ankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escort

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

holiganbet

Betpas güncel giriş

Casibom

holiganbet güncel giriş

betkolik

trendbet giriş

taksim escort

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

vaycasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

izmit escort

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

marsbahis giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

vaycasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

sekabet

maltcasino

grandpashabet

savoybetting

savoybetting

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casino levant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

vaycasino

Atlasbet Giriş

Wbahis

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

Wbahis

grandpashabet

restbet

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

galabet

kingroyal

holiganbet

marsbahis

casibom

padişahbet

padişahbet giriş

queenbet

padişahbet

padişahbet giriş

casinolevant

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

Pendik escort, esenyurt escort

sekabet

casinolevant

casinolevant giriş

anadoluslot

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

casinolevant

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

అనాథ పిల్లలకు దత్తత ఓ వరం!

భారత్‌లో అధికారికంగా ప్రతి ఏట అత్యధికంగా దాదాపు మూడు వేలకు పైగా పిల్లలు దత్తత ప్రక్రియలో కుటుంబాలను మారడం జరుగుతున్నది. 2024 – 25లో 4,515 మంది, 2023 -24 లో 3,142 మంది పిల్లలు దత్తత ద్వారా మారడం కొనసాగుతున్నది. అధికారికంగా దత్తత తీసుకునే ప్రక్రియ చాలా సంక్లిష్టమైనదిగా, ఎక్కువ కాలం పట్టే ప్రక్రియగా గుర్తించబడింది. పిల్లల్ని దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించడం, దత్తత తీసుకున్న కుటుంబాలను గుర్తించి ప్రశంసించడం, ప్రక్రియ పట్ల అవగాహన కలిపించడానికి ప్రతి ఏట 22 నవంబర్ రోజు జాతీయ దత్తత దినోత్సవం (నేషనల్ అడాప్షన్ డే) పాటించడం జరుగుతున్నది. పిల్లలు కాని దంపతులు, ఇతర సందర్భాల్లో శాశ్వతంగా పిల్లలను తన కుటుంబాల్లోకి దత్తత తీసుకోవడం, ఆ కుటుంబాలను ప్రోత్సహించడం, ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం, దత్తత పట్ల అవగాహన కల్పించడం, దత్తతకు సంబంధించిన సంస్థల వివరాలు తెలుసుకోవడం లాంటి అంశాలు ఈ రోజు చర్చించబడతాయి.

2025 జాతీయ దత్తత దినోత్సవం ఇతివృత్తంగా పిల్లల్ని గుర్తించడం : నూతన చిరకాల బంధాలను ఏర్పరచడం అనే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. దత్తత అనేది ఓ అద్భుత ప్రక్రియ. ఇది అనాథల జీవితాల్లో మార్పులను తీసుకు వస్తుంది. దత్తత తీసుకున్న పిల్లల పట్ల ప్రేమను కుమ్మరిస్తూ, మానవత్వానికి మరో నిర్వచనంగా నిలవడం, వారి శ్రేయస్సుకు పాటు పడే కుటుంబాలను గూర్చి చర్చించడం జరుగుతుంది. దత్తత పిల్లలు తమ జీవితాల్లో తగు చేయూత, ప్రేమ, శిక్షణ, విద్య, భద్రత లాంటివని పొందుతారు. ఈ రోజున దత్తత తీసుకున్న దంపతులు, దత్తతకు వెళ్లిన పిల్లలు నూతన కుటుంబ జీవితాలను అనుభవిస్తారు. దత్తత ప్రక్రియ పట్ల అవగాహన కలిపించడం, దీనికి సంబంధించిన సవాళ్లను అధిగమించడం జరుగుతుంది. అనాథ పిల్లల్ని ఆదుకునే ఒక పవిత్ర ప్రక్రియగా దత్తత గుర్తించబడింది.

పేగు బంధానికి సరిసమానంగా దత్తత బంధం నిలవాలని కోరుకుంటారు. అనాథ పిల్లల ఉజ్వల భవిత, కుటుంబాల్లో ప్రేమానుబంధాలు, సంతోషంగా కుటుంబ జీవితాలను గడపడం లాంటివని దత్తతతో ముడిపడి ఉంటాయి. దత్తత ఓ గొప్ప సమాజ సేవ అని, ప్రేమల పందిరి వలె పిల్లలతో కూడిన కుటుంబ వాతావరణం సృష్టించబడడానికి, అనాథ పిల్లలు తమ బాల్యాన్ని క్రమ పద్ధతిలో గడపడానికి దత్తత దోహదపడుతున్నది. అనాథ పిల్లలకు నమ్మకం, ప్రేమలు పరిచయం చేసే కుటుంబాలు లభిస్తాయి. దత్తత ద్వారా అధిక సంఖ్యలో అనాథ పిల్లల్ని కాపాడవచ్చని గమనించాలి. దత్తత ప్రక్రియలో ఓపిక, మార్గదర్శనం, చేయూత అవసరం అవుతాయి. దత్తత తీసుకోవడంలో పౌర సమాజం, సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం, అవగాహన వేదికలు, కుటుంబాలు, మిత్రులు లాంటి వారి సమన్వయం అవసరం అవుతుంది. ఒక పవిత్రమైన దత్తత ద్వారా ఇరుపక్షాలు తమ కోరికలను తీర్చకపోవడం జరుగుతుంది. దత్తతను ఒక శాశ్వత బంధంగా నిలుపుకుంటూ అనాథలు లేని పౌర సమాజ స్థాపనకు కృషి చేద్దాం.  

బుర్ర మధుసూదన్‌రెడ్డి

9949700037

సమాచార హక్కు సామాన్యులకు ఎండమావేనా!

ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు నాలుగు గోడల మధ్యలో పాలన చేస్తున్నట్టు కాకుండా పారదర్శకంగా చేస్తున్నట్టు ఉండాలి. పౌరులకు తెలియని స్థలమనేది ఉండకూడదు. రహస్య ప్రాంతాల్లో అవినీతి పెరిగిపోతుంది. అదే బహిరంగ ప్రదేశాల్లోనైతే నిర్మూలించబడుతుంది’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ అన్నారు. మన దేశంలో సమాచార హక్కు చట్టం (రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005) అమలులోకి వచ్చి 2025 అక్టోబర్ 12వ తేదీ నాటికి ఇరవై ఏండ్లు పూర్తి అయింది. దేశ ప్రజాస్వామ్య పునాదిని పటిష్టంగా ఉంచే కీలకమైన చట్టాల్లో ఇది ఒకటి. ఓటు హక్కు తర్వాత అంతటి ప్రాధాన్యత కూడా దీనికే ఉంది. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలైన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ఇన్నేండ్లైనా కానీ.. ఆర్‌టిఐ అమలు తీరు ‘మేడి పండు చందం’గానే ఉంది. సమాచార పారదర్శకతపై ప్రభుత్వాలు, అధికారులు చెప్పే మాటలకు.. చేతల్లో పొంతనే లేదు. సమాచార హక్కు చట్టంద్వారా ఆఫీసుల్లో పాలన రికార్డుల వివరాలను పొందడానికి ఎన్నో సవాళ్లను, అడ్డంకులను, వైఫల్యాలను ఎదుర్కొం టున్నారు. దీనికి పాలకులు, అధికారుల నిర్లక్ష్యం, పొరపాట్లు, వ్యవస్థాగత లోపాలు వంటివే కారణాలుగా ఉన్నాయని చెప్పొచ్చు.

రాజ్యాంగం తర్వాత అంతటి ప్రాముఖ్యత ఆర్‌టిఐకే దక్కింది. పార్లమెంట్ చేసిన చట్టాల్లో ఇదొక మైలురాయిగా నిలిచిపోయింది. అవినీతి నిర్మూలన, విధుల్లో బాధ్యతారాహిత్యాన్ని తగ్గించడంతోపాటు పారదర్శకతను పెంపొందించడం, సుపరిపాలనను అందించడం ఈ చట్టం ముఖ్య లక్ష్యాలుగా ఉన్నా యి. పంచాయతీ నుంచి ప్రధాని ఆఫీసు దాకా.. వివిధ స్థాయిల్లో జరిగే అవినీతిని బయటపెట్టడం, జవాబుదారీతనాన్ని పెంచడం, అభివృద్ధి, సంక్షేమాలపై తెలుసుకోవడం, ప్రభుత్వ రికార్డుల తనిఖీ ఆర్‌టిఐ సామాన్యులకు కల్పించిన ఒక ప్రధాన అస్త్రం కూడా. ఇది అమలులోకి వచ్చి ఇరవైఏండ్లే అయినా.. దీనికి తొలి అడుగుపడినది దశాబ్దాల కిందటే అని చెప్పొచ్చు. 1976లోఉత్తరప్రదేశ్ స్టేట్ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ పని తీరుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తప్పకుండా ఇవ్వాల్సిందే! సమాచార హక్కు రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని, స్వేచ్ఛ హక్కు 19(1)(ఏ)లో ఇమిడి ఉందని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాతనే సమాచార హక్కు చట్టం రూపొందించుకోవాలనే ఆలోచన పాలకుల్లో వచ్చింది. అనంతరం 2005నుంచి అమలులోకి వచ్చింది.రెండు దశాబ్దాల కాలంలో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుదారులు సాధించిన విజయాలెన్నో ఉన్నాయి. ఇందుకు ఉదాహరణ.. 2జీ స్పెక్ట్రం కేటాయింపులు, కామన్వెల్త్ గేమ్స్, కోల్ గేట్ స్కామ్ అవినీతి గుట్టు బయట పెట్టడంలో ఆర్‌టిఐ కీలకంగా నిలిచింది. జాతీయ ఉపాధి హామీ పనుల సోషల్ ఆడిట్, రికార్డుల తనిఖీలో ఎంతో సమర్థవంతంగా వినియోగించుకునేలా దోహదపడింది. ఇక దరఖాస్తుదారులకు అడ్డంకులు కూడా చాలా ఎక్కువే. సమాచారం ఇచ్చేందుకు అధికారులు కావాలనే ఆలస్యం చేయడం, లేదా అసంపూర్తిగా ఇవ్వడం, లేదంటే దరఖాస్తులను తిరస్కరించే పరిస్థితులను నూటికి తొంభై శాతం మంది ఎదుర్కొంటుంటారు. అవినీతి బహిరంగ పరిచే ఆర్‌టిఐ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడడం, దాడులు వంటివి చేస్తున్నారు. ఇప్పటివరకు వందల మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వేలమంది దాడులు ఎదుర్కొన్నారు. దేశంలో సామాన్యులు సమాచార హక్కును పొందడంలో ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులను ఎదుర్కొంటున్నట్టు సర్వేలు తేల్చిచెబుతున్నాయి. 30 రోజుల గడువులోపు ఇవ్వాల్సిన సమాచారానికి నెలల, ఏండ్లకు ఏండ్లు ఎదురు చూడాల్సి పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు ప్రభుత్వాలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం, పారదర్శకత పాటించకపోవడం కారణాలని సమాచార నిపుణులు సైతం పేర్కొంటున్నారు.

దేశంలోని పౌరులకు ఆర్‌టిఐ ఒక శక్తిమంతమైన సాధనం అయినప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో సరిగా అవగాహన కల్పించడం లేదు. ప్రచారమూ చేయడం లేదు.గ్రామీణ ప్రాంతాల్లోని చాలామందికి ఆర్‌టిఐ ఉందనేదికూడా తెలియదు. తద్వారా ఆఫీసుల్లో సమాచారాన్ని పొందే హక్కు సామాన్యులకు దక్కడం లేదు. పాఠశాలస్థాయి నుంచే సమాచార హక్కు ప్రాధానత్యపై అవగాహన పెంపొందించాలి. కేంద్ర, రాష్ట్రాల కమిషన్ల వెబ్‌సైట్లు కూడా యూజర్ -ఫ్రెండ్లీగా లేవు. అప్లికేషన్ల ఫాలో అప్, ఒటిపిల్లో లేట్, పేమెంట్ ఫెయిల్యూర్లు వంటి టెక్నికల్ ఇష్యూలు దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారాయి. దరఖాస్తుదారులు కావలసిన సమాచారం పొందేందుకు నగదును చెల్లిస్తున్నా.. సమాచారం ఇవ్వకుండా.. చట్టాన్ని సరిగా అమలు చేయకుండా నీరుగార్చుతున్నారు. ఇలాంటివి కూడా చట్టాన్ని బలహీనం చేస్తూ.. పారదర్శకతకు విఘాతంగా మారాయి. ఆర్‌టిఐ కమిషన్లను బలోపేతం చేసి.. డిజిటల్ టెక్నాలజీని మెరుగుపరచాలని దరఖాస్తుదారులు, సమాచార నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్‌టిఐ విజయవంతం అమలవ్వాలంటే కమిషన్లను క్రమానుగతంగా బలోపేతం చేస్తుండాలి. మౌలిక వసతులు కల్పిస్తుండాలి. దరఖాస్తులను, అప్పీళ్లను సకాలంలో పరిష్కరించాలి. ఇలా సమాచారంవేగంగా, స్పష్టంగా పొందినప్పుడే సామాన్యులు ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకుగా భాగస్వాములవుతారు.

ఇలా చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. ఆఫీసుల్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంటే.. ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షిస్తారు. మెరుగైన సేవలను అందడంతోపాటు అధికారుల్లో పారదర్శకత కూడా పెరుగుతుంది. అవినీతి తగ్గుతుంది. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే ప్రజాస్వామ్య విజయవంతానికి ఓటు హక్కు మాదిరిగానే సమాచార హక్కు తయారవుతుంది. దేశంలో కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరుగా సమాచార హక్కు కమిషన్లు ఉన్నప్పటికీ ఎవరూ.. చట్టాన్ని సరిగా అమలు చేయడం లేదు. కేంద్ర, రాష్ట్రాల్లోని కమిషన్లలో ఏటేటా లక్షల్లో దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. అప్పీళ్లపైనా విచారణ వేగంగా, సరిగా జరగడంలేదు. ఆర్‌టిఐ కమిషన్ల నియామకాల్లోనూ రాజకీయ అధికార జోక్యం కూడా ఎక్కువే. సకాలంలో నియామకాలు చేయడం లేదు. కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాయి. నిబద్ధత కలిగిన వ్యక్తులను నియమించడం లేదు. ఇలాంటి ఆరోపణలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి. ఇవి సందర్భానుసారం సామాజిక మాధ్యమాల్లోనూ చూస్తుంటాం కూడా. 2019లో సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 13, 16లను కేంద్ర ప్రభుత్వం సవరించి.. సమాచార కమిషనర్ల పదవీ కాలాన్ని నిర్ణయించే బాధ్యతను కట్టబెట్టుకుంది. కేంద్రం తీరుతో సమాచార కమిషనర్ల స్వతంత్రతకే ముప్పు తలెత్తిందని, సమాచార హక్కు చట్టం ఉనికి ప్రమాదమని సమాచార నిపుణుల నుంచి విమర్శలెన్నో వచ్చాయి. ఆర్‌టిఐ జబ్బుపడిన చట్టంగా మారిందని వ్యాఖ్యలు కూడా చేశారు.

 డా. చంటి ముదిరాజ్

78010 01004 

రాహుల్ ‘హస్త’భూషణమేనా!

‘అబ్ కే బార్ చార్ సౌ పార్’ అనే నినాదంతో బయలుదేరి 2024లో 240 స్థానాల దగ్గర ఆగిపోయిన భారతీయ జనతా పార్టీ, అటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఇటు బీహార్ లో జనతాదళ్ యునైటెడ్ తదితర పార్టీల సహాయంతో కేంద్రంలో మూడోసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీ అధినాయకత్వంలో రాజ్య విస్తరణకాంక్ష రోజు రోజుకు బలపడుతున్నట్టు అర్థం అవుతున్నది.శుక్రవారంనాడు బీహార్ లో అక్కడి రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే పశ్చిమబెంగాల్లో ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ‘నెక్స్ వెస్ట్ బెంగాల్’ అని ట్వీట్ చేసింది. అంతేకాదు, కేంద్రమంత్రి గిరిరాజ్ తో సహా పలువురు బిజెపి నాయకులు ‘బెంగాల్ ఈ విజయ పరంపరను అందిపుచ్చుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు. అంటే బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్ని ఆక్రమించుకోబోతున్నామని అర్థం కదా. దానికి అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ యూట్యూబ్ లో ఒక బాలుడి చేత చేయించిన వీడియో దేశమంతా ఆసక్తికరమైన చర్చకు తెర లేపింది. ఆ బాలుడు వీడియోలో ‘సప్నే దేఖ్నా అచ్ఛీ బాత్ హై’ (కలలు కనడం మంచిదే) అంటాడు. అంటే బీహార్ తర్వాత వెనువెంటనే ఎన్నికలు రాబోతున్నది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భాషలో బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ‘జంగిల్ రాజ్’ (ఆటవిక రాజ్యం)ను అంతమొందించే సమయం ఆసన్నమైందని బిజెపి కలలు కంటున్నదని అర్థం.

2021లో పశ్చిమ బెంగాల్లో బిజెపి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 294 శాసనసభ స్థానాల్లో 77 చోట్ల గెలిచిన కారణంగా ఈసారి అక్కడ అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇక తమిళనాడు విషయానికొస్తే నిన్న బీహార్ ఫలితాలు వెలువడిన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తన ఎక్స్ ఖాతాలో ఎన్‌డిఎ ఘన విజయానికిగాను జెడి(యు) నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలుపుతూనే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వాకాన్ని మాత్రం దుయ్యబట్టారు. బీహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన అవకతవకలను, నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చజాలవని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఈ దేశానికి మరింత బలమైన, నిష్పాక్షికమైన ఎన్నికల సంఘం అవసరం అంటూ, ఓడిపోయేవారిలో కూడా విశ్వాసం కల్పించేలా ఎన్నికల వ్యవస్థ నిర్వహణ పద్ధతి ఉండాలన్న స్టాలిన్ మాటల వెనుక మరో ఆరు నెలల్లో తన రాష్ట్రానికి ఎన్నికల సంఘం ద్వారా ప్రమాదం ముంచుకురానున్నదన్న సూచన ఉందేమో అనిపిస్తుంది. తమిళనాడు అధికారపక్షం డిఎంకె కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బిజెపికి బద్ధశత్రువు. ఎన్‌డిఎ వ్యతిరేక కూటమైన ‘ఇండియా’లో భాగస్వామి. డిఎంకె ప్రత్యర్ధి ఎఐఎడిఎంకె తో కలిసి డిఎంకె ని ఎదుర్కోవడం సాధ్యమయ్యే పని కాదని అర్థం అయిన బిజెపి, తమిళ ప్రముఖ నటుడు విజయ్‌తో పార్టీ పెట్టించిందనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతున్నది.

ఒక రాజకీయ పార్టీ ఎల్లకాలం కేంద్రంతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తానే అధికారంలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కాంగ్రెస్ దే ఈ దేశంలో ఏకఛత్రాధిపత్యం. భారతీయ జనతా పార్టీ ఏర్పడిందే 80 లలో. ఇక కేంద్రంలో, రాష్ట్రాల్లో తామే శాశ్వతంగా అధికారంలో ఉండాలన్నది బిజెపి ఆలోచన కావచ్చు. ప్రజామోదం ఉంటే ఎవరాపగలరు?హర్యానా, మహారాష్ట్ర , బీహార్ ఫలితాల ఊపులో కమలనాథులు ఆ ఊహల్లో తెలియాడుతుండటంలో తప్పులేదు కానీ అది అంత సులభం కాదన్న విషయం ఎవరు చెప్పాలి? కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉన్నంతకాలం అది సులభమేనని ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెబుతున్నారు. బీహార్ ఎన్నికల ప్రక్రియ మొదటినుండి సక్రమంగా సాగలేదని చెబుతూనే ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయన్నారు రాహుల్ గాంధీ. అంతేకాదు, నా పోరాటం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే అని కూడా వ్యాఖ్యానించారు. అధికారంలోకి రావడంకంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ప్రధానమైంది. అందులో సందేహం లేదు. దానిలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ తాను చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలంటే అధికారం కూడా అవసరమన్న విషయం రాహుల్ గాంధీకి పెద్దగా పట్టినట్లు లేదు. రాజ్యాంగబద్ధమైన, స్వయంప్రతిపత్తిగల కేంద్ర ఎన్నికల సంఘం లోపభూయిష్టంగా ఉన్నదని, అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులు ఒత్తుతున్నదని చెపుతూ అందుకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పోరాటం ఓటర్లకు పెద్దగా ఎక్కుతున్నట్లు లేదు. ఒకవైపు ఆయన పోరాటం సాగుతూనే ఉన్నది, ఇంకో వైపు హర్యానా పాయె, మహారాష్ట్ర పాయె, ఇప్పుడు బీహార్ కూడా పాయె.

ఆయన ఇంకా ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణ ఉద్యమ జెండా భుజానేసుకుని ఇలానే ముందుకుపోతుంటే రేపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు కూడా పాయే అనుకోవాల్సి వస్తుందేమో. తమిళనాడులో కాంగ్రెస్ ఎప్పుడూ అధికారంలో లేదు. పశ్చిమ బెంగాల్లో కూడా కాంగ్రెస్ ది గత చరిత్రే అయినప్పటికీ ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పక్షాలు భారతీయ జనతా పార్టీకి బద్ధ విరోధులు. వచ్చే కొద్ది మాసాల్లో ఆ రెండు రాష్ట్రాల్ని రాహుల్ గాంధీ చెబుతున్న ఎన్నికల సంఘం అవకతవకలనుంచి కాపాడటానికి ఏం చేయాలో ఈరోజు నుండే రాహుల్ గాంధీ ఆలోచించకపోతే త్వరలోనే ఆయన రాజకీయ రంగస్థలం మీద నుండి నిష్క్రమించే పరిస్థితి రావచ్చునన్నది విశ్లేషకుల అంచనా.

రాహుల్ గాంధీ రాజ్యాంగ వ్యవస్థల్ని సరైన మార్గంలో పెట్టాలనుకుంటే ఆయన చేతుల్లో అధికారం అనే అస్త్రం ఉండాలి. కానీ ఆయన ఆ ఆలోచన, ప్రయత్నాలు పక్కనపెట్టి విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీహార్ నే ఉదాహరణగా తీసుకుంటే అక్కడ పేరుకే మహా ఘట్‌బంధన్ గా కాంగ్రెస్, ఆర్‌జెడి తదితర పార్టీలు ఎన్నికల్లో ఎన్‌డిఎను ఢీకొనేందుకు వెళ్లాయి కానీ, సరైన హోంవర్క్ జరగలేదని స్పష్టంగా కనిపిస్తున్నది. హేమాహేమీలైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీహార్ రాజకీయాల్లో కురువృద్ధుడు నితీశ్ కుమార్ మీద పోరాటానికి నాయకత్వం వహించాల్సిందిగా అంతగా రాజకీయ అనుభవం లేని తేజస్వి యాదవ్‌ను వదలడమే నష్టం చేసిందన్న వాదన వినిపిస్తోంది. మహాఘట్‌బంధన్‌లో ప్రధాన పాత్రధారి కాంగ్రెస్ పరిస్థితి బీహార్ లో అత్యంత దయనీయమైంది. అక్కడ పోటీ చేసిన మజ్లిస్ పార్టీకి వచ్చిన ఐదు స్థానాలకంటే ఒక్క స్థానం మాత్రమే ఎక్కువ గెలుచుకుంది కాంగ్రెస్. ఇండియా కూటమిలో ఉన్న మజ్లిస్‌ను బీహార్ ఎన్నికల్లో ఎందుకు ఘట్‌బంధన్‌లో చేర్చుకోలేకపోయారు? ఆ పార్టీ ఒంటరిగా ఎందుకు పోటీ చేసింది? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు.

కేంద్రంలో అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్న బిజెపి కూడా బీహార్ రాష్ట్రానికి పరిమితమైన నితీశ్ కుమార్ నే ముందుపెట్టి నడిపించినప్పటికీ ఆ పార్టీ నితీశ్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న విషయం గమనార్హం. నితీశ్ కుమార్ ముందు తేజస్వి యాదవ్ పర్సనాలిటీని ఓటర్లు పట్టించుకోలేదనిపిస్తుంది. అయితే విచిత్రం ఏమిటంటే, 25 స్థానాలకే పరిమితమైన ఆర్‌జెడి ఓట్ల శాతం మాత్రం గెలిచిన బిజెపి, జెడి(యు’ పార్టీలకంటే ఎక్కువ. ఆర్‌జెడికి 23 శాతం ఓట్లు లభించగా, ఆ పార్టీ కంటే బిజెపికి 2. 92 శాతం, జెడి(యు)కు 3.75 శాతం తక్కువ ఓట్లు లభించాయి.ఇక్కడ ప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి ప్రస్తావించాలి. కొన్ని పార్టీలను అధికారంలోకి తేవడానికి ఆయన ఎన్నికల వ్యూహాలు పని చేసాయి కాని, స్వయంగా తాను రాజకీయాల్లోకి వచ్చి బరిలో దిగితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం తయారు చేసిన ఫైర్ బ్రాండ్ యువ నాయకుడు, బీహార్ కే చెందిన కన్హయ్యకుమార్ కాంగ్రెస్ తరఫున ప్రచారంలో లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించింది.

ఓట్ల సంఖ్య విషయంలో రాహుల్ గాంధీ విమర్శలకు మరింత బలం చేకూర్చిన అంశం బీహార్‌లో రెండవ విడత పోలింగ్ తరువాత ఎన్నికల సంఘం అధికారికంగా మొత్తం ఓటర్ల సంఖ్యను పేర్కొంటూ విడుదల చేసిన పత్రికా ప్రకటన. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అక్టోబర్ ఆరున బీహార్‌లో అర్హులయిన ఓటర్ల సంఖ్య ఏడుకోట్ల 42 లక్షలు అని అధికారికంగా ప్రకటించారు. అదే ఎన్నికల సంఘం నవంబర్ 11న రెండవ విడత పోలింగ్ ముగిసాక చేసిన ప్రకటనలో మొత్తం ఓట్ల సంఖ్య ఏడుకోట్ల నలభై అయిదు లక్షలు అని ప్రకటించింది. ఈ మూడు లక్షల ఓట్లు ఎలా పెరిగాయి? దీనికి ఎన్నికల సంఘం దగ్గర సమాధానం లేదు.

అధికార ఎన్‌డిఎ కూటమి బీహార్ లో ఎన్నికల నియమాల్ని ధిక్కరించినా పట్టించుకున్న నాథుడు లేడు. బీహార్ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ ఆరవ తేదీన ప్రకటించింది. అంటే, ఎన్నికల కోడ్ ఆ రోజునుంచే ప్రారంభమైందని అర్థం. లెక్క ప్రకారం ఎటువంటి ఆర్థిక మంజూరీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, నిధుల విడుదల కానీ చేయకూడదు. అయితే బీహార్‌లో అధికారంలో ఉన్న పక్షాలకు లాభం చేకూరే విధంగా ప్రభుత్వం అక్టోబర్ 31న, నవంబర్ 7న, నవంబర్ 14న డబ్బులు పంచింది. మహిళల ఖాతాల్లోకి పదివేల రూపాయల చొప్పున ఈ తేదీల్లో నేరుగా నగదు బదిలీ చేయడం ఎన్నికల ఉల్లంఘనే అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆర్‌జెడి అధికారికంగా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడు లేడు.ఇదీ పరిస్థితి. మరి రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థను సరిచేసేందుకు పోరాటం చెయ్యాలా? ప్రతిపక్షాలను కలుపుకుని అధికారంలోకి రావడానికి ప్రయత్నించాలా? భవిష్యత్తు తమదయిన యువత ఆలోచించాల్సిందే.

Delete Edit

రాహుల్ బాధ.. ఇసికి ‘సర్’దా!

రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత. ప్రధానమంత్రి కావలసిన నాయకుడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి ప్రత్యర్థిగా నిలిచిన పార్టీలను సమన్వయం చేసుకుని ముందుకు పోతున్న నాయకుడు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కొద్ది రోజులనుండే ఆయన ఓట్లకు సంబంధించిన అనేక అవకతవకల మీద సీరియస్‌గా దృష్టి సారించి అధ్యయనం జరిపి పలు విషయాలు బయటికి తెస్తున్నారు.. ఒకసారి ఆటంబాబు అని, మరోసారి హైడ్రోజన్ బాంబు అని. ఈ బాంబులు ఎందుకు పేలడం లేదు? అంటే.. జనంలో ఎందుకు రావలసినంత స్పందన రావడం లేదు? స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ఎందుకు ఆయన ఆరోపణలను ఖండన ప్రకటనలతో తేలిగ్గా కొట్టిపారేస్తున్నది? నిజానిజాలను నిగ్గు తేల్చి ఆయన విమర్శలు అవాస్తవాలైతే ఎందుకు రుజువులతో జనం ముందుకు రావడం లేదు?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పినట్టు ‘రొట్టె ఎక్కువ సమయం ఒక వైపే కాలిస్తే మాడిపోతుంది. ఇంకోవైపుకు మార్చాలి’. ఆయన బహుశా మోడీ నేతృత్వంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ కూటమి గురించి అని ఉండొచ్చు. 20 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్‌కుమార్ గురించి అని ఉండొచ్చు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న సత్యం అందరూ గుర్తించవలసిందే. ఆ లెక్కన ఎప్పుడో అప్పుడు రాహుల్ గాంధీయో, మరొకరో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండనే ఉంది. మరెందుకు రాహుల్ గాంధీ నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా జనానికి, ఎన్నికల సంఘానికి ఎక్కడం లేదు? ఆయన విమర్శలను సహేతుకంగా, శాస్త్రీయంగా, నిరాధారమైనవని నిరూపించే ప్రయత్నం ఏమాత్రం చెయ్యకుండా తేలికగా కొట్టిపారెయ్యడాన్ని జనం ఎలా అర్థం చేసుకోవాలి?

తాజాగా రాహుల్ గాంధీ గత ఏడాది హర్యానా రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి జరిగిన అవకతవకలను గురించి మాట్లాడారు. ఆ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు పోలయ్యాయన్నది రాహుల్ ఆరోపణ. వాటి ద్వారా బిజెపి ఓట్లను దొంగిలించి అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ ఆయన దాన్ని ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’ అన్నారు. ఆయన ఓట్ల చోరీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈలోగా బీహార్ ఎన్నికలు కూడా వచ్చేశాయి. బీహార్‌లో కూడా ఇలా ఓట్ల చోరీ జరిగే ప్రమాదం ఉందని ఆయన అంటుండగానే అక్కడ మొన్న ఆరో తేదీన మొదటి విడత పోలింగ్ కూడా అయిపోయింది. ఎల్లుండి రెండవ, చివరి విడత పోలింగ్ కూడా ముగిసిపోతుంది.

రాహుల్ గాంధీ గోడు వినడానికి, ఆయన తప్పు అని శాస్త్రీయంగా రుజువు చేయడానికి మాత్రం ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు. హర్యానాలో పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్‌కు 73 సీట్లలో, బిజెపికి 17 సీట్లలో ఆధిక్యం వస్తే, ఇవిఎం పోలింగ్ తరువాత ఫలితాలు మాత్రం వేరుగా రావడాన్ని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. హర్యానా వ్యవహారంలో రాహుల్ గాంధీ ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఆయన మాటల్లోనే ‘ఎవరీ మహిళ, ఆమె పేరు ఏమిటి? ఎక్కడినుంచి వచ్చింది? అనేవీ ఎవరికీ తెలియదు. కాని ఆమె హర్యానా ఎన్నికల్లో 22 సార్లు 10 వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసింది. సీమా, స్వీటీ, సరస్వతి, రష్మి, విమల.. ఇలా రకరకాల పేర్లతో. తీరా ఆ ఫోటోలో ఉన్న మహిళ ఏనాడూ భారతదేశంలో అడుగు కూడా పెట్టని ఒక బ్రెజిల్ మోడల్. ఒక హిందీ సినిమా టైటిల్ ‘వో కౌన్ థీ’ తరహాలో ‘ఏ కౌన్ హై’ అని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ.

రాహుల్ దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ఎన్నికల వ్యవస్థ అవకతవకల మీద చేస్తున్న మిగతా ఆరోపణలన్నీ పక్కన పెడదాం. కనీసం ఈ ఒక్క ఘటన గురించి అయినా ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుని నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయం బ్రెజిల్ మోడల్ లారిస్సా బొనెస్ దాకా వెళ్లింది. తన ఫోటో, అదీ ఎప్పుడో తాను 20 ఏళ్ల వయసులో ఉన్ననాటిది వాడుకుని ఇలా దొంగ ఓట్లు వెయ్యడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చెయ్యడమే కాకుండా చీదరించుకున్నారు కూడా. ప్రజలను మోసం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో ‘ఏ ప్రపంచంలో బతుకుతున్నాం మనం’ అని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. నిజమే, ఆ బ్రెజిల్ మోడల్ అన్నట్టుగా మనం ఏ ప్రపంచంలో అనే మాటకు ఏ కాలంలో బతుకుతున్నాం మనం అనే మాట కూడా చేరిస్తే బాగుంటుంది.

‘హెచ్‌ఫైల్’ పేరిట తమ వద్ద ఉన్న ఆధారాలను నూటికి నూరు శాతం రుజువు చెయ్యగలమని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలి. ఒక్క హర్యానాలోనే కాదు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో కూడా ఇదే సమస్య ఉందని రాహుల్ చెబుతున్నారు. ఎక్కడో బ్రెజిల్లో ఉన్న మహిళ ఫోటో ఉపయోగించి 10 పోలింగ్ కేంద్రాల్లో 22 సార్లు ఓటు వెయ్యడం ఏమిటి? ఒకే వ్యక్తి ఒకే ఫోటోతో రెండు పోలింగ్ కేంద్రాల్లో 223 ఓట్లు కలిగి ఉండటం ఏమిటి? ఒకే ఇంట్లో 501 ఓట్లు నమోదై ఉండటం ఏమిటి? ఇవి అసత్యాలని రుజువు చేసే ప్రయత్నం కూడా ఎన్నికల సంఘం వైపునుండి ఎందుకు జరగడం లేదు? ఆ పని మానేసి ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) ను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నది.

2002- 2005 తరువాత ఇప్పుడు మళ్లీ రెండోసారి డూప్లికేట్, వలస వెళ్లిన, అనర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించి, ఓటు అర్హతను తనిఖీ చేసే ఆలోచనతో పన్నెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 51 కోట్ల ఓట్లను తనిఖీ చేసి ఓటర్ల జాబితాలను సక్రమ మార్గంలో పెట్టే ఆలోచనతో మొదలైన కార్యక్రమం. అయితే ఈ కొత్త ‘సర్’ మీద కూడా నీలినీడలు పరచుకున్నాయి. ఈ రెండో విడత ‘సర్’.. ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా చేయడం కాక ఎంపిక చేసిన ఓట్లు తొలగించే కార్యక్రమంగా తయారయిందని ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ వంటి మేధావులు నెత్తీ నోరుకొట్టుకుని చెబుతున్నారు. ‘సర్’లో విధించిన నిబంధనలు చూస్తే అర్హులైన ఓటర్లు ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసే బాధ్యతను ఎన్నికల కమిషన్ గాలికి వదిలేసి, జాబితాలో నుండి హడావుడిగా ఓటర్లను తొలగించే పని చేస్తున్నదని వారి ఆరోపణ. తాను నిజమైన ఓటరని రుజువు చేసుకునే బాధ్యత దేశ పౌరుడి మీద వదిలెయ్యడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు వారు. నిర్ణీత సమయంలో ఎన్యూమరేషన్ ఫాంను నింపకపోతే ఓటు హక్కు కోల్పోవడం ఏమిటి? రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కు ప్రతి పౌరుడికీ అందేవిధంగా పని చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది.

ఓటర్ల జాబితాలను సరిచూసేందుకు సులభమైన, పారదర్శకతతో కూడిన మార్గాలు 2003 నాటి ‘సర్’, 2016 నాటి జాతీయ ఓటర్ల జాబితా సరిచేసే ప్రక్రియ వదిలేసి ఇంత జటిలమైన, పౌర ప్రయోజనాల వ్యతిరేక పద్ధతిని అనుసరించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.ఓటు హక్కు అంటే భావ ప్రకటనా స్వేచ్ఛ అనే అర్థం. ఒక రాజకీయ పక్షం పట్ల లేదా ఒక రాజకీయ నాయకుడి పట్ల, ఆయన ఎంచుకున్న అభ్యర్థి పట్ల దేశ పౌరులు తమ భావాలను ఓట్ల రూపంలో వ్యక్తం చేసే ప్రక్రియ ఎన్నికలు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారత పౌరుడికి/ పౌరురాలికి ఓటు హక్కు తప్పనిసరిగా కల్పించాల్సిన బాధ్యత స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల వ్యవస్థ పైన ఎంత ఉంటుందో, అనర్హులు అందులోకి చొరబడకుండా చూడాల్సిన, అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా అదే వ్యవస్థ మీద తప్పనిసరిగా ఉంటుంది.

అటువంటి ఎన్నికల సంఘం మీద ఒక బాధ్యత గల రాజకీయ పక్షానికి నేతృత్వం వహిస్తున్న నాయకుడు నూటికి నూరు శాతం ఆధారాలు ఉన్నాయని చెబుతుంటే పిల్లలాటగా తీసి పారేయడం సమంజసం అనిపించుకోదు. అసలే ఏ ఏటికాఏడు ఓటర్లలో పెరుగుతున్న నిర్లిప్తత, ఏ కారణంవల్ల అయితేనేమీ రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఏవగింపునకు ఇదంతా తోడయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కీర్తి గడించిన భారతదేశం మరింత నవ్వుల పాలు కాక తప్పదు. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? 

హస్తానికి అజహర్ పాశుపతాస్త్రమేనా?

హత్యకు గురి కావడానికి సరిగ్గా మూడు రోజుల ముందు.. అంటే 1948 జనవరి 27వ తేదీన మహాత్మాగాంధీ ప్రస్తుతం ఉన్న స్వరూపంలో కాంగ్రెస్‌కు కాలం చెల్లిపోయింది అంటూ, దానిని రద్దుచేసి ఆ స్థానంలో ‘లోక్ సేవక్ సంఘ్’ పేరుతో జనంలోకి వెళ్లాలని చిన్న నోటు రాశారు. దురదృష్టవశాత్తూ ఆయన ఆ అభిప్రాయం వెలిబుచ్చిన మూడు రోజులకే హత్యకు గురై ఉండకపోతే పట్టుబట్టి కాంగ్రెస్‌ను రద్దు చేయించి ఉండేవారా? నిజంగానే అదే జరిగి ఉంటే భారతదేశ రాజకీయాలు ఎంత నిస్తేజంగా, చప్పగా ఉండేవో ఊహించడం కష్టమే కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక గొప్ప లక్షణమే అది, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యి, కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సన్నిహితులు కొందరు వైయస్సార్ ఆత్మ అయిన కెవిపి రామచంద్రరావుకు రాజ్యసభ గ్యారెంటీ అని ఊహాగానాలు చేస్తుంటే, ఆయనను అభినందిస్తుంటే కెవిపి ఒక మాట అన్నారు.. కాంగ్రెస్‌తో గేమ్స్ ఆడొద్దు అని ఖాన్ తో గేమ్స్ ఆడోద్దన్న ఒక సినిమా డైలాగ్‌ని గుర్తు చేస్తూ. ఆయన అన్నట్టుగానే అప్పుడు రాజ్యసభ సభ్యత్వం రాలేదు. కొద్దికాలం తర్వాత ఆయన రాజ్యసభకు వెళ్లారు.

కాంగ్రెస్ ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరు చెప్పలేరు. అది ఊహాతీతమైన రాజకీయపక్షమని ఆయన ఉద్దేశం. ప్రస్తుతం తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతున్న తరుణంలో కూడా కాంగ్రెస్ వ్యవహార శైలి కెవిపి అన్నట్టు కాంగ్రెస్ తో గేమ్స్ ఆడొద్దు అన్నట్టుగానే ఉంది. కొంతకాలంగా తెలంగాణలో రెండు శాసనమండలి పదవుల విషయంలో పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రముఖ తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరామ్ ను, ఒక ఉర్దూ పత్రిక సంపాదకుడు ఆమెర్ అలిఖాన్‌ను శాసనమండలి సభ్యులుగా గవర్నర్ కోటాలో మంత్రి మండలి సిఫార్సు చేస్తే దానికి సుప్రీంకోర్టు అడ్డుపడటం, ఆ తర్వాత మళ్లీ మంత్రిమండలి కోదండరామ్ తోపాటు, ఆమేర్ అలీని తొలగించి, మహమ్మద్ అజరుద్దీన్‌ను ప్రతిపాదించి గవర్నర్‌కు పంపింది. ఇప్పటికింకా గవర్నర్ ఆ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముంచుకొచ్చి అక్కడ ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా 2023లో పోటీ చేసి ఓడిపోయిన అజహరుద్దీన్‌ను మంత్రిగా నియమించింది. ఆయన శాసనమండలి సభ్యత్వం ఇంకా ఖరారు కావలసి ఉంది.

అయితే ఏ చట్టసభలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రివర్గంలో చేర్చుకునే పూర్తి అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. కానీ ఆ పదవి చేపట్టిన ఆరు మాసాలలో శాసనసభ లేదా శాసనమండలి నుండి సభ్యుడిగా ఎన్నికయి రావలసి ఉంటుంది. అలా జరగకపోతే గతంలో ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ పరిస్థితి అజహర్‌కు ఎదురుకాకతప్పదు. 1995లో ఎన్టీ రామారావును అన్యాయంగా దింపేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని తనవైపు తిప్పుకునే క్రమంలో హరికృష్ణను, ఏ చట్టసభలోనూ సభ్యుడు కాకపోయినా, మంత్రిగా నియమించి రవాణాశాఖ అప్పగించారు. ఆరుమాసాలు తిరగకుండానే ఎన్టీఆర్ మరణించడంతో ఇక తనకు హరికృష్ణ అవసరం లేదనుకున్నారేమో చంద్రబాబు ఆయనను చట్టసభకు పంపించే ఆలోచనకు సున్నాచుట్టారు. దాంతో హరికృష్ణ మంత్రిపదవి ఊడింది. అటువంటి పరిస్థితి అజహరుద్దీన్‌కు రాకూడదనుకుంటే ఆయన ఆరు మాసాల్లోపు తప్పనిసరిగా శాసనమండలి సభ్యుడు అయ్యేట్టు చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదే.

ఆరు మాసాల్లో ఆయన శాసనసభకు వెళ్లే అవకాశం అయితే లేదు. ఆయనను శాసనసభకు పంపించే ఆలోచన కాంగ్రెస్‌కు ఉన్నట్టయితే గత ఎన్నికల్లో అదే నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశాడు కాబట్టి అజహర్ కే ప్రస్తుత ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ స్థానంలో పార్టీ టికెట్ ఇచ్చి ఉండేది. వచ్చే ఆరు మాసాల్లో ఆయన మరే నియోజకవర్గంనుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశం లేదు.ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొంతకాలంగా చర్చ జరుగుతున్నది. ఆ పార్టీలో ప్రతి నాయకుడు తాను ఎందుకు మంత్రి కాకూడదు, ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నవారే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆశావహులకు ఎన్నడూ కొరతలేదు. అయితే ఈ వారంలో అజహరుద్దీన్ ఒక్కడితో మంత్రివర్గ విస్తరణ చేసి, అదే రోజు మరో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఒకరిని సలహాదారుగా, మరొకరిని కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడాన్ని చూస్తే త్వరలో మంత్రివర్గ విస్తరణ ఖాయమని అర్థమవుతున్నది. ఇందులో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు బాధ్యత చూసుకునే సలహాదారు పదవికి అత్యంత సీనియర్ నాయకుడు, నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శనరెడ్డికి కేబినెట్ సమావేశాలకు కూడా హాజరయ్యే వీలు కల్పించడం విశేషం.

ఇద్దరికీ కేబినెట్ హోదా కల్పించడం మంత్రివర్గ విస్తరణ విషయంలో స్పష్టత వచ్చిందనే సంకేతాలను వెలువరించినా అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలో చేర్చుకోవడం విషయంలో ప్రత్యర్థి పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసం కాంగ్రెస్ ఆయనను మంత్రివర్గంలో చేర్చుకున్నదని విమర్శ చేయడానికి ఆస్కారం కలిగింది. అజహరుద్దీన్ అసలు సిసలు హైదరాబాదీ. నారాయణగూడలోని విఠల్వాడి వాస్తవ్యుడు. ఆల్ సెయింట్స్ స్కూల్లో క్రికెట్ ఆట మొదలుపెట్టి భారత క్రికెట్ జట్టుకే కెప్టెన్ గా ఎదిగి రెండుసార్లు తన కెప్టెన్సీలో ఆసియా కప్ సాధించి, 1996 ప్రపంచ కప్ పోటీల్లో జట్టును సెమీఫైనల్స్ వరకు నడిపించిన అద్భుత క్రీడాకారుడు. క్రీడారంగంలో అత్యున్నత ప్రతిష్ఠాత్మకమైన అర్జున అవార్డు గ్రహీత, పద్మశ్రీ కూడా. అనేక ఎత్తుపల్లాలు చూసినవాడు. 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలక రాజకీయాలకు శ్రీకారం చుట్టి అదే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా ప్రఖ్యాతి చెందిన అజహరుద్దీన్, మూడుసార్లు ప్రపంచకప్ పోటీలకు భారతజట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన అజహరుద్దీన్ 2012లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుని భారత క్రికెట్ సంఘం బిసిసిఐ విధించిన జీవితకాలపు నిషేధానికి గురయ్యాడు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ నిషేధాన్ని తర్వాత తొలగించింది. ఒకసారి ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఆ పదవిలో కూడా కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో తలమునకలై ఉన్న రాష్ట్ర మంత్రి జి. వివేక్ వెంకటస్వామి వర్గం అప్పట్లో హెచ్ సిఎ అధ్యక్షుడిగా అజహరుద్దీన్ వ్యవహారశైలి మీద తీవ్ర విమర్శలు చేసినవారే. ఇప్పుడు ఆ ఇద్దరూ మంత్రివర్గ సహచరులు. ఇక అజహరుద్దీన్‌ను జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవడం కోసమే మంత్రివర్గంలోకి తీసుకున్నారని ప్రతిపక్షాలు సహజంగానే విమర్శిస్తున్నాయి.

జూబ్లీహిల్స్‌లో ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ టికెట్ కోసం అజహరుద్దీన్ కూడా ప్రయత్నించినట్టు వార్తలు చదివాం. 2023లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు అప్పట్లో మజిలీస్ సహకారంతో పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్‌కు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కింది. అప్పట్లో అజహరుద్దీన్‌కు మద్దతు ఇవ్వకుండా స్వతంత్ర అభ్యర్థిని సమర్థించిన మజిలీస్ పార్టీ, ఈసారి తన అభ్యర్థిని పోటీకి నిలపకుండా నామినేషన్ సమయంలో కాకతాళీయంగా కనిపించే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను మజిలీస్ అగ్ర నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్పనిసరిగా కాంగ్రెస్‌కు అనుకూల సంకేతాలనే పంపుతున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఏడు సెగ్మెంట్లలో కలిపి దాదాపు 1,20,000 ఓట్లు ముస్లిం మైనారిటీలవి ఉండటం గమనార్హం. ఫలితంపై ప్రభావం చూపగల సంఖ్యలో వారు ఉన్నారన్నది నిర్వివాదాంశం.

ఈ ఉపఎన్నిక అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకం. మామూలుగా ఉప ఎన్నికలను అధికారపక్షం అంత సీరియస్‌గా పట్టించుకోదు. అయితే ఇక్కడ రెండు ప్రతిపక్షాలు భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు మేలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రుజువు చేసేందుకు తాము గెలిచినా ఓడినా ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను ఓడించాలనే పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. అందుకే కాంగ్రెస్ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. కాబట్టే ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారంలోకి దిగారు. తన సొంత స్థానం కాబట్టి మళ్లీ గెలుచుకోవాలనే పట్టుదలతో బిఆర్‌ఎస్ ఉంటే, భారతీయ జనతా పార్టీకి అందులోనూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఇది అత్యంత ప్రధానమైన పోటీగా పరిణమించింది. అందుకు కారణం పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదింట మెజారిటీ సాధించి గెలిచిన కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్, నాంపల్లి సెగ్మెంట్లలో మాత్రం వెనుకబడటంతో కాంగ్రెస్‌కు మెజారిటీ లభించింది. 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానంలో కాంగ్రెస్‌కు 64,212 ఓట్లు వస్తే, 2024లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు అదే స్థానంలో 89,705 ఓట్లు లభించాయి. దాదాపు 25 వేల ఓట్లు కాంగ్రెస్‌కు పెరిగాయి.

2023లో 80,000కు పైగా ఓట్లు సాధించి గెలిచిన బిఆర్‌ఎస్, లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి 18 వేల ఓట్లకు పడిపోయింది. ఆ మేరకు బిజెపి లాభపడి దాదాపు 40 వేల ఓట్లు శాసనసభ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో పెంచుకున్నది. అయినా కాంగ్రెస్ కంటే తక్కువలోనే ఉన్న కారణంగా ఇది కిషన్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠగా మారింది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు మహాబద్దకస్థులు. ఏ ఎన్నికకు ఆ ఎన్నికలో ఓటర్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది కానీ ఓటింగ్ శాతం మాత్రం తక్కువగానే ఉంటుంది. 2023 శాసనసభ ఎన్నికల్లో 47.58% ఓట్లు పోలైతే సరిగా ఒక ఏడాదికి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అది 45.38 శాతానికి తగ్గింది. ఈసారైనా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే నాయకుల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. మరో ముచ్చట.. పక్క రాష్ట్రంలో కూటమిలో భాగస్వామ్యపక్షాలైన టిడిపి, జనసేన పార్టీలు ప్రస్తుతం జూబ్లీహిల్స్ బరిలో ఉన్న తమ సహచర పార్టీ బిజెపి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో ఇప్పటివరకు నోరు మెదపలేదు. బిజెపి కూడా నోరు తెరిచి ఆ పార్టీ నేతల మద్దతు ఇంతవరకు కోరలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తున్నారని బిజెపి వర్గాల్లో ప్రచారం మాత్రం జరుగుతున్నది. మరోపక్క భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్ హౌస్ నుంచే మంత్రాంగం నడుపుతున్నారు తప్ప ప్రచారానికి వస్తున్న జాడలేదు. ఇది జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక తాజా స్థితి.

Delete Edit

లొంగుబాటా.. పోరుబాటా?

ఇరవై ఏళ్లకుపైగా దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఏర్పరచుకున్న పునాదులు సంక్షోభం దిశగా కూరుకు పోయాయి. తాజాగా సోడి తిరుపతి, రవి అనే వారిని మావోయిస్టు పార్టీ మట్టుబెట్టడం తాజా పరిణామం అయితే వాళ్ళు సామూహిక లొంగుబాటు కంటే ముందు లొంగిపోయిన వారా, ఇన్ఫార్మర్లని అనుమానించినవారైతే వారి మరణం మావోయిస్టు పార్టీ ప్రజాకోర్టు పేరుతో తమకుతాముగా దళాలు అమలు జరిపిన ప్రతీకార చర్యనే అవుతుంది. అలా కాకుండా సామూహికంగా లొంగిపోయిన వారికి శిక్షవేసి ఉంటే అది మరో అంతర్గత యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. గత రెండేళ్ళుగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దండకారణ్యం మీద ఉక్కుపాదం మోపింది. మావోయిస్టుపార్టీ, కేంద్ర బలగాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి సంబాల కేశవరావు తోపాటు, అనేక మంది కీలక కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. కేంద్ర బలగాల కూంబింగ్‌లో 600 మంది వరకు మావోయిస్టు కేడర్ మరణించింది. కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 డెడ్ లైన్ కూడా మావోయిస్టు పార్టీకి విధించింది. ఈ దశలో మావోయిస్టు పార్టీకి ముందున్నది రెండే ప్రత్యామ్నాయాలు. 1) చనిపోయినా పర్వాలేదు, ఉన్న సైద్ధాంతిక వెలుగులో కడదాకా పోరాడటం లేదా వ్యూహాత్మకంగా వెనకడుగువేసి తమనితాము కాపాడుకోవడం. 2) లొంగిపోవడం ద్వారా తమతో పాటు దళాల్లోఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, సాయుధ పోరాటం విరమించి, ఆయుధాలు అప్పగించి, ప్రాణాలు కాపాడుకోవడం, మావోయిస్టు పోరాట రూపం మార్చుకొని పని చేయడమా? లేక ఇప్పుడు ఉన్న కేంద్ర బలగాలకు పూర్తిగా లొంగిపోవడమా? ఈ రెండు అంశాల గురించి పరిశీలన గనుక జరిగితే! మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానంతో ఇరవై ఏళ్ళుగా ఆచరణాత్మకంగానే పోరాడి నష్టాలు చవిచూశారు.

జరిగిన నష్టాల నుండి బయటపడి నిలబడడానికే కాల్పుల విరమణ, చర్చలు జరపాలని వ్యూహాత్మకంగానే మావోయిస్టు పార్టీ ముందుకు తెచ్చింది. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా వామపక్ష తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికే సిద్ధం అయింది తప్ప పట్టుజార విడువలేదు. ఈ దశలో కొందరు మేధావి వర్గం సూచనలు, సైద్ధాంతికపరమైన కాలదోషం తదితర విషయాలుపై జరిగిన చర్చ కూడా మిగిలిన మావోయిస్టు కేడర్‌పై కొంత ప్రభావం చూపితే చూపి ఉండవచ్చును. దాని పర్యావసానాలు కూడా మావోయిస్టు పార్టీలో అంతర్గత వైరుధ్యాలు తీవ్రతరం అయి ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగానే మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ @ సోనూ @ అభయ్, మరో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు @రూపేష్ @ సతీష్ తమతమ డివిజన్ సాయుధులతో కలిసి మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల ముందు లొంగిపోయారు. ఆయుధాలు పోతే సమకూర్చుకోవడం తేలికనే! కానీ, ప్రాణాలుపోతే తిరిగి తేవడం చాలా కష్టం! ఒక రకంగా గత్యంతరం లేని స్థితిలోనే వారు నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చును. ఆయుధాలు అప్పగించే షరతుపై లొంగిపోయినప్పడు వారు నవ్వారా? ఏడ్చారా? అనే విషయాలు పక్కనపెడితే! ఇక్కడ సాముహిక లొంగుబాటు కనుక ఖచ్చితంగా సైద్ధాంతిక మార్పులో భాగంగానే జరిగింది అనేది అర్థం అవుతుంది.

మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుకు ముందు జనతన సర్కార్, పిజిఎల్‌ఎ ఏర్పాటు తదితర విషయాలను ఆయన తప్పిదాలని బహిరంగంగా ప్రకటించాడు. ఆచరణలో వచ్చిన తప్పిదాలు కూడా ఆయన స్థాయిలో ఆయన లేఖ ద్వారా చర్చించాడు. కనుక లొంగిపోయిన వారు ఆయుధం లేకుండా పని చేసుకుంటామని ప్రకటన కూడా చేశారు. ముందు ప్రాణాలు నిలుపుకొని, తదుపరి ఉద్యమం రూపకల్పన చేసుకుందామనే ఎత్తుగడ కావచ్చును లేదా బతుకుజీవుడా అని వచ్చిన అవకాశం తీసుకొని ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు జీవితం గడిపినా కొందరు గడపవచ్చును. అది వారి వారి ఇష్టం. కానీ, జరిగే అసమాన యుద్ధం, రక్తం పాతం నుండి వ్యూహాత్మకంగా ఈ వర్గం బయటపడిందనే చెప్పాలి. ప్రజల్లో వారు ఉంటారా, ఉండరా అనే విషయం కాలం నిగ్గు తేల్చుతుంది. అయితే సైద్ధాంతికంగా మార్పు చెందిన వర్గం ప్రతిపాదనల మూలం గా ప్రభుత్వ సైనిక చర్య తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రభుత్వం కూడా వేచిచూసే ధోరణితో ఉంది. దండకారణ్యం లో గత రెండు నెలలుగా సామూహిక ఎన్‌కౌంటర్స్ తగ్గిపోయాయి.

ఈ వాతావరణాన్ని లొంగిన నక్సల్స్ వర్గం పూర్తిగా వినియోగించుకొనగా, మావోయిస్టు సిద్ధాంతాలకు, సాయుధ పోరాటానికి కట్టుబడినవారికి సైతం ఈ సంధికాల సమయం కుదురుకోవడానికి కొద్దిగా వెసులుబాటునైనా లభించింది. మావోయిస్టులు ఖచ్చితంగా ఈ విషయం గమనించాలి. రెండో రకం లొంగిపోయిన నక్సల్స్ ఆయుధాలు అప్పగించకుండా లొంగుబాటుకు వెళితే బాగుండేది అనే ఆలోచన సైతం బయట మావోయిస్టు సానుభూతిపరులకు ఆవేదనగా ఉంది. ఆయుధాలు అప్పగించకుండా లొంగుబాటు అనేది లేదనేది అవతల పక్షం విధించిన ఒకానొక షరతు. కనుక ఆయుధాలు అప్పగించి లొంగిపోయినవారు లొంగిపోయారు. ఇక మావోయిస్టు పార్టీ మూల సిద్ధాంతానికి కట్టుబడిన కేంద్ర కమిటీ సభ్యులు, దళాలు ఇంకా దండకారణ్యం లో కొనసాగుతున్నాయి. సాధ్యమైనంత నష్టాలు లేకుండా బయటపడ్డమే ఇప్పుడు మిగిలిన మావోయిస్టుల కర్తవ్యం కూడా. దానితో పాటు నష్టాలనుండి తేరుకుని కొంతలో కొంత అయినా భేష్ ఏరియా కాపాడుకోవడం వారికి ఆచరణాత్మక చాలెంజ్‌నే.

అయితే, ఎంతవరకు నిలబడతారు? ఎంత కాలం నిలబడతారు? అనేది కాలం నిగ్గు తేల్చాల్సిన సమస్యనే? ఇప్పుడు దండకారణ్యం సరిహద్దులో తెలంగాణ ఉండడం, బిజెపి వ్యతిరేక కాంగ్రెస్ అధికారంలో ఉండడం మావోయిస్టు లకు కాస్తా ఊరటననే చెప్పవచ్చును. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా నక్సలైట్లు లొంగిపోవాలని కోరుతున్నారు. రేపు ఈ విషయంలో ఇక్కడ సర్కార్ కూడా ఈమాత్రం వెసులుబాటు ఇస్తుందని భావించలేము? ఇక్కడే మావోయిస్టుల మధ్య మరో వైరుధ్యం చేరింది. లొంగి పోయిన, లొంగిపోని నక్సలైట్ల మనుగడ సమస్య ఇప్పుడు ఒకరి ఉనికి మరొకరి మనుగడకు ప్రమాదకరం కానుంది. ఇప్పటివరకు ప్రభుత్వ దళాలతో తలపడిన మావోయిస్టులు అంతర్గత పోరుతో నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. లొంగిన మావోయిస్టులు ద్రోహులు అని, వారికి ప్రజలే శిక్ష వేస్తారని మిగిలిన మావోయిస్టులు బహిరంగ ప్రకటనే చేశారు. అంటే వారిని హతమార్చుతామనే సంకేతమే ఇచ్చా రు. ఇలా ప్రకటన చేయడం మావోయిస్టు పార్టీకి కొత్తకాక పోవచ్చును. కానీ, ప్రజల్లో మావోయిస్టు పార్టీకి ఈ పరిస్థితి గడ్డుకాలమే? ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న స్టేట్ టెర్రరిజం బహిరంగంగా తేదీ ఇచ్చి హతమార్చుతామని చేసే ప్రకటనకు, మావోయిస్టు పార్టీ లొంగిపోయిన తమ మాజీలను చంపుతామని చేసే ప్రకటనకు తేడా ఏమైనా ఉందా? అంటే, లేదనే చెప్పాలి.

నిజంగా మావోయిస్టు పార్టీని రెండు వర్గాలుగా చీలడం వల్ల ప్రభుత్వం నక్సల్స్‌ను బలహీనపరచాలన్న లక్ష్యం చాలా తేలిక అవుతుంది. నిర్మూలించడంలో తమ చేతికి మట్టి అంటకుండా రెండు వర్గాల ఘర్షణను ప్రోత్సహించే అవకాశం ఉంది. కనుక మావోయిస్టులు ప్రస్తుత చీలిక ఒకరిపై మరొకరు ద్వేషంతో దాడులవరకు వెళ్ళకుండా ఎవరి పంథాలో వారు పని చేసుకోవడం వలన సైద్ధాంతిక సానుకూలత ఉన్న వర్గం ప్రజల్లో నిలబడుతుంది. లేని వర్గం దానికదే ప్రజలనుండి వేరుపడి అదృశ్యం అవుతుంది. కనుక మావోయిస్టులు ఘర్షణ వాతావరణం నివారణ దిశగా పయనించడమే కొంతలో కొంతైనా లొంగిపోయిన వర్గం నిలబడిన వర్గాలకు మేలు జరుగుతుంది. గతంలో వివిధ నక్సల్స్ వర్గాల అంతర్గత ఘర్షణల అనుభవాలు నక్సల్స్ ఉద్యమాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ఇల్లెందు, సిరిసిల్ల ప్రాంతాల్లో జరిగిన భౌతిక ఘర్షణలు ఆయా వర్గాలకు క్యాడర్ నష్టపోవడం తప్ప ఎలాంటి లబ్ధి చేకూరలేదు. కనుక మావోయిస్టు పార్టీ కష్టకాలంలో మరింత విజ్ఞతతో మెలగవలసిన అవసరం మాత్రం ఉంది. దండకారణ్యంలో శాంతిని కాపాడాల్సిన కర్తవ్యం కూడా మావోయిస్టు పార్టీ పైనే ఉంది. రెండు పంథాల మధ్య సైద్ధాంతిక వైరుధ్యం కూడా శాంతి మార్గంలోనే సాధ్యం అవుతుంది తప్ప! బలప్రయోగం ఇప్పటికీ ఎప్పటికీ అటు ప్రభుత్వం చేసినా, ఇటు నక్సల్స్ చేసినా జీవించే హక్కును కాలరాయడమే!

– ఎన్.తిర్మల్

94418 64514

అంబేద్కర్ మార్గంలో ‘కోటా’ కొట్లాట

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తయినప్పటికీ సామాజిక న్యాయం అందని ద్రాక్షగానే మిగిలింది. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఇతర వెనకబడిన కులాలకు సమాన అవకాశాల కల్పనలో పార్టీలకు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికీ జనాభా ప్రకారం వారికి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదు. అగ్రకులాలు అదనపు హక్కుల పొందగా ఓబీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పావులుగా మారుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై పార్టీల స్పందనే ఇందుకు నిదర్శం. స్థానిక సంస్థల్లో 42 బీసీ రిజర్వేషన్ల అమలుకై తెచ్చిన జీవో 9కు కోర్టులో అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో రాష్ట్రంలో అక్టోబర్ 18న బీసీ రిజర్వేషన్ సాధనకు బీసీ సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్యర్యంలో బంద్ ప్రకటించారు.

దీనికి మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతు పలికాయి. పొలిటికల్ మైలేజ్ కోసం పరస్పర రాజకీయ ఆరోపణలకే పరిమితమయ్యాయి. అసలు 42శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన పరిష్కారం చూపాలనే నిబద్ధత ఏ పార్టీకి లేదని అర్థమవుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అనేది ఆయా వర్గాల ప్రాతినిధ్యం. కానీ సుప్రీం కోర్టు ఇందిరా సాహ్ని కేసులో 50శాతం పరిమితిని విధించింది. ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు తలుచుకుంటే ఈ పరిమితిని తొలగించలేరా?. అసలు అడ్డుకునేది ఎవరు? న్యాయ స్థానాలా? న్యాయ బద్దతలేని విధానాలా?.. ఆలోచన చెయ్యాలి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.

డా. బి.ఆర్. అంబేద్కర్ కేవలం దళితుల కోసమే కాదు, ఇతర వెనుకబడిన తరగతుల అభ్యున్నతిలోనూ ప్రధాన పాత్ర పోషించారు. మహాత్మా ఫూలే, సాహూ మహారాజ్ వంటి వెనకబడిన వర్గ ఉద్యమ నేతల ఆలోచనలను అంబేద్కర్ స్వీకరించి, వాటిని భారత రాజ్యాంగంలో ప్రతిబింబింపజేశారు. ఓబీసీలు తమతో కలిసి రానప్పటికీ అంబేద్కర్ వారికి సమాన న్యాయం, విద్యాఅవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం రావాలని పట్టుదలగా ప్రయత్నించారు. రౌండ్ టేండ్ సమావేశాల్లో ఆయన వెనుకబడిన కులాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయల్లో ప్రత్యేక అవకాశాలు కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించారు. రాజ్యాంగంలో 340వ అధికరణాన్ని చేర్చించారు. దీంతో వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగమనమైంది. ఈ అధికరణ ఆధారంగా ఓబీసీల జాబితా రూపొందించి, వారికి రిజర్వేషన్లు కల్పించటానికి ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధ బాధ్యత ఏర్పడింది. ఈ క్రమంలో కాక కలేల్కర్, బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కారణంగానే బీసీల రిజర్వేషన్ల కొంతమేర చట్టబద్ధమైనవి. స్వాతంత్య్రం అనంతరం జవహర్ లాల్ నెహ్రూ తొలి కేబినెట్లో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు.

1951లో ఆయన మహిళలకు వారసత్వం, సమాన హక్కులు కల్పించాలనీ‘హిందూ కోడ్ బిల్లును ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు వ్యతిరేకించడంతో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అంబేద్కర్ 1951 అక్టోబర్ 10న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆనాడు ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం కూడా తన రాజీనామాకు కారణంగా పేర్కొన్నారు. ఈ వాస్తవం బీసీ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజీనామా అనంతరం అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలిపి ఒక శక్తిగా ఎదగడం అవసరమని భావించారు. షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి రాజకీయ వేదికల ద్వారా దళితులు, బీసీలు, మహిళలు సమాన హక్కులు కోసం పోరాడారు. నేడు దేశంలో బీసీల సంక్షేమానికి అంబేద్కర్ దిక్సూచి. కావున ఇప్పుడు బీసీ విముక్తికి చారిత్రకంగా మహనీయుల పోరాటాలు పాఠం కావాలి.

అంబేద్కర్ తర్వాత ఆయన ఉద్యమ రథాన్ని ముందుకు నడిపించిన కాన్షీరాం సైతం ఇతర వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. 1980 సంవత్సరంలో మండల్ కమిషన్ ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. వీటి అమలుకై కాన్షీరాం డిల్లీ బోట్స్ క్లబ్ ముందు 48 రోజుల ధర్నా చేశారు. అప్పుడు వి.పి సింగ్ ప్రభుత్వం ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో కల్పిస్తూ చట్టం తెచ్చారు. ఈ విధంగా కాన్షిరాం బీసీ రిజర్వేషన్ ఉద్యమం దేశంలో విప్లవం సృష్టించింది. ఆ దిశగా మరో స్వాభిమాన బీసీ ఉద్యమం బయలుదేరాలి. ఈ క్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్, ఉమ్మడి ఏపీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బాలగోని బాలరాజు గౌడ్, పొన్నం దేవరాజ్ గౌడ్, జి.కిరణ్ కుమార్ నేతృత్వంలో బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటయ్యింది. ఈ సమితి బీసీ కేటగిరీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, తమిళనాడు తరహాలో వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నది. ఇది బీసీ రిజర్వేషన్లకు శాస్త్రీయ పరిష్కారం కానుంది. న్యాయపరమైన రక్షణ లభించనుంది. ఈ రిజర్వేషన్లను రాజకీయ, విద్య, ఉద్యోగాల్లోనూ అమలుకై పటిష్టమైన ఉద్యమం చేపడుతున్నారు. ఈ నెల24న ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా నిర్వహించారు. తదుపరి బీసీ చైతన్య యాత్ర చేపట్టబోతున్నారు. బీసీ సంఘాలతో పాటు ఇతర కుల సంఘాలు ఈ సమితికి తోడై దేశవ్యాప్త ఉద్యమంగా మారాలి. అప్పుడే బీసీలకు సామాజిక న్యాయం, రాజ్యాధికారం దక్కే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో బహుజన వర్గాలంతా తరతరాలుగా అగ్రకుల పాలకుల దోపిడికి గురయ్యారు. ఈ క్రమంలో 90 శాతం బీసీ ఎస్సీ ఎస్టీ బలగాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగించాలి. ఇందుకై వారిని పూలే, అంబేద్కర్, కాన్షీరాం దారిలో నడిపించడానికి డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆలోచన నుంచీ మార్చు 31, 2025న బిసి,ఎస్సీ,ఎస్టీల ఐక్య కార్యాచరణ సమితి(జాక్) ఆవిర్భవించింది. దీని ఆధ్వర్యంలో అదిలాబాద్ కేంద్రంగా ఏప్రిల్ 14 2025 న లక్ష కిలో మీటర్ల రథయాత్ర ప్రారంభమైనది. ఇది అట్టడుగు వర్గాల సమస్త రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతూనే.. రాజ్యాధికారం కోసం ధర్మ యుద్ధం చేస్తున్నది. ప్రజా సమస్యలపై సింహ గర్జన చేస్తున్నది. ఈ యాత్ర అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నది. ఇది ప్రత్యామ్నాయ ప్రతిపక్షమై సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నది.

దీనిలో భాగమైన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు టి.చిరంజీవులు గారు బీసీల చైతన్యానికి కృషి చేస్తున్నారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన జస్టిస్ ఈశ్వరయ్య బీసీల న్యాయపోరాటాలకు ప్రేరణ ఇచ్చారు. ఈ త్రిమూర్తులు అగ్రకుల పార్టీలకు అభిముఖంగా అంబేద్కర్ మార్గంలో నడుస్తూ పీడిత వర్గాల విముక్తికి తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల సాధన సమితిలో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. బీసీ ఉద్యమానికి కథానాయకులై నడిపిస్తున్నారు. వీరికి తోడుగా వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మేధావులు, కుల సంఘాలు కలిసి వస్తున్నారు. గతంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో 10వేల కిలో మీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీల కులాల వాటానడుగుతూ రాజ్యాధికార స్పృహ రగిలించారు. ఇదే నేటి బీసీల సంఘటిత మహోద్యమానికి కారణమైనది. 

కళాత్మక సమరశీలి సత్యన్న

కళ కళ కోసం కాదు ప్రజల కోసమే అన్నట్లుగా ఆట-పాటలనే ఆయుధంగా చేసుకొని నిరంతరం ప్రజా ఉద్యమ పంథాలో కొనసాగిన కళాత్మక సమరశీలి కామ్రేడ్ సత్యన్న. భూక్య సత్యనారాయణ అలియాస్ సత్యన్న అలియాస్ పెద్దన్నగా పేరు గడించిన సత్యన్న పేరుకు తగ్గట్టుగానే జీవితాంతం ఎత్తిన ఎర్రజెండాను దించలేదు. నమ్మిన సత్యాన్ని, సిద్ధాంతాన్ని వీడలేదు. పెద్దన్నగా పెద్దరికంతో కూడిన హుందాతనం ఆయన సొంతం. అందరి కోసం నేను అన్నట్లుగా జీవించేవారు. మే 18,1963 సంవత్సరంలో ఖమ్మం జిల్లా, తిరుమలయపాలెం మండలం, కాకరవాయి గ్రామంలో భూక్యా రాములు-తిరుపతమ్మ దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించిన భూక్యా సత్యనారాయణకు ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెలు ఉన్నారు. భూక్యా సత్యన్న జీవనోపాధిరీత్యా యుక్త వయసులోనే మహబూబాబాద్ కు వలస వచ్చారు. ఆ సమయంలో మహబూబాబాద్ లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకత్వంలో ఎగురుతున్న ఎర్రజెండా రెపరెపలకు ముగ్దుడై ఎర్ర జెండా ఎత్తి పట్టి పోరాట బాట పట్టారు.

మానుకోట ప్రాంతంలో కామ్రేడ్ ధర్మన్న సహచరునిగా ప్రజా ఉద్యమంలో కొనసాగారు. ప్రజా పోరాట తత్వాన్ని అలవర్చుకున్న భూక్యా సత్యన్న తన స్వగ్రామమైన కాకరవాయి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖ నిర్మించి ఎర్రజెండా ఎగురవేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై తెలంగాణ ఉద్యమ ప్రజా కళాకారులతో జతకట్టి ఉద్యమ పాటల పల్లకి ఎత్తుకున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ జానపద కళాకారుల సంఘం, విశ్వ సమాజం తదితర ప్రజా సంఘాలలో చేరి, ప్రజా ఉద్యమకారునిగా, ప్రజా కళాకారునిగా పనిచేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఖమ్మం జిల్లా సాంస్కృతిక విభాగం కో కన్వీనర్‌గా ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో విస్తృతమైన కళా ప్రదర్శనలు ఇచ్చారు.

తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వ సమాజం వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది రచయిత విశ్వ జంపాల సహచరత్వంలో తెలంగాణ, సామాజిక న్యాయ ప్రజా పోరాటాల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ ప్రజా కళాకారుడుగా కాలుకు గజ్జ కట్టి గోసి గొంగడేసి కైగట్టి పాట పాడుతూ తెలంగాణ ప్రజా యుద్ధనౌక గద్దరన్నను అనుకరిస్తూ ఆడుతూ పాడుతూ ప్రజలను ఆకట్టుకునేవారు. ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో ప్రజా యుద్ధనౌక గద్దరన్న, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పాల్గొన్న ప్రతి కళా ప్రదర్శనలో, సమావేశాల్లో విధిగా పాల్గొనేవారు. వృత్తిరీత్యా బిల్డింగ్ నిర్మాణ పనులు, రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. మహబూబాబాద్ పట్టణంలో పేదల ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న అనేక పోరాటలలో సైతం పాల్గొని ప్రజా పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచారు.

ప్రజా ఉద్యమ వేదికల మీద రొమ్ము విరిచి, గుండెలు బాదుకుంటూ పేదల ఆకలి కేకల బాధలను పోరాట పాటలుగా వినిపించేవారు. సత్యనారాయణకు భార్య సీతాదేవి పెద్ద కూతురు విశాల, చిన్న కూతురు విమల, కుమారుడు విక్రమ్ ఉన్నారు. మంచికి మారుపేరు, సహానశీలి, మానవత్వం, పెద్దరికం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా చిరునవ్వుల పలకరింపులతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొంది, అందరికీ ఆదర్శంగా నిలచిన కామ్రేడ్ భూక్య సత్యన్న గుండె పోటుతో తెలంగాణ బీసీ బంద్ రోజున ది.18.10.2025న అకాల మరణం చెందారు. ఎందరో కవులు కళాకారులు ఉద్యమకారుల సాన్నిహిత్యం పొంది, వారి సహచరునిగా తన పాద ముద్రలను వదిలి వెళ్లారు. ప్రజా కళాకారునిగా, ప్రజా ఉద్యమకారునిగా కామ్రేడ్ భూక్యా సత్యనారాయణ అలియాస్ సత్యన్న అలియాస్ పెద్దన్న ఆలోచన విధానాన్ని ఆయన మహోన్నత ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు అర్పించే ఘనమైన నివాళి.

(27.10.2025న మహబూబాబాద్‌లో జరగనున్న కామ్రేడ్ భూక్య సత్యన్న సంస్మరణ సందర్భంగా)

విశ్వ జంపాల అడ్వకేట్ (విశ్వ సమాజం వ్యవస్థాపకులు)

77939 68907

‘గెలుపు’ రాజకీయాల్లో సానుభూతి సయ్యాట!

రాజకీయాల్లో ప్రత్యర్ధులు మాత్రమే ఉండే కాలంలో ఒక ప్రజాప్రతినిధి మరణిస్తే ఆయన లేదా ఆమె ప్రాతినిధ్యం వహించిన పార్టీకే ఏకగ్రీవంగా ఆ స్థానాన్ని వదిలేసి మిగతా రాజకీయ పార్టీలన్నీ మృతి చెందిన ఆ నేతకు గౌరవంగా నివాళులు అర్పించేవారు. క్రమక్రమంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు అనే మాట అంతరించిపోయి బద్ధ శత్రువులు మిగిలారు. ఇటీవలి కాలంలో, అవి జాతీయ రాజకీయాలైన, ప్రాంతీయ రాజకీయాలైనా అన్ని పార్టీలు ఒకరినొకరు శత్రువులుగానే పరిగణిస్తూ ఉండటం చూస్తున్నాం.

ఇప్పుడు ఎక్కడ ఎన్నిక జరిగినా రాజకీయ పార్టీలు పోటీని ‘స్పోర్టివ్’గా తీసుకోవడం మానేశాయి. అవతలి పక్షాన్ని ఓడించి తామే గెలవాలన్న పట్టుదల పెరిగింది. ఇది యుద్ధంలో శత్రువులు ఎంత మందినైనా చంపి విజయం సాధించాలన్న రాజ్యకాంక్ష వంటిది. అది ఇప్పుడు మనకు ఎల్లెడలా కనిపిస్తుంది. ఆ క్రమంలో ఉచ్చనీచాలు మరిచిపోయి, స్థాయిని విస్మరించి అవతలిపక్షం వారిని అవమానించే విధంగా మాట్లాడటం, ప్రకటనలు చేయడం పరిపాటి అయింది. ఈ పక్షం ఆ పక్షం అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు అట్లానే తయారవుతున్నాయి. ఇక ఎన్నికల అప్పుడు సరే సరి. పోటీలు పడి వ్యక్తిగత విమర్శలు, అవతలి వారి వ్యక్తిత్వ హననానికి కూడా వెనుకాడని స్థితి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక జరపవలసిన అవసరం ఏర్పడింది. నిజానికి ఇది పేరుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం. దీని పరిధిలో జూబ్లీహిల్స్ లేకపోవడం ఓ విచిత్రం. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రాష్ట్ర సమితి శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా ఈ ఉపఎన్నిక జరపవలసి వచ్చింది. గోపీనాథ్ 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికై పార్టీ మారి భారత రాష్ట్ర సమితిలో చేరి ఆ తరువాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి.

ప్రస్తుతం ఆయన సతీమణి సునీత భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా బరిలో ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అనే యువ బీసీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా లంకల దీపక్ రెడ్డిని పోటీలోకి దింపింది. ఇక్కడ అంత ప్రాముఖ్యం లేకపోయినా ఒక విషయం సరదాగా అయినా గుర్తు చేసుకోవాలి. ఈ ముగ్గురు అభ్యర్దులూ ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీతో సంబంధం ఉన్న వారే. ముందే చెప్పుకున్నట్టు బీఆర్‌ఎస్ అభ్యర్ధి సునీత భర్త మాగంటి గోపినాద్ మొదట తెలుగు దేశం శాసన సభ్యుడే కాగా బీజేపీ ప్రస్తుత అభ్యర్థి రాజకీయ ప్రస్తానం కొంత కాలం చంద్రబాబు నాయుడు పార్టీలోనే.

ఇక నవీన్ యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్‌ను 2019కి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆహ్వానం పలికి పార్టీలో చేర్చుకున్నారు. అప్పట్లో పార్టీలో చేరడానికి శ్రీశైలం యాదవ్ తీసిన ఊరేగింపును ఆనాటి హోంమంత్రి ఏ. మాధవ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు కూడా. ఆరోజుల్లో అది పెద్ద చర్చనీయాంశం కూడా అయింది. సరే ఇప్పుడిక్కడ ఆ పార్టీకి పెద్ద ప్రాముఖ్యత లేదనుకోండి, అయినా మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చాను, సెల్ ఫోన్ నేనే తెచ్చాను అన్న చందంగా అన్ని పార్టీల అభ్యర్ధులను నేనే తెచ్చాను అని కూడా చంద్రబాబు చెప్పుకోగలరు.

ఇక ప్రస్తుతానికి వొస్తే, సానుభూతి పవనాలు వీచి తమ అభ్యర్థి తప్పకుండా గెలుస్తారనే నమ్మకం, ఈ రెండేళ్లలో అధికార కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగింది అన్న అభిప్రాయంతో తమ గెలుపు తధ్యమని అభిప్రాయంలో బిఆర్‌ఎస్ ఉంటే, ఉప ఎన్నికలు సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలమైన ఫలితాలనిస్తాయని ఒక అభిప్రాయంతో పాటు తాము వెనుకబడిన తరగతుల 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి చూపిన చొరవ, చిత్తశుద్ధి పనిచేసే తాము నియమించిన యువ బీసీ అభ్యర్థి గెలుపు ఖాయం అని భావిస్తున్నది అధికార కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని నాలుగు లక్షల మందికి పైగా ఓటర్లలో దాదాపు 1,20,000 ఓట్లు మైనారిటీలవి ఉండడం, ఈసారి మజిలీస్ పార్టీ పోటీ చేయకుండా అధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం కూడా తనకు కలిసి వచ్చే అంశంగా కాంగ్రెస్ భావిస్తున్నది. భారతీయ జనతా పార్టీ పోటీలో ఉన్న పెద్దగా ప్రభావం చూపలేకపోవచ్చునని అభిప్రాయం సర్వత్ర ఉన్నది.

సరిగ్గా మరో రెండు వారాలకు ఎన్నిక జరగనున్న ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పక్షాలు పట్టుదలగా పనిచేయడానికి కారణాలు ఉన్నాయి. వాటిని గురించి చర్చించే ముందు ప్రత్యర్థులు శత్రువులుగా మారి పోటీలు పడుతున్న ఈ తరుణంలో ప్రజలలో సానుభూతి అనే అంశం అంతగా ప్రభావం చూపడం లేదని గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.

2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలకు వివిధ కారణాల చేత ఉప ఎన్నికలు జరిగాయి. వీటిల్లో జనం భిన్నమైన ఫ లితాలని రాజకీయ పక్షాలకు రుచి చూపించారు. 2016 లో ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో, ఖమ్మం జిల్లా పాలేరులో ఉప ఎన్నికలు జరిగాయి. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం బీఆర్‌ఎస్ పరమయింది. అట్లాగే పాలేరులో కూడా కాంగ్రెస్ స్థానం బీఆర్‌ఎస్ వశమైంది. ఇక్కడ సానుభూతి పనిచేయలేదు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి మృతి కారణంగా జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయి టిఆర్‌ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికై మంత్రి అయ్యారు. 2019లో లోకసభకు ఎన్నికైన కారణంగా ప్రస్తుత మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసినందు వల్ల జరిగిన ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి అప్పటి అధికార పక్షం బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిచారు.

2020లో ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మరణిస్తే ఆయన సతీమణిని బీఆర్‌ఎస్ పోటీకి నిలిపినా అక్కడ అనూహ్యంగా ప్రజలు బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావును గెలిపించారు. దుబ్బాకలో సానుభూతి పనిచేయలేదు. ఉప ఎన్నికల్లో అధికార పక్షమే గెలుస్తుందన్న వాదన కూడా పటాపంచలైంది. ఇక 2021లో నాగార్జునసాగర్‌లో బీఆర్‌ఎస్ శాసనసభ్యుడు నోముల నరసింహయ్య మరణిస్తే ఆయన కుమారుడు నగేష్ అదే పార్టీ నుంచి పోటీ చేస్తే జనం ఓట్లు వేసి గెలిపించారు. ఇట్లా దుబ్బాక నాగార్జునసాగర్‌లలో ఫలితాలు పూర్తి భిన్నంగా రావడానికి ఇతరేతర కారణాలు ఉంటాయి.

అదే సంవత్సరంలో హుజరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నిక గురించి, ఆ వెనువెంటనే 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసిన ఉద్యమ సహచరుడు, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌ను అకారణంగా, అర్ధరాత్రి నిర్ణయం తీసుకుని మంత్రివర్గం నుంచి తొలగించడం, పార్టీ నుండి వెలివేయడం, అవినీతి కేసులు పెట్టడం వంటివి చేసిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్ణయాన్ని వ్యతిరేకించి హుజరాబాద్ ప్రజలు బిజెపి టికెట్ తెచ్చుకున్న ఈటెల రాజేందర్‌ను గెలిపించారు. దళిత బంధు వంటి బీఆర్‌ఎస్ జిమ్మిక్కులు కూడా అక్కడ పని చేయలేదు. బిజెపి ఘనత కంటే ఈటెల రాజేందర్‌కు ప్రజలలో ఉన్న వ్యక్తిగత పలుకుబడి, కేసీఆర్ నిర్ణయాల పట్ల పెరిగిన వ్యతిరేకత బాగా పనిచేసాయి.

అదే మునుగోడు దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించి ప్రజలు బిఆర్‌ఎస్ అభ్యర్థికే పట్టం కట్టారు. అయితే మునుగోడులో భారత కమ్యూనిస్టు పార్టీని మళ్ళీ ఒకసారి తన సహజ మిత్రులని కౌగిలించుకొని భవిష్యత్తులో ఇంకెప్పుడు వారితో మిత్రత్వం వదులుకోబోనని కెసిఆర్ బోలెడు వాగ్దానాలు చేసిన కారణంగా ఆ పార్టీకి సంబంధించిన పదివేల ఓట్లు పడి అంతే తేడాతో టిఆర్‌ఎస్ అభ్యర్థి బయటపడి కెసిఆర్, బీఆర్‌ఎస్ పరువు దక్కినట్టు అయింది . హుజురాబాద్‌లో ఈటెల రాజేందర్‌కు సానుభూతి పనిచేస్తే మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి అది ఏ మాత్రం సాయం చేయలేదు.

ఇక ఈ క్రమంలో జరిగిన చివరి ఉప ఎన్నిక 2024లో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో టిఆర్‌ఎస్ అధికారంలో ఉండగానే మరణించిన గడ్డం సాయన్న కూతు రు లాస్య నందిత ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎ మ్మెల్యేగా గెలిస్తే ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె కూడా మ రణించాక ఆమె సోదరి నివేదితని పోటీకి నిలిపితే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ సానుభూతిని కాదని అధికారం గెలిచింది. ఓ పక్క 2023లో అధికారం కోల్పోయి, 2024లో ఒక్క లోక్‌సభ స్థానం గెలుచుకోలేకపోయిన బిఆర్‌ఎస్‌కు కంటోన్మెంట్ ఓటమి మూలి గే నక్క మీద తాటి పండు పడ్డ సామెతగా తయారైంది.

ఇక ఎవరి బలం ఎంతో స్పష్టంగానే ఉన్న సమయంలో ఒక్క అసెంబ్లీ స్థానంలో గెలుపు కోసం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీలు ఎందుకు పట్టుదలకు పోతున్నాయి అంటే, బీఆర్‌ఎస్‌కు ఇద అగ్ని పరీక్ష వంటిది. 2023లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా హైదరాబాద్ చుట్టుపక్కల గల నగర నియోజకవర్గాలన్నీ గెల్చుకున్నది. అధికారంలోకి వొచ్చాక కాంగ్రెస్ ఇది దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరం దాని చుట్టూ చేస్తున్నఅభివృద్ధి కార్యక్రమాల ద్వారా మరింత బలోపేతం అయితే పార్టీ మనుగడ కష్టం కాబట్టి జూబిలీహిల్స్‌ను నిలుపుకోవాలన్న పట్టుదల బీఆర్‌ఎస్‌ది. స్థానిక ఎన్నికల ముంగిట్లో జూబ్లీహిల్స్ గెలుపు మరింత ఉత్సాహాన్నిస్తుందన్న ఆలోచన కాంగ్రెస్‌ది.

ఇది న్యాయ వ్యవస్థకే అప్రతిష్ఠ

సుప్రీం కోర్టు విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై ఓ మూర్ఖపు న్యాయవాది బూటుతో దాడికి ప్రయత్నించడం యావత్ దేశానికి పెద్ద షాక్. దాడి చేసిన వ్యక్తి ‘సనాతన ధర్మాన్ని అగౌరవ పర్చడం భారతదేశం ఎన్నడూ సహించదు’అని బెదిరించడం వినిపించింది. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఆలయ సముదాయంలో ఏడు అడుగుల విష్ణు విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని కోరుతూ పిటిషన్ దాఖలు కాగా ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ సిజెఐ కొన్ని వ్యాఖ్యలు చేశారు. విష్ణువుకు వీరభక్తుడినని చెప్పుకుంటున్నావు కదా! వెళ్లి ఆ దేవుడిని ప్రార్థించుకో. అదో ఆర్కియాలజీ సైట్. దానికి ఆర్కియాలజీ పర్మిషన్ అవసరం ఉంటుందని సిజెఐ వ్యాఖ్యానించడం బిజెపి అనుకూల సామాజిక మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ నేపథ్యమే న్యాయవాది దౌర్జన్యానికి కారణమైంది. సిజెఐ ఆ వ్యాఖ్యలను బాగా చెప్పి ఉండవచ్చని వాదించినప్పటికీ, ప్రజాస్వామ్యంలో మూలస్తంభమైన స్వేచ్ఛగా భావప్రకటన చేసే రాజ్యాంగపరమైన హక్కు సిజెఐ ప్రకటనకు రక్షణ కల్పిస్తుంది. అయినాసరే ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో దానికి సిజెఐ తనదైన శైలిలో తెరదించారు. తరువాత ఓ కేసులో స్పందిస్తూ తానేమీ ఏ మతాన్ని అమర్యాద పర్చలేదని, అన్ని మతాలను తాను గౌరవిస్తానని, కేవలం సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు వ్యతిరేక ప్రచారం అయినట్టు వివరించారు. సరైన సలహా ఉంటే ఈ విషయం అక్కడే నిలిచిపోయేది.

అయితే దాడికి ప్రయత్నించిన న్యాయవాది, 71 ఏళ్ల న్యాయశాస్త్ర అనుభవజ్ఞుడే కాక, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు కూడా. అయినా సనాతన ధర్మ మొదటి సూత్రాలను అంతర్గతీకరించే పరిపక్వత లేదు. హింసను త్యజించడం, ఆలోచనలను స్వేచ్ఛగా పరస్పరం పంచుకోవడం అనేవి సనాతన ధర్మంలోని ప్రధాన సూత్రాలు. కేవలం సంకుచిత దృష్టితో అత్యున్నత న్యాయస్థానానికి అధ్యక్షత వహించే ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయాలని అపేక్షించడం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఇప్పటివరకు విచ్చలవిడి రాజకీయ నాయకుల పైన, పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న నేరస్థులనే అనుమానితుల పైన మితవాద హింసాకాండ సాగడం పరిపాటిగా వస్తోంది. ఇప్పుడీ సంఘటన సోషల్ మీడియాలో పరమత విద్వేషం ప్రదర్శించడం, విషపూరిత టెలివిజన్ చర్చలు సర్వసాధారణమైనట్టు కనిపిస్తోంది. ఇవి సామాజిక ఒత్తిడిని పెంచేలా వేలెత్తి చూపుతున్నాయి. సిజెఐ గవాయి మారిషస్‌లో, భారతదేశంలోని చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన పాలన, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి ప్రముఖంగా ప్రసంగించిన చాలా రోజులకు సుప్రీంకోర్టులో నాటకీయంగా ఈ సంఘటన జరగడం అనూహ్యం. మతోన్మాద న్యాయవాది బూటు విసరడానికి ప్రయత్నించినా, సిజెఐని వేలెత్తి చూపుతూ హెచ్చరించినా సిజెఐ మాత్రం ఎలాంటి కలవరం చెందలేదు.

సుప్రీం కోర్టు రిజిస్ట్రీ కూడా ఎలాంటి కేసులు దాఖలు చేయలేదు. అపరాధిని బయటకు వెళ్లనిచ్చేరు. విశేష న్యాయపరమైన దయ చూపించడం గమనార్హం. ‘సుప్రీం కోర్టు ప్రాంగణంలో సిజెఐపై దాడికి పాల్పడడం ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇటువంటి చర్యలకు చోటు లేదు. ఇది పూర్తిగా ఖండించదగినది. దాడి సమయంలో జస్టిస్ గవాయ్ ప్రశాంతతను ప్రదర్శించడం అభినందనీయం. ఇది న్యాయ విలువల పట్ల, మన రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల ఆయన నిబద్ధతను ఉద్దీపింప చేస్తుంది’ అని ప్రధాని మోడీ తన ట్వీట్‌లో సిజెఐని ప్రశంసించడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. బీహార్‌లో కులాల ఆధారంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్న పోరాటం నుంచి దృష్టి మళ్లించడానికి ప్రధాని మోడీ ఈ విధంగా సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ఆ తలతిక్క న్యాయవాది లైసెన్సిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. ఇటువంటి సర్వవ్యాప్త చర్యలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించని రాష్ట్ర హైకోర్టు జడ్జీలు కొందరి ఉదంతాలు కూడా బయటపడ్డాయి గత మే నెలలో ఇద్దరు జడ్జీలను సుప్రీం ధర్మాసనం ఇటీవల ఘాటుగా మందలించింది.

మోసపూరిత కేసులో ఒకే నిందితునికి అనుకూలంగా బెయిలు మంజూరు చేయడంలో అసలు ఉద్దేశమేమిటని ప్రశ్నించింది. క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి, ఒక కేసులో తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిన గత తీర్పుకు భిన్నంగా బెయిల్ మంజూరు చేశారని మధ్యప్రదేశ్ సెషన్స్ జడ్జిని ఆక్షేపించింది. ఈ జడ్జిని ఢిల్లీలో వారం రోజుల పాటు శిక్షణ తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. 2023 మేలో అలహాబాద్ హైకోర్టు సెషన్స్ జడ్జిని విధుల నుంచి తప్పించి వారం రోజుల పాటు జ్యుడీషియల్ అకాడమీకి శిక్షణ కోసం పంపాలని ఆదేశించింది.దీనివల్ల వారి నైపుణ్యం మెరుగుపడుతుందని సూచించింది. ఈ సంఘటనలు న్యాయవ్యవస్థలో అవినీతి, అసమర్థత ప్రక్షాళనం చేయడానికి తోడ్పడతాయి. న్యాయవ్యవస్థను అనేక రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి. చాలా మందిలో పోటీతత్వం, విశ్వసనీయత ఉండడం లేదని కొన్ని సంఘటనల బట్టి తెలుస్తోంది. పెండింగ్ కేసుల భారం, కాలం చెల్లిన చట్టాలు, విధానాలు, వనరుల కొరత, మౌలిక సౌకర్యాల లోపం, ఇవన్నీ ప్రజాస్వామ్య మూలస్తంభమైన న్యాయవ్యవస్థను ముందుకు తీసుకు వెళ్లడం లేదు. కొంతమంది న్యాయవాదులు, జడ్జీలు అవినీతిపరులు కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. న్యాయస్థానాల్లో అవాంఛనీయ సంఘటనలు గతంలో కూడా జరిగాయి. న్యాయమూర్తులపై దాడులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే చర్యలు, హైకోర్టు జడ్జీల ప్రవర్తనపై సుప్రీం కోర్టు ఆందోళన చెందడం, అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదులు నిరవధిక సమ్మె చేయడం, తెలంగాణ హైకోర్టులో కక్షిదారుల దురుసు ప్రవర్తన, తదితర సంఘటనలు ఎన్నో జరిగాయి.