ankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escort

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

holiganbet

Betpas güncel giriş

Casibom

holiganbet güncel giriş

betkolik

trendbet giriş

taksim escort

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

vaycasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

izmit escort

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

marsbahis giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

vaycasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

sekabet

maltcasino

grandpashabet

savoybetting

savoybetting

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casino levant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

vaycasino

Atlasbet Giriş

Wbahis

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

Wbahis

grandpashabet

restbet

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

galabet

kingroyal

holiganbet

marsbahis

casibom

padişahbet

padişahbet giriş

queenbet

padişahbet

padişahbet giriş

casinolevant

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

Pendik escort, esenyurt escort

sekabet

casinolevant

casinolevant giriş

anadoluslot

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

casinolevant

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

గాడ్సే ఆరాధకుల కోసమే ‘గాంధీ’ పేరు తొలగింపు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ ఆర్‌ఇజిఎ)నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించాలనే ప్రయత్నం, బిజెపి, నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఉన్న ప్రజావిరోధి, క్రూరమైన ఉద్దేశాలను స్పష్టంగా బయటపెడుతోంది. ఎం.జి. నరేగా ద్వారా ఇప్పటివరకు 15.5 కోట్ల మంది క్రియాశీల గ్రామీణ కార్మికులకు ఉపాధి లభించింది. వీరిలో దాదాపు 50% మహిళలు. లబ్ధిదారుల్లో అధిక శాతం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, పీడిత వర్గాలకు చెందినవారే. గ్రామస్వరాజ్యం -ప్రతి గ్రామం స్వయం సమృద్ధిగా ఉండాలన్నది గాంధీజీ కల. ఆ కలను రూపం లోకి తీసుకువచ్చిన చట్టమే ఎం.జి. నరేగా. కానీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈ చట్టాన్ని బలహీనపరచడం, క్రమంగా నిర్వీర్యం చేయడం అనే దిశలోనే పని చేస్తోంది. పేదల కోసం అన్నట్లు మాట్లాడే మోడీ ప్రభుత్వం వాస్తవంగా వందమంది కార్పొరేట్ కుటుంబాల అభివృద్ధికే కట్టుబడి ఉంది. నరేగా పై కొనసాగుతున్న దుష్ప్రచారం మొత్తం గోబెల్స్ తరహా అసత్య ప్రచారమే. మహాత్మా గాంధీ పేరు తొలగించడం యాదృచ్ఛిక చర్య కాదు. ఇది గాంధీ హంతకుడు గాడ్సేను ఆరాధించే కాషాయ శక్తులను సంతృప్తి పరచడానికే తీసుకున్న రాజకీయ నిర్ణయం. నరేగా స్థానంలో మరో కొత్త చట్టం తీసుకురావాలన్న ప్రయత్నం కూడా ఇదే అజెండాలో భాగం. కొత్త చట్టంలో: ‘సంవత్సరానికి 100 రోజులు నుంచి 150 రోజులు ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు ఇది కేవలం మోసం. ‘ఖర్చులో 60 శాతం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి అని ప్రతిపాదిస్తున్నారు. దీని వల్ల ‘ఆర్థికంగా బలహీనమైన రాష్ట్రాలు ఈ భారాన్ని మోయలేకపోతాయి. ‘చివరకు ఉపాధి హామీ పథకం ప్రయోజన రహితంగా కూలిపోతుంది. ఇంకా, గ్రామ పంచాయతీలకు పనుల ఎంపికలో అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వమే ఏ పని చేయాలో ఆదేశిస్తుంది. పెరుగుతున్న ధరల మధ్య వేతన పెంపుపై ఒక్క మాట లేదు. ఇది 15.5 కోట్ల గ్రామీణ పేదలపట్ల ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఉన్న అమానుష వైఖరిని స్పష్టంగా చూపిస్తుంది.

ఇప్పటివరకు నరేగా పథకానికి ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం సుమారు రూ. 10 లక్షల కోట్లు. దీని ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆకలి మరణాలు, ఉపాధి లేని వారి ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. కానీ అదే సమయం లో 2021 -22 వరకు కార్పొరేట్లకు రూ. 8 లక్షల కోట్లు పన్ను రాయితీలు, 2022 -2024 మధ్య మరో రూ. 3 లక్షల కోట్లు, మొత్తం పన్ను రాయితీలు రూ. 11 లక్షల కోట్లు కార్పొరేట్ రుణ మాఫీలు రూ. 16.5 లక్షల కోట్లు. అంటే మొత్తం మీద 100 మంది కార్పొరేట్ మిత్రులకు రూ. 28 లక్షల కోట్లు, 15.5 కోట్ల పేదలకు కేవలం రూ. 10 లక్షల కోట్లు, ఇదే బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల పేదల వ్యతిరేక విధానం. వ్యవసాయ సంక్షోభం-గ్రామీణ విపత్తు, స్వాతంత్య్రం వచ్చి 8దశాబ్దాలు గడిచినా పేదరికం, ఆకలి, నిరుద్యోగం ఇవన్నీ దేశాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. మోడీ ప్రభుత్వం ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ వాస్తవం ఏమిటంటే: గ్రామాలనుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. వ్యవసాయం నష్టాల వృత్తిగా మారింది. కనీస మద్దతు ధరలేదు. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉదాహరణలు: కర్నూలు జిల్లాలో టమాటా రైతులు రోడ్లపై పంట పారేస్తున్నారు. వరంగల్ జిల్లాలో పత్తి రైతులు నష్టాల్లో ఉన్నారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రలో కరువు ఛాయలు. తీరాంధ్రలో వరదలు, భారీ వర్షాలతో నానిపోయిన ధాన్యం. యుపిఎ 1 ప్రభుత్వ కాలంలో, వామపక్ష పార్టీలే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రతిపాదించాయి. గ్రామీణ నిరుద్యోగుల ఆత్మహత్యలకు చెక్ పెట్టే విప్లవాత్మక ఆలోచన ఇది. అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం తీవ్రంగా వ్యతిరేకించినా, వామపక్షాల ఒత్తిడితో 2006లో చట్టంగా మారింది. గాంధీజీ కలకు ప్రతీకగా దీనికి మహాత్మా గాంధీ పేరు పెట్టారు. ఉపాధి హామీ దానం కాదు నరేగా డబ్బుల వృథా అన్న ప్రచారం పూర్తిగా అసత్యం. ఇది పని చేయడానికి హక్కు కల్పించే చట్టం. సోవియట్ యూనియన్‌లో లెనిన్ ప్రవేశపెట్టిన ‘సబ్‌బోట్నిక్స్’ ద్వారా ప్రతి పౌరుడిలో శ్రమ విలువను పెంచారు. ఆ స్ఫూర్తితోనే నేను కూడా నా స్వగ్రామం ఐనంబాకంలో నరేగా పనుల్లో 8 గం. పని చేశాను, కార్మికులతో కలిసి అక్కడే భోజనం చేశాను. అవును, అమలు లో లోపాలు ఉన్నాయి. కొంతమంది భూస్వాములు, రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నా రు. అలాంటి వారిని అరెస్ట్ చేసి, ఆస్తులు స్వాధీనంచేసుకోవాలి. కానీ అవినీతిపేరుతో చట్టాన్ని చంపడం నేరం. 15 రోజుల్లో వేతనం, సమాన పనికి సమాన వేతనం, వలసలు, ఆత్మహత్యలకు అడ్డుకట్ట. కార్పొరేట్లకు రూ. 28 లక్షల కోట్లు ఇచ్చే ప్రభుత్వం, 15.5 కోట్లపేదల జీవనాధారమైన నరేగాను ఎందుకు రక్షించలేకపోతోంది? మహాత్మాగాంధీ పేరు తొలగించడం పరిపాలనా సంస్కరణ కాదు-అది భావజాల విధ్వంసం. ఈ ప్రగతిశీల చట్టాన్ని కాపాడటం ప్రతి ప్రజాస్వామ్య శక్తి బాధ్యత.

డా. కె.నారాయణ

సారొస్తున్నారు సరే…?

2023 నవంబర్‌లో అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ కొద్దిసార్లు మాత్రమే బయటకు వచ్చారు. కారణాలు ఏమైనా కావచ్చు. ఒకసారి ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ కావడం, ఆ తర్వాత అనారోగ్యం తోడై ఆయన క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఈ సందర్భంలో కేసీఆర్ మళ్ళీ బయటికి వస్తున్నారన్న వార్త చర్చ నీయాంశమే అయింది. గతంలో ఒకసారి పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వరంగల్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగసభలో పాల్గొనడం తప్ప పబ్లిక్‌లోకి ఆయన వచ్చింది లేదు.

ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజాక్షేత్రంలో ఆయన గైర్హాజరీ బిఆర్‌ఎస్‌కు చేసిన నష్టం ఏమిటో పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు తెలుసు. తెలంగాణ ప్రజానీకానికి కూడా అర్థ మవుతున్నది. ఈ రెండేళ్లలో బిఆర్‌ఎస్ ఎన్నికల లో ఓడిపోవడమే కాకుండా ఇంటా బయటా కూడా తీవ్రమైన కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పదిమంది శాసనసభ్యులతో పాటు జిహెచ్‌ంఎసి మేయర్ వలస పోయారు. వాటికంటే ప్రధానమైనది కేసీఆర్ కుమార్తె, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి నాయకురాలు కవిత వ్యవహారం. ఆమె పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు బయటికి వెళ్లి పోయాక కూడా బిఆర్‌ఎస్‌కి చేస్తున్న నష్టాన్ని చంద్రశేఖరరావు ఎందుకు పట్టించుకోవడం లేదు? 

ఇవాళ్టి సమావేశంలో కెసిఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు తాను అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్న మరో అంశం మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నార ని వార్తలు వస్తున్నాయి. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నదీజలాల పంపకాల విషయంలో ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మీద తనకున్న పట్టును, తెలంగాణ ప్రభుత్వంతో తనకున్న సాన్ని హిత్యాన్ని ఉపయోగించి నిర్ణీత వాటాలకు మించి నీటిని తరలించుకుపోయే ప్రయ త్నాలు చేస్తున్నారని, దాన్ని అడ్డుకోవడా నికి పోరాటానికి సన్నద్ధం చేయడానికి కూడా ఇవాళ్టి ఆయన దిశానిర్దేశం ఉంటుందని తెలుస్తోంది.

తెలంగాణలో గ్రామపంచాయతీలకు జరిగిన ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సహా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించిన ఉత్సాహభరితమైన మూడ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్న తరుణంలో నేడు కెసిఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ ఎంపిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కలుసుకోవడానికి వస్తుండటం విశేషం. రెండు రోజుల క్రితం పంచాయతీ ఎన్నికల తొలివిడత ఫలితాలు వెలువడిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో విలేకరులతో మాట్లాడినప్పుడు కెసిఆర్ మళ్లీ బయటకు వస్తున్నారన్న విషయాన్ని ఒక విలేకరి ప్రస్తావిస్తే ‘ఆయన అధికారంలో ఉండగానే ఎదుర్కొని ఓడించాం.. ఇప్పుడు అది పెద్ద విశేషం కాదు’ అన్నారు.

2023 నవంబర్ లో అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ కొద్దిసార్లు మాత్రమే బయటకు వచ్చారు. కారణాలు ఏమైనా కావచ్చు. ఒకసారి ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ కావడం, ఆ తర్వాత అనారోగ్యం తోడై ఆయన క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఈ సందర్భంలో కెసిఆర్ మళ్ళీ బయటికి వస్తున్నారన్న వార్త చర్చనీయాంశమే అయింది. గతంలో ఒకసారి పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వరంగల్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగసభలో పాల్గొనడం తప్ప పబ్లిక్ లోకి ఆయన వచ్చింది ఎప్పుడూలేదు.

శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత ఈ రెండేళ్లలో ఓ రెండు శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వాటికంటే ముందు అత్యంత కీలకమైన లోకసభ ఎన్నికలు జరిగాయి. నిన్నగాక మొన్న గ్రామపంచాయతీ ఎన్నికలు కూడా ముగిసినా వీటిల్లో ఎక్కడ కెసిఆర్ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నది లేదు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుండి తనకింది నాయకులు అందరికీ దిశానిర్దేశం చేస్తే చేసి ఉండవచ్చు. పైన పేర్కొన్న అన్ని ఎన్నికల్లో కూడా, గ్రామపంచాయతీలు మినహాయిస్తే, భారత రాష్ట్ర సమితి ఘోర వైఫల్యం చెందిందన్న విషయం అందరికీ తెలిసిందే. అత్యంత కీలకమైన సందర్భాలలో కూడా ఆయన మౌనంగానే ఉండిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కెసిఆర్ రాజకీయాలను దగ్గరినుండి చూసినవాళ్లకు ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం ఏమీ కాదు.

ఈ రెండు సంవత్సరాలూ బయటకు రాకుండా తెరవెనకే ఉండిపోవడం కూడా కెసిఆర్ రాజకీయ వ్యూహంలో భాగమే అని ఆయన సమర్థకులు చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన ఉద్యమ కాలంలో కూడా ఆయన ఈ వ్యవహారశైలి చూశాం. కొన్ని సందర్భాల్లో కెసిఆర్ బయట కనిపించకపోతే ‘ఇదేమిటి, నాయకుడు బయటికి రాకుంటే ఎలా? ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో’ అన్న విమర్శ వినిపించేది. మళ్ళీ హఠాత్తుగా ఆయన బయటకు వచ్చేవారు. కెసిఆర్ ఒక విషయాన్ని నమ్ముతుంటారెమో బహుశా. అస్తమానం జనంలో కనిపిస్తూ ఉంటే తన ప్రాముఖ్యత తగ్గిపోతుంది కాబట్టి అవసరమైనప్పుడే బయటికి రావాలన్నది ఆయన ఆలోచన కావచ్చు.

కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజాక్షేత్రంలో ఆయన గైర్హాజరీ భారత రాష్ట్ర సమితి పార్టీకి చేసిన నష్టం ఏమిటో ఆయన పార్టీ నాయకత్వానికి తెలుసు, కార్యకర్తలకు తెలుసు. తెలంగాణ ప్రజానీకానికి కూడా అర్థమవుతున్నది. ఈ రెండేళ్లలో భారత రాష్ట్ర సమితి ఎన్నికలలో ఓడిపోవడమే కాకుండా ఇంటాబయటా కూడా తీవ్రమైన కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పదిమంది పార్టీ శాసనసభ్యులు అధికార పక్షానికి వలసపోయారు. ప్రతిష్ఠాత్మకమయిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వలసపోయారు. వాటికంటే ప్రధానమైనది కెసిఆర్ కుమార్తె, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి నాయకురాలు కవిత వ్యవహారం. ఆమె పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు బయటికి వెళ్లిపోయాక కూడా భారత రాష్ట్ర సమితికి చేస్తున్న నష్టాన్ని చంద్రశేఖరరావు ఎందుకు పట్టించుకోవడం లేదు? కవిత పార్టీలో ఉన్నప్పుడు జరిగిన నష్టం ఆమె మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లడం. కవిత తీహార్ జైల్లో కొన్ని మాసాలు గడిపి బయటికి వచ్చిన కొద్దికాలంలోనే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపట్ల కినుక వహించడం, తిరుగుబాటు చేయడం, సస్పెండ్ కావడం అక్కడి నుండి దాదాపు ప్రతిరోజూ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు, గతంలో పార్టీ అధికారంలో ఉండగా జరిగాయంటున్న అవినీతి కార్యక్రమాల గురించి ఆమె చేస్తున్న ప్రకటనలు మామూలుగా తీసిపారేయవలసినవి కావు.ఈ నష్టం జరగకుండా నివారించడానికి కెసిఆర్ ఎందుకు ప్రయత్నించలేదు? కవిత చేస్తున్న ఆరోపణలు, దానికి బదులుగా ఆమెమీద కొందరు భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న ప్రత్యారోపణలలో వాస్తవం ఎంత ఉంది అన్నది అలా ఉంచితే ఈ క్రమంలో జరుగుతున్న నష్టం మాత్రం చిన్నది కాదు. కెసిఆర్ ఎందుకు దీన్ని నివారించాలేనంత అశక్తులు అయిపోయారు? కవిత ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు మీద, సీనియర్ నాయకుడు హరీశ్ రావు మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా చేస్తున్న విమర్శలలో వాస్తవం ఎంత ఉంది అనేది అలా ఉంచితే దానివల్ల పార్టీకి నష్టం జరిగిందన్న మాట వాస్తవం. ఈ పరిస్థితిని నివారించే లేదా ఇదంతా జరిగిపోయాకనైనా చక్కదిద్దే స్థితిలో కెసిఆర్ లేరా!

భారత రాష్ట్ర సమితి పగ్గాలు కెసిఆర్ చేతుల్లో లేకపోతే ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో జరపబోతున్న సమావేశంవల్ల ప్రయోజనం ఏముంటుంది? ఎన్నికలొచ్చినప్పుడే బయటకు రావాలని ఆయన అనుకుంటున్నారా? రాష్ట్రసాధన కోసం ఇంత పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించి, తొమ్మిది సంవత్సరాలకుపైగా ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కూడా తనను ఓడించారని ప్రజలమీద అలిగి ఆయన బయటకు రావడం లేదా? ఇది వెనకటికి చెప్పిన ముతక సామెతలాగా ఉంది. చెరువు మీద అలిగితే ఎవరికీ నష్టం?

ఇవాళ తన పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత కెసిఆర్ వచ్చే మూడు సంవత్సరాలు క్రియాశీల రాజకీయాల్ని నడుపుతారా లేక మళ్ళీ ఏకాంతంలోకి వెళ్ళిపోతారా అన్నది శేష ప్రశ్న. అందుకు కారణం గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో.. ముఖ్యంగా పార్టీ రజతోత్సవం జరిగిన సమయంలో కెసిఆర్ మళ్ళీ చురుగ్గా రాజకీయ క్షేత్రంలో నిలబడతారని ప్రచారం జరిగింది కానీ షరామాములే. భారత రాష్ట్ర సమితికి అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు కూడా కెసిఆర్ అయిన కారణంగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించాలని పార్టీకి సంబంధించిన వారు ఆశిస్తారు. కనిపించకపోతే బయటివారు విమర్శిస్తారు. చూస్తూనే ఉన్నాం కదా, అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సవాలు విసురుతూ ఉంటారు.. ‘కెసిఆర్ ను శాసనసభకు రమ్మనండి అన్ని విషయాలు చర్చిద్దాం’ అని. రేవంత్ రెడ్డి సవాలును భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు, కెసిఆర్ అభిమానులు తేలిగ్గా కొట్టిపారేయవచ్చుగాక, కానీ జనం దృష్టిలో మాత్రం రేవంత్ రెడ్డికి ప్లస్ మార్కులు పడుతున్నాయి.

ఇవాళ జరగబోయే సమావేశంలో కెసిఆర్ ఏ అంశాలు చర్చించబోతున్నారు? తన పార్టీ ప్రజాప్రతినిధులకు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? అనే విషయాలు కూడా బయట చర్చనీయాంశాలయ్యాయి. ప్రభుత్వపక్షమే అధికారికంగా చేసిన ప్రకటన ప్రకారం మొన్న ముగిసిన పంచాయితీ ఎన్నికల్లో 33% పంచాయతీలను భారత రాష్ట్ర సమితి, బిజెపి దక్కించుకున్నాయి. ఇందులో బిజెపిని పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. బిజెపి నాయకులు తమ పరిస్థితి మెరుగుపడిందని చెబుతున్నా, అందులో సింహభాగం భారత రాష్ట్ర సమితికే దక్కిన విషయం అందరికీ తెలిసిందే. పైగా పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగినవి కాదు. దీని తర్వాత జరిగే ఎన్నికలు మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పార్టీల గుర్తులు మీద జరిగేవి. కాబట్టి పంచాయతీలు ఇచ్చిన ఉత్సాహంతో వీటిలో రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేయబోతున్నారా కెసిఆర్?

అయితే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిలో తన తర్వాత కీలకంగా ఉన్న ఇద్దరు నాయకులు కె.టి.రామారావు, హరీశ్ రావులకు రానున్న మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలలో బాధ్యతలను పంచే ఆలోచన కూడా కెసిఆర్ చేస్తున్నారని వినికిడి. పట్టణ ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల బాధ్యతలు కెటిఆర్‌కు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తుల ఎన్నికల బాధ్యతలు హరీశ్ రావుకు అప్పగించి సమాన స్థాయి కల్పిస్తారని ప్రచారం. ఇదే కాకుండా ఇవాళ్టి సమావేశంలో కెసిఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు తాను అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్న మరో అంశం మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నదీజలాల పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మీద తనకున్న పట్టును, తెలంగాణ ప్రభుత్వంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి నిర్ణీత వాటాలకు మించి నీటిని తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారని, దాన్ని అడ్డుకోవడానికి పోరాటానికి సన్నద్ధం చేయడానికి కూడా ఇవాళ్టి ఆయన దిశానిర్దేశం ఉంటుందని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోవాలని జరిగిన ఉద్యమంలోని మూడు ప్రధాన అంశాల్లో అత్యంత కీలకమైనవి నీళ్లు, నిధులు, నియామకాలు ఆ తర్వాతనే. మరి ఇంత ముఖ్యమైన అంశంలో చంద్రబాబు తన అధికారాన్ని, సాన్నిహిత్యాన్ని ఉపయోగించి నీళ్లు తరలించుకుపోతానంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఊరికే ఉంటుందా? తెలంగాణలో అధికారం కోసం కలలు కంటున్న భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు వత్తిడికి లొంగి తెలంగాణకు ద్రోహం చేసే సాహసం చేస్తుందా?.

దేవులపల్లి అమర్

సర్వం కేంద్ర ప్రభుత్వ ఇష్టారాజ్యం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరు తో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే కాక, మందబలంతో ఏకచ్ఛత్రాధిపత్యం వహించింది. విపక్షాలు లేవదీసిన అభ్యంతరాలకు సరైన సమాధానాలు చెప్పడం లేదు సరికదా, చర్చకు కూడా అవకాశం లేకుండా బుల్‌డోజర్ సంస్కృతి అవలంబించింది. ఉన్నత విద్యారంగాన్ని తన గుప్పెటలో పెట్టుకోవడానికి శ్రీకారం చుట్టింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ఇతర దేశాలపై ఆధారపడే దుస్థితినుంచి బయటపడాలంటూ పదేపదే ప్రబోధించే మోడీ ప్రభుత్వం బీమా, అణువిద్యుత్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు స్వాగతం పలకడం, ముఖ్యమైన వ్యవస్థలను విదేశాలకు తాకట్టుపెట్టడం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకత. ఇది కాక యుపిఎ ప్రభుత్వ చిహ్నాలను, మహాత్మాగాంధీ పేరును పూర్తిగా చెరిపేసేందుకు చరిత్రాత్మక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది. ఈ పథకాన్ని తన అధీనం లోకే తెచ్చుకుని తన పెత్తనంతోనే పనులు సాగేలా మార్చుకుంది.ఈ పథకంలో 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచి ఉద్ధరిస్తున్నట్టు నమ్మిస్తున్నా దాని అసలు స్వరూపం వేరేగా ఉంటోంది. ఏ రాష్ట్రంలో, ఎక్కడ, ఏ పనులు చేపట్టాలో కేంద్రమే నిర్ణయిస్తుంది.

ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తుందో ఆ మేరకే పనులు చేపట్టాలి. అదీ కూడా అవసరం బట్టే పని కల్పన ఉంటుంది. అంటే రాష్ట్రాలకు ఇందులో ఎలాంటి స్వేచ్ఛ లేనట్టే. ఇక నిధుల వ్యయంలో ఇంతవరకు శ్రామికుల వేతనాలు పూర్తిగా, సామగ్రి వ్యయంలో 75% నైపుణ్యం, పాక్షిక నైపుణ్య కార్మికుల వేతనాల్లో 75 శాతం కేంద్రమే చెల్లించేది. కానీ ఇకనుంచి మొత్తం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వమే 40 శాతం వరకు భరించక తప్పదు. 90ః 10 గా ఉన్న వ్యయం ఇకనుంచి 60ః40 గా ఉంటుంది. ఇంత భారీ వ్యయాన్ని రాష్ట్రాలు ఎంతవరకు భరించగలవో ఆలోచించాలి. ఈ వివాదాస్పద నిర్ణయంపై కాంగ్రెస్‌తో సహా విపక్షాలన్నీ భగ్గుమంటున్నాయి. జాతీయ స్థాయిలో వ్యతిరేక ఉద్యమానికి సన్నద్ధమవుతున్నాయి. కేంద్రం మితిమీరిన పెత్తనానికి మరో తార్కాణం ఉన్నత విద్యారంగం. ఉన్నత విద్య క్రమబద్ధీకరణ చట్టాన్ని పూర్తిగా ఏకీకృతం చేస్తూ వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (వి బిఎస్‌ఎ) బిల్లును తీసుకొచ్చింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిటిఇ) పర్యవేక్షణ అధికారాలన్నీ ఒకే రెగ్యులేటర్ కిందకు తెస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తోంది.

అన్ని కేంద్ర యూనివర్శిటీలు, వాటి కిందగల కాలేజీలు, విద్యామంత్రిత్వశాఖ పరిపాలన కింద గల జాతీయ ప్రాముఖ్యత గల సంస్థలన్నీ ఈ కమిషన్ కిందకే వస్తాయి. ప్రస్తుతం యుజిసి కింద లేని ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్‌ఐటిలు, ఐఐఎస్‌సిలు, ఐఐఎన్‌ఇఆర్‌లు, ట్రిపుల్ ఐటిలు కూడా ఈ కమిషన్ కిందకే వస్తాయి. ఈ విబిఎస్‌ఎ కమిషన్‌లో తనకు అనుకూలమైన తొమ్మిది మందిని కేంద్రమే నియమిస్తుంది. ఈ బిల్లుపై రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు కూడా కేంద్ర అధిష్టానం ఆదేశాలకే లోబడాల్సి వస్తుంది. ఇక బీమా రంగంలో విదేశీ సంస్థలు పూర్తిస్థాయిలో ప్రవేశించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీమా రంగంలో ప్రస్తుతం 74% వరకు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతం పెంచడానికి వీలుగా బిల్లును రూపొందించింది. జిడిపిలో 3 శాతం వాటాకు పరిమితమైన బీమారంగం ఇక నుంచి విదేశాల్లో మాదిరిగా ఆరున్నర శాతానికి చేరుతుందని ప్రభుత్వం నమ్మబలుకుతోంది.

నూరు శాతం ఎఫ్‌డిఐలతో విదేశీ కంపెనీలు తక్కువ మూలధనంతో ఇకపై ఇక్కడ వ్యాపారాలు పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు 65 శాతం వాటాతో అత్యంత బలంగా ఉన్న ప్రభుత్వ రంగ ఎల్‌ఐసికి ఇప్పుడు అగ్నిపరీక్షే ఎదురవుతుంది. బీమా రంగంలో వంద శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అణుశక్తి బిల్లు రూపంలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అణుశక్తిని స్థిరంగా వినియోగించుకుంటూ అభివృద్ధి పథం వైపు దేశాన్ని తీసుకెళ్లడమే లక్షంగా ‘శాంతి బిల్లు’ ను ప్రవేశపెట్టినట్టు మోడీ ప్రభుత్వం ప్రకటిస్తోంది. అణు విద్యుత్ సంస్థాపిత సామర్థం ప్రస్తుత 8.8 గిగావాట్లు నుంచి 2047 నాటికి 100 గిగావాట్లకు పైగా పెంపు చేయడమే లక్షంగా 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అమెరికాతో సివిల్ అణుశక్తి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే రియాక్టర్లలో ఏదైన ప్రమాదం సంభవిస్తే మానవ ప్రాణ, పర్యావరణ నష్టానికి ఆ రియాక్టర్ల సరఫరాదారు పరిహారం చెల్లించాలని సివిల్ లయబిలిటీ బిల్లు తీసుకు రాగా, అమెరికా కంపెనీలు వ్యతిరేకించడంతో బిల్లు అమలు కాలేదు.

ఈ పరిహారం విషయంలో సడలింపు కల్పించి దాన్ని మోడీ ప్రభుత్వం అమలులోకి తీసుకు వస్తోంది. 1962 అణుశక్తి చట్టం, 2010 పౌర అణు నష్టపరిహార చట్టాన్ని రద్దు చేయాలనే బిల్లు లోని నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు రియాక్టర్ల సరఫరాదారుల నష్టపరిహార చెల్లింపు బాధ్యత కేవలం 300 మిలియన్ డాలర్లకే పరిమితం చేయడం ప్రజలభద్రతను నిర్లక్షం చేయడమే. జపాన్‌లో పుకుషిమా, రష్యాలో చెర్నోబిల్ అణుప్రమాదాలు నేర్పిన గుణపాఠాలు ఇప్పుడు విస్మరించడం ఎవరికీ క్షేమం కాదు. నియంత్రణలన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని చెబుతున్నప్పటికీ బహుళజాతి కంపెనీలు ఎంత శక్తిమంతమైనవో భోపాల్ యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ ప్రమాదం సంఘటనే ప్రత్యక్ష సాక్షం. ఈ బిల్లు ద్వారా అమెరికా, ఫ్రాన్స్ వంటి విదేశీ కంపెనీలకే తప్ప భారత కంపెనీలకు ప్రయోజనం శూన్యం అన్న విమర్శలు వస్తున్నాయి. 

‘ఉపాధి హామీ’ ఉసురు తీస్తున్నారు!

జి రామ్ జి బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. ఇది చట్టం కాబోతున్నది. అయితే సరికొత్త చట్టం కాదు. ఇప్పటికే ఇది అమలులో ఉన్నది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 గా నిన్నటి వరకు అమలులో ఉన్నది. రాష్ట్రపతి ఆమోదంతో కొత్త పేరు అమలులోకి వస్తుంది. అందులో ఏ అంశాలున్నాయనే విషయం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. గ్రామాలలో ఉన్న పేదలకు ప్రత్యేకించి వ్యవసాయ కూలీలకు ఈ చట్టం ఉపాధిని కల్పిస్తున్నది. దాని మీద చర్చలు ఎన్నో జరిగాయి. విమర్శలు, ప్రతి విమర్శలు మరెన్నో వచ్చాయి. అయితే నిరుపేదలకు ఈ చట్టం ఎంతో మేలు చేస్తుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ చట్టంలో గతంలో ఉన్న ముఖ్యమైన అంశం మారిపోతున్నది. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా విషయం. గతంలో ఈ పథకం బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. కానీ కొత్త చట్టం ద్వారా ఖర్చులో రాష్ట్రాలపై భారం మోపనున్నది. బడ్జెట్‌లో 60 శాతం కేంద్రం నుంచి, 40 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంది. ఇంకా కూలీల శ్రమ యంత్రాల వాడకం పైన కూడా కొన్ని నిర్ణయాలు చేశారు. అంతేకాకుండా అత్యంత ముఖ్యమైనది, కూలీల డిమాండ్‌ను బట్టి కాక, ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి పనులను కల్పిస్తారు. గతంలో కనీసం వంద రోజుల పని దినాలను కల్పించాల్సి ఉంది. కాని దానిని 125 రోజులకు పెంచారు. ఇది కేవలం కంటితుడుపు మాత్రమే.

రాష్ట్రాల మీద గతంలో దీని భారం ఉండేది కాదు. కానీ ఈ రోజు రాష్ట్రాలు ఇందులో ఆర్థికంగా తమ బడ్జెట్‌లను వెచ్చించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వాటాను కల్పించకపోతే, ఆ పథకం అమలు సాధ్యం కాదు. ఇప్పటికే చాలా పథకాల్లో ఇటువంటి షరతులు విధించి, పథకాలనే నిలిపివేసిన ఘటనలున్నాయి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ పథకం అందులో భాగమే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలను వెచ్చించకపోవడం వల్ల కేంద్రం నిధులను విడుదల చేయడం ఆపేసింది. పంజాబ్ రాష్ట్రంలో ఈ స్కాలర్ షిప్స్ సమస్య ప్రభుత్వాన్నే మార్చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను రేపు కూలీల ముందు దోషులుగా నిలబడే పరిస్థితి రాబోతున్నది. అంటే జి రామ్ జి పథకం రేపు రాష్ట్ర ప్రభుత్వాల నిస్సహాయతను బజారులో నిలబట్టే పరిస్థితి రాబోతున్నది. దానితో పథకమే ప్రశ్నార్థకం కాబోతున్నది. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నది కూడా అదే. క్రమంగా ఈ పథకాన్ని ఆచరణలో రద్దు చేయాలన్నదే ఉద్దేశం. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు తమ బడ్జెట్‌ల ద్వారా అమలులో ఉన్న పథకాలనే కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లను సరైన సమయంలో చెల్లించలేని దీనస్థితిలో ఉన్నాయి.

వాటికితోడు ఎన్నికల్లో గెలవడానికి ఆర్థిక పరిస్థితిని దృష్టింలో ఉంచుకోకుండా చేసిన వాగ్దానాలు రాష్ట్ర ప్రభుత్వాలకు గుదిబండలుగా మారిపోయాయి. వీటన్నింటిని నిర్వహించడానికి బ్యాంకులనుంచి అప్పులు తీసుకోవడానికి రిజర్వు బ్యాంకు అనుమతి కోసం విరామం లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం తమ అప్పుల పరిమితులను దాటిపోయాయి. దీనితో చాలా రాష్ట్రాలు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నాయి. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. సరిగ్గా ఈ పరిస్థితిలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తమ బడ్జెట్ నుంచి నిధులను కేటాయించడమంటే అది వాస్తవ విరుద్ధమే అవుతుంది. ఇది మరింత సంక్షోభానికి దారి తీసే అవకాశముంది. అంతిమంగా ఈ పథకమే ఆగిపోయే పరిస్థితులున్నాయి. ఈ పథకాన్ని మొదటి నుంచి బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వ్యతిరేకత దృష్టితోనే చూస్తున్నది.

నిధుల కేటాయింపులు కానీ, ఖర్చు గానీ ఏనాడు డిమాండ్‌కు తగ్గట్టుగా లేవు. దానికి తోడు కార్డులను తొలగించడం అనేది ఒక నిత్య కార్యక్రమంగా పెట్టుకున్నారు. గత రెండేళ్లలో దాదాపు 50 లక్షల కార్డులను దేశవ్యాప్తంగా తొలగించారు. అంతేకాకుండా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి చేయాల్సినంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ చట్టం అంతిమ సమాధి. దీనికి బిజెపి సామాజిక నేపథ్యమే కారణం. ఈ పథకాన్ని గ్రామాల్లోని ధనిక, మధ్య తరగతి రైతులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చిన తర్వాత కూలీలలో వేతనం డిమాండ్ పెరిగిందని, తమ పొలాల్లో పని చేయడానికి ముందుకు రావడం లేదని వాళ్లు వాదిస్తున్నారు. అంతేకాకుండా కూలీలలో పెరిగిన ఈ స్వేచ్ఛ గ్రామాల్లో వ్యవసాయ కూలీ పెరుగుదల అనివార్యమైందని, దానితో వ్యవసాయ ఖర్చులు పెరిగాయని రైతులు తమ వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో ఈ వర్గమే బలమైనది. ఓట్లు గాని, ఇతర ఏ రాజకీయ ప్రయోజనాలకు గానీ ఈ వర్గమే ఆధారం. ఇది వర్గం, కులాల రీత్యా ఆధిపత్యం కలిగి ఉంది. అందువల్ల ఈ పథకానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టడమంటే ఆధిపత్య కులాలకు, వర్గాలకు అండగా నిలబడడమే. దీని వల్ల బిజెపి ఆధిపత్య కులాల్లో బలాన్ని స్థిరం చేసుకోవడానికి వీలవుతుంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఈ చట్టానికి తక్షణ లక్షం. బెంగాల్‌లో ధనిక, మధ్య తరగతి వర్గం ప్రస్తుతం మెల్లగా బిజెపి వైపునకు నడుస్తున్నది. దీని వల్ల వాళ్లు మరింతగా బిజెపిని బలపరిచే అవకాశముంది. బెంగాల్‌లో నూటికి 50శాతం మంది ఎస్‌సిలు, ఎస్‌టిలు, ముస్లింలు ఉన్నారు. వీళ్లంతా భూమిలేని నిరుపేదలే. దాని వల్ల ఈ వర్గాలకు వ్యతిరేకింగా మధ్య తరగతి వర్గం కూలీలను సమీకరించే పనిలో పడ్డారు. అందుకే ఈ చట్టం ద్వారా మరో ప్రయోజనం పొందాలని పథకం వేశారు. అదే పేరు మార్పు. అందులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించి, రామ్ పేరును చేర్చడం రెండో ప్రయోజనం. ఎందుకంటే ఇక్కడ పరోక్షంగా ముస్లింల మీద వ్యతిరేకత రెచ్చగొట్టడం. మహాత్మా గాంధీ పేరును తొలగించడం వల్ల జరిగే చర్చలో పరోక్షంగా ముస్లింల విషయాన్ని చేర్చి తమకు అనుకూలంగా దీనిని మలుచుకోవడంలో సఫలీకృతం కావాలని ఆలోచన చేస్తున్నారు. మహాత్మాగాంధీ పైన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలకు మొదటి నుంచి సదాభిప్రాయం లేదు. అది మహాత్మా గాంధీ హత్యతోనే బయట పడింది.

మహాత్మా గాంధీని హత్య చేసిన నాథ్‌రామ్ గాడ్సే హిందూ మహాసభ నాయకుడు. ఆర్‌ఎస్‌ఎస్‌లో కూడా పనిచేశాడని చరిత్రలో ఉన్న విషయం. అదే విధంగా మహాత్మా గాంధీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు మిఠాయిలు పంచుకున్నాయని అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గోల్వాల్కర్‌కు రాసిన ఉత్తరంలో పేర్కొన్నారు. అంతేకాకుండా 2014లో అప్పటి బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ నాథ్‌రామ్ గాడ్సే జాతీయ వీరుడు అని ప్రకటించారు. అదే విధంగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన నాయకుడు రాజ్‌భయ్యా నాథ్ గాడ్సేను సమర్థిస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా నాథ్‌రామ్ గాడ్సేకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లలో సావర్కర్ ప్రధానమైన వ్యక్తి. ఆయన అనేక సార్లు గాంధీని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అయితే గత కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ వీర్ సావర్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, తమ అనుబంధాన్ని చాటుకున్నారు.

అయితే బిజెపి మహాత్మా గాంధీని ప్రత్యక్షంగా విమర్శించిన సందర్భాలు తక్కువ. అదే విషయాన్ని గత రెండు రోజుల క్రితం పార్లమెంట్‌లో ఆ పార్టీ ప్రకటించింది. మహాత్మా గాంధీ జయంతిని స్వచ్ఛ అభియాన్‌గా జరుపుకుంటున్న విషయాన్ని కూడా ప్రకటించారు. అది నిజమే. ఇక్కడ గమనించాల్సింది మహాత్మా గాంధీ మీద కోపం ఆయన మీద కాదు. ఆయన ఏ విధానాలను అవలంబించి ముస్లింలను సోదరులుగా చూడాలని ప్రకటించారో ఆ అంశం వాళ్లకు నచ్చదు. ఇప్పుడే ఈ విషయాన్ని లేవనెత్తి, పేరు మార్చడానికి రాబోయే బెంగాల్ ఎన్నికలే కారణం. అక్కడ ముస్లింల మీద వ్యతిరేకతను రెచ్చగొట్టి మిగతా సమాజాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఈ చర్చ వాళ్లకు అవసరం. ఈ రోజు భారత దేశంలో ముస్లింలు ఉండి హిందూ సమాజాన్ని అవహేళన, దాడులు చేస్తున్నారంటే మహాత్మా గాంధీ విధానాలే కారణమని బిజెపి చెప్పదలచుకున్నది.

రాబోయేరోజుల్లో మహాత్మా గాంధీ సెక్యులరిజం, సర్వమత సమానత్వం అనే అంశాలమీద వాళ్లు కాకుండా, వివిధ వ్యక్తులతో మాట్లాడించి, ముస్లిం వ్యతిరేకతను తాము ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. జి రామ్ జి పేరును బాగా ప్రచారం చేయడం ద్వారా మరో ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం మీద విమర్శలు రాముని మీదికి మళ్లించి, వీళ్లంతా రాముని వ్యతిరేకులు, హిందూత్వ వ్యతిరేకులు అని చెప్పడం ద్వారా హిందూ భక్తులను కూడా ఇందులో భాగస్వాములను చేసి, దానిని సంఘటితం చేయాలనుకుంటున్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా వారి హిందూత్వ ఎజెండా ఉచ్ఛస్థాయికి చేరింది. ఇక వాళ్లు దేనిని సహించే స్థితిలో లేరు. అంతిమంగా హిందూత్వ భావాలను తమ ఎన్నికల ప్రయోజనాలకు వినియోగించుకొని ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. నూటికి ఇరవై మందిగా ఉన్న ఉన్నత ఆదాయ వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల ప్రభుత్వాలను తారుమారు చేసే పథకాన్ని అమలు చేస్తున్నారు.  

– మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)

‘కోర్-5’ భ్రమ మాత్రమే

అమెరికా నుంచి వెలువడే ‘పొలిటికో’ అనే రాజకీయ పత్రికలో వెలువడే కథనాలకు ప్రపంచమంతటా మంచి విలువే ఉంది. అవి ఒకోసారి సంచలనాత్మకంగా తోచవచ్చు. కాని వాటిలో చివరకు అసత్యాలుగా తేలేవి చాలా తక్కువ. పైగా ‘స్కూప్ స్టోరీస్’ అని ఇంగ్లీషులో వ్యవహరించే, ‘మరెవరికీ తెలియని, రాయని కథనాలను’ వెలికి తీయటం తమ పని అని ఆ పత్రిక సగర్వంగా ప్రకటిస్తుంటుంది. అటువంటి పేరున్నది గనుకనే ‘పొలిటికో’కు అనేక అవార్డులతో పాటు ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ బహుమతి కూడా లభించింది. ఈ కారణాల వల్లనే ఆ పత్రిక ఇటీవల ప్రచురించిన ‘కోర్5’ రాజకీయ కథనం ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అందులోని సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికా తన నాయకత్వాన కొన్ని దశాబ్దాలుగా ఉన్న నాటో, జి7, జి20 వగైరా కూటములు అన్నింటిని వదలివేసి, కొత్తగా జి 5 అనదగ్గ ‘కోర్5’ కూటమి ఏర్పాటు కోసం ఆలోచిస్తున్నది. ఈ కొత్త కూటమిలో అమెరికాతో పాటు రష్యా, చైనా, జపాన్, ఇండియాలు ఉండవచ్చునట. ఈ కథనాన్ని అమెరికా అధ్యక్షుని వైట్ హౌస్ నిజం కాదంటూ కొట్టి వేసింది. అయినప్పటికీ, “అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే” అన్న పాట వలె, ట్రంప్ మాటలకు అర్థాలు ఏవైనా కావచ్చునని అనుభవంలోకి వచ్చినందున, ఈ విషయమై చర్యలు జరుగుతూ ఉన్నాయి. అదట్లుంచినా మరొకటి గమనించాలి.

ఎప్పుడైనా సరే ఇటువంటి ముఖ్యమైన ఆలోచనలు జరిగినపుడు, వాటికి ఒక స్వరూపం, తర్వాత పరస్పర అంగీకారం స్థూలంగానైనా వచ్చే వరకు విషయం తెర వెనుకనే ఉంటుంది. ఇది ఎక్కడైనా సర్వసాధారణం. ఇట్లా అంటున్నామంటే ‘కోర్5’ ఆలోచన నిజమైనదే అని చెప్పటం కాదు. కావచ్చు, కాకపోవచ్చు కూడా. అదెట్లున్నా దీని గురించి, తాత్కాలికంగానైనా కొంత సమాలోచన అవసరం. ఒకవేళ ట్రంప్ ఆలోచన నిజమే అయితే తను ఈ ఆలోచన ఎందుకు చేస్తుండవచ్చు? అటువంటి కూటమి ఏర్పాటు సాధ్యమా? సాధ్యమైతే ఆ కూటమి వ్యవహరణ ఏ విధంగా ఉండవచ్చు? అనేవి మూడు ప్రధానమైన ప్రశ్నలు. ఈ ఆలోచనలు చేసే ముందు ఒక మాట చెప్పుకోవాటి. ‘కోర్5’ ఆలోచన నిజం కాదని వైట్ హౌస్ ఖండించగా, తక్కిన నాలుగు దేశాల నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందనా లేదు. అందులో ఆశ్చర్యమూ లేదు. ఏ దేశమైనా, ముఖ్యంగా ఇటువంటి సీరియస్ విషయాలలో, కేవలం పత్రికా కథనాలపై స్పందించదు. అవి తమపై ఆరోపణల వంటివి అయితే తప్ప. ఒకవేళ అమెరికా ఇటువంటి ప్రతిపాదన అధికారికంగా చేసినట్లయితే అపుడు ఏదో స్పందన ఉండవచ్చు. ‘కోర్5’ ఆలోచన లేదని వైట్ హౌస్ అంటున్నందున, ఆ ప్రతిపాదన ఇంత వరకు ఎవరికీ చేయలేదని భావించవలసి ఉంటుంది. మొత్తం అయిదు దేశాలూ రహస్యాన్ని పాటించదలిస్తే తప్ప.

అయితే, ఎటు నుంచి ఏ ధ్రువీకరణ లేకున్నా, ఇటువంటి కూటమితో భారత దేశానికి లాభమేమిటనే ఊహాగానాలు మాత్రం దేశంలో మొదలైపోయాయి. దాని గురించి ఇక్కడ మాట్లాడేది ఏమీ లేదు. ఇవన్నీ వదలివేసి, పైన పేర్కొన్న మూడు ప్రశ్నల గురించి ఆలోచిద్దాము. కోర్5 ఆలోచన నిజమే అనుకుంటే, అమెరికా అధ్యక్షునికి ఆ తరహా ఆలోచన ఎందుకు కలిగి ఉండవచ్చునన్నది మొదటి ప్రశ్న. అమెరికా 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి గత 80 సంవత్సరాలుగా అగ్రరాజ్యంగా ఉంటూ వస్తున్నది. 1991 వరకు అప్పటి సోవియెట్ నాయకత్వాన అమెరికాకు పోటీగా రెండవ ధ్రువం ఉండినప్పటికీ అగ్రరాజ్యం మాత్రం అమెరికాయే. అణ్వస్త్ర బలిమిని మినహాయిస్తే ఇతరత్రా సైనికంగా, ఆర్థికంగా, శాస్త్ర సాంకేతికాభివృద్ధిపరంగా పరిస్థితి అదే. 1991లో సోవియేట్ పతనం తర్వాత ఇక చెప్పనక్కర లేదు. అట్లా సుమారు 20 సంవత్సరాల పాటు ఎదురులేని ఏకధ్రువ ప్రపంచాధిపత్యం తర్వాత రష్యా తిరిగి పుంజకోవటం, చైనా కొత్త శక్తిగా ఆవిర్భవించటం, బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు బలపడుతుండటం వల్ల అమెరికా బలిమి గతం కన్న బలహీన పడుతుండటం నిజమే అయినా, అమెరికా అగ్రస్థానం మాత్రం స్థూలంగా కొనసాగుతూనే ఉన్నది.

వారు యథేచ్ఛగా తమకు అవసరమైన చోటనల్లా సైనిక చర్యలకు పాల్పడుతుండటం, ప్రపంచ వాణిజ్యాన్ని ఒకప్పటి స్థాయిలో కాకున్న ఇంకా చాలా మేరకు నియంత్రించ గలగటం, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఐక్యరాజ్య సమితి నుంచి మొదలుకొన్ని ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ మొదలైన ప్రపంచ వ్యవస్థలపై ఆధిపత్యం వంటివి ఇందుకు తార్కాణాలు. అదే సమయంలో తక్షణ స్థితిగతులు, సమీప భవిష్యత్తుకు పరిమితం కాక మధ్యకాలిక, దీర్ఘకాలిక భవిష్యత్తు గురించి తెలివైన నాయకత్వం ఆలోచించవలసి ఉంటుంది గనుక, ఆ విధంగా చూసినపుడు మాత్రం తమ అగ్రనాయకత్వం దీర్ఘకాలం పాటు కొనసాగగలదనే భరోసా అమెరికా నాయకత్వానికి కలిగే అవకాశం లేదు. అటువంటపుడు తమ వ్యూహాలపై పునరాలోచన తప్పనిసరి అవుతుంది. దాని ఫలితమే ‘కోర్5’ ఆలోచన అయి ఉండాలి. ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఇంతకాలం కలసి వచ్చిన స్వీయ ఆధారాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. ఆ క్రమాన్ని నిలువరించగల అవకాశాలు కన్పించటం లేదు. మరొక వైపు, ఇంతకాలం వెంట నిలిచిన యూరప్, ఇతర నాటో రాజ్యాలు కూడా నెమ్మదిగానైనా బలహీనపడుతున్నాయి.

చిరకాలంగా తమకు లోబడి ఉండిన అనేకానేక ఇతర దేశాలు స్వతంత్ర మార్గాలను అన్వేషిస్తున్నాయి. కొత్తగా తమ ఛత్రచ్ఛాయలోకి రాగోరేవారు కన్పించటం లేదు. బలప్రయోగంతోనో, ఆర్థికపరమైన వత్తిళ్లతోనే ఆ పని చేయబోతున్నా పరిస్థితి ఒక పరిమితిలో తప్ప ఆశాజనకంగా లేదు. అటువంటి స్థితిలో, కోర్5’ వంటి కొత్త తరహా వ్యూహ రచన అవసరమవుతుంది. అది ముసాయిదా వ్యూహం మాత్రమే. నిజంగా రూపు తీసుకునేదీ లేనిదీ తెలియదు. కోరుకున్న ఫలితం సాధించేదీ లేనిదీ తెలియదు. ప్రయత్నమైతే జరగాలి. అంతకన్న మార్గాంతరం లేదు. రెండవ ప్రశ్నకు వస్తే, ‘కోర్5’ ఏర్పాటు సాధ్యమా? ఇది అసలు సిసలైన సవాలు. అది సాధ్యం కానిదన్నదే వెంటనే కలిగే అభిప్రాయం. ఎందువల్లనంటే అందులో అనేక ప్రశ్నలున్నాయి. అన్నీ చిక్కులమారివే. అసలు అటువంటి కూటమిలో చేరేందుకు జపాన్, ఇండియాల మాట ఎట్లున్నా రష్యా, చైనాలు ఎందుకు అంగీకరించాలి? వారిద్దరికీ అమెరికా సైద్ధాంతిక శత్రువు. అనేక దశాబ్దాలుగా ప్రత్యర్థి. రాగల కాలంలోనూ సైద్ధాంతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సైనికంగా, వ్యూహాత్మకంగా శాశ్వత ప్రత్యర్థివంటిది.

అమెరికా ఆధిపత్యాన్ని క్రమంగా బలహీనపరచి, దానితో సమాన స్థాయి సాధించి, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ, డీడాలరైజేషన్, బెల్డ్ అండ్ రోడ్ పాలసీ వగైరాల ద్వారా బహుళ ధ్రువ ప్రపంచ ఆవిష్కరణ ఆ రెండింటి దీర్ఘకాలిక లక్షం. ఆ విధంగా అమెరికాతో పాటు పాశ్చాత్య సామ్రాజ్యవాదం, ప్రపంచాధిపత్యం ముగిసిపోవాలన్నది వారి పట్టుదల. ఇవన్నీ సానుకూలమవుతున్న సూచనలు కూడా ఉన్నప్పుడు, ‘కోర్5’ పేరిట అమెరికా కూటమిలో చేరవలసిన అవసరం వాటికి ఏమున్నది? అందుకు పొడిగింపుగా ఇతర సమస్యలున్నాయి. అమెరికా తన ఇండో పసిఫిక్ ఆధిపత్య వ్యూహంతో చైనా, రష్యాలకు సమస్యలు సృష్టిస్తున్నది. ఆ ప్రాంతపు మిత్రదేశాలలో సైనిక స్థావరాలను నిర్వహిస్తున్నది. తైవాన్ సమస్యను అనువుగా చేసుకుని చైనాను, హోక్కైరో దీవుల సమస్యతో రష్యాను ఇబ్బందిపెడుతున్నది. అందుకు జపాన్‌ను ఉపయోగించుకుంటున్నది.

ఇండియా, చైనా సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. మరొక వైపు చైనాతో పాటు ఇండియాతో టారిఫ్‌లు, వాణిజ్య ఒప్పంద యుద్ధాలు, రష్యాకు సంబంధించి ఉక్రెయిన్ యుద్ధం వంటి సమస్యలు అనేకం కనిపిస్తున్నావే. అటువంటపుడు, పరస్పర సాధారణ సంబంధాలు వేరు. కాని ఇండియా చైనా, జపాన్‌చైనా, జపాన్ రష్యా ఒక కూటమిగా పని చేయగలగటం అసాధ్యం. ఆయా సమస్యలు పరిష్కారం కూడా సమీప భవిష్యతులో కనిపించదు. చివరి ప్రశ్న ‘కోర్5’ వ్యవహరణ. అసలు ఆ కూటమి లక్షాలు ఏమిటి? రాజకీయంగా ఏం చేస్తుంది? ఆ కూటమి వల్ల ఆయా దేశాలకు గాని, ప్రపంచానికి గాని ఉపయోగం ఏమిటి? కూటమికి ముఖ్యంగా యూరపియన్ యూనియన్ లోబడి ఉంటుందా? అన్నింటికిమించి ఈ కొత్త రూపంలో తన అగ్రస్థానాన్ని నిలుపుకొనేందుకు, సామ్రాజ్యవాద ప్రయోజనాలు కాపాడుకునేందు అమెరికా చేయగల ప్రయత్నాలను మిగిలిన వారు అంగీకరిస్తారా? అందువల్ల, ఆచరణాత్మకంగా చూసినపుడు, ‘కోర్5’ ఆలోచన ఒక భ్రమగానే కనిపిస్తుంది. 

– టంకశాల అశోక్ ( దూరదృష్టి)

(రచయిత సీనియర్ సంపాదకులు) 

భారత జాతీయ ఆత్మకు 150 ఏళ్ల స్ఫూర్తి

వందేమాతరం’.. ఇది కేవలం ఒక గేయమే కాదు. భారతదేశాన్ని ఒక భౌగోళిక ప్రాంతంగా కాకుండా, తల్లిగా దర్శించే వేల సంవత్సరాల జాతీయ సంస్కృతి భావజాలానికి ప్రతీక. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ఈ మహాగీతం 150 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ సమయంలో, దాని చారిత్రక నేపథ్యం, అసలైన భావార్థం, కాలక్రమంలో జరిగిన వక్రీకరణలపై దేశవ్యాప్తంగా గంభీరమైన చర్చ జరగాల్సిన అవసరం ఏర్పడింది. బంకించంద్ర చటోపాధ్యాయ 1875లో ‘వందేమాతరం’ను రచించి, అనంతరం ఆనందమఠ్ నవలలో భాగంగా చేర్చారు. బ్రిటిష్ బానిస పాలన భారతీయ మనసుల్లో నిస్సహాయతను నాటే ప్రయత్నం చేసిన కాలంలో, ఆ సంకెళ్లను ఛేదించే ఆధ్యాత్మిక- జాతీయ స్ఫూర్తిగా వందేమాతరం అవతరించింది. ‘సుజలాం సుఫలాం’ అనే తొలి పాదం నుంచే భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని, తన పిల్లలను ఆదరించే తల్లిగా భావించాలన్న ఆలోచనను ప్రజల మనసుల్లో బలంగా నాటింది. భారతదేశాన్ని పూజించాల్సిన మాతృభావంగా సామాజిక చైతన్యంలో స్థిరపరిచింది.

భారతదేశం కేవలం ఒక భూమి ముక్క కాదు; అది జీవించే జాతీయ ఆత్మ. అటల్ బిహారీ వాజ్‌పేయి అన్నట్టుగా.. ‘భారత్ ఏ భూమి కా తుక్డా సహీ హై… యే జీతా జాతా ఏక్ రాష్ట్ర పురుష్ హై’. ఈ భావన ఏ ఒక్క కాలానికి చెందినది కాదు. వేదకాలం నుంచే ‘ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను’ అనే దృఢమైన ఆలోచన భారతీయ సంస్కృతికి మూలాధారం. అదే మాతృభావం, తాత్విక భావజాలం, అదే జాతీయ చైతన్యం కాలక్రమంలో వందేమాతరంగా అవతరించింది. సరస్వతి, లక్ష్మీ వంటి దేవీదేవతలను భరతమాత రూపంలో దర్శించే విశాలమైన సంస్కృతి భారతదేశానిది. స్వామి వివేకానంద భారతదేశాన్ని తల్లిగా ఆరాధించే భావజాలాన్ని స్పష్టంగా వివరించి, దానిని తరతరాలకు అందించారు. అలాంటి వేల సంవత్సరాల సంస్కృతి పరంపరలోంచే వందేమాతరం అవతరించింది. అందుకే వందేమాతరం ఏ మతానికి చెందిన గేయం కాదు.. అది భారత జాతీయ సంస్కృతికి ప్రతీక. దాన్ని మతపరమైన గేయంగా ముద్ర వేయడమంటే భారతీయ సంస్కృతి మూలాలనే అపహాస్యం చేయడమే.

అయితే దురదృష్టవశాత్తు, కాలక్రమంలో వందేమాతరాన్ని బెంగాల్ రాజకీయాలకు, మత కోణాల కోసం ముడిపెట్టే ప్రయత్నాలు జరిగాయి. ‘ఇది బెంగాలీల గేయం’, ‘ఇది మతపరమైన పాట’ అనే విమర్శలు చరిత్రను అర్థం చేసుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలే. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ కవి కావచ్చు, బంకించంద్ర ఛటోపాధ్యాయ బెంగాలీ రచయిత కావచ్చు. కానీ వారు ప్రాతినిధ్యం వహించినది ఏ ప్రాంతానికో, ఏ మతానికో కాదు.. సంపూర్ణ భారత జాతీయ ఆత్మకోసమేనని గుర్తుంచుకోవాలి. వారిని ప్రాంతీయ సంకుచితత్వంతో పరిమితం చేయాలనుకోవడం, భారతీయ జాతీయ భావజాలాన్ని చిన్నచూపుగా చూడడమే. బ్రిటిష్ కుట్రలకు ఎదురుగా భారతీయ ఐక్యతను నిలబెట్టిన శబ్దంగా వందేమాతరం మార్మోగింది. బ్రిటిషర్లు ‘విభజించి పాలించు’ అనే కుట్రను అమలు చేయడానికి బెంగాల్‌ను ప్రయోగశాలగా మార్చారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన శక్తివంతమైన నినాదం ‘వందేమాతరం’. ఆ గీతమే స్వదేశీ ఉద్యమానికి ప్రాణం పోసి, ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించింది. ఈ స్ఫూర్తి బెంగాల్‌కే పరిమితం కాలేదు, దేశం నలుమూలలా విస్తరించి స్వాతంత్య పోరాటానికి దిశానిర్దేశం చేసింది.

బెంగాల్‌కే పరిమితం కాకుండా, హైదరాబాద్‌లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ ‘వందేమాతరం’ నినాదం గట్టిగా మార్మోగింది. రామచందర్ రావు వంటి నాయకులు నిజాం అణచివేతకు ఎదురుగా పోరాడిన సందర్భంలో.. అదే గేయం ఉద్యమకారులకు ధైర్యం, దిశ ఇచ్చింది. తమిళనాడులో సుబ్రమణ్యం భారతి వంటి మహానుభావులు కూడా ఇదే జాతీయ భావజాలాన్ని ప్రజలలో వ్యాప్తి చేశారు. అందుకే వందేమాతరం ఏ ఒక్క ప్రాంతపు నినాదం కాదు.. భారతదేశమంతటా ప్రతిధ్వనించిన జాతీయ నినాదం. ఇక్కడే ప్రధాన ప్రశ్న ఉద్భవిస్తుంది- వందేమాతరాన్ని మత కోణంలోకి లాగిన వారు ఎవరు? సంపూర్ణ గీతాన్ని పక్కన పెట్టి, కొన్ని చరణాలకే పరిమితం చేయడం ఎవరి స్వార్ధానికి అనుగుణంగా జరిగింది? 1933 -1947 మధ్యకాలంలో, దేశవిభజన రాజకీయాలు, జిన్నా కోసం సర్దుబాట్లు, కొన్ని వర్గాలను సంతృప్తిపర్చే ప్రయత్నాలు.. ఇవన్నీ భారత జాతీయ ఆత్మను బలహీనపరచే చర్యలే.

అప్పటి కాంగ్రెస్ జాతీయ చైతన్యాన్ని రాజకీయం కోసం తక్కువ చేసి, జిన్నా వ్యూహాలను అనుకూలంగా చూడటానికి సిద్ధపడింది. చరిత్ర స్పష్టంగా నిరూపిస్తోంది. స్వాతంత్యానికి ప్రతీకగా, దేశమాతకు ప్రతీకగా పుట్టిన వందేమాతరాన్ని, రాజకీయ లాభాల కోసం కుదించడమే తప్పు. మొత్తం వందేమాతరాన్ని కత్తిరించి, కొన్ని చరణాలకే పరిమితం చేయడంవల్ల గీతంలోని అసలు అర్థం, సంపూర్ణ స్ఫూర్తి దేశప్రజలకి అందలేదు. వందేమాతరం మొత్తం పాడినప్పుడు మాత్రమే, భారత దేశాన్ని తల్లిగా ఆరాధించే పూర్తి భావజాలం, జాతీయ చైతన్యం స్పష్టమవుతుంది. అన్ని చరణాలు కలిసినప్పుడు మాత్రమే, భారత జాతీయ ఆత్మను ప్రతిబింబిస్తాయి. వందేమాతరం 150 ఏళ్ల ప్రయాణం స్పష్టంగా చెప్పేది ఏంటంటే- భారతదేశాన్ని మతపరమైన కళ్లజోడు ద్వారా మాత్రమే చూడాల్సిన అవసరం లేదని. వేలాది సంవత్సరాల సంస్కృతి పరంపరను తల్లిగా ఆరాధించే భావజాలమే నిజమైన భారతీయత, ఆ భావజాలానికి ప్రతీక వందేమాతరం. ఈ గేయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం అసహ్యకరం. దాని అసలు అర్థాన్ని, స్ఫూర్తిని నేటి తరానికి చేరవేయడం అత్యవసర కర్తవ్యం. వందేమాతరం కేవలం చరిత్ర జ్ఞాపకం మాత్రమే కాకుండా, వర్తమానానికి దిశానిర్దేశం, భావితరాలకు ప్రేరణ.

– డా. ఎస్.ప్రకాశ్ రెడ్డి

(బిజెపి సీనియర్ నాయకులు)

ప్రతి భారతీయుడి గుండె చప్పుడు

వందేమాతరం కోట్లాది గొంతుకల జాతీయ చైతన్యం. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒక మంత్రంలా మారి, కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసిన మహోన్నత గీతం ‘వందేమాతరం’. బంకించంద్ర ఛటర్జీ కలం నుండి జాలువారిన ఈ గీతం నేటికి 150 వసంతాలను పూర్తి చేసుకుంది.

చారిత్రక నేపథ్యం, సాహిత్య సౌరభం

1870వ దశకంలో బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘ఆనందమఠం’ నవలలో భాగంగా ఈ గీతం పుట్టింది. సంస్కృత, బెంగాలీ భాషల కలయికతో సాగే ఈ గీతం కేవలం ఒక పాట మాత్రమే కాదు.. మాతృభూమి పట్ల భక్తిని చాటే ఒక అద్భుత గీతం. ప్రకృతిని, దేశ సంపదను వర్ణిస్తూ సాగే ఈ సాహిత్యం భరత భూమిని సాక్షాత్తూ ఒక తల్లిగా అభివర్ణించింది. 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని మొదటిసారిగా ఆలపించడంతో ఇది జాతీయ ఉద్యమ ఊపిరిగా మారింది.

దేశ సమగ్రతకు ప్రతీక

వందేమాతరం అంటే ‘తల్లీ నీకు వందనం’ అని అర్థం. ఒక దేశాన్ని భౌగోళిక సరిహద్దులుగా కాకుండా, ఒక జీవమున్న తల్లిగా చూడటం భారతీయ సంస్కృతిలోని విశిష్టత. బ్రిటిష్ వారు ‘డివైడ్ అండ్ రూల్’ (విభజించి పాలించు) పద్ధతితో భారతీయుల మధ్య చిచ్చు పెట్టాలని చూసినప్పుడు బెంగాల్ విభజన సమయంలో ప్రజలను ఏకం చేసింది ఈ నినాదమే. నేటి కాలంలో ప్రాంతీయతత్వం, కుల ప్రాతిపదికన విచ్ఛిన్నకర శక్తులు తలెత్తుతున్న తరుణంలో ‘వందనం’ అన్న భావన మనల్ని ఒకే తాటిపైకి తెస్తుంది. దేశ సమగ్రతను కాపాడటంలో ఈ గీతం అందించే స్ఫూర్తి అజరామరం.

నేటి అవసరం

మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో యువత తన మూలాలను మరచిపోతున్న తరుణంలో వందేమాతరం అవసరం మరింతగా ఉంది. దేశభక్తి కేవలం యుద్ధ సమయాల్లోనే కాదు, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడంలో కూడా ఉంటుంది.

ఐక్యత: భాషలు, ఆచారాలు వేరైనా మనమంతా భారతీయులమనే భావనను ఇది పెంపొందిస్తుంది.

ప్రకృతి ఆరాధన: ఈ గీతంలో నదులు, చెట్లు, పచ్చని పొలాల వర్ణన ఉంది. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతను ఇది పరోక్షంగా గుర్తుచేస్తుంది.

నైతిక బలం: కష్టకాలంలో దేశం కోసం నిలబడే ధైర్యాన్ని ఈ గీతం ఇస్తుంది.

సాహిత్య చర్చ, వివాదాలు

వందేమాతరం చుట్టూ కొన్ని మతపరమైన వివాదాలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. అయితే లోతుగా పరిశీలిస్తే ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు. దేశాన్ని తల్లిగా గౌరవించడం ఒక సంస్కృతి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ఈ గీతాన్ని ఒక రాజకీయ కోణంలో కాకుండా జాతీయ గౌరవంగా చూడాలి. వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానం ఒక అద్భుతం. ఇది గతం గురించి మాత్రమే కాదు, భవిష్యత్ భారతం గురించి కూడా మాట్లాడుతుంది. ఒక సగటు భారతీయుడికి తన దేశం పట్ల ఉండాల్సిన బాధ్యతను, ప్రేమను గుర్తు చేసే నిత్య నూతన గీతమిది. స్వార్థ రాజకీయాలకు అతీతంగా, ప్రతి భారతీయుడు ఈ గీతంలోని అంతరార్థాన్ని గ్రహించి, దేశాభివృద్ధికి కంకణబద్ధులు కావడమే మనం ఈ గీతానికి ఇచ్చే నిజమైన నివాళి. వందేమాతరం కేవలం ఒక నినాదం కాదు, అది ప్రతి భారతీయుడి గుండె చప్పుడు. 

పమిడికాల్వ మధుసూదన్

(సీనియర్ జర్నలిస్ట్)

2047లో 1947 పునరావృతం అవుతుందా?

మూడు నాలుగేళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు ముస్లిం మహిళా విలేఖరి ఆర్ఫా ఖానమ్ షేర్వానీకి తన కవిత వినిపించి, అభిప్రాయం చెప్పమన్నాడు. ఆ కవిత పాఠం ఉర్దూలో ఇలా ఉంది.

తస్లీమాత్ మా తస్లీమాత్

తూ భరీ హై మీఠీ పానీ సే

ఫల్ ఫూలోంకి షదాబీ సే

దఖ్కిన్ కీ ఠండీ హవావోంసే

ఫసలోంకి సుహాని ఫిజావోంసే

తస్లీమాత్ మా తస్లీమాత్

తేరీ రాతే రోషన్ చాంద్ సే

తేరి రౌనక్ సబ్జె ఫామ్ సే

తేరీ ప్యార్ భరీ ముస్కాన్ హై

తేరి మీఠా బహుత్ జుబాన్ హై

తెరి బాహోం మే మేరీ రాహత్ హై

తేరే కద్మోం మే మేరీ జన్నత్ హై

తస్లీమాత్ మా తస్లీమాత్

ఈ కవిత వినిపించి దానిపై ఆ నాయకుడు మహిళా విలేఖరి అభిప్రాయాన్ని అడిగాడు. ఆమె ఈ పాటలోని మాతృత్వం పట్ల వ్యక్తమైన ఉదాత్త భావాలను చాలా ప్రశంసించింది. దీన్ని దేశభక్తి గేయంగా పెడితే ఎలా ఉంటుంది అని అడిగితే ఆమె చాలా బాగుంటుంది అన్న జవాబిచ్చింది.

అప్పుడు ఆ రాజకీయ నాయకుడు ఈ రచన జాతీయ గీతమైన వందేమాతరం కి ఉర్దూ అనువాదం. సుజలాం, సుఫలాం, మలయజ శీతలం, సస్యశ్యామలాం, శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీ, ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం, సుహాసినీం, సుమధుర భాషిణీం అన్న భావాలనే ఈ రచన వ్యక్తీకరిస్తోంది అని చెప్పాడు. మరి మీరు వందేమాతరం గీతాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని నిలదీశాడు. మహిళా విలేఖరి ఆర్ఫా ఖానమ్ షేర్వానీ నోట మాట పెగల్లేదు. వందేమాతర గీతం పట్ల కొన్ని వర్గాల్లో వ్యక్తమౌతున్న వ్యతిరేకతలోని డొల్లతనాన్ని బరిబాతలగా బట్టబయలు చేసిన ఆ రాజకీయ నాయకుడు ప్రస్తుతం బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.

కత్తి మెడమీద పెట్టినా భారత్ మాతాకీ జైయ్ అనేది లేదనే అసదుద్దీన్ ఒవైసీ, ఈ దేశాన్ని తల్లిగా భావించడం మా మతం ఒప్పదు కాక ఒప్పదనే మతోన్మాదులకీ తెలియని విషయం ఒకటుంది.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ జాతీయగీతం ‘అమార్ శోనార్ బాంగ్లా లో ఓ మా (నా తల్లీ) అన్న పదం నాలుగు సార్లు వస్తుంది. దాన్ని పాడేందుకు మతాంధ జమాతె ఇస్లామీ బంగ్లాదేశ్ కి, మహ్మద్ యూనస్ కి, మరే ఇతర మత సంస్థకీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. దక్షిణాన ఉన్న శ్రీలంక తూర్పు భాగమంతా ముస్లింలే ఉంటారు. వారెవరికీ శ్రీలంక జాతీయగీతం

శ్రీలంకా మాతా.. అప శ్రీలంకా

నమోనమోనమో నమో మాతా

సుందర సిరిబరిని

సురేంది అతి శోభమనా లంకా

ధాన్య ధనయనేకా

మాయి పలతురు పిరిజయ భూమియల రమ్య జీవనయే మాతా

పాడటంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. మతం అడ్డు రాలేదు. ఈ జాతీయ గీతంలో దేశాన్ని తల్లిగా భావించడం జరిగింది. శ్రీలంక ముస్లిములెవరూ అభ్యంతర పెట్టడం లేదు.

ప్రపంచంలోని అతిపెద్ద ముస్లిం దేశాల్లో ఒకటైన ఇండోనేసియా జాతీయగీతంలో ఒక చరణం ఇండొనీసియా పవిత్ర భూమి, నా పవిత్ర మాతృ భూమి కోసం నేను నిలుచుంటాను అని స్పష్టంగా చెబుతుంది. ఇండోనేసియా ముస్లిం తన దేశాన్ని మాతృభూమిగా భావిస్తాడు. వందేమాతరం అన్న భావాన్నే నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా పాడతాడు.

బంగ్లా ముస్లింలకు, శ్రీలంక ముస్లింలకు, ఇండోనేసియా ముస్లింలకు దేశాన్ని తల్లిగా సంబోధించడంలో ఇబ్బంది లేదు. తల్లికి వందనం అనడంలో మతం అడ్డు రాదు. కానీ మన దేశంలోని ముస్లింలకే అభ్యంతరం ఎందుకు? ఈ దేశాలకు దేశాన్ని అమ్మ అనడంతో, అమ్మకు వందనం అనడంలో అడ్డం రాని మతం భారతదేశంలోని కొందరు ముస్లింలకే ఎందుకు వస్తుంది?

వందేమాతరం మొత్తం గీతంలో దేశాన్ని దుర్గగా, లక్ష్మిగా, సరస్వతిగా అభివర్ణించడం మా మతానికి విరుద్ధం అనే వారు బ్రిటన్ కి ఆవురావురుమని వెళ్లి అక్కడి పౌరసత్వం కోసం ఎగబడి, కలబడి అక్కడి నేషనల్ యాంథమ్ గాడ్ సేవ్ ది కింగ్ ని పాడతారే తప్ప గాడ్ అనడం కుదరదు అల్లాయో, ఖుదాయో అంటామని ఎప్పుడైనా, ఎక్కడైనా వాదించారా? లేదా వారు గాడ్, అల్లాహ్ ఒకటేనని అంగీకరిస్తారా? పైగా బ్రిటన్‌లోని ముస్లింలలో ఎక్కువమంది పాకిస్తానీలు (ముఖ్యంగా ఆక్రమిత జమ్మూకశ్మీర్‌కి చెందిన మీర్ పురీలు), బంగ్లాదేశీలు, భారతీయులు.

వీరంతా స్వాతంత్య్రానికి ముందు వందేమాతరంను వ్యతిరేకించిన వారే. భారతీయ ముస్లింలలో చాలా మంది ఇప్పుడూ వ్యతిరేకిస్తున్నారు. కానీ అక్కడ అల్లాహ్‌ని కాక గాడ్‌ని ప్రార్థించడానికి వారికి ఎలాంటి ఇబ్బందీ లేదన్నదే ముఖ్యం.

దుర్గ, లక్ష్మి, సరస్వతి వంటి పేర్లను పలకవలసిన అవసరం లేకుండా కేవలం తొలి చరణాన్నే భారతదేశం స్వీకరించింది. దానిని రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులైన ముస్లింలు అందరూ ఆమోదించారు. అలాంటి దాన్ని పలకడానికీ కూడా ఎందుకు అభ్యంతరం? ఈ గీతం ఆలపిస్తే లేచి నిలబడటానికి ఏమిటి ఇబ్బంది? దీనికి జవాబు అడగాల్సిన సందర్భం వచ్చింది.

పూర్తి వందేమాతర గీతాన్ని 1923వరకూ కాంగ్రెస్ పార్టీ పాడుతూ వచ్చింది. కాకినాడ కాంగ్రెస్ మహాసభల్లో మౌలానా మహ్మదలీ అభ్యంతరపెట్టడంతో వివాదం మొదలైంది. అంతకు ముందు హిందువులు, ముస్లింలు కలిసి ఈ గీతాన్ని పాడారు. పైగా కాకినాడ మహాసభలకు మహ్మదలీని మేళతాళాలతో ఊరేగించారు. ఆయనకు సంగీత వాయిద్యాలు ఇస్లాం మత విరుద్ధమని గుర్తుకు రాలేదు. మతవాద రాజకీయాల ముందు మోకరిల్లిన నాటి కాంగ్రెస్ నేతలైన గాంధీ, నెహ్రూలు అక్టోబర్ 1937 లో రెండు ముక్కలనే తూతూమంత్రంగా పాడి, తంతును నిర్వహించి సరిపుచ్చాలని నిర్ణయించారు. అంత చేసినా సరిగ్గా పదేళ్లకి 1947 లో దేశం రెండు ముక్కలైంది.

ముందు వందేమాతరం ముక్కలైంది. తరువాత దేశం ముక్కలైంది. అవునా కాదా?

ఈ ప్రశ్నలను వందేమాతర గీత రచనకు 150 సంవత్సరాలైన సందర్భంలో మనల్ని మనం వేసుకోవాలి. స్వాతంత్య్ర స్వర్ణోత్సవ వేడుకల సమయంలో, వందేమాతర గీత రచనకు 150 ఏళ్లవుతున్న సందర్భంలో 2047 లో 1947 పునరావృతం కాకూడదని కోరుకుందాం. పూర్తి వందేమాతర గీతాన్ని సగర్వంగా పాడదాం.

కస్తూరి రాకా సుధాకర్ రావు

(జర్నలిస్ట్)

దేశ సమైక్యతకు ప్రతీక

భావోద్వేగాలను రెచ్చగొడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ సున్నితమైన అంశాలతో రాజకీయాలు చేస్తోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని చరిత్రను వక్రీకరించడంలో దిట్ట అయిన బీజేపీకి భారత స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం లేదనేది వాస్తవం. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహా నేతల మధ్య విభేదాలున్నట్టు అసత్య ప్రచారం చేసిన బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ వేదికగా ‘వందేమాతరం’ గీ తాన్ని వక్రీకరించింది. వందేమాతరం 150 ఉత్సవాల సందర్భంగా అవాస్తవాలతో అధికార బీజేపీ దేశ భావితరాలను తప్పుదోవ పట్టించేలా, చరిత్రను తప్పుగా చిత్రీకరించేందుకు చేసిన కుట్రలను బాధ్యతగల పార్టీగా కాంగ్రెస్ వాస్తవాలతో ఎండగట్టింది. వందేమాతరం కేవలం ఒక నినాదం కాదు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలను ఏకంచేసిన ఒక భావజాలం, ఒక మంత్రశక్తి. దేశం కోసం త్యాగానికి సిద్ధపడిన కోట్లాది భారతీయుల హృదయ స్పందన.

భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రాణం పోసిన గీతం. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రను వక్రీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం పవిత్రమైన ‘వందేమాతరం’ గీతాన్ని కూడా భావోద్వేగాలకు వినియోగించుకునే దురుద్దేశంతో మతపరంగా ప్రజలను రెచ్చగొట్టాలని చూడడం దురదృష్టకరం. వందేమాతరం భావనను భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే స్వీకరించింది. బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతం నియంతృత్వ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో జాతీయతకు సంకేతంగా నిలిచింది. వందేమాతరంతో భారత స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఉద్యమకారులను ప్రోత్సాహించిన కాంగ్రెస్ పార్టీ ఎంతో బాధ్యతాయుతంగా మెలిగి ఆ గీతాన్ని సంకుచిత దృష్టితో దుర్వినియోగం చేయలేదు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాం గ నిర్మాతలు దేశభక్తిని ప్రజాస్వామ్య విలువలతో ముడిపెట్టారు. వందేమాతరం జాతీయ గీతం కాకపోయినా, దానికి అంతే సముచిత గౌరవం, స్థానం కల్పించారు. ఇది దేశంలోని విభిన్న మతాలు, కులాలు, వర్గాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రాంతాలను గౌరవించే రాజ్యాంగాత్మక సమతుల్యానికి నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ఈ సమతుల్యాన్ని ఎప్పటికీ కాపాడుతూనే వచ్చింది. అయితే పవిత్రమైన వందేమాతరం గీతాన్ని కూడా మత కోణంలోనే చూస్తున్న బీజేపీ తమ సిద్ధాంతాలతో విభేదించే వారిని దేశద్రోహులుగా ముద్రవేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. దేశాన్ని ప్రేమించడంతో పాటు ఎవరు ఏమి చేయాలో, ఎలా వ్యవహరించాలో, ఏమి తినాలో, ఏ గీతం పాడాలో అంశాలను కూడా తామే నిర్ణయిస్తామన్నట్టు వ్యవహరిస్తున్న బీజేపీ పోకడలను కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ సహించదు. వారి నుండి విద్వేష పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలో దేశం లేదనే సత్యాన్ని ఆ పార్టీ గ్రహించాలి.

జవహర్ లాల్ నెహ్రూ ఒత్తిడికి తలొగ్గి వందేమాతరం గీతాన్ని కుదించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ లో బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించి అవాస్తవాలు చెప్పారు. ఎవరికీ అభ్యంతరాలు లేకుండా, అందరికీ ఆమోదయోగ్యం ఉండేలా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆర్‌ఎస్‌ఎస్ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సమక్షంలోనే వందేమాతరం గీతంలో చరణాలకు రాజ్యాంగ పరిషత్తు ఆమోదం తెలిపింది. ఈ సవరణలపై జాతీయగీతం రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవ చరిత్ర ఇది అయితే బీజేపీ నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగా నెహ్రూను లక్ష్యంగా చేసుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఒక వేళ నరేంద్ర మోదీ చెప్పినట్టే నెహ్రూ కావాలనే గీతాన్ని కుదిస్తే రాజ్యాంగ పరిషత్తులో ఇతర సభ్యులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదన్న ప్రశ్నకు సమాధానం బీజేపీ నేతలవద్ద లేదు. వందేమాతరం గీతం చరణాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న సమయంలో పార్టీ సభ్యులుగా మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, ఠాగూర్ కూడా ఉన్నారనే వాస్తవాలను తొక్కిపెట్టి కేవలం నెహ్రూ లక్ష్యంగా పవిత్రమైన పార్లమెంట్ వేదికగా బీజేపీ అసత్యాలను చెప్పింది.

దేశ స్వాతంత్య్ర సమరంలో ఏ పాత్రా పోషించని బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు వందేమాతరంపై తమకే పేటంట్ హక్కులున్నట్టు వ్యవహరిస్తున్నా రు. 1875లో బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతాన్ని 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటి సారిగా కాంగ్రెస్ సమావేశంలోనే ఆలపించారు. కాంగ్రెస్ ఈ గీతాన్ని ఆలపించదని ఆరోపిస్తున్న బీజేపీ వారు ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు..? అంతేకాదు నెహ్రూపై నిరాధార ఆరోపణలు చేస్తున్న బీజేపీ దేశం స్వాతంత్య్రం కోసం నెహ్రూ 12 ఏండ్లు జైలు జీవితం గడిపారనేది వాస్తవం కాదా చెప్పాలి. సంఘ్ పరివార్ సభ్యులు, బీజేపీ నేతలెవరైనా స్వాతంత్య్రం కోసం జైళ్లకి వెళ్లారా? వాస్తవాలు ఇలా ఉంటే కేవలం వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ వందేమాతరం గీతంపై రాజకీయాలు చేస్తోంది.

పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం నల్ల చట్టాలను రూపొందిస్తోంది. వీరి పాలనలో నిరుద్యోగం రికార్డు స్థాయికి పెరిగిపోయింది. మహిళలకు భద్రత, సమానత్వం కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యింది. దళితులు, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు. మైనార్టీలు మోదీ పాలనలో అభద్రతా భావంతో జీవిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఆహార భద్రత, ఉపాధి హామీ, విద్యా హక్కు వంటి ప్రజా సంక్షేమ పథకాలు బీజేపీ పాలనలో నీరుగారిపోతున్నాయి. నిత్యావసర ధరలు ఆకాశనంటడంతో సామాన్య ప్రజల జీవితాలు దుర్భరం అవుతున్నాయి.

సామాన్యుడి చేతిలో అస్త్రం అయిన సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశారు. విదేశీ వ్యవహారాల్లో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. స్వయం ప్రతిపత్తి గల ఈడీ, ఐటీ, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రత్యర్థులపై రాజకీయ కక్ష కోసం వాడుకుంటూ దుర్వినియోగం చేస్తోంది. బీజేపీ ప్రభుత్వంపై దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన దశలో దాన్ని పక్కదారి పట్టిస్తూ వందేమాతరం గీతంపై బీజేపీ ప్రభుత్వం వివాదాన్ని సృష్టిస్తోంది.

వందేమాతరం మతాల మధ్య విభేదాల కోసం కాదు.ఈ గీతం దేశంలోని గంగా జమున సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. స్వాతంత్య్ర సమరంలో ప్రజలు దేశభక్తితో మతాలకు అతీతంగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తే ఇప్పుడు బీజేపీ దీనికి మతం రంగం పులుముతోంది. వందేమాతరం గీతం దేశ భక్తి, మత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, భావ ప్రకటనకు ప్రతీకగా నిలిచింది. అయితే వీటిలో ఏ ఒక్కటినీ ఆచరించని బీజేపీ ఇప్పుడు వందేమాతరం గీతంపై రాజకీయాలు చేయడం హాస్యాస్పదం. వందేమాతరం అనేది దేశ ప్రజలందరికీ చెందిన భావన. ఈ గీతాన్ని దేశ విభజన కోసం కాదు. దేశ ప్రజల ఐక్యతకు స్ఫూర్తిగా తీసుకోవాలి. వందేమాతరాన్ని ద్వేషాల కోసం కాకుండా ప్రేమానురాగాలు పంచేందుకు వినియోగించుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తితో, ప్రజాస్వామ్య విలువలతో, సమానత్వభావనతో కలిసికట్టుగా సాగినప్పుడే ‘వందేమాతరం’ అర్థం సార్థకమవుతుంది.

బి.మహేశ్ కుమార్ గౌడ్

(ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు)

‘వందేమాతరం’పై నేతల వరస మారుతోంది!

‘వందేమాతరం’ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 8న మన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జరిగిన సుదీర్ఘ చర్చ రాజకీయ రగడగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. బెంగాల్ చరిత్ర, సాంస్కృతిక మూలాలలో ‘వందేమాతరం’ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందనేది జగమెరిగిన సత్యం. 1875లో ప్రముఖ బెంగాలీకవి బంకించంద్ర ఛటర్జీ కలం నుండి ఊపిరిపోసుకున్నఈ గేయానికి సంగీతకారుడు జోదునాథ్ భట్టాచార్య బాణీ కట్టారు. 1896లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గళం నుండి ఈ గేయం గీతమై జాలువారింది. ఆ తరువాత, స్వాతంత్య్రోద్యమంలో అత్యంత ప్రజాదరణ పొందిన నిరసన గీతాలలో ఒకటిగా నిలిచింది. 1937లో మన జాతీయ గేయంగా ఎన్నికైంది. ఇందుకు 1950లో రాజ్యాంగ సభ ఆమోదం కూడా పొందింది. అయితే, ముహమ్మద్ అలీ జిన్నా ఒత్తిడికి తలొగ్గి, నెహ్రూ ‘వందేమాతరం’ని రెండు చరణాలకే కుదించారని, తద్వారా దేశ ప్రజలను విడగొట్టారని పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ చర్చ రానున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలే లక్ష్యంగా, ‘జాతీయవాదం’ ముసుగులో అక్కడి ప్రజల్లో మతవిద్వేషాలు రేకెత్తించడానికి ఎన్డీయే ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న సంక్షోభాలనుండి ప్రజల దృష్టిని మళ్ళించే చర్యగా దీనిని అభివర్ణించాయి.

దిల్లీ వాయు కాలుష్యం మొదలుకొని, ఇండిగో సంక్షోభం, రూపాయి పతనం, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులకు మద్దతు ధర లేకపోవడం, మైనారిటీలపై దాడులు, అలాగే లింగ ఆధారిత వివక్ష/ హింస వరకు.. ఇలా దేశంలో ఉన్న ఎన్నో ప్రధాన సమస్యలపై చర్చించకపోవడం ప్రజలపట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రతిబింబిస్తోందన్న ప్రతిపక్షాల అభిప్రాయంతో మన నవతరం కూడా ఏకీభవిస్తోంది.

ప్రతీకవాదం వేరు, వాస్తవాలు వేరు

ఎన్జీఓ రంగంలో విద్యావేత్తగా పనిచేస్తున్న 27 ఏళ్ళ నిఖితా రీనా, ‘వందేమాతరం’ చర్చని పశ్చిమ బెంగాల్ ఎన్నికల నుండి వేరు చేసి చూడలేమన్నారు. ఎందుకంటే, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాలు ఆ గేయంలోని సాంస్కృతిక విలువల గురించి తక్కువ, ఒక నిర్దిష్ట నియోజక వర్గానికి జాతీయవాదాన్ని ఆపాదించే దిశలో ఎక్కువగా దృష్టి పెట్టాయన్నారు. జాతీయ ప్రాధాన్యతలను గుర్తించడం, భవిష్యత్తును చర్చించడం, ప్రగతిశీల, ఇన్‌క్లూజివ్, పౌరులకు సహాయపడే చట్టాలను ఆమోదించడం పార్లమెంటు ప్రాథమిక లక్ష్యాలు. ఒకపక్క, మన దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలుపడింది. నిరుద్యోగం ప్రబలంగా ఉంది. జీవన వ్యయం పెరిగింది. ఇంకోపక్క, ప్రజారోగ్యం, పర్యావరణం, సామాజిక భద్రతా వ్యవస్థలు తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో, చారిత్రక ప్రాముఖ్యం ఉందన్న కారణంతో, ఒక గేయం కోసం పది గంటల సమయాన్ని కేటాయించడం ఓటు రాజకీయం కాక ఇంకేంటి?

ఎన్జీఓ రంగంలో నిఖితా రీనా అనుభవాలు, పరిశీలనలు ఆమె అభిప్రాయాన్ని మరింత బలపరుస్తున్నాయి. స్థానభ్రంశం, కాలుష్యం, పోషకాహార లోపం, అస్థిర జీవనోపాధిని ఎదుర్కొంటున్న సముదాయాలకు ప్రభుత్వ విధానాలు, చొరవలు, జవాబుదారీతనం, సకాలంలో జోక్యం చేసుకోవడం, ఇంకా అధికారుల ప్రతిస్పందన ముఖ్యమని వివరించారు.

దేశీ మార్కెట్

ఆహార భద్రత, మైనారిటీలకు సమాన అవకాశాలు, మధ్యతరగతి గృహనిర్మాణం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, విద్యాహక్కు, బేటీ బచావో -బేటీ పడావో, మహిళలు -గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, విద్య-పరిశోధన నాణ్యత పెంచడం, నైపుణ్యాల గుర్తింపు, ఉపాధి, ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడం, బ్యాంకింగ్ సంస్కరణలు- ఇలా రాజకీయ పార్టీలు తమ ఎలక్షన్ మేనిఫెస్టోలలో ప్రకటించింది ఒకటైతే, వాస్తవాలు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. పెరుగుతున్న లేఆఫ్‌లు, కార్పొరేట్ విధానాలు, టాక్సిక్ వర్క్ కల్చర్, అధిక పని వేళలు, జెండర్ గ్యాప్ లాంటి అంశాలలో సంస్థాగత చర్యలు లేకపోవడం చాలా నిరాశాజనకంగా ఉంది. దాంతో, మా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కూడా దెబ్బతింటోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్’ ప్రవేశపెట్టడం నిజంగా హర్షణీయం. కానీ ఇవేవీ పట్టనట్టు, ఎప్పుడో రాసిన వందేమాతరం గురించి చర్చించి, కేంద్ర ప్రభుత్వం ఏం నిరూపించింది? ఐటీ రంగంలో అవకాశాలు లేకపోవడంతో, గత 8-9 నెలలుగా ఫ్రీలాన్స్ వర్క్‌కే పరిమితమైన శ్రీలత గండికోట ప్రశ్నించారు.

మహిళా సాధికారత, రక్షణ ఒక మిథ్య

మహిళలకు ఇంట్లో, బయటా స్వేచ్ఛ, గౌరవం కరువైన ఈ సమాజంలో, సాధికారత/ సమాన అవకాశాలు కేవలం ఒక అపోహ. ఎందుకంటే, ఆర్థిక మాంద్యం రాగానే, మొదట ఉద్యోగాలు కోల్పోతోంది మహిళలే. ఇది చాలదన్నట్లు, ఈ ఏడాది జూన్‌లో, తమ దేశ మహిళలు భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించ వద్దని అమెరికా విదేశాంగ శాఖ సిఫార్సు చేసింది. ‘భారతదేశంలో విపరీతంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటి,’ అని లెవెల్-2 హెచ్చరికను కూడా జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ళలో మౌలిక సదుపాయాలు, అమ్మాయిలకు భద్రత, బడ్జెట్ కేటాయింపులు లేవు. పోక్సో కేసులు నమోదు చేసే యంత్రాంగం లేదు అంటూ తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఒక హక్కుల ఆధారిత సంస్థలోని యువ వాలంటీర్ వాపోయారు.

విదేశీ అవకాశాలు

అక్టోబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023 మధ్య, అమెరికా జారీ చేసిన హెచ్1బీ వీసాల లబ్ధిదారులలో 72.3 శాతం భారతీయ పౌరులే. దీని బట్టి, మనవాళ్ళు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎంఎస్‌సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ తరువాత, హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ళ నాగార్జున్, అమెరికాలో పీహెచ్డీ అవకాశాల కోసం గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ, హెచ్1బీ అప్లికేషన్‌ల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో, అతని ఆశ అడియాస అయ్యింది. ఇప్పటికే ఆర్థికంగా సతమవుతున్న మధ్యతరగతికి ఇక అమెరికా అందని ద్రాక్షే! సోషల్ మీడియా వెట్టింగ్ లాంటి కొత్త నియమాల వల్ల వీసా రావడం కష్టమవుతుంది. అందుకే, నేను యూరప్‌కి వెళ్దామనుకుంటున్నాను. ఇక్కడేమో కానీ, ఇమిగ్రంట్స్‌కి అక్కడ మంచి డిమాండ్ ఉంది. ఒక్క 2024లోనే, 2.06 లక్షల మంది భారతీయులు ఇక్కడి పౌరసత్వం వదులుకొని, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ దేశాల పౌరసత్వం పొందారు. అంటే, ‘పర్మనెంట్ సెటిల్‌మెంట్’ కి మన యువత ఎంత ప్రాధాన్యతనిస్తోందో అర్థమవుతోంది.

మన దేశంలో ఇంకా ఏం మిగిలుంది? ఉద్యోగాలు లేవు. భూమీ, నీళ్ళూ, గాలీ కలుషితమయ్యాయి. పేరుకే మనది ప్రజాస్వామ్యం. కానీ, ఓట్లు కూడా చోరీ అవుతున్నాయి. జనం ఎప్పుడో కులం, మతం, జాతి, అంతస్తు పేరుతో చీలిపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, స్కూల్స్ సైతం ప్రైవేటైజ్ అవుతున్నాయి. ఈ లెక్కన, త్వరలో రిజర్వేషన్ వ్యవస్థకు మనం స్వస్తి చెప్పొచ్చు. అయినా, ఎన్నికలొచ్చినప్పుడు, బిజెపి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎత్తుగడ వేస్తూ వస్తోంది. బెంగాల్ ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు ఇది, అంటూ, యూకే వీసా కోసం ఎదురుచూస్తున్న రుక్షియా బేగం నిట్టూర్చారు.

ఇదేనా ‘వందేమాతరం’ స్ఫూర్తి?

మన యువతలో ఆత్మహత్యల రేటు ఆందోళనకరమైన స్థాయిలో ఉంది. ఎన్‌సిఆర్‌బి 2022 నివేదిక ప్రకారం, భారతదేశంలో, ప్రతి సంవత్సరం సుమారు 13,000 మంది యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రేమ వ్యవహారాలు, పెళ్ళి, కుటుంబ అంచనాలు, డ్రగ్స్, ఒత్తిడి, నిరుద్యోగం, వేధింపులు ఇవన్నీ ఈ బలవన్మరణాలకు ప్రధాన కారణాలు. ఇదొక జాతీయ విపత్తు. కానీ, దీనిపై పార్లమెంటులో చర్చ జరగదు. ‘వందేమాతరం’ స్ఫూర్తిని మన పార్లమెంటు గౌరవిస్తోందన్నది నిజమే అయితే, ఆ గేయం కాంక్షించిన సమాజాన్ని సృష్టించడానికి, మన రాజకీయ నాయకులు పారదర్శకత, జవాబుదారీతనంపై ఎందుకు దృష్టి పెట్టరు? తెలుగు రాష్ట్రాలలో గే హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్త విష్ణు తేజ ప్రశ్నించారు. ఏదేమైనా, ‘వందేమాతరం’ చర్చ సాంస్కృతిక, సైద్ధాంతిక ప్రతీక వాదంగా మారింది. మొదటి నుండీ, బెంగాల్ రాజకీయాలు సంస్కృతి, చారిత్రాత్మక, మేధోపరమైన చర్చ, ప్రాంతీయ ఆత్మగౌరవానికే పెద్ద పీట వేస్తూ వచ్చాయి. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం వేసిన ఈ ఎత్తుగడ అక్కడి ఓటర్ల విశ్వాసాన్ని గెలుస్తుందా లేదా అన్నది సమయమే నిర్ధారిస్తుంది.

వై. కృష్ణజ్యోతి

(ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)