గెలుపోటములను లెక్కచేయకుండా ఎదురు తిరుగుతాడు. అందులోనే జీవన సాఫల్యం ఉందనుకుంటాడు. ఉరితాడును ముద్దుపెట్టుకొనే వీరుడిగా పోరాట చరిత్రలో నిలిచిపోతాడు. ఆ ధీరత్వం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ మానవచరిత్రలో పోరువీరులు తక్కువేమీ లేరు. ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డడం మానవ నైజంలో ఉంది. బలవంతంగా దాన్ని అణచిపెట్టవచ్చేమోగాని క్లీన్ స్వీప్ లాగా ఎవరు తుడిచేయలేరు. బరి గీసి ఇకనుంచి మనిషి ఎదురుతిరగడు అని చెప్పడం చరిత్ర తెలియని అవివేకమే.

మానవ చరిత్ర అందుబాటు లో ఉన్న మేరకు పీడిత పక్ష ప్రతినిధిగా తిరుగుబాటు చేసిన మొదటి వరుస ధైర్యశాలిగా స్పార్టకస్ పేరును తలుచుకోవచ్చు. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్ద కాలంలో రోమన్ పాలకులను ఎదిరించిన బానిస జాతి వీరుడాయన. కాళ్ళ దగ్గరపడి ఉండే బానిస తమపై కత్తి దూస్తాడని రోమన్ రాజులు ఊహించే అవకాశమే లేదు. కానీ స్పార్టకస్ తనలాంటి బానిసలను కూడగట్టుకొని రోమన్ సైన్యంతో యుద్ధమే చేశాడు. బానిస బతుకులో ఆయన సర్దుకొని ఉండలేక ముప్పై ఏళ్లకే అపూర్వ సాహసంతో ఎదురు తిరిగి చావుకు సిద్ధపడ్డాడు. రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా తన పేరును తలుచుకుంటారని ఆయన అనుకోలేదు. అయినా ఒక సాహసిగా, తిరుగుబాటుకు పురా సాక్ష్యంగా, సదా ప్రేరణగా ఆయన పేరు ఎల్లకాలం నిలుస్తుంది. ఆంగ్లేయుల పాలనకు ఎదురొడ్డిన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైన్యం శక్తిసామర్థ్యాలకు బెదిరి వెనుకంజ వేయలేదు. గిరిజనుల వెతలు చూడలేక తెగించి పోరాడాడు. కొమురం భీం కు నిజాం పటాలం గురించి అంచనా ఉండదా! అరాచకానికి తుపాకితోనే జవాబు చెప్పాలనుకున్నాడు. అది సామాజిక ప్రయోజన వీరత్వం. పేదల ఇక్కట్లు బాపే బలిదానం. పాలకులకు ఒక షాక్ ట్రీట్‌మెంట్. తిరుగుబాటు చదరంగం ఆట కాదు.

ఈ పోరులో ప్రాణం ఒక సమిధ. తనతోపాటు కుటుంబ సభ్యులను కూడా ఎన్నో బాధలకు గురిచేసే పరిణామం. ఎండా, వాన, ఆకలి, దప్పికలు లెక్క చేయలేని జీవనం. కన్నతల్లికి, కట్టుకున్న భార్యకి, పుట్టిన పిల్లలకు దశాబ్దాల తరబడి కంటికి కానరాకుండా బతకడం ఎంత వేదనాభరితం. అయినా మనిషి తిరుగుబాటుకు కారణం ఏమిటి? సమాజంపై కోపం, పాలనపై అయిష్టత, శ్రమ దోపిడీ, కులవివక్షలను సహించనితనం మనిషిని ఉన్నచోట ఉండనీయదు. ఈ విధానాలను కూలదోయాల్సిందే అని బలంగా కోరుకుంటాడు. రాజ్యం ఎంత శక్తివంతమైనదైనా ఎదిరించడానికి సిద్ధపడతాడు. ప్రేమికులు తమ ప్రేమ కోసం ఎంతటి కష్టాలకైనా సిద్ధపడినట్లు విప్లవకారుడు కూడా తమ లక్ష్యాన్ని ఒక రొమాంటిక్ ధోరణిలోనే ఇష్టపడతాడు. మానసికంగా ఆ స్థాయికి చేరినవాడే చివరికంటూ ఆ బాటలోనే ఉంటాడు. మనిషిలోని సహజ స్పందనలైన ప్రేమను, మమకారాన్ని, మానవత్వాన్ని చంపలేనట్లే తిరుగుబాటుకు పురికొల్పే ప్రేరణను కూడా ఎవరూ తుదముట్టించలేరు.

మనుషుల్లో ధనిక, పేద వర్గాలున్నంతకాలం, శ్రమ దోపిడీ, పీడన ఉన్నంతకాలం ఎదురు తిరిగేవారు పుడుతూనే ఉంటారు. పేదల కష్టాలను అర్థం చేసుకొని వాటి నిర్మూలనకు ప్రభుత్వాలు సిద్ధపడనంతకాలం తిరుగుబాట్లు తలెత్తుతూనే ఉంటాయి. సమస్య తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టడం నేటి ప్రభుత్వాలు చేస్తున్న పని. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ఒకరినిమించి మరొకరు అన్నట్లు దోపిడీ వర్గాలకు సహకరిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీకి ఓటేసినా, ప్రభుత్వాలను మార్చేసినా సామాన్యుల జీవితాల్లో గణనీయమైన మార్పు రావడంలేదు. పోలీసు, రెవెన్యూ శాఖలు పేదలను ఇబ్బందులకు గురి చేస్తూ పాలక పక్ష దోపిడీదారులకు అన్నివిధాలా ఊడిగం చేస్తున్నాయి. విద్య, వైద్యం ప్రైవేటు రంగమై చిరు జీవితాలను వేపుకు తింటున్నాయి. లంచాలకు మరిగిన అధికారులు బాధ్యతలను మరచి కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు వ్యవస్థనే తిరుగుబాటు విత్తనాలకు చల్లుతుంది. మేము ఇలాగే ఉంటాం. మీరు మాత్రం తిరగబడొద్దు అంటే కుదురుతుందా! ఎండిన ఆకులను మండించడానికి వేలెడంత లేని అగ్గిపుల్లలా ఓ ప్రాణి తప్పక ఉద్భవిస్తుంది. దావాలనాన్ని సృష్టించి ప్రభుత్వాల డొల్లతనాన్ని ప్రపంచానికి చాటుతుంది. ఆ వేడిని చల్లబరచేందుకు ఏవో కొన్ని సంక్షేమ పథకాలు రచనకు పాలకులను అనివార్యం చేస్తుంది.

సామాన్యుడి ప్రతి పూట భోజనం తిరుగుబాటు ఫలితమే. రక్తం చిందిస్తేనే ఎనిమిది గంటల పని దినం వచ్చింది. వచ్చే ఏడాది మార్చి చివరికల్లా దేశంలో నక్సలైటు లేకుండా చేస్తామని కేంద్రం అంటోంది. గిరిజనులకు ఆవాసాలైనా అడవులను తెగనరికి నేలలోని ఖనిజాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతోంది. అడవిపై గిరిజనుల హక్కులపై రాజ్యాంగంలో పొందుపరచిన అధికరణలను అమలు చేయకుండా వారి ఇళ్లను కాలబెట్టి అడవిలోంచి పారద్రోలే పన్నాగం ప్రభుత్వం చేస్తోంది. ఏ ప్రాజెక్టులోనూ పునరావాసం వల్ల నిర్వాసితులు సంతోషంగా లేరు. బయటి ప్రపంచం తెలియని అడవి బిడ్డలను దేశపౌరులుగా ప్రభుత్వాలు లెక్కలోకి తీసుకోవడం లేదు. ఒక హిడ్మాను వేటాడి పట్టుకుంటే తిరుగుబాటు అంతమైనట్లేనా? ఎన్ని బలగాలను దింపినా.. చర్చలు జరిపితేనే తుపాకుల చప్పుళ్లు ఆగిపోతాయి. ఆ శాంతి వాతావరణంలో గిరిజనుల సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఈ చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలకు కటాఫ్ తేదీలతో మిగిలేది పరాభవమే అని చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది.

బి.నర్సన్ 94401 28169

ఇ.సి.పై కేంద్రం పెత్తనం

భారత రాజ్యాంగంలో ఎన్నికల వ్యవస్థకు ఉండే స్వతంత్ర ప్రతిపత్తి గురించి ఆర్టికల్ 324 తెలుపుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా స్వతంత్రంగా పనిచేసే అతికొద్ది సంస్థల్లో భారత ఎన్నికల వ్యవస్థ ప్రధానమైనది. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటుకై ఓటర్లకు సంబంధించిన ఓటరు జాబితాను తయారు చేసేది, వివిధ రాజకీయ పార్టీలకి గుర్తింపును, రాజకీయ పార్టీలకి చిహ్నలను కేటాయించేది కేంద్ర ఎన్నికల సంఘం. కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి నూతనంగా ఏర్పాటు అయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వ్యవస్థపై పెత్తనం చెలాయించి వివిధ రాజకీయ పార్టీలకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించేలా వేటికి కూడా హక్కు ఎన్నికల వ్యవస్థపై ఉండదు. భారతదేశం అంటే స్వేచ్ఛ, సమానత్వ, సోదరభావ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ దేశంగా ఉండడానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ద్వారా అంబేద్కర్ ఎన్నికల వ్యవస్థకు చాలా పటిష్టమైన భద్రతను ఇస్తూ స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. అందుకే కేంద్ర, రాష్ట్రాలల్లో ఎంతటి బలమైన ప్రజాబలం ఉన్న నాయకులు ఉన్నప్పటికీ ఎన్నికల వ్యవస్థను, వాటిని నడిపే అధికారులను ఆయా పార్టీలకి, ప్రభుత్వాలకి అనుకూలంగా వ్యవహరించడానికి సాధ్యం లేదు.

ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి భారత రాజ్యాంగం రూపం లో ఎన్నికల వ్యవస్థకి అత్యున్నతమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నది. ఇది భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పడానికి నిదర్శనం.కానీ గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వంలో బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో కేంద్ర ఎన్నికల వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనేక సందర్భాల్లో అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్ష పార్టీ నాయకులు బలమైన ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తూ హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల వ్యవసను తమకి అనుకూలంగా మలుచుకొని హర్యానాలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆధారాలతో సహా నిరూపించారు. అందులో భాగంగానే తాజాగా ఢిల్లీలో ప్రొజెక్టర్‌లో ఫోటో, వీడియోలు వేసి ఎన్నికల వ్యవస్థ లోపాలను వివరిస్తూ దాదాపు 25 లక్షల నకిలీ ఓట్లు హర్యానాలో ఉన్నాయని చెప్తున్నారు. అందువల్లనే హర్యానాలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు.

అందుకు బలమైన ఆధారాలు చూపిస్తూ బ్రెజిల్ దేశానికి చెందిన మోడల్ పేరుపై వివిధ పేర్లతో హర్యానాలో 22 చోట్ల ఓటు హక్కు ఉండడం రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్ విధానానికి బిజెపి పాల్పడుతున్నదని నమ్మక తప్పని పరిస్థితి నెలకొన్నది. అంతేకాదు బ్రెజిల్ మోడల్ కూడా రాహుల్ గాంధీ చూయించిన ఆధారాలకు స్పందించి అవి తాను గతం లోని మోడల్ ఫోటోలు అని, ప్రస్తుతం భారతదేశంలో తాను వైరల్ అవ్వడం, ఓటు హక్కు కూడా ఉండడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మన దేశంలోని ఎన్నికల వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం కాదా, విదేశీయుల ముందు అత్యున్నత విలువలతో కూడిన భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం కదా! మరి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై ఎన్నికల సంఘం తప్పులేనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరించనప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థపై తప్పుడు ఆరోపణ చేస్తూ, ఎన్నికల వ్యవస్థనే అభాసుపాలు చేస్తున్నారని ఎన్నికల కమిషన్ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ పై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? కేంద్ర ఎన్నికల సంఘం తన ప్రతిపత్తిని కాపాడుకోలేకపోతున్నదంటే కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నదా! అనే విషయాన్ని మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు సైతం నమ్మక తప్పడం లేదు! ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఒక్క ఓటే నాయకుల గెలుపు, ఓటమిని నిర్ణయిస్తుంది.

కాబట్టి భారతదేశమంటేనే ఒకే వ్యక్తి ఒకే ఓటు ఒకే విలువ అనే రాజ్యాంగబద్ధమైన ఉన్నత విలువలతో కూడిన అంశం కాబట్టి ఒక్క ఓటు అయినా ముఖ్యమైనదనే విషయం జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా చూపిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఓటు దొంగతనానికి పాల్పడుతున్నదనే అంశంలో మోడీ నేతృత్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఎలాంటి లోపాలు లేనప్పుడు కేంద్ర ఎన్నికల సంస్థను తమకు అనుకూలంగా కీలుబొమ్మగా మార్చుకోవడం లేదని నిజం అయితే, తప్పుడు ఆరోపణలు చేస్తూ భారతీయ ప్రజల ఓట్లని, ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచేలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు తీసుకోవడం లేదు? అంటే రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఉన్నదని ప్రధాని మోడీ చెప్పదలుచుకున్నారా! అంటే భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికల వ్యవస్థకి కల్పించిన స్వతంత్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ దుర్వినియోగం చేస్తున్నారంటే భారత రాజ్యాంగాన్ని, 140 కోట్ల భారతీయ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమాన పరుస్తున్నట్లే కదా! భారతీయులు తమ విలువైన ఓటు హక్కుతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో లేని వ్యక్తులపై ఓట్లు చూయించి, ఒక వ్యక్తికే అనేక ప్రాంతాల్లో ఓట్లు చూయించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే భారతీయ ప్రజల ఆలోచనకి వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పుడు, ప్రజల ఇష్టాలకు గౌరవం లేనప్పుడు దేశ ప్రజలను గొప్పదైన రాజ్యాంగాన్ని పాలకులు ఇష్టానుసారం అగౌరపరుస్తున్నట్లే కదా! అలాంటప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు ఎలా వర్ధిల్లాబడతాయి! కాబట్టి అంతిమంగా ఇలాంటి అనేక సందేహాలకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు నైతిక విలువలతో వ్యవహరించి 140 కోట్ల మంది భారతీయులకి వాస్తవాలతో కూడిన సమాధానం చెప్తూ, భారత సార్వభౌమాధికారాన్ని, భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉండే స్వతంత్ర ప్రతిపత్తిని రక్షించి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ పార్టీలకతీతంగా, కుల, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు సైతం గ్రహించాల్సిన చారిత్రక సత్యం.


పుల్లెంల గణేష్, 95530 41549