ankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escortjokerbetyakabet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Restbet

Restbet giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

Meritking Giriş

meritking

meritking

Meritking Giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking - Meritking

Meritking

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

marsbahis giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Restbet

Restbet giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Meritking

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

cratosslot

piabellacasino

superbetin

superbetin

vdcasino

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinodior

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

sekabet

sekabet

vdcasino giriş

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

piabet

bets10

pusulabet

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

casibom

holiganbet

marsbahis

casibom

yakabet

casinolevant giriş

1xbet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

milanobet

gallerbahis

galabet

betkolik

betticket

süratbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

casinoroyal

sekabet

jojobet

joybet

wbahis

kingroyal

masterbetting

kingroyal

vdcasino

ultrabet

tlcasino

galabet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

casinoas

dinamobet

artemisbet

casinolevant

enbet

madridbet

vdcasino

sonbahis

casibom

betturkey

atlasbet

grandpashabet

casibom

tarafbet

ultrabet

casibom giriş

madridbet giriş

betasus

holiganbet

bahiscasino

jokerbet

kingroyal

hilarionbet

matbet

marsbahis

vdcasino

sekabet

bahsegel

yakabet

grandpashabet

meritking

pusulabet

betpuan

casibom güncel giriş

కేంద్రం అడకత్తెరలో పత్తిరైతు

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) అంటే దేశంలో పత్తిని కొనుగోలు చేసి, అవసరమైన దేశాలకు ఎగుమతి చేసే కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లోని వాణిజ్యపరమైన సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ అనుసరిస్తున్న విధానం దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పత్తిరైతులకు విపత్తు తెచ్చే సంస్థగా తయారైంది. తెలంగాణలో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. దీని దిగుబడి 24.70 లక్షల టన్నుల వరకు ఉండవచ్చని అంచనా. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. సుమారు 8 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట విపరీతంగా దెబ్బతింది. ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతుకు ఇప్పుడు సిసిఐ పెట్టిన నిబంధనలు దిక్కుతోచని పరిస్థితిని కల్పిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పిన సిసిఐ 7 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం రైతుల నెత్తిపై పిడుగుపడింది. అదీకాక రూ. 8110 మద్దతు ధర చెల్లించాలంటే తేమ 12% మించరాదని నిబంధన విధించింది. అసలే శీతాకాలం, పైగా మంచు ప్రభావం, ఇటీవల వరకు మొంథా తుఫాన్ బీభత్సం ఈ వైపరీత్యాల కారణంగా చాలా చోట్ల పత్తి దెబ్బతింది.

ఈ సమస్యలతో కుంగిపోతున్న పత్తిరైతుకు సిసిఐ నిబంధనలు నిలువునా దహించి వేస్తున్నాయి. తుఫాన్, భారీ వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఎకరాకు దిగుబడి 5 నుండి 7 క్వింటాళ్లకు మించి రాదని, అందువల్లనే ఎకరాకు 12 నుండి 7 క్వింటాళ్లకు సేకరణ తగ్గించామని సిసిఐ నచ్చచెబుతోంది. గత సంవత్సరం దిగుబడిపై పదిశాతం పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ సంవత్సరం పత్తి కొనుగోలు పరిమితిని ఎకరానికి 7 క్వింటాళ్లుగా నిర్ణయించినట్టు కేంద్ర జౌళిశాఖ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశారు. కానీ ఏం లాభం ఆ ప్రకారం కొనుగోలు చేయడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పత్తి దిగుబడి ఎకరానికి 11 క్వింటాళ్ల వరకు ఉంటుందని జిల్లా కలెక్టర్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్తి కొనుగోలు పరిమితిని ఎకరానికి 7 క్వింటాళ్లనుంచి 11 క్వింటాళ్ల వరకు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రంలో జిల్లాలవారీగా వాస్తవిక పత్తి దిగుబడి గణాంకాలు సేకరించి వెంటనే కేంద్రానికి పంపాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్రప్రభుత్వం సూచిస్తోంది.

ఇదిలా ఉండగా పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా చాలా ఆలస్యంగా ఏర్పాటయ్యాయి. సిసిఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకోవాలంటే ముందుగా రైతు సేవా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న తరువాత కేంద్రం ప్రవేశపెట్టిన ‘కిపాస్ కిసాన్ స్లాట్ ’లో 24 గంటల ముందు బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ విధానం మారుమూల ప్రాంతాల్లోని దాదాపు 70 శాతం మంది రైతులకు తెలియదు. ఈ బుకింగ్ విధానంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా రైతులు వెనుదిరిగి వెళ్లిపోవలసిందే. రవాణాకు ఖర్చులు భరించి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాక అనేక నిబంధనలు, ఆంక్షలతో కొనుగోలు చేయకపోయే సరికి దిక్కుతోచక బయట ప్రైవేట్ వ్యాపారులకు లేదా దళారులకు క్వింటాల్‌కు రూ. 6400 వంతున అమ్ముకోవలసి వస్తోంది. అంటే క్వింటాలుకు కనీసం దక్కాల్సిన రూ. 8000 కు కేవలం రూ. 6000 మాత్రమే దక్కుతుందంటే ఆ రైతు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో జిన్నింగ్ మిల్స్ మూతపడడంతో పత్తి కొనుగోళ్లు అసలు జరగడం లేదు. ఎల్1, ఎల్2 అంటూ కేటగిరిలవారీగా జిన్నింగ్ మిల్లులను విభజించడమే జిన్నింగ్ మిల్స్ మూతపడడానికి దారితీసింది.

అమెరికాతో సాగుతున్న వాణిజ్య చర్చలు కూడా పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలపై ప్రభావం చూపిస్తున్నాయని వాణిజ్యరంగాల నిపుణులు వివరిస్తున్నారు. అమెరికా పత్తి దిగుమతులపై ఉండిన 11% సుంకాన్ని భారత ప్రభుత్వం అకస్మాత్తుగా ఎత్తివేసింది. ఆ ఎత్తివేత మొదట గత ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే జరగ్గా, మళ్లీ ఇప్పుడు డిసెంబర్ వరకు పొడిగించారు. ఈ కారణంగానే గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండా, అడ్డంకులు లేకుండా పత్తిని కొనుగోలు చేసే కాటన్ కార్పొరేషన్ ఇప్పుడు 7 క్వింటాళ్లు మాత్రమే కొంటానని చెబుతోందని విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. గ్రామీణ జనాభాలో దాదాపు 70% మంది వ్యవసాయంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. దేశ ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగం 15 శాతం వాటాను కలిగి ఉంది. దేశం లోని శ్రామిక శక్తిలో దాదాపు 45.5 శాతం మంది వ్యవసాయంతో ముడిపడి ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.

రైతు వ్యతిరేక చట్టాలు, అధిక రుణభారాలు, ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేకపోవడం, సబ్సిడీల్లో అవినీతి, పంట వైఫల్యం, ఆర్థిక సమస్యలు ఇవన్నీ రైతు కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ కారణాల వల్లనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని అధ్యయనాలు వివరిస్తున్నాయి. 1995 నుంచి 2014 మధ్యకాలంలో 2,96,438 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, 2014 నుంచి 2022 మధ్య తొమ్మిదేళ్లలో 1,00,474 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2022లో వ్యవసాయ రంగంలో రైతులు, కార్మికులు కలిపి మొత్తం 11,290 మంది ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశంలోని మొత్తం ఆత్మహత్య బాధితుల్లో ఈ సంఖ్య 6.6 శాతంగా ఉన్నట్టు తేలింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు పత్తిరైతులు తమ పంట దెబ్బతినడం, అప్పుల భారంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. రైతులను చిన్నచూపు చూసే కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభానికి తగిన విధంగా స్పందించి నివారణ చర్యలు తీసుకోకుంటే గతంలో ఎదురయ్యే ఆత్మహత్యల భయానక పరిస్థితులు మళ్లీ ఎదురయ్యే ప్రమాదం ఉంది. 

శిలాజ ఇంధనాలతో మానవాళికి ముప్పు

శిలాజ ఇంధన మౌలిక సదుపాయాలు ప్రపంచవ్యాప్తంగా కనీసం 2 బిలియన్ల ప్రజల ఆరోగ్యం, జీవనోపాధికి ముప్పును కలిగిస్తున్నాయని, ప్రపంచ జనాభాలో దాదాపు పావు వంతు మంది అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, బెటర్ ప్లానెట్ లాబొరేటరీ (బిపిఎల్) ప్రపంచవ్యాప్తంగా వాతావరణం, ప్రజలు, పర్యావరణ వ్యవస్థలకు శిలాజ ఇంధన పరిశ్రమ కలిగించే హానిపై ప్రచురించిన ఓ నివేదికలో పేర్కొన్నాయి. ‘ఎక్స్‌ట్రాక్షన్ ఎక్స్‌టింక్షన్: ఫొజిల్ ఇంధనాల జీవితచక్రం జీవితం, ప్రకృతి, మానవ హక్కులను ఎందుకు బెదిరిస్తుంది?’ అనే నివేదిక, శిలాజ ఇంధనాల పూర్తి జీవితచక్రం భర్తీ చేయలేని సహజ పర్యావరణ వ్యవస్థలను నాశనం చేస్తుందని, మానవ హక్కులను, ముఖ్యంగా శిలాజ ఇంధన మౌలిక సదుపాయాల దగ్గర నివసించే వారి హక్కులను బలహీనపరుస్తుందని నిరూపిస్తుంది. బ్రెజిల్ లో కాప్ 30వ పర్యావరణ సదస్సు జరుగుతున్న సమయంలో ఈ నివేదికను విడుదల చేయడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.

బొగ్గు, చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాల సామీప్యత కేన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, ప్రతికూల పునరుత్పత్తి ఫలితాలు, ఇతర ప్రతికూల ఆరోగ్య ఫలితాల ప్రమాదాలను పెంచుతుందని నిరూపితమైంది. శిలాజ ఇంధనాల ఉత్పత్తి కోసం ఇప్పటికే ఉన్న, భవిష్యత్తులో ఉన్న ప్రదేశాలనుండి ప్రపంచ హాని సంభావ్య స్థాయిని అంచనా వేయడానికి మొట్టమొదటి రకమైన మ్యాపింగ్ వ్యాయామం కోసం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయంలో బెటర్ ప్లానెట్ లాబొరేటరీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘నానాటకీ విస్తరిస్తున్న శిలాజ ఇంధన పరిశ్రమ బిలియన్ల మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తోంది. వాతావరణ వ్యవస్థను తిరిగి మార్చలేని విధంగా మారుస్తోంది. ఇప్పటివరకు, శిలాజ ఇంధన మౌలిక సదుపాయాలకు దగ్గరగా నివసించే ప్రజల సంఖ్యపై ప్రపంచ అంచనా లేదు. బిపిఎల్ తో కలిసి మేము చేసిన పని, వారి జీవితకాలంలో శిలాజ ఇంధనాల వల్ల కలిగే భారీ ప్రమాదాల స్థాయిని వెల్లడిస్తుంది. బొగ్గు, చమురు, గ్యాస్ ప్రాజెక్టులు వాతావరణ గందరగోళానికి కారణమవుతున్నాయి. ప్రజలకు, ప్రకృతికి హాని కలిగిస్తున్నాయి’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లామర్డ్ పేర్కొన్నారు.

‘మానవ హక్కులపై వాతావరణ సంక్షోభం, చెత్త ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ‘డీఫోసిలైజ్’ చేయవలసిన ఆవశ్యకతకు ఈ నివేదిక మరిన్ని ఆధారాలను అందిస్తుంది. శిలాజ ఇంధనాల యుగం ఇప్పుడే ముగియాలి’. పరిశోధన, ప్రపంచ గణనలకు నాయకత్వం వహిస్తూ, బిపిఎల్ శిలాజ ఇంధన మౌలిక సదుపాయాలకు గురయ్యేస్థాయిని మ్యాప్ చేసింది. ఈ నివేదిక కొలంబియా లా స్కూల్ స్మిత్ ఫ్యామిలీ హ్యూమన్ రైట్స్ క్లినిక్‌తో భాగస్వామ్యంలో నిర్వహించిన లోతైన గుణాత్మక పరిశోధనపై ఆధారపడి ఉంది. బ్రెజిల్ (గ్వానాబారా బే) లోని చేతివృత్తుల, మత్స్యకార సంఘాల నుండి ప్రత్యక్షంగా ప్రభావితమైన వ్యక్తులు, కెనడా లోని స్వదేశీ భూరక్షకులు (వెట్‘సువెట్’ఎన్ భూభాగం), సెనెగల్ (సలోమ్ డెల్టా) లోని తీరప్రాంత కమ్యూనిటీలు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, సిఎస్‌ఒలు, ప్రభుత్వ అధికారులతో సహా 90 మందికి పైగా వ్యక్తుల ఇంటర్వ్యూలను పొందుపరిచింది.

ప్రమాదంలో ఉన్న జనాభా అద్భుతమైన పరిమాణం ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలలో పంపిణీ చేసిన 18,000 కంటే ఎక్కువ ఆపరేటింగ్ శిలాజ ఇంధన మౌలిక సదుపాయాల ప్రదేశాల నుండి 5 కి.మీ.ల పరిధిలో కనీసం 2 బిలియన్ల మంది నివసిస్తున్నారు. వీరిలో, 520 మిలియన్లకు పైగా పిల్లలు ఉన్నారని అంచనా. కనీసం 463 మిలియన్ల మంది ఈ ప్రదేశాల నుండి 1 కి.మీ. దూరంలో నివసిస్తున్నారు. వారు చాలా ఎక్కువ పర్యావరణ, ఆరోగ్య ప్రమాదాలకు గురవుతున్నారు. స్వదేశీ ప్రజలు అసమానంగా బహిర్గతమవుతున్నారు. ప్రపంచ శిలాజ ఇంధన మౌలిక సదుపాయాలలో 16% కంటే ఎక్కువ స్వదేశీ భూభాగాల్లో ఉన్నాయి. కనీసం 32% ప్రస్తుత శిలాజ ఇంధన ప్రదేశాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ‘క్లిష్టమైన పర్యావరణ వ్యవస్థలతో’ అతివ్యాప్తి చెందాయి. శిలాజ ఇంధన పరిశ్రమ విస్తరిస్తూనే ఉంది, ప్రపంచవ్యాప్తంగా 3,500 కంటే ఎక్కువ శిలాజ ఇంధన మౌలిక సదుపాయాల ప్రదేశాలు ప్రతిపాదించారు. బిపిఎల్ గణాంకాలు అటువంటి విస్తరణ కనీసం 135 మిలియన్ల మందిని ప్రమాదంలో పడేస్తుందని సూచిస్తున్నాయి.

ముఖ్యంగా, అన్ని ఖండాలలో చమురు, గ్యాస్ ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతుంది. అయితే బొగ్గు ప్లాంట్లు, గనుల సంఖ్య ఎక్కువగా చైనా, భారతదేశంలో పెరుగుతోంది. ‘శిలాజ ఇంధనాలను దశలవారీగా తొలగిస్తామని ప్రభుత్వాలు ప్రతిజ్ఞ చేశాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా మన అత్యంత కీలకమైన పర్యావరణ వ్యవస్థలలో కొత్త శిలాజ ఇంధన ప్రాజెక్టులు ప్రాధాన్యతగా విస్తరిస్తున్నాయని చూపించే స్పష్టమైన ఆధారాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఇది పేర్కొన్న వాతావరణ లక్ష్యాలకు ప్రత్యక్ష విరుద్ధం’ అని నివేదిక ప్రపంచ పరిశోధనలకు ఆధారమైన పత్రానికి నాయకత్వం వహించిన బిపిఎల్ సీనియర్ డేటా సైంటిస్ట్ గిన్ని బ్రైచ్ పేర్కొన్నారు. ‘మేము తరాల మధ్య యుద్ధ అలసటను అనుభవిస్తున్నాము… మేము భౌతికంగా (దీని నుండి) బయటపడలేము. మేము ఎప్పుడూ ప్రేరేపకులం కాదు కానీ అన్ని హింసల భారాన్ని మేము భరించాము’ అని వెట్’సువెట్’ఎన్ ల్యాండ్ డిఫెండర్ త్సాకే’ స్లేడో’ (మోలీ విక్హామ్) కెనడాలో కోస్టల్ గ్యాస్‌లింక్ (సిజిఎల్) పైప్‌లైన్ లాభదాయకతను పెంచడానికి కొత్త కంప్రెసర్‌ల నిర్మాణం త్వరలో జరుగుతుందని వివరిస్తూ పేర్కొన్నారు.

చాలా ప్రాజెక్టులు కాలుష్య హాట్‌స్పాట్‌లను సృష్టించాయని, సమీపంలోని కమ్యూనిటీలు, కీలకమైన పర్యావరణ వ్యవస్థలను ‘త్యాగ మండలాలు’గా మార్చాయని స్పష్టం అవుతుంది. ప్రజలు, వన్యప్రాణులకు హాని కలిగించే లేదా ప్రమాదం కలిగించే శిలాజ ఇంధనాల అన్వేషణ, ప్రాసెసింగ్, సైట్ అభివృద్ధి, రవాణా, నిర్వీర్యం తీవ్రమైన కాలుష్యం, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు, దెబ్బతిన్న కీలక జీవవైవిధ్య ప్రాంతాలు లేదా కార్బన్ సింక్‌లకు దారితీసింది. అంతర్జాతీయ వాతావరణ ఒప్పందాల కింద చేసిన నిబద్ధతలు, శిలాజ ఇంధనాలను అత్యవసరంగా తొలగించాలని ఐరాస పదేపదే పిలుపునిచ్చినప్పటికీ, ప్రభుత్వ చర్యలు పూర్తిగా సరిపోవు. శిలాజ ఇంధనాలు ఇప్పటికీ ప్రపంచ ప్రాథమిక ఇంధన సరఫరాలో 80% వాటా కలిగి ఉన్నాయి. అయితే పరిశ్రమ వాటి వేగవంతమైన ఉపసంహరణను నిరోధించడానికి వాతావరణ విధాన వేదికలలో అనవసర ప్రభావాన్ని చూపే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.

ప్రభుత్వాలు శిలాజ ఇంధనాల నుండి పూర్తి, వేగవంతమైన, న్యాయమైన, నిధులతో కూడిన దశను ప్రారంభించాలి. మానవ హక్కులకు అనుగుణంగా ఉత్పత్తి చేయబడిన పునరుత్పాదక శక్తికి న్యాయమైన పరివర్తనను ప్రారంభించాలి. శిలాజ ఇంధన వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని స్వీకరించి అమలు చేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అత్యవసరంగా పిలుపునిచ్చింది’ అని ఆగ్నెస్ కల్లామార్డ్ తెలిపారు. ‘వాతావరణ సంక్షోభం లోతుగా పాతుకుపోయిన అన్యాయాలకు ఒక అభివ్యక్తి, ఉత్ప్రేరకం. ఈ సంవత్సరం కాప్ 30ని స్థానిక ప్రజలు, సాంప్రదాయ సమాజాలు, పౌరసమాజంతో సహా అటవీ ప్రజల అర్థవంతమైన భాగస్వామ్యం కోసం ఒక వేదికగా చేయాలనే ఆతిథ్య దేశం బ్రెజిల్ దృష్టికి ఈ నివేదిక ప్రతిస్పందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా శిలాజ ఇంధన ఉత్పత్తితో ముడిపడి ఉన్న వాతావరణం, మానవ హక్కుల హానికర పరిమాణాన్ని మా నివేదిక బహిర్గతం చేస్తుంది.

స్థానిక ప్రజలు, సాంప్రదాయ సమాజాలపై పరిశ్రమ అసమాన ప్రభావాన్ని వివరిస్తుంది. అవి పెరుగుతున్న ప్రతిఘటనను హైలైట్ చేస్తుంది. ‘శిలాజ ఇంధన పరిశ్రమ, దాని రాష్ట్ర స్పాన్సర్లు దశాబ్దాలుగా మానవ అభివృద్ధికి శిలాజ ఇంధనాలు అవసరమని వాదిస్తున్నారు. కానీ ఆర్థిక వృద్ధి ముసుగులో, వారు దురాశ, లాభాలకు బదులుగా ఎరుపు గీతలు లేకుండా సేవ చేశారని, దాదాపు పూర్తి శిక్షార్హత లేకుండా హక్కులను ఉల్లంఘించారని, వాతావరణం, జీవగోళం, మహాసముద్రాలను నాశనం చేశారని మనకు తెలుసు. ఈ నిరంతర నమూనాలకు వ్యతిరేకంగా, ప్రపంచ శిలాజ ఇంధన రాజకీయ ఆర్థిక వ్యవస్థ అణచివేతకు వ్యతిరేకంగా, మనం సమిష్టిగా ప్రతిఘటించాలి. ప్రపంచ నాయకులు తమ బాధ్యతలు, కట్టుబాట్లను నెరవేర్చాలని డిమాండ్ చేయాలి. మానవత్వం గెలవాలి’ అని ఈ నివేదిక పిలుపిచ్చింది. ఇలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల నుండి వెలువడే కర్బన ఉద్గారాల స్థాయి ఈ ఏడాదిలో రికార్డు సృష్టించనుందని ఒక అధ్యయనంలో వెల్లడికావడం ఆందోళన కలిగిస్తుంది. గతేడాది కన్నా ఇది 1.1 శాతం పెరుగుతోంది.

ఈ ఏడాది శిలాజ ఇంధనాల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 38.1 బిలియన్ల టన్నులకు చేరుకుంటాయని గ్లోబల్ కార్బన్ బడ్జెట్ 2025 అంచనా వేసింది. అంతర్జాతీయ శాస్త్రీయ కన్సార్టియం అయిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు దీన్ని రూపొందించింది. పునర్వినియోగ ఇంధన విస్తరణ ఎంత జరిగినా దాన్ని దాటి అంతర్జాతీయంగా ఇంధన డిమాండ్ పెరుగుతూనే వస్తోందని, అందువల్ల కాలుష్య ఉద్గారాలు కూడా పెరుగుతున్నాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్ కన్నా పెరగకుండా చూడాల్సిన లక్ష్యం నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదని ఆ నివేదిక హెచ్చరించింది. పైగా కర్బన కాలుష్యాన్ని సహజసిద్ధమైన రీతిలో హరించుకునే సముద్రాలు, అడవులు వంటివి కూడా వాతావరణ మార్పుల వల్ల బలహీనపడుతున్నాయని నివేదిక పేర్కొంది.

– చలసాని నరేంద్ర

98495 69050

పారిశుధ్యమే పరమార్థం

ప్రతి ఏటా నవంబర్19న నిర్వహించబడే ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ఈసారి, అంటే 2025లో, ప్రపంచ పారిశుధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన వేగవంతమైన, స్థిరమైన చర్యల ఆవశ్యకతను మరింత బలంగా నొక్కి చెబుతోంది. 2030 నాటికి అందరికీ సురక్షితమైన పారిశుద్ధ్యాన్ని అందించాలనే సుస్థిర అభివృద్ధి లక్ష్యం -6 వైపు ప్రపంచం ముందుకు సాగడంలో, ప్రతి పౌరుడికి మరుగుదొడ్డి సౌకర్యం అందించడం అనేది కేవలం ఒక సౌకర్యం కాదు, అది ఒక ప్రాథమిక మానవ హక్కు. భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ద్వారా గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మలవిసర్జన రహిత (ఒడిఎఫ్) హోదాను సాధించినప్పటికీ, పారిశుధ్య ఉద్యమం ఇంకా చాలా మైళ్ళ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంది. కేవలం మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే కాకుండా వాటిని నిరంతరంగా, సరిగ్గా వినియోగించడం, మురుగు వ్యర్థాలను సురక్షితంగా నిర్వహించడం అనే తరువాతి దశపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. సురక్షితమైన మరుగుదొడ్డి సదుపాయం వలన కలిగే ఉపయోగాలు కేవలం వ్యక్తిగత శుభ్రతకు మాత్రమే పరిమితం కాకుండా, దేశ సామాజిక, -ఆర్థిక పురోగతికి మూలస్తంభాలుగా నిలుస్తాయి.

పారిశుధ్యం మెరుగుపడడం వల్ల అతిసారం, కలరా, టైఫాయిడ్ వంటి మల-నోటి మార్గాల ద్వారా వ్యాపించే తీవ్రమైన వ్యాధులు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా, ప్రతి సంవత్సరం అపరిశుభ్రత కారణంగా చిన్న పిల్లల్లో సంభవించే మరణాలను అరికట్టడంలో మరుగుదొడ్డి వినియోగం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ప్రతి సంవత్సరం 60,000 నుంచి 70,000 మంది పిల్లల ప్రాణాలు రక్షించబడుతున్నాయంటే ఈ ఉద్యమం ప్రజారోగ్యంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. మరుగుదొడ్డి వినియోగం వలన మహిళలు, బాలికలకు ఆత్మగౌరవం, భద్రత లభిస్తాయి. బహిర్భూమికి వెళ్లవలసిన అవసరం లేకపోవడం వల్ల చీకట్లో లేదంటే ఒంటరిగా వెళ్లవలసిన భయం తొలగిపోతుంది. తద్వారా వారు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా మెరుగైన పారిశుధ్యం విద్యపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. బాలికలు ఋతుస్రావ సమయాల్లో కూడా పాఠశాలలకు వెళ్లడానికి ప్రోత్సహించబడుతారు. ఎందుకంటే వారికి పాఠశాలల్లో శుభ్రమైన, సురక్షితమైన టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

పారిశుధ్య లోపం కారణంగా అనారోగ్యం పాలై పని దినాలను కోల్పోవడం తగ్గుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది. ప్రజల ఉత్పాదకత పెరుగుతుంది. మరుగుదొడ్ల నిర్వహణ వినియోగంలో ఇబ్బందులు భారతదేశంలో పారిశుధ్య లక్ష్యాలను పూర్తిగా చేరుకోవడానికి అతిపెద్ద సవాళ్లుగా నిలుస్తున్నాయి. మొదటి దశలో మరుగుదొడ్ల నిర్మాణం వేగంగా జరిగినప్పటికీ, వాటిని స్థిరంగా, సరైన పద్ధతిలో ఉపయోగించడంలో సాంస్కృతిక అడ్డంకులు, అలవాట్లు అడ్డుపడుతున్నాయి. ‘ఇంట్లో టాయిలెట్ నిర్మించుకోవడం అశుభం’ అనే మూఢనమ్మకాలు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. రెండవ అతిపెద్ద సవాలు ఏమిటంటే వ్యర్థాల నిర్వహణ. స్వచ్ఛ భారత్ మిషన్ దశ- 2 లో ప్రధానంగా దృష్టి సారించింది దీనిపైనే. పట్టణాల్లో సెప్టిక్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల మానవ వ్యర్థాలు నేరుగా నీటి వనరుల్లోకి వెళ్లి వాటిని కలుషితం చేస్తున్నాయి. దేశంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలలో 30% కంటే తక్కువ మాత్రమే శుద్ధి అవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

మల బురదను శుభ్రం చేయడానికి యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అనేక చోట్ల ఇంకా పారిశుధ్య కార్మికులను మ్యాన్‌హోళ్లలోకి పంపడం జరుగుతోంది.ఈ అమానుషమైన, ప్రమాదకరమైన పద్ధతిని పూర్తిగా నిర్మూలించకపోవడం మన పారిశుద్ధ్య ఉద్యమంపై ఒక చీకటి మరక. ముఖ్యంగా, వాతావరణ మార్పుల ప్రభావం కూడా పారిశుధ్య వ్యవస్థలపై పడుతోంది. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు పల్లపు ప్రాంతాల్లోని మరుగుదొడ్లు, సెప్టిక్ ట్యాంకులు పొంగి, వ్యర్థాలన్నీ ప్రజలు నివసించే ప్రాంతాల్లోకి, తాగునీటి వనరుల్లోకి చేరి నీటి కాలుష్యం, వ్యాధుల వ్యాప్తికి దారితీస్తున్నాయి. దీనికితోడు పట్టణీకరణ వేగం పెరగడంవల్ల పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుధ్య మౌలిక సదుపాయాలను విస్తరించడం, పాతబడిపోతున్న వ్యవస్థలను ఆధునీకరించడం అనేది స్థానిక సంస్థలకు ఆర్థికంగా, సాంకేతికంగా పెద్ద భారం. 2025 ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా, భారతదేశం కేవలం మరుగుదొడ్లను నిర్మించడం నుండి ‘సురక్షితంగా నిర్వహించబడే పారిశుద్ధ్యం’ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

అంటే, మానవ వ్యర్థాలు సేకరించబడి, రవాణా చేయబడి, శుద్ధి చేయబడి, సురక్షితంగా పారవేయబడేవరకు జరిగే ప్రక్రియ అంతా సురక్షితంగా ఉండాలి. దీని కోసం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. నీటిని తక్కువగా ఉపయోగించే ‘బయో -టాయిలెట్లు’, వికేంద్రీకృత వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, గోబర్‌ధన్ వంటి ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా వ్యర్థాలను శక్తి వనరులుగా మార్చవచ్చు. పారిశుధ్య సేవలను అందించడంలో మహిళా స్వయం సహాయక సంఘాలు, ట్రాన్స్‌జెండర్ వర్గాలను భాగస్వాములను చేయడం ద్వారా వారికి ఉపాధి కల్పించడంతోపాటు, పారిశుధ్య సేవల్లో సామాజిక సమ్మిళితత్వాన్ని తీసుకురావాలి. నిధులు, ప్రభుత్వ సంకల్పంతో పాటు ప్రజాభాగస్వామ్యం అనేది ఈ ఉద్యమం విజయానికి కీలకం. ప్రతి పౌరుడు మరుగుదొడ్డిని తమ ఇంటి గౌరవంగా, కుటుంబ ఆరోగ్యానికి భరోసాగా భావించి, దానిని శుభ్రంగా ఉంచే అలవాటును పెంచుకోవాలి. అప్పుడే, భారతదేశం నిజంగా బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మారి, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. మరుగుదొడ్డి అనేది కేవలం ఒక నిర్మాణం కాదు, అది ఆరోగ్యకరమైన, ఆత్మగౌరవంతో కూడిన భవిష్యత్తుకు వేసే గట్టి పునాది.

– జనక మోహన రావు దుంగ

– 8247045230

( నేడు ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం)

మావోలకు కోలుకోలేని దెబ్బ

మావోయిస్టు పార్టీ అగ్రశ్రేణి దళం పీపుల్స్ గెరిల్లా ఆర్మీ కమాండర్ హిడ్మా మరణం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. మధ్య భారతంలో దండకారణ్యం నేర్పుతున్న పాఠం మావోయిస్టులే కాదు, ఇప్పటికీ రకరకాల సూత్రీకరణలతో ఉనికిలో ఉన్న నక్సలైట్ గ్రూపులు, కమ్యూనిస్టులు, ప్రగతిశీల ఆలోచనాశీలురు కూడా ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మన ఆలోచన ప్రజలగురించి అయినప్పుడు మనం సామూహిక ప్రజా అభిప్రాయం గౌరవిస్తున్నామా? లేదా! కష్టాల్లో ఉన్న ప్రజలను మార్చడానికి మనకు నచ్చిన సైద్ధాంతిక వెలుగులో మనమే వెళ్ళి సాయుధం అయ్యామా? ప్రజలలో పనిచేసే క్రమంలో అనివార్య స్థితిలో సాయుధులుగా మారామా? ఈ రెండింటిలో సమస్య ఒకటే కావచ్చును. పంథాలు మాత్రం వేర్వేరు. సారూప్యత ఆయుధం అయినప్పుడు, క్రియ కూడా ఒక్కటే అది సాయుధ చర్య, కర్త మనమే అయినా కర్మ మాత్రం ప్రజలనే విశాల జన సమూహానికి సంబంధించినది. కనుక విశాల జనసమూహం అయిన ప్రజలను వేరు పరిచేదిగా కర్మ ఏ రకంగానూ ఉండరాదు. అటు ప్రభుత్వాలు, ఇటు సమూహాలకు అది వర్తిస్తుంది. ఇది ప్రధానపాఠం. రెండు అంశాలూ ప్రజలకు సంబంధించినవే అయినా ప్రజల సంసిద్ధత, శాంతియుత జీవనం, ప్రజలు అబివృద్ధి అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన గుణపాఠం సాయుధ పోరాటానికి ఉంది.

భారతీయ సాయుధ గిరిజన తిరుగుబాట్లను గమనిస్తే కోయ, గోండు, కోలాం, సంతాల్, మూండ తదితర తిరుగుబాట్లలో వాళ్ళ మనుగడ కోసం, జాతి జీవనం కోసం, జాతి అబివృద్ధి కోసం, ఆ జాతి నేతలతోనే! సాధారణ తిరుగుబాటుగా మొదలై శత్రువు దగ్గర ఆధునిక ఆయుధాలు అవసరార్థం గుంజుకొని ధైర్య సాహాసాలతో పోరాడినారు. ఓడినా వారి సమస్య ప్రపంచం దృష్టిలో పడేలా చేయగలిగారు. అడవిపై ఆధిపత్యం నిలబెట్టుకున్నారు. అలా తిరుగుబాటులో చనిపోయిన వారిని శతాబ్దాలుగా ఆరాధ్య దైవాలుగా ప్రజలు ఆరాధిస్తున్నారు. కొమరంభీం, బిర్సాముండా, సమ్మక్క సారక్క తదితర చారిత్రిక ఉదాహరణలు ఎన్నో? అటు ప్రభుత్వం దాడులు, ఇటు నక్సల్స్ సాయుధ చర్యల మధ్య నలిగిపోయి వలస వెళ్ళిన చత్తీస్‌గఢ్ ప్రజల సంఖ్య లక్షకు పైగానే ఉంటుంది. లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ సూత్రీకరణ అదే ధ్రువీకరణ చేస్తుంది. జనతన సర్కార్ పాఠశాల చదువులకు, గిరిజన ప్రజలు భూములకు చట్టబద్ధత లేకపోవడం ప్రజలను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వైపు చూసేలా చేసింది. ఈ దశలో మావోయిస్టులు ప్రజలకు సన్నిహితంగా నిర్ణయాలు మార్చుకొని, రహస్య పార్టీ నిర్మాణం, ప్రజాసంఘాలు నిర్మాణం చేసిఉంటే జనంలో మద్దతు లభించేది.

కానీ, తాము సిద్ధాంతీకరించిన అర్థ వలస, అర్థం భూస్వామ్య స్థితి ఎన్నో ఏళ్ళ నాటి సామాజిక వ్యవస్థ? ఈనాడు అనేక సామాజిక మార్పులు సంభవించాయి. వీటిని గుర్తించకుండా సాయుధ పోరాట సైద్ధాంతిక కోణం నుండి బయటపడేందుకు ఇష్టపడకపోవడం వలన గత పదేళ్ళుగా తమను తాము కాపాడుకోవడమే మావోలకు సమస్యగా మారింది. మారిన సాంకేతిక పరిజ్ఞానం, వేగం పుంజుకున్న రవాణా సౌకర్యాలు, భౌతిక పరిస్థితి మావోయిస్టు పార్టీ ఉనికికి శత్రువుగా మారిపోయింది. పీపుల్స్ గెరిల్లా ఆర్మీ కూడా ఎక్కడా సైన్యంతో తలపడిందిలేదు. తలదాచుకునే స్థితిలోనే హిడ్మా లాంటి చీఫ్ మరణించడం దాన్నే ధ్రువీకరిస్తూ ఉంది. ఈ దశలో కీలకమైన చత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బిజెపి రాజకీయంగా మావోయిస్టు పార్టీ తో ఉన్న సైద్ధాంతిక వైరం, మరోవైపు రెండు వైపులా. దీన్ని అవకాశంగా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అణచివేత చర్యలు అనంతరం కఠినమైన ఆపరేషన్ కగార్ ద్వారా సైన్యాన్ని దించి తాడోపేడో తేల్చుకోవడానికి బిజెపి ప్రభుత్వం సిద్ధం అయింది.

బిజెపిమావోయిస్టు పార్టీ అణచివేతలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.అర్బన్ నక్సల్స్‌పై కేసులు నుండి ఆపరేషన్ కగార్ వరకు అంతా పకడ్బందీ ప్రణాళికతోనే నడిపింది. సైన్యం చుట్టుముట్టిన దశలో మావోయిస్టు పార్టీ దిద్దుబాటు చర్యలేవీ సఫలం కాలేదు? చర్చలు, కాల్పుల విరమణ లాంటివి ముందుకు తెచ్చినప్పటికీ ప్రతిపాదనలు ఏవీ కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే 600 మంది క్యాడర్‌తో పాటు కేంద్ర కార్యదర్శి సంబాల కేశవరావుతో సహా కేంద్ర కమిటీ సభ్యులు అనేక మంది చనిపోయారు. ఈ దశలో 500 మంది క్యాడర్‌తో సహా సాయుధ పోరాట విరమణ పేరుతో ఆయుధాలు అప్పగించి మల్లోజుల కోటేశ్వరరావు, తక్కేళ్ళపల్లి వాసుదేవరావు లాంటి కీలక నేతలు లొంగుబాటు, సాయుధ పోరాటం సమర్థించే మిగిలిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి, హిడ్మా లాంటి వారు మిగిలారు.

హిడ్మా ఎన్‌కౌంటర్, దేవుజీ లొంగుబాటు వార్తలు నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఉనికి ప్రమాదంలో పడినట్లే? ఎన్‌కౌంటర్స్ అన్నీ చాలా వరకు సజీవంగా పట్టుకొని చంపినవేనన్న పౌరహక్కుల సంఘాల ఆరోపణల్లో ఎంతోకొంత నిజం లేకపోలేదు? దేశంలో అవకాశవాద, నీతిరహిత రాజకీయ వ్యవస్థ వేళ్లూనుకుంటున్న దశలో నిజాయితీ కలిగిన రాజకీయ శక్తుల అవసరం నేడు ఎంతో ఉంది. కానీ, మారిన పరిస్థితిలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలబడే విప్లవశక్తులు అపజయం, వెనకడుగు నష్టమే! కానీ, ప్రజల పక్షాన నిలిచే శక్తుల అర్థరహిత త్యాగాలు కూడా సరైనవి కాదు? ఏ ఉద్యమానికైనా ప్రజల సంసిద్ధత, పరిపక్వత, సామాజిక అనుకూలత ముఖ్యం. అట్లాంటి సమయంలో మార్క్సిజం వెలుగులోనే నూతన మార్గాలు అన్వేషించాలసిన పరిస్థితి నేడు ముందుకు వచ్చింది. ప్రత్యామ్నాయ రాజకీయ ఐక్యపోరాటాలు అవసరం బలపడుతున్న మదోన్మత శక్తులు వేగంగా ముందుకు తెచ్చాయి.ఈ దశలో విశాలమైన ఐక్య సంఘటనకు బదులు నేలవిడిచి సాము చేయడం కరెక్ట్ కాదేమో? ఈ దశలో ఏ రకమైన పోరాటం అయినా ప్రజలకోసమే అయినప్పుడు ప్రజలను ప్రేక్షకులుగా నిలబెట్టే త్యాగాలు అవసరమా అన్నదే నేటి ప్రధాన ప్రశ్న?

– ఎన్. తిర్మల్ 9441865514

లొంగిపోతే పోయేది కొంతే!

యుద్ధంలో సైనికుడు చావుకు బెదరకుండా ముందుకు సాగుతాడు. ఆ తెగువ ఉన్నవాడి వల్లే సైన్యం కదులుతుంది. మనిషిలో జీవమున్నంత సేపే పోరాటంలో పాల్గొనడం సాధ్యపడుతుంది. విప్లవ సాయుధ పోరులోను ప్రాణాన్ని పణంగా పెట్టడం ఆ కార్యాచరణలో తొలిపాఠమే. ప్రాణంపోతే మనిషి జీవితం ముగిసినట్లే. పోతే తిరిగి తెచ్చుకోలేని ప్రాణం విలువ లెక్కకట్టలేనిది. అంతటి ఘనమైన త్యాగం వృథా కాకూడదు. గొప్ప లక్ష్యానికి జీవితకాలం వెచ్చించేందుకు సిద్ధపడ్డప్పుడు ప్రాణం కాపాడుకోవడం కూడా ఒక కొనసాగింపే. విషమ పరిస్థితుల్లో సాహసం కన్నా వ్యూహమే ప్రధానం. ఇక యుద్ధం ముందుకు సాగదనుకున్నప్పుడు అందరూ ప్రాణాలు పోగొట్టుకుంటే రేపటి పోరాటానికి ఏమి మిగలదు. బతికిఉంటే వంద యుద్ధాలు చేయవచ్చు. టాప్ కేడర్ పోలీసు తూటాకు బలి కావడమో లేదా లొంగిపోవడమో జరుగుతున్నప్పుడు పోరాటంలో భాగంగా వారికి, దళసభ్యులకు అంతా అగమ్యం గా ఉంటుంది. యుద్ధం ఒక మలుపు తీసుకుంటున్న తరుణంలో విజ్ఞత అవసరం. ఉద్యమం తుదికంటా లేకుండా అణచివేతకు రాజ్యం సిద్ధపడ్డప్పుడు తిరిగి మొలకెత్తేందుకు కొన్ని గింజలైనా మిగిలి ఉండాలి. శత్రువు వెదికివెదికి చంపుతున్నప్పుడు తెల్లజెండా చూపడం ఆపత్కాల నిర్ణయమే.

తోడు నడిచినవారు వరుసగా నేల రాలుతుంటే ఆలోచనలు అతలాకుతలం అవుతాయి. చెదిరిపోయిన దళాల మధ్య సయోధ్య తెగిపోతుంది. స్వీయ నిర్ణయాల అనివార్యత ఏర్పడుతుంది. ఇలా చావడం కన్నా ఎలాగైనా బతకడం ఒక ఆప్షన్. చివరకు అందరం చచ్చిపోవడమేనేమో అనే తలంపు కొత్త ఆలోచనలకు మూలం కావచ్చు. చావును తప్పించుకోవడానికి తలవంచడం ఓ మార్గం. దాన్ని ఎలా విశ్లేషించాలి అనే విషయంలో ఏకాభిప్రాయం కష్టమే. విప్లవ సేనానిగా గుర్తింపు పొందిన మల్లోజుల వేణుగోపాలరావు ఆ రకమైన లొంగుబాటు పూర్తి గా అనూహ్యమే. నిజానికి మావోయిస్టుల్లో అగ్రనేతలుగా కొనసాగిన మల్లోజుల సోదరులవి చరిత్రకు ఎక్కదగ్గ పోరు జీవితాలు. కోటేశ్వరరావు వీరమరణం పొంది తన అంతిమయాత్రలో చిరస్మరణీయంగా పెద్దపల్లికి ఎరుపెక్కించి విప్లవతారగా మిగిలిపోయాడు. సుదీర్ఘకాలం ఉద్యమంలో కలిసి నడిచిన అన్నదమ్ముల బాట అంతిమంగా ఆచరణలో విడిపోయింది.

అందుకు కారణాలు కూడా ఉన్నాయి. మావోయిస్టుల వేట ఎన్నడూ లేనంతగా ఇప్పుడు తీవ్రమైంది. అరణ్యం నిత్యం మావోయిస్టుల రక్తంతో తడుస్తోంది. చావును తప్పించుకొని బతికితే తప్పేంటి అనే ఆలోచన సిద్ధాంతాన్ని అపహాస్యం చేస్తున్నట్లు అనిపించవచ్చు. బతకడమా చావడమా అనేది ఎప్పుడైనా వ్యక్తిగత నిర్ణయమే. బాగా ఆడుతాడనుకొన్న ఆటగాడు డకౌట్ అయితే అభిమానులు తిట్టి పోస్తారు. ఆడలేకపోయిన పరిస్థితి ఆ ఆటగాడికే తెలుసు. నక్సలైట్లుగా పనిచేస్తూ లొంగిపోయినవారు ఎంతోమంది ఉన్నారు. వివిధ వృత్తుల్లో వారు జనజీవితం గడుపుతున్నారు. లొంగిపోయినవారి పునరావాసం, పోలీసులతో వారు పడుతున్న ఇబ్బందుల గురించి అప్పుడప్పుడు వార్తలు వచ్చాయి కానీ, ఈమధ్య అదంతా సద్దుమణిగింది. అ సిద్ధాంతం రక్తంలో ఇంకిపోయాక బయటికి వచ్చినా ఆలోచన ధోరణి ఆ వైపే ఉంటుంది. ఆ మార్గం వీడలేదన్నట్లు కొందరు వివిధ సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మంచి ఆదాయం ఉన్నవారు తమ ఆసక్తుల మేరకు కళాపోషక పాత్ర పోషిస్తున్నారు. విద్య, వ్యాపారాల్లో స్థిరపడినవారు దాతృత్వాన్ని చేపడుతున్నారు. ప్రజాస్వామిక సభలు, సమావేశాల్లో వారు కీలకంగా కనబడుతున్నారు. మొత్తానికి నిన్నటి ఆలోచనకు విరుద్ధమార్గంలో నడిచేవారు తక్కువే. అంటే లొంగిపోయినవారు అడవిలో నక్సలైటుగా కాకున్నా అర్బన్ నక్సలైటుగా జీవితం కొనసాగించవచ్చు. చట్టం పరిధిలో, రాజ్యాంగబద్ధంగా మన దేశంలో చేసేందుకు బోలెడు పనులున్నాయి. వాటికి కూడా సాహసం, త్యాగనిరతి అవసరమే. శక్తి, ఆసక్తి ఉన్నంత కాలం ఆ పాత్ర పోషిస్తే లొంగుబాటు వృథా కాదు.

– బి. నర్సన్ 

-9440128169

ఉప ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం?

పోటాపోటీగా ప్రచారం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలుపు అనంతరం సహజంగానే కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో మునిగిపోగా, ఓడిపోయిన బిఆర్‌ఎస్ పార్టీలో నిరాశ అలుముకొంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బిఆర్‌ఎస్, బిజెపిలకు ఒక సందేశాన్ని ఇచ్చాయి. భవిష్యత్‌లో రాష్ట్రంలో ఏ పార్టీ ఎలాంటి పాత్ర పోషించాలో స్పష్టత ఇచ్చాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఇక తిరుగులేదనే వాతావరణం లేదు. ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ చతికిలపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో గెలిచిన పార్టీ తర్వాత ఎలాంటి ఫలితాలు సాధించిందో పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.తెలంగాణలో ఉపఎన్నికల్లో గెలిచిన పార్టీ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో పరాజయం పొందినట్టు మెజారిటీ ఫలితాల్లో స్పష్టమైంది. ఉపఎన్నికల తీరును గమనిస్తే గతంలో కెసిఆర్ సర్కార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకే బాటలో ప్రయాణిస్తున్నట్టే ఉంది.

ఉపఎన్నికల్లో గెలవగానే పూర్తి ప్రజామోదం లభించనట్టు కాదని గత ఉప ఎన్నికలు, తర్వాత జరగిన జనరల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. ‘ఇల్లు అలుకగానే పండుగా కాదు’ అనే సామెత గతంలో బిఆర్‌ఎస్‌కు, ఇప్పుడు కాంగ్రెస్‌కు వర్తిస్తుంది. జూబ్లీహిల్స్‌లో గెలిచినంతమాత్రాన ఆరు గ్యారెంటీలను అసంపూర్తిగా అమలుచేసినా ప్రజలు గెలిపించారని కాంగ్రెస్ భావిస్తే పప్పులో కాలేసినట్టే. మహిళలకు నెలకు రూ. 2500 పంపిణీ, పెంచుతామన్న చేయూత పింఛన్లు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ. 12000 వంటి హామీలు అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయం. గతంలో కెసిఆర్ కూడా ఉపఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలను పూర్తిగా అమలు చేయలేకపోవడంతో అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందినట్టు చరిత్రే చెబుతుంది.

ఉపఎన్నికల్లో గెలుపోటములకు పలు కారణాలుంటాయి. అధికారంలో ఉండే పార్టీకి సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే సందర్భంలో అధికార పార్టీ అత్యుత్సాహం ప్రదర్శిస్తే కొన్నిసార్లు ఫలితం పూర్తిగా తిరగబడిన దాఖలాలున్నాయి. తెలంగాణలో జూబ్లీహిల్స్ కంటే ముందు జరిగిన ఎనిమిది ఉపఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాలతోనే ఫలితాలు వెలువడ్డాయి. ఆరుసార్లు అధికార పార్టీ గెలవగా, రెండు సార్లు ప్రతిపక్షం గెలిచింది. అధికారంలో పార్టీ ఉప ఎన్నికలను ప్రతిష్ఠగా తీసుకొని పెద్దఎత్తున మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో దింపడంతోపాటు పలు హామీలిచ్చి గెలిచే అవకాశాలుంటాయి. సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ప్రజాప్రతినిధులకు ఎవరి నియోజకవర్గం వారికే ప్రాధాన్యతవుతుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో పెట్టినంత ప్రత్యేక దృష్టి సాధారణ ఎన్నికల్లో పెట్టడం సాధ్యం కాదని గత ఎన్నికల ఫలితాలే నిరూపిస్తున్నాయి.

పాలేరు నియోజకవర్గానికి 2016లో జరిగిన ఉపఎన్నికల్లో మంత్రి హోదాలో బిఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు 26 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై గెలిచి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో 3% ఓట్ల తేడాతో ఓడిపోయారు. నారాయణఖేడ్‌లో సిట్టింగ్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ పి. కిష్టారెడ్డి మృతితో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన మహేంద్‌రెడ్డి 34.63% ఓట్లతేడాతో గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుండి గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019లో నల్గొండ ఎంపిగా గెలవడంతో ఎంఎల్‌ఎ పదవికి రావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేయగా అధికార బిఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి చేతిలో 21.65 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతిలో 20.85 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020లో దుబ్బాక ఉపఎన్నికల్లో బిజెపి తరఫున పోటీచేసిన రఘునందన్ రావు కేవలం 0.65 శాతం ఓట్ల తేడాతో గెలిచినా, 2023 సాధారణ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ చేతిలో 30.62 శాతం ఓట్లతో ఓడిపోయారు.

ఈటల రాజేందర్ బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో 2021లో జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల్లో బిజెపి తరఫున ఈటల రాజేందర్ 11.58 శాతం ఓట్ల తేడాతో బిఆర్‌ఎస్‌పై గెలిచి, 2023 సాధారణ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ చేతిలో 8.06 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021 నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరఫున నోముల భగత్ 9.88 శాతం ఓట్ల తేడాతో గెలిచి, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో 27.64% ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామ చేసి బిజెపిలో చేరడంతో 2022లో జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలచింది. బిజెపి తరఫున పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో 4.57%ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరి 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 17.38 శాతం ఓట్ల తేడాతో గెలిచారు. 2025 జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 12.7 శాతం ఓట్ల తేడాతో గెలిచారు. హుజూర్‌గర్, హుజురాబాద్, మునుగోడులో మారిన రాజకీయ కారణాల నేపథ్యంలో ఉప ఎన్నికలు జరగ్గా, పాలేరు, నారాయణఖేడ్, దుబ్బాక, నాగర్జునసాగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థుల మరణంతో ఉపఎన్నికలు జరిగాయి.

రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందిత 13.88 శాతం ఓట్లతో బిజెపి అభ్యర్థి శ్రీగణేశ్‌పై గెలిచిన అనంతరం మూడు నెలల వ్యవధిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో 2024లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ అసెంబ్లీ సెగ్మంట్‌కు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. 2023లో ఇక్కడ బిజెపి నుండి పోటీ చేసి ఓడిపోయిన శ్రీగణేష్ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి 2024 ఉప ఎన్నికల్లో 10.06 శాతం ఓట్ల తేడాతో బిజెపిపై గెలిచారు. 2023లో గెలిచిన బిఆర్‌ఎస్ మూడో స్థానానికే పరిమితమైంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనం అనంతరం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉపఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగానే ఉన్నాయి. నంద్యాలలో 2014లో వైఎస్‌ఆర్‌సిపి నుండి గెలిచిన భూమా నాగిరెడ్డి అనంతరం అధికార టిడిపిలో చేరాక అకాల మరణం పొందారు. ఇక్కడ 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి టిడిపి నుండి పోటీ చేసి వైఎస్‌ఆర్‌సిపిపై 15.86 ఓట్ల శాతం తేడాతో గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాలలో బ్రహ్మానంద రెడ్డి వైఎస్‌ఆర్‌సిపి చేతిలో 17.50 శతం ఓట్లతో తేడాతో ఓడిపోయారు. ఆత్మకూరులో 2022 ఉప ఎన్నికల్లో గెలిచిన అధికార వైఎస్‌ఆర్‌సిపి 2024లో ఓడిపోయింది. ఇటీవల పులివెందులలో జరిగిన జెడ్‌పిటిసి ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఎలా జరిగియో బహిరంగ రహస్యమే.

బిజెపి నేతల ప్రచారం శైలి కూడా తమ పార్టీ కంటే ఇతర పార్టీలకు మేలు చేసేదిగానే జరిగింది. కేంద్రమంత్రి బండిసంజయ్ ప్రచారం చివరి దశలో ముస్లిం మైనారిటీల లక్ష్యంగా చేసుకొని రేవంత్‌రెడ్డిని విమర్శిస్తూ ప్రసంగాలు చేయడంతో ముస్లిం ఓటు బ్యాంకు సంఘటితమై భారీగా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లింది. ఎపిలో టిడిపి, జనసేన, బిజెపి ఒకే కూటమిలో ఉన్నా జూబ్లీహిల్స్ లో టిడిపి బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించలేదు. జనసేన కూడా సంపూర్ణంగా బిజెపి కోసం పని చేయలేదు. సెటిలర్లు ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్‌లో టిడిపికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఉప ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధంతో కాంగ్రెస్ వైపు మళ్లింది. జూబ్లీహిల్స్‌లో 2023 శాసనసభ ఎన్నికలతో 2025 ఉప ఎన్నికల ఫలితాలను పోలిస్తే.. 2023లో బిఆర్‌ఎస్ 43.94 శాతం ఓట్లు పొందితే 2025లో 38.13 శాతం, కాంగ్రెస్ 2023లో 35.03% పొందితే, 2025లో 50.83%, బిజెపి 2023లో 14.11 శాతం పొందితే 2025లో 8.76 శాతం ఓట్లు సాధించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జూబీహిల్స్ సెగ్మంట్‌లో 36.64 శాతం సాధించిన బిజెపి ఇప్పుడు ఉపఎన్నికల్లో కేవలం 8.76% ఓట్లే పొందింది. బిఆర్‌ఎస్ విషయానికొస్తే 2024లో 10.42 శాతం ఓట్లే పొందిన ఆ పార్టీ ఉప ఎన్నికల్లో 38.13 శాతం ఓట్లు సాధించింది.

అంటే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి పడ్డ ఓట్లు ఇప్పుడు దాదాపు బిఆర్‌ఎస్ పార్టీకి బదిలీ అయ్యాయి. అంటే జూబ్లీహిల్స్‌లో 2023లో గెలిచిన బిఆర్‌ఎస్ అక్కడ మళ్లీ పుంజుకుందని తేలింది. మాగంటి గోపినాథ్ అకాల మరణం తర్వాత కూడా బిఆర్‌ఎస్‌కు ఉన్న ఆ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన 50.83 శాతం ఓట్లను ఉప ఎన్నికల్లోనూ నిలబెట్టుకుంది. ఈ పార్టీకి వచ్చి ఓట్లను పరిశీలిస్తే జూబ్లీహిల్స్ సెగ్మంట్‌లో నిర్ణయాత్మకంగా ఉన్న మైనారిటీ ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ఇప్పుడు ఉపఎన్నికల్లో కూడా బిజెపి చేసిన ముస్లిం వ్యతిరేక ప్రచారంతో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్‌కే ఓటు వేశారు.తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉప ఎన్నికలు భారీ వ్యయంతో కూడుకున్న ఎన్నికలుగా మారుతున్నాయి. అధికారంలో ఉన్నవారు ఇతర ప్రతిపక్షాల కంటే అధికంగా ఖర్చు చేస్తున్నారు. గత ఉప ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో పార్టీలు మరింత అధికంగా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. భారీ ఖర్చుతో కూడుకున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలను లోతుగా గమనిస్తే గెలిచిన కాంగ్రెస్‌కు ఇది బలం కాదు వాపు మాత్రమే అని చెప్పవచ్చు.

ఎన్నికల షెడ్యూల్ ముందే మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా అభివృద్ధి బాధ్యతలను అప్పగించి హడావుడిగా పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎంఎల్‌ఎలను, ఎంపిలను, ఇతర ప్రజాప్రతినిధులను నియోజకవర్గంలో పగలు రాత్రి మోహరించి పలు హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ వారికి ఎంఐఎం ఎంఎల్‌ఎలు, ఎంపి, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తోడయ్యి భారీ హామీలిచ్చారు. వాటినన్నింటినీ పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. ఒకానొక దశలోబిఆర్‌ఎస్ దూసుకుపోతుందనే వార్తలొచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ వీధివీధిన ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మైనారిటీ ఓట్ల మీద దృష్టి పెట్టి ఆగమేఘాల మీద అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. ఉద్యోగులకు డిఎ ప్రకటించారు. మరోవైపు బిఆర్‌ఎస్ ప్రజాక్షేత్రం కంటే సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడి చేతులు కాల్చుకుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలను తమ ప్రభుత్వ పనితీరుకు కొలమానమని విశ్వసిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలకు వెళ్లగలదా..? అప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ బలానికి నిదర్శనమా..? లేదా ఇది కేవలం తాత్కాలిక వాపా..? అని తేలుతుంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు ఒక గుణపాఠంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.

– తోపుచర్ల నిఖిల్

పాత్రికేయులకేదీ పెద్ద దిక్కు?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి ఏర్పాటయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సర కాలంగా పనిచేయడం లేదు. ప్రెస్ కౌన్సిల్ 14వ టర్మ్ (పదవీ కాలం) అక్టోబర్ 5, 2024న ముగిసిన తర్వాత, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలోని చట్టబద్ధమైన, క్వాసీ జుడిషియల్ వ్యవస్థకు క్రియాశీలమైన కమిటీ లేకపోవడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. పిసిఐ 15వ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడానికి ఎటువంటి ఆచరణాత్మక చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. కొత్త కౌన్సిల్ ఏర్పాటులో జాప్యాన్ని ఆశ్చర్యకరంగా అభివర్ణిస్తూ, వివిధ జర్నలిస్ట్ సంస్థలు సంబంధిత అధికారులను అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. వార్తా ఛానెళ్లు, రేడియో , డిజిటల్ ప్లాట్ ఫామ్‌లను దాని అధికార పరిధిలోకి తీసుకురావడానికి, అవసరమైతే, దానిని మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చేందుకు పిసిఐకి అధికారం ఇవ్వాలని కూడా వారిలో చాలామంది డిమాండ్ చేశారు.

పిసిఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది మొదట 1966లో ప్రెస్ కౌన్సిల్ చట్టం 1965 కింద స్థాపించబడింది. తరువాత 1979లో ప్రెస్ కౌన్సిల్ చట్టం 1978 ద్వారా తిరిగి స్థాపించబడింది. దీని ప్రధాన లక్ష్యం దేశంలో పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం, వార్తాపత్రికలు, వార్తాసంస్థల ప్రమాణాలను మెరుగుపరచడం. ఈ కౌన్సిల్ మూడు సంవత్సరాల పదవీకాలాన్ని కలిగి ఉంది. గత సంవత్సరం చైర్‌పర్సన్ కొత్త కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోలేదు. పిసిఐలో ఒక చైర్మన్ (సాధారణంగా రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిని నియమిస్తారు) 28 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 13 మంది ప్రొఫెషనల్ జర్నలిస్టులు ఉంటారు. వీరిలో ఆరుగురు వార్తాపత్రికల సంపాదకులు, మరో ఏడు మంది పనిచేసే జర్నలిస్టులు ఉండాలి.

మరో ఆరు మంది సభ్యులు వార్తాపత్రికల నిర్వహణకు (యజమానులతో సహా) ప్రాతినిధ్యం వహిస్తారు. పెద్ద, మధ్యస్థ, చిన్న వార్తాపత్రికల నుండి ఒక్కొక్కరు తీసుకోబడతారు. ఒక సభ్యుడు వార్తా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తారు. పార్లమెంటులోని రెండు సభలు ఐదుగురు సభ్యులను పంపుతాయి. ముగ్గురు వ్యక్తులను విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సాహిత్య అకాడమీ వరుసగా విద్య, చట్టం, సాహిత్య రంగాల నుండి నామినేట్ చేస్తాయి. కానీ పిసిఐ వార్తాపత్రికలు, పత్రికలు, వార్తాసంస్థల పనితీరును మాత్రమే సమీక్షించగలదు. అంతేకాకుండా, మార్గదర్శకాలను అమలు చేయడానికి ఇది పరిమిత అధికారాన్ని కలిగి ఉంటుంది. మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు వార్తా సంస్థలు, వాటి సంపాదకులు, వర్కింగ్ జర్నలిస్టులను కూడా శిక్షించజాలదు.

భారతదేశంలో దాదాపు 1,00,000 ప్రచురణలను (రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా ఆమోదించినవి) ఇంగ్లీష్‌తో సహా వివిధ ఫ్రీక్వెన్సీలు, భాషలలో వెలువడుతూ ఉంటాయి. వేలాది పోర్టల్‌లు, వాట్సాప్ ఛానెల్‌లు, ఇతర డిజిటల్ అవుట్‌లెట్‌లతోపాటు దాదాపు 400 ఉపగ్రహ వార్తా ఛానెళ్లకు భారత్ నిలయం. కొవిడ్- 19 మహమ్మారి తర్వాత ఇతర మీడియా సంస్థల ఆధిపత్యం పెరగడంతో భారతీయ వార్తాపత్రికలు, పత్రికలు సహా మ్యాగజైన్ల (అమ్మకాలు, ప్రకటనల నుండి) ఆదాయాలు తగ్గుతూనే ఉన్నాయి. అయితే, సాంప్రదాయ మీడియా నెమ్మదిగా నష్టాల నుంచి కోలుకుంటుందని చాలామంది ప్రింట్ పరిశీలకులు విశ్వసిస్తున్నారు. డిజిటల్ మీడియా నుంచి వినియోగదారులు విశ్వసనీయ సమాచారం కోసం సాంప్రదాయ మీడియా వైపు మళ్లుతారనీ, పాఠకుల సంఖ్య తిరిగి పెరుగుతుందని భావిస్తున్నారు. 2030 నాటికి ప్రింట్ మీడియా అవుట్‌లెట్‌లు పాఠకుల సంఖ్యను దాదాపు రెండు రెట్లు పెంచుతాయని వారు వాదిస్తున్నారు.

ఇటీవల, అనేక మీడియా సంస్థలు పిసిఐ నియమాలలో మార్పులను వ్యతిరేకించాయి. జాతీయ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులకు బదులుగా వివిధ ప్రెస్ క్లబ్‌ల నుండి సభ్యులను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రెస్ క్లబ్‌లు సాధారణంగా వినోద కార్యకలాపాల కోసమేనని, వాటి కవరేజ్ ప్రాంతాలు సాధారణంగా ఒక నిర్దిష్ట ప్రాంతం, నగరం లేదా పట్టణానికి కట్టుబడి ఉంటాయని వారు వాదిస్తున్నారు. ప్రెస్ క్లబ్‌లు పని చేయని జర్నలిస్టులకు (విద్యావేత్తలు, రచయితలు, సినీ ప్రముఖులు, దౌత్యవేత్తలు వంటివారు) కూడా సభ్యత్వాలను ఇస్తాయి. అంతేకాకుండా, ప్రెస్ క్లబ్/ ప్రెస్ గిల్డ్/ మీడియా క్లబ్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రతినిధులు సభ్యులుగా ఉండరు. గుర్తింపు పొందిన జర్నలిస్ట్ యూనియన్లలో సాధారణంగా భారతదేశంలోని చాలా ప్రాంతాల సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, సిక్కిం మొదలైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అనుబంధ సంస్థలను కలిగి ఉన్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, 23,000 మందికి పైగా సభ్యులకు మద్దతు ఇస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రొఫెషనల్ స్క్రైబ్‌లకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఇంతలో, అవసరమైన అన్ని ప్రమాణాలను నెరవేర్చిన తర్వాత కూడా దాని సభ్యులను చేర్చుకోలేదని ఆల్ ఇండియా వర్కింగ్ న్యూస్ కెమెరామెన్స్ అసోసియేషన్ పిసిఐని సవాలు చేసింది.

ఒక నిర్దిష్ట వార్తాపత్రిక/వార్తా సంస్థ లేదా ఎడిటర్/వర్కింగ్ జర్నలిస్ట్ తన వృత్తిపరమైన దుష్ప్రవర్తనతో పాత్రికేయ ప్రమాణాలను దిగజార్చుతోందని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదులపై పిసిఐ చర్యలు తీసుకుంటుంది. కాబట్టి, అది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. పత్రికా స్వేచ్ఛకు హామీ ఇవ్వబడిన విషయంలో ప్రభుత్వ ప్రవర్తన సముచితం కాదని తేలితే పరిశీలనలు చేసే అధికారం కూడా దీనికి ఉంది. అందువల్ల కౌన్సిల్‌ను సక్రియం చేసి తిరిగి ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని రకాల మీడియా సంస్థలను తన పరిధిలోకి తీసుకు వచ్చేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలి.

(మొదటి ప్రెస్ కమిషన్ (1956) సిఫార్సు మేరకు 1966, నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాట యింది. కౌన్సిల్ ఏర్పడిన రోజును ప్రతి సంవత్సరం జాతీయ పత్రికా దినోత్సవంగా జరుపుకుంటున్నాం)

నవ థాకురియా

చిరుధాన్యాలతోనే చక్కెరవ్యాధికి చెక్

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువమందిని కలవరపెడుతున్న అంశం జీవనశైలి జబ్బులు. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే బిపి, షుగర్, గుండెజబ్బులు వంటివి ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మందిని భయపెడుతున్నాయి. కారణం పెరిగిన కాలుష్యం, మారిన జీవనశైలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.జంక్, ప్రాసెస్‌డ్ ఆహారం అనేక రోగాలకు కారణం అవుతోంది. ఈ పరిస్థితుల్లో రోగాలను దరిచేరనీయని చిరుధాన్యాలు అమృతంలా మారాయి. ప్రపంచంలో అనేకమంది తమ ఆహారంలో వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. చిరుధాన్యాలు అంటే చిన్న గింజలు కలిగిన తృణధాన్యాల సమూహం. వీటిలో జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, రాగులు వంటివి ప్రధానమైనవి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, ఫైబర్, పోషకాలు అధికంగా కలిగి ఉంటాయి, జీవనశైలి వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. ఆధునిక యుగం మనిషిజీవితంలో వేగాన్ని పెంచింది. గడియారంతో పోటీ పడుతూ తీవ్ర ఒత్తిడి మధ్య పని చేస్తే కానీ బతకలేని పరిస్థితి ఏర్పడింది.

ఈక్రమంలో మనిషి అనేక ముఖ్య విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ప్రధానంగా ఆరోగ్యాన్ని నిర్దేశించే తిండి, నిద్ర విషయంలో సమతౌల్యం లోపిస్తోంది. ఉద్యోగ, కుటుంబ ఒత్తిళ్ల మధ్య వంట చేసుకునే సమయం లేకపోవడం వల్ల ఆరోగ్యానికి చేటు చేసే జంక్ ఫుడ్, ప్రాసెస్‌డ్ ఫుడ్ ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగి చిన్న వయసులోనే బిపి, షుగర్, గుండెజబ్బులు సహా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సివస్తోంది. అయితే కొవిడ్‌కు ముందు వరకు ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నా ఆ తర్వాత మాత్రం పరిస్థితుల్లో మాత్రం క్రమంగా మార్పురావడం ఆరంభమైంది. ప్రజల్లో ఆరోగ్య, పోషహాకార స్పృహ పెరిగింది. ఫలితమే విస్తృత పోషకాలు కలిగిన చిరుధాన్యాలకు ఆదరణ పెరగడం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తూ ఉండడం తో ప్రస్తుతం అనేకమంది చిరుధాన్యాలతోచేసిన ఆహారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఎప్పుడైనా కానీ డయాబెటిస్ అదుపులో ఉండాలన్నా కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఒక ఆహార పదార్థం మనం తీసుకున్నపుడు అది మనకు ఎంత తొందరగా అబ్సార్బ్ అయ్యి ఎంత తొందరగా గ్లూకోస్‌ని శరీరంలో విడుదల చేస్తుందనే దానిని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఎప్పుడూ అవాయిడ్ చేయాలి. షుగర్‌లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే అబ్సార్షన్ స్లోగా జరిగి షుగర్‌ని స్లోగా రిలీజ్ చేస్తుందని అనే కంట్రోల్ మేనర్‌లో ఫుడ్ తీసుకోవాలి. మధుమేహం రాకుండా బరువును అదుపులో ఉంచుకోవడానికి మిల్లెట్స్ ఉత్తమం.

సంపూర్ణ ఆరోగ్యానికి సిరిధాన్యాలు: మిల్లెట్స్‌ను చిరుధాన్యాలు, తృణ ధాన్యాలు అని అంటారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, రాగులు, అరికెలు, అండు కొర్రలు, సామలు, ఊద్లు, ఉలవలు వంటి వాటిని మిల్లెట్స్‌గా పరిగణిస్తారు. ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహార పదార్థాలు కావడంతో వీటిని సిరిధాన్యాలు అని కూడా అంటారు. వీటిలో ఎక్కువ భాగం మొదట పశువులకు మేతగా వాడేవారు. తర్వాత క్రమంగా మన ఆహారంలో భాగంగా మారాయి. వీటిలో మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువ. గోధుమల కంటే 3 నుంచి 5 రెట్లు పోషకాలు కలిగిఉంటాయి. బి విటమిన్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ కలిగి ఉండడంతోపాటు గ్లూటెన్ లేకుండా ఉంటాయి. వీటిలోని అధిక పోషకాల కారణంగానే చిరుధాన్యాలను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జొన్నఅంబలి, రాగిజావ, ఉలవచారు, మక్కగట్క, సామల ఉప్మా, కొర్రల కిచిడీ, పాయసం, జొన్నరొట్టె, గుడాలు,సూప్, చిరుధాన్యాల మిశ్రమ పిండితో రొట్టెలు, బజ్జీలు, బిర్యానీ, వడ, ఉప్మా, కట్లెట్, కీర్, ఇడ్లీలు, దోశ తయారు చేసి విక్రయిస్తుండటం, ఇళ్లలోనూ వీటివాడకం క్రమంగా పెరుగుతోంది. మురుకులు, బిస్కెట్లు తదితరాలను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిరుధాన్యాలను ప్రతిరోజు తింటే మనిషికి ఎన్నడూ జబ్బుచేయదని నిపుణులు చెబుతున్నారు. చిరుధాన్యాల సాగు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. తక్కువ కాలంలో పండే పంటలు. మిగతా పంటలతో పోలిస్తే ఎరువులు, పురుగు మందుల వాడకమూ తక్కువే. ఇవి వర్షాధారితంగా ఎక్కువ పండుతాయి. రసాయనాలు లేకపోవడం, తక్కువ కొవ్వు, అధిక ఫైబర్ ఉండటంతో మధుమేహ వ్యాధిగ్రస్థులు, బరువు తగ్గాలనుకునే వారికి చిరుధాన్యాలు వరదాయినిగా మారాయి. సకల పోషకాలు కలిగిన పదార్థాలు కాబట్టి మిల్లెట్స్‌కు అంత ప్రాధాన్యం ఉంది. మిల్లెట్స్‌ను ప్రజలు ప్రధానంగా రొట్టెలు, దోశలు, సూప్‌లు, అన్నం లాగానే తయారు చేసుకుని తింటారు. వీటిని కడిగి నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి.

మిల్లెట్స్‌తో ప్రయోజనాలు ఇవీ : ఆలస్యంగా జీర్ణమవటంవల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులకు లాభిస్తుంది. వీటిల్లో చక్కెర పదార్థాలు తక్కువగా ఉండగా టైప్ 2 చక్కెరవ్యాధి నిరోధానికి దోపదపడతాయి. చిరుధాన్యాల్లోని మెగ్నీషియం అధిక రక్తపోటు తగ్గిస్తుంది. చిరుధాన్యాల్లో బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఖనిజ లవణాలు పిల్లల్లో ఎదుగుదలకు సాయపడతాయి. నాడీవ్యవస్థ సక్రమ పనితీరుకు, పాస్పరస్ శరీర కణాల పెరుగుదలకు, పిండి పదార్థాలు శక్తిగా మారడానికి దోహదడపతాయి. వీటిలోని నయాసిస్ అనే బి-విటమిన్ బ్లడ్‌లోని చెడుకొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటి వల్ల గుండెసంబంధిత వ్యాధులు సైతం తగ్గుతాయి. కాలేయం, మూత్రపిండాలు, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తాయి. పేగుసంబంధిత కేన్సర్లు, అల్సర్లు ఏర్పడే అవకాశాలను సైతం తగ్గిస్తుంది. ఊబకాయం, మలబద్దకం, తిమ్మిరి, ఉబ్బసం వంటివి రాకుండా సహకరిస్తాయి. సామలలో ఎక్కువగా ఖనిజ లవణం, ఇనుము ఉండటంతో మహిళల్లో రక్కహీనతను నివారిస్తుంది. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా అధిక పీచుపదార్థం కాపాడుతుంది.


డా. చేతన్‌రెడ్డి కె.బి

91540 69355

పథకాల మంత్రం.. వ్యూహాల తంత్రం

ఎగ్జిట్ పోల్స్ ముందుగా వెల్లడించిన అంచనాలకు మించి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికావడం మోడీ నితీశ్ జోడీ దోస్తీ విజయం సాధించడం బీహార్ చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయం. రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవకాశాలను చేజిక్కించుకోవడంలో అపర చాణక్యుడుగా ప్రఖ్యాతి వహించిన ప్రస్తుత ముఖ్యమంత్రి, జెడి (యు) అధినేత నితీశ్ కుమార్ ఇమేజ్ ముందు ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఏమాత్రం పనిచేయలేదని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. విపక్ష కూటమి మహాగట్‌బంధన్ ఎంత ప్రయత్నించినా ఓట్లను రాబట్టుకోలేకపోయింది. మహాగట్ బంధన్‌లో ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో బీహార్‌లో ఓటర్ల జాబితాల్లోని అనేక అవకతవకలు ఎత్తిచూపినా, ఓట్లచోరీ నినాదంతో పోరాటం సాగించినా అవేవీ ఓటర్లకు పట్టలేదనిపిస్తోంది. ఓటర్ల తుది జాబితాలో చోటు లేని 47 లక్షల ఓటర్లలో 16 లక్షల మంది మహిళా ఓటర్లే ఉండగా, ఈసారి పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లలో మహిళలే అత్యధిక శాతం ఉండడం గమనార్హం.

మహిళా ఓట్లపైనే నితీశ్ గురిపెట్టి పథకాల మంత్రాల గారడీ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించిన వెంటనే రాష్ట్రం లోని 21 లక్షలమంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అయ్యేలా మొత్తం రూ. 2100 కోట్లు బదిలీ చేశారు. ఈ విధంగా ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద ప్రతి మహిళా ఓటరుకు రూ. 10 వేలు వంతున ఆర్థిక సాయం అందించగలిగారు. ఈ పథకాల మంత్రంలో మోడీ వ్యూహాల తంత్రం కూడా ఉంది. ఈ మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని గత సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ ప్రారంభించడం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వ్యూహమే. రాష్ట్రంలో 50 శాతం కంటే మహిళా ఓటర్లు ఉన్న జిల్లాలు 25 ఉండగా, ఇక్కడి 174 సీట్లలో జయాపజయాలను నిర్ణయించేది మహిళలే. 2010 నుంచి బీహార్‌లో మహిళా ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. ఈ ఓట్లే నితీశ్‌కు విజయావకాశాలను కల్పించాయి. 2005లో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నితీశ్ మహిళా ఓటు బ్యాంకును చేజిక్కించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు.

బీహార్‌ను అత్యధికంగా వేధిస్తున్న నిరుద్యోగ సమస్యపై ఈసారి పార్టీలన్నీ దృష్టి కేంద్రీకరించి హామీలు గుప్పించాయి. జాతీయ సరాసరి నిరుద్యోగ రేటు 4.1 శాతం ఉండగా, బీహార్‌లో సరాసరి నిరుద్యోగ రేటు 5.9 శాతం వరకు ఉంది. ఇప్పటి వరకు బీహార్‌లో ఏ ప్రభుత్వమూ నిరుద్యోగ నిర్మూలనకు గట్టి ప్రయత్నం చేయకపోయినా, నితీశ్ ప్రభుత్వం ఇటీవల నిరుద్యోగులకు వివిధ రంగాల్లో లక్షలాది అపాయింట్‌మెంట్ లెటర్లు జారీ చేసినట్టు ప్రకటించింది. రాష్ట్రం లోని ఓటర్లలో 22 శాతం మంది అంటే 1.63 కోట్ల మంది 18 నుంచి 23 ఏళ్ల లోపు వారే. వీరిలో 1.5 కోట్ల మంది 20 ఏళ్ల వయసు దాటినా వారు. వీరి ఓట్లు జయాపజయాలను నిర్ణయిస్తాయని భావించి పార్టీలన్నీ హామీలు ప్రకటించాయి. మహాగట్‌బంధన్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. బీహార్‌లో 2.97 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల ప్రకారం 2.97 ఉద్యోగాలు కల్పించడం సాధ్యమా అన్న ప్రశ్న ఎదురైంది.

నిరుద్యోగుల ప్రభావం పోలింగ్‌లో ఎంతవరకు పనిచేసిందో చెప్పలేం. ఎన్‌డిఎ కూటమి కూడా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా, ఉపాధి కల్పన కోసం బడ్జెట్ నుంచే ప్రయత్నాలు ప్రారంభించడం గమనార్హం. ఇక కులాల ప్రభావాన్ని పరిశీలిస్తే 2023లో నితీశ్ కుమార్ నిర్వహించిన కులాల గణన బట్టి బీహార్‌లో కులమే ప్రధాన బలమైన పునాదిగా వెల్లడవుతోంది. ఈ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ ముస్లిం యాదవ్ వర్గాలను సమీకరించడం పైనే దృష్టి కేంద్రీకరించగా, ఎన్‌డిఎ కూటమి మహిళా ఇబిసి వ్యూహాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. బిజెపి అగ్రవర్ణాల ఓట్లను గుత్తగోలుగా కొల్లగొట్టడానికి నిర్విరామం గా కృషి చేసింది. నితీశ్ మాత్రం కుర్మీ ఓట్ల ఆర్జన పైనే దృష్టి పెట్టారు. జెడి(యు) ఎంఎల్‌ఎల్లో ఏడుగురు కుర్మీలు, నలుగురు యాదవులతో కలుపుకుని స్థానిక ప్రాధాన్యం కలిగిన ఒబిసి గ్రూపులకు చెందినవారే ఉన్నారు. ఎన్‌డిఎ కూటమిలో భాగస్వాములైన లోక్‌మోర్చా, ఎల్‌జెపి, హిందుస్థాన్ అవామీ లీగ్ (ఎస్) పార్టీలు దళిత ఓటర్లను ఆకర్షించడానికి సమయం వెచ్చించాయి.

2024 లో కేంద్రంలో ఎన్‌డిఎ అధికార పగ్గాలు అందుకోవడానికి జెడి(యు) పొత్తు ఎంతో కీలక పాత్ర వహించింది. అందుకని కేంద్ర ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగడంలో బీహార్ మద్దతు చాలా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మఖానా బోర్డు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్‌టెక్నాలజీ ఏర్పాటు, ఐఐటిల విస్తరణ, కొత్తగా ఎయిర్‌పోర్టులు ఏర్పాటవుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం దాదాపు 200కు పైగా ఎంపి సీట్లు ఉన్న హిందీ హార్ట్ ల్యాండ్‌లో 40 ఎంపి సీట్లు బీహార్‌లోనే ఉండడం విశేషం. హిందీ హార్ట్‌ల్యాండ్ పరిధిలో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో ఒక్క జార్ఖండ్ మినహా మిగతా రాష్ట్రాలన్నీ ఎన్‌డిఎ కూటమి పాలనలోనే మనుగడ సాగిస్తున్నాయి. కేంద్రం లోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి గుండెకాయ లాంటి ఈ హిందీ బెల్టు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు తారుమారైనా అది కేంద్ర ప్రభుత్వ సుస్థిరతపై తీవ్ర ప్రభావం చూపించక తప్పదు. అందుకని బీహార్ రాష్ట్రంలో ఎన్‌డిఏ కూటమి విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రధాని మోడీ, అమిత్ షా తదితర బిజెపి అగ్రనేతలు నిర్విరామంగా ప్రచారం సాగించి దక్కించుకోగలిగారు. 

తొలిపొద్దు గీతమై.. లోక సంగీతమై!

‘జిల్ల వరముగల్లు జిజ్ఞాస నా ఇల్లు

మా ఊరు రేబర్తి మంచి స్ఫూర్తి

అందె ఇంటి పేరు అలరించు రాగాల

ఆత్మమేలు కొలుపు అవనిలోన

నిష్ఠ కలిగియున్న కష్టాల నెదురీదు

మనిషికందని విద్య మహిని కలదె

పల్క బలపంబట్టి పాఠశాలకు పోలె

అచ్చు హల్లులు కాస్త అభ్యసించ

కలము బట్టాను కరమున కళ్లు దెరిచి

పారజూశాను లోకాన్ని పట్టుబట్టి

ప్రజల భావాలె కవితగ పల్లవించు

తప్పులున్నచో దిద్దుడీ తండ్రులారా!”

ఇది ప్రజాకవి ఉద్యమ గాయకుడు అందెశ్రీ స్వగతం అతని మాటల్లోనే. తన గేయాల సంపుటి అందెల సవ్వడి పుస్తకం ఆఖరి అట్టమీద రాసుకున్న తన ఆనవాలు. అందెశ్రీ తెలంగాణ గడ్డ మీద తన పాటల తోటను పేర్చి దాని అందచందాలను, సువాసనల గాలులను మనకు వదిలేసి తన దారి తాను చూసుకున్నాడు. ఆయన జీవితం గురించి ఆయనే చాలా సాధారణంగా మనకు చెప్పారు. అది అందరికి తెలిసిందే జీవితం సాధారణమైనదే. కాని ప్రయాణమే అంటె సాహితీ జీవితం చాలా చాలా మలుపులు తిరిగింది. ఒక దగ్గర ఆగిపోయే వ్యక్తిత్వం కాదు. ఎప్పుడు ఏదో చేయాలనే, మరేదో రాయాలనే తపనే ఆయనను అక్షరం రాని స్థితి నుంచి విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చే దాకా తీసుకెళ్లింది. ఆయన పేరు మీద అచ్చయిన రెండు గేయాల సంకలనాలు ఆయన సాహితీ సారాన్ని మనకు అందిస్తాయి. దానితోపాటు ఆయన సంకలనం చేసిన తెలంగాణ ఉద్యమ పాటలు “నిప్పులవాగు” కూడా అందరిలో తనను కూడా ఆవిష్కరించుకున్నాడు. అట్లా ఆయన మొదలు పెట్టిన ప్రయాణం నుంచి నేటి వరకు ఆయన ఆలోచనల ధారను మనకు సాక్షాత్కరింప జేస్తుంది.

‘పాటల పూదోట’ అనే మొదటి పుస్తకంలో మనకు ప్రకృతి కవి, ప్రేమ కవి, దేశభక్తి కవి, ఆధ్యాత్మిక కవి ఎక్కువగా కనిపిస్తాడు. ఆ పాటల పుస్తకానికి పరిచయ వాక్యాలు రాసిన వాళ్లలో సి. నారాయణరెడ్డి, పేర్వారం జగన్నాధం, రావూరి భరద్వాజ, ఆచార్య తిరుమల, నాగిశెట్టి లాంటి వాళ్లున్నారు. అందులో రావూరి భరద్వాజ రాసిన నాలుగు వాక్యాలైన ఆనాటి వరకు అందెశ్రీ గురించి మనకు అందించిన విషయాలు చాలా సంక్షిప్తంగా ఎంతో ప్రేమగా ఉన్నాయి. “అందెశ్రీ గారి పాటల పూదోట” ను చూసి నేను సుక్షేత్రంలో విరిసిన సుమవనం అని అనుకున్నాను. నేనెందు కలా అనుకున్నదో, ఈ పుస్తకం చదివాక మీకే తెలుస్తుంది” అని భరద్వాజ కవితాత్మకంగా రాసిన వాక్యాలు ఆనాడు అందెశ్రీకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటాయి. మిగతా పెద్దలు కూడా చాలా ప్రోత్సాహపూరితంగా రాసి, ఎంతో నైతిక మద్దతును పలికారు. ఈ పుస్తకం నిండా మనకు ప్రకృతితో అందెశ్రీ ఆడకున్నట్టు కనిపిస్తుంది. ఇది 1993 కు ముందు ప్రచురించింది. సమస్య ఏమిటంటే ఇందులో ప్రచురణ సంవత్సరం, వివరాలు లేవు. రెండోది, అందెల సవ్వడి. ఈ పుస్తకంలోని పాటలు, గేయాలు రాసే నాటికి అభ్యుదయ, ప్రజా కవుల ఆలోచనలలోకి రాగలిగాడు. అందుకే ఆ పుస్తకం ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్‌కు అంకితం ఇచ్చాడు.

“అబద్ధాల గొంతునొక్కే, వాస్తవ చిత్రాలు చెక్కే, ఇజమెప్పుడు వీడకుండా, నిజమన్నది వాడకుండా ప్రజాకవిగా ప్రభవించిన అజరామరుడు” అంటూ ప్రభాకర్‌ను సొంతం చేసుకున్నాడు. ఇది 1995 96 ప్రాంతంలో అచ్చయి ఉంటుంది. ఈ పుస్తకానికి ప్రముఖ పాత్రికేయులు జి. కృష్ణ రాసిన పరిచయం అందెశ్రీకి ఒక నిలువెత్తు ధ్రువపత్రం. “ఇది” చదువు రాని వాడు “వ్రాసే కవిత’ కు కవిత్వం రానివాడు “వ్రాస్తున్న పరిచయం” అంటూ మొదలు పెట్టాడు. ఇందులో చదువురాని వాడు, కవిత్వం రానివాడు అన్న పదాలు ఇన్‌వర్టెడ్ కామాలలో ఉంచడం గమనించాలి.

“అసలు చదువు రానివాడు వ్రాసే కవిత్వం లోనే నిజమూ, అమాయకత్వమూ సొంపుగా పెన వైచుకొని సాక్షాత్కరిస్తూ ఉంటాయి” అంటూ పరిచయ వాక్యాలు కొనసాగాయి. ఆ తర్వాత వాసిలి వసంత కుమార్ కూడా ఈ పుస్తకానికి ముందు మాట రాశారు. ఈ పుస్తకం వచ్చే సరికి తనలో ఉన్న సామాజిక చైతన్యం బయటకు వచ్చింది”. పూర్వీకులు తవ్విన పునాదులను, పునర్జన్మలను పేరుతో నింపి భయభ్రాంతుల గోడల పెట్టే పురాణ ఇతిహాసాల మేడలు కట్టే స్వర్గం నరకాలు అను పేర్లు పెట్టి మానవతను మంటకల్పి మనుధర్మ శాస్తాలు మనకందని వేదాలు” అంటూ తనలో అంతర్లీనంగా దాగిన ధిక్కారాన్ని బయటకు లాగాడు. అయినా ప్రకృతిని, పల్లెను తన వెంటనే మోసుకొస్తున్నాడు.

ఆ తర్వాత 2000 సంవత్సరాల తర్వాత తన గొంతును సవరించుకొని స్వరాన్ని పెంచాడు. అందులో “పల్లె నీకు వందనాలమ్మో, మముగన్నా తల్లీ నీకు వందనాలమ్మో” అంటూ పల్లెను ప్రపంచం ముందుపెట్టాడు. అంటూ గత నాటి పల్లెను పలవరించే విధంగా చేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తన నిజరూపం, విశ్వరూపం ప్రదర్శించాడు. సూడసక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి అంటూ తెలంగాణ పల్లెను, ఆ పల్లెల్లో ఉండే గొప్పతనాన్ని తన పాటలో ప్రదర్శించాడు . అందువల్లనే ఆ పాట నృత్య రూపకమైపోయింది. అదే తెలంగాణ ధూంధాం ఆరంభ గీతమైంది. ఆ తర్వాత “సూడు తెలంగాణ చుక్క నీళ్లలేని దాన’ అంటూ జల దోపిడీ ఆర్థిక సిద్ధాంతానికి పాట పరిచయ గొంతునిచ్చింది. తెలంగాణ జాతీయ గీతమైన జయ జయ హే తెలంగాణపాట ఉద్యమ ఊపిరిగా మారిపోయింది. జై బోలో తెలంగాణ సినిమాకు రాసిన జై బోలో తెలంగాణ గళ గర్జనల జడివాన అన్న పాట తెలంగాణను ఉర్రూతలూగించింది.

చాలా మంది ఉద్యమకారులకు, మానవతావాదులకు, సెల్‌ఫోన్‌లో రింగ్ టోన్‌గా మారిన “మాయమైపోతున్నాడమ్మా” అన్న పాటతో మాయమైపోతున్న సమాజాన్ని మన ముందుంచాడు. అదే మానవత్వం మనుగడ మీద, మనిషి ఉనికి మీదనే కొరడా ఝళిపించినట్టయింది. అంతేకాకుండా, తన సామాజిక నేపథ్యాన్ని, గ్రామ దేవతల వైభవాన్ని ముఖ్యంగా అమ్మతల్లులైన దేవతల మీద రాసిన పాట తన కవితా సృజనకు ఒక మచ్చుతునక. “కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసే మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా! అంటూ మనిషికి దేవుని, దేవతలపట్ల ఉన్న తాత్వికతను కళ్లముందుంచాడు. వీటన్నింటితోపాటు, “తల మీద సుట్టబట్ట ఆపైన పండ్ల తట్ట, పండ్లు పండ్లుయో అని పల్లెంత తిరిగి అమ్మే తెనుగోల్ల ఎల్లమ్మ ఏది మా పల్లెల్లోన కండ్లల్లో కానరాదేమి! అన్న పాట పల్లె జీవితాన్ని మనకు మరిచిపోకుండా చేయగలదు.

ఎంతో సాహితీ శక్తిని ప్రదర్శించిన అందెశ్రీ ఎవ్వరూ చేయని మరొక గొప్ప కార్యం చేశారు. ఇది చాలా మందికి తెలియదు. ఆయన మెదడులో ఒక ఆలోచన పుట్టింది. అదే ప్రపంచంలోని నదులన్నింటిని సందర్శించాలనేది. అది ఆలోచన. దానికి ఆచరణ జోడించాడు. అమలు చేశాడు. అనుభూతిని పొందాడు. దాదాపు ప్రపంచంలోని ముఖ్యమైన నదులన్నింటిని చూసినవాడు అందెశ్రీ ఒక్కడే అయి ఉంటాడేమో. ప్రపంచంలో ఈ ఘనతను ఎవ్వరూ చేయలేదేమో అనిపిస్తుంది. ఎవరైనా ఇంత కన్నా ఎక్కువ నదులను సందర్శించి ఉంటే మన అభిప్రాయాన్ని సరిచేసుకోవచ్చు. అభ్యంతరం లేదు. 2010 సంవత్సరంలో తన ‘నదీ యాత్ర’ ను ప్రారంభించి ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాల్లోని మిసిసిపి, ఆమెజాన్, నైలు, సరానా, కాంగో, జాంబేజ నదులను చూశారు. వాటి మీద యాత్ర చేశాడు. ఎన్నో వందల రోజులు ఆ నదులతో మాట్లాడాడు.

ఆ తర్వాత రష్యాలోని రష్యా, ఇర్తిష్, ఓట్, యెన్సి నదులను కూడా తన కళ్లతో చూసి, మనసుతో మాట్లాడాడు. అదే విధంగా ఫ్రాన్స్‌లోని సేన్, జర్మనీలోని రైన్ నదులను పలకరించి యాత్రను ముగించాడు. చైనాలోని యాంగ్జి, ఎల్లో నదుల జలాన్ని చేతుల్లోకి తీసుకొని కళ్ల కద్దుకున్నాడు. ఆస్ట్రేలియాకు వెళ్లి యారా, మురై, హకేష్‌బరి నదులలో ఆటలాడి, పాటలు పాడాడు. ఇది మరెవ్వరూ చేయలేని పని. అయితే ఇది అక్షర రూపం దాల్చలేదు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ నదీ యాత్ర మొత్తం ఒక పుస్తకంగా వస్తుందని చెప్పాడు. కాని అది పూర్తి కాలేదు. ఆయనతో ఈ నది యాత్రలో పాల్గొని తుదకంటూ ఆయనతో నడిచిన సంగిశెట్టి సత్యం మీద ఈ బాధ్యత ఉండేమో.

అయితే ఈ నదీ యాత్ర గురించి ఒక సందర్భంలో “అవి నదులు కాదు. నడిచొచ్చే సముద్రాలు. ఆ నదులపై కావ్యం రాయాలనే కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నా” అంటూ మనకు హామీ ఇచ్చాడు. అయితే కావ్యం రాసినట్టు తెలుస్తున్నది. అయితే అది అచ్చు కావాలి. నదీ యాత్ర మీద రాసిన నాలుగు వాక్యాలు మనకు లభ్యమవుతున్నాయి.

“కొండలను కోనలను కొనగోట కొలిసింది

నేలపై నెలవంక తారయై వెలిసింది

అడవులను ముద్దాడి ఆకు పసరయ్యింది

నేలలో పాయలుగా ఉయ్యాల లూగింది

తొలిపొద్దు గీతమై లోక సంగీతమై

నడినడిచిపోతున్నది నన్ను నావనై రమ్మన్నది!” అంటూ “నా జీవన గమనం నా ప్రపంచ నదీ యాత్రా” అంటూ ఎంతో అనుభూతిని వ్యక్తపరిచాడు. కవిత్వంలో, జీవితంలో ఎన్నో అనుభవాలను అనుభూతులను మనకు అందించి, మన నుంచి మరుగై, మాయమైపోయిన మానవతా మూర్తి అందెశ్రీ. 

– మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)