Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

స్లీపర్ ట్రావెల్స్.. డేంజర్ బెల్స్

ఇప్పుడు స్లీపర్ బస్సుల పేరు చెబితే భయం కలుగుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో శుక్రవారం (24.10.25) తెల్లవారు జామున చెలరేగిన మంటలు అనేక మందిని సజీవ దహనం చేసిన సంఘటన స్లీపర్ బస్సుల నిర్వహణ లోపాలకు సాక్షంగా మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా, పది రోజుల క్రితం రాజస్థాన్‌లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ప్రమాదాల కారణంగానే కొన్ని దేశాల్లో స్లీపర్ బస్సుల వినియోగాన్ని బాగా తగ్గించేశారు. చైనాలో 2009 తర్వాత నుంచి 13 స్లీపర్ బస్సు ప్రమాదాలు జరిగి 252 మంది ప్రాణాలు కోల్పోవడంతో 2012 లో వీటి రిజిస్ట్రేషన్లను చైనా నిలిపివేసింది. మన దేశంలో స్లీపర్ బస్సులు చాలా పాప్యులర్ పొందాయి. చాలా మంది ప్రయాణికులు తమ సుదీర్ఘ ప్రయాణంలో ఈబస్సుల్లో హాయిగా నిద్రపోవచ్చని ఇష్టపడుతుంటారు.

కానీ తరచుగా ప్రమాదాలు జరుగుతుండడంతో వీటి భద్రతపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు సాధారణంగా స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్లకు అధికారికంగా అనుమతించడం లేదు. కానీ చాలామంది ఆపరేటర్లు స్థానిక నిబంధనలను పక్కన పెట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని చోట్ల తమ బస్సులకు రిజిస్ట్రేషన్లు చేయించి ఈ రాష్ట్రాల్లో నడుపుతున్నారు. ఈ వక్ర మార్గాలు నిజంగా భద్రతా ప్రమాణాలు అమలవుతున్నాయా లేదా అన్న సందేహాలకు దారితీస్తున్నాయి. ఘోర ప్రమాదాలకు దారి తీస్తున్న స్లీపర్ బస్సుల భద్రత ప్రమాణాలను కట్టుదిట్టం చేయడం ప్రభుత్వ అధికారుల ప్రస్తుత కర్తవ్యం. భద్రతా ప్రమాణాలతో ఫ్యాక్టరీలో తయారైన బస్సులనే రోడ్లపైకి అనుమతించాలి. అత్యధిక లాభాల కోసం అనధికారికంగా బస్సుల డిజైన్లను ఆపరేటర్లు మార్చకుండా నియంత్రించాలి. అలాగే రెగ్యులర్‌గా వీటిపై తనిఖీలు జరగాలి. స్లీపర్ బస్సుల్లో ఓవర్ లోడ్‌ను అనుమతించరాదు.

ఎన్ని సౌకర్యాలు ఉన్నా ప్రాణాలకు రిస్కుగా మారకూడదు. బస్సుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే పొగకమ్ముకోవడం ప్రయాణికులకు ఊపిరాడక వెంటనే తప్పించుకునే దారి కనిపించడం లేదు. ఈలోగా జరగవలసిన నష్టం జరిగిపోతోంది. స్లీపర్ బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసరంగా తప్పించుకునే ఏర్పాట్లు ఎంతవరకు ఉన్నాయో మొదట తప్పనిసరిగా పరిశీలించుకోవడానికి బదులు కేవలం తమ సౌకర్యాలపైనే ప్రయాణికులు దృష్టి పెడుతున్నారు. మొదట్లో కొన్ని మాత్రమే స్లీపర్ బస్సులుండేవి. అయితే ట్రావెల్ ఆపరేటర్లు చాలామంది తమ మామూలు సీటింగ్ బస్సులను కూడా స్లీపర్ కోచ్‌లుగా మార్చేసి అత్యధికంగా ఛార్జీలు పిండుకోవడం ప్రారంభించారు. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలతో తయారైన బస్సులను ప్రైవేట్‌గా తమ ఇష్టం వచ్చినట్టు ఆపరేటర్లు వాటి డిజైన్ మార్చేయడం పరిపాటి అయింది. బస్సు కిటికీలు తరచుగా మూసి ఉంటాయి. బస్సులో టివి స్క్రీన్లు, మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్ కనెక్షన్లకు ఛార్జింగ్ చేసుకునే సౌకర్యం తదితర హంగులు ఉండడంతో పవర్ లోడ్ అధికమై షార్టు సర్కూట్ సంభవించి మంటలు చెలరేగే ప్రమాదాలు ఎదురవుతుంటాయని కొందరు ప్రయాణికులు చెబుతుంటారు.

బస్సులో ప్రవేశించడానికి, బయటకు రావడానికి ఒకే ద్వారం తెరిచి ఉంటుంది. సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి తొమ్మిది అడుగుల వరకు ఉండడంతో బస్సు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల నుంచి బయటపడడం కష్టమవుతోంది. ఈ బస్సుల్లో 30 నుంచి 36 వరకు బెర్త్‌లు ఉంటాయి. ఒక్కో బెర్తు 6 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పులో ఉంటుంది. ఈ బెర్తులను అనుసంధానించే గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండడమే అసలు సమస్య. రాత్రివేళల్లో ఇవి అత్యంత స్పీడ్‌తో వెళ్తుండడం డ్రైవర్లకు అగ్నిపరీక్షే. డ్రైవర్లకు ఏమాత్రం అలసట వచ్చినా, మగత కమ్మినా ప్రమాదాలకు దారితీస్తుంటాయి. రాత్రుళ్లు డ్రైవింగ్ సమయంలో 25 శాతం మంది నిద్రమత్తులో ఉంటున్నట్టు 2019 లో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అర్ధరాత్రి తర్వాత నుంచి ఉదయం 6 గంటల లోపు డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకునే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఈ ధోరణిని అరికట్టడానికి కృత్రిమ మేధ (ఎఐ) సాంకేతిక వ్యవస్థలను కొన్ని నగరాల్లో వినియోగిస్తున్నారు.

పుణె వంటి నగరాల్లో డ్రైవర్లు మగతగా ఉన్నారా లేదా పరధ్యానంలో ఉన్నారా లేదా సిగ్నల్ దాటుకుని స్పీడ్‌గా వెళ్తున్నారా? అని పసికట్టి హెచ్చరించే స్మార్ట్ కెమెరాలు వినియోగిస్తున్నారు. డ్రైవర్ ఎన్నిసార్లు కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఉన్నాడో, తరచుగా వాహనం ఎన్నిసార్లు అదుపు తప్పిందో తెలిసిపోతుంది. రెడ్ లైట్ సిగ్నల్ వద్ద డ్రైవర్ ఏ విధంగా అజాగ్రత్తగా వ్యవహరిస్తునాడో పసిగడతాయి. అలాంటి సమయాల్లో కీచుమని శబ్దం రూపంలో, మరికొన్ని సార్లు స్టీరింగ్ వీల్ ప్రకంపించడం ద్వారా హెచ్చరికలు వస్తుంటాయి. ఇటువంటి ఎఐ వ్యవస్థ డ్రైవింగ్ అవర్స్‌ను ట్రాక్ చేయడమే కాదు, వారు స్మార్ట్‌గా డ్రైవ్ చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు కొత్తగా బస్సుల్లో డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్నా వాటి పనితీరు సామర్థంపై ఇంకా అనుమానాలు ఉంటున్నాయి. కృత్రిమ మేధ సాయంతో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఢిల్లీ గురుగ్రామ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవేపై కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేయడం చెప్పుకోతగ్గ విశేషం. దీంతో దేశం లోనే మొట్టమొదటి ఎఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవేగా ఈ రహదారి గుర్తింపు పొందింది. ఈ ప్రక్రియను దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై అమలు చేయడానికి కేంద్రం యోచిస్తోంది. 

హృదయం.. పదిలం

నాకు పర్ఫెక్ట్ డ్రైవింగ్ వస్తుంది. ఇన్ని సంవత్సరాల నా డ్రైవింగ్ సర్వీసులో ఎప్పుడు కూడా ఎలాంటి చిన్న రోడ్డు ప్రమాదం చేయలేదు అనే ధీమాతో రోడ్లపై వాహనాల సీనియర్ డ్రైవర్లు అనుకోవడం మనకు తెలిసిందే. మనకు డ్రైవింగ్ సరిగానే వస్తుంది కానీ ఎదురుగా వచ్చే వాహనం డ్రైవర్ సరిగా లేకుంటే అది మనకు ప్రమాదమే. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే రోడ్డు ప్రమాదాలు కొన్ని తగ్గుతాయి. వేగం తగ్గిస్తే ఎదుటి వారి నుండి మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఎలిమెంట్లు లేకుండా, అధిక లోడుతో, అతి వేగంతో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలలో కనురెప్పపాటులో ప్రాణాలు వదులుతూ లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలను అనుకోకుండా జరిగే ప్రమాదాలు కాబట్టి యాక్సిడెంట్ అంటాం. రోడ్డు ప్రమాదాల తరహాలోనే గుండెపోటు ప్రమాదాలు.. నాకు ఎటువంటి చెడు అలవాట్లు అంటే మద్యపానం, పానం వంటివి ఏవీ లేవని, నేను రోజు ఉదయం జాగింగ్‌కు వెళ్తానని లేదా వ్యవసాయం పనిలో ఎప్పుడు పని చేస్తూ ఉంటాను అని, నేను మెకానిక్‌ను, హార్డ్ వర్కర్ ను, నేను ఎప్పుడూ ఏదో పని చేస్తుంటాను అంటూ ఇలా కొంత మంది ఏదో ఒక శరీరం దృఢపడే పనులు చేస్తూ ఉంటారు.

ఈ పనులు చేసేవారు శరీరం దృఢపడడంతో పాటు అవయవాలు కూడా బాగానే ఉన్నాయని, నాకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రావని, నా ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని ధీమాతో బీమా వ్యక్తం చేసేవారు అధిక శాతం. పొద్దంతా పనిచేసి విశ్రాంతికి మందు తాగితేముంది.. పొద్దంతా పనులు చేస్తాం, వ్యవసాయ పనులు చేస్తాం, భవన నిర్మాణ పనులు చేస్తాం, బాడీ విశ్రాంతి ఉపశమనం కోసం కాయకష్టం చేసి కొద్దిగా మందు తాగితే ఏమవుతుంది? మేం చేసేది రెక్కలుముక్కలు చేసుకుని చేసే కష్టమే కదా మా శరీరానికి మందు తాగితే ఏమవుతుంది అన్న ధైర్యంతో సుమారు 70 శాతం మంది పట్టణ, పల్లెటూర్లలో వైన్స్ పర్మిట్ రూములలో పట్టనంత మంది రోజు వారు చేసిన కష్టంలో సగం మద్యం ఖర్చుకే పోతున్నాయి. వారు తాగే మద్యం నాణ్యమైన మద్యం కూడా కాదు. పక్క రాష్ట్రాల నుండి ప్రభుత్వాల అనుమతులు లేని చీప్ లిక్కర్, చౌకబారు మద్యంను సేవించే వారే ఈ కాయం కష్టం చేసే కూలీనాలీ జనాలు. ఈ వ్యసనం కొన్ని సంవత్సరాల తర్వాత నేరుగా ఊపిరితిత్తులు గాని, కిడ్నీలకు గాని, అన్నిటి కంటే ముఖ్యంగా గుండెకు కచ్చితంగా ఆటంకం కలిగిస్తుంది. అనారోగ్య ప్రమాదం ఏర్పడుతుంది.

బీడీ, సిగరెట్ అలవాటు ఉన్న వారి సంగతి ఇక చెప్పనవసరం లేదు. పట్టణ ప్రాంతాలలో ప్రస్తుతం విద్యావంతుల కొంతమంది వైద్య రంగం, కొన్ని రంగాలలో పని చేసే వారికి ఈ అలవాట్లు లేకపోవచ్చు. కానీ, ఇతర కూలీనాలీ పని చేసే వారికి మాత్రం తప్పనిసరిగా ఈ ధూమపానం అలవాటు ఉంటుంది. పల్లెటూర్లలో చెప్పనవసరం లేదు, ధూమపానం అలవాటు ఉన్నవారు 70 శాతం పైగానే ఉంటారు. ఇంతకు ముందు పొగాకును వీక్లీ మార్కెట్లలో కిలోల కొద్దీ కొనుగోలు చేసి చుట్టలు తాగేవారు. ఇప్పటికీ తంబాకు చుట్టా తాగే వారు పల్లెటూర్లలో ఇంకా ఉన్నారు. ఇక ధూమపానంలో లేటెస్ట్‌గా సిగరెట్లలో రోజుకో మోడల్, రోజుకు ఫ్యాషన్ లైట్ సిగరెట్లు, స్మార్ట్ సిగరెట్లు అంటూ రకరకాలుగా, పుట్ట గొడుగుల్లా సిగరెట్ కంపెనీలు పుట్టుకొస్తూ కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే యువకులను ఆకర్షించే విధంగా సిగిరెట్ పాకెట్లు వస్తున్నాయి. వీటిని నిషేధించే నాథుడే లేడు. కాలేజీకి వెళ్లే విద్యార్థి కూడా సిగరెట్లు తాగుతున్నాడు అంటే ధూమపానం ఏ స్థాయికి వెళ్లిందో ఆలోచించాలి.

వెనుకటి నుండి పనులు చేస్తూ మధ్యలో విశ్రాంతికి దిగినప్పుడు ఒక బీడీ తాగే పల్లెటూరి వ్యక్తి ఇప్పుడు బీడీ కట్టలు కట్టలు తాగుతూ కొద్దిగా పదిమంది ఉన్నచోట హోటల్లో చాయ్ తాగి సిగరెట్ కూడా అలవాటు పడుతూ పల్లెటూర్లలో చెప్పలేని విధంగా ధూమపానం నూటికి నూరు శాతం పెరిగిపోయింది. ఇలా అధిక ఈ ధూమపానం వల్ల శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర అవయవాలతో పాటు ప్రధానంగా గుండెకు రక్తప్రసరణ చేసే రక్తనాళాలను మూసివేసే ప్రమాదం ఉందని డాక్టర్లు గట్టిగా నొప్పి చెపుతున్నారు. చెడు అలవాట్లు లేని వారు, ఆరోగ్యం పట్ల అప్రమత్తం అనేవారు మాకు ఎటువంటి ధూమపానం, వంటి చెడు అలవాట్లు లేవు, మేము చిన్న చిన్న చిట్కాలతో మా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అప్రమత్తంగా ఉంటున్నాం. మాకు గుండెపోటు వంటి రోగాలు దరికి రావని ధీమాతో ప్రధానంగా పల్లెటూర్లలో జీవిస్తున్న వారు అధిక శాతం ఉన్నారు.

చెడు అలవాట్లు లేవు కానీ శరీరంలో కొలెస్ట్రాల్ (చెడు కొవ్వు) పెంచే పదార్థాలను భుజిస్తూనే ఉన్నారు, మాంసాహారులైతే రకరకాల మాంసాహార బిర్యానీలకు అలవాటు పడి అదే పనిగా బొక్కలతో తయారైన మంచినూనెతో చేసిన బిరియానీలు తింటూ శరీరంలో కొవ్వును పెంచుకుంటున్నారు. శాకాహారులకు, మరి మాంసాహార వ్యక్తులకు శరీరంలో మాంసంతో కొవ్వు పెరుగుతుందని అనుకుంటే మరి అసలు మాంసం అలవాటు లేని శాకాహారులకు శరీరంలో కొవ్వు పెరగడంపై కొంత మంది ఆశ్చర్యపోతున్నారు. కొవ్వు కేవలం మాంసంలోనే ఉండదు. మాంసకృత్తులు ఉండే శాకాహారాలలో కూడా మాంసకృతులతో శరీరంలోని కొవ్వు పెరిగి గుండెపోటు ప్రమాదాల అంచులకు వెళ్తున్నారు. ఎన్ని చెడు అలవాట్లు ఉన్నా, చెడు అలవాట్లు లేకున్నా శరీరం, అవయవాలు ఆరోగ్యాల పట్ల అశ్రద్ధ వహిస్తే మృత్యువాత పడకతప్పవని డాక్టర్లు చెబుతున్నారు.

ఎటు తిరిగి శరీరంలో కొవ్వును పెంచుకోకుండా జాగ్రత్తలు పాటిస్తే పని చేయని వారు రోజు జాగింగ్‌కు అలవాటైతే మన ఆరోగ్యాలను గుండె పోటు నుండి కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్షణం పాటు తీరని ఎవరు బిజీలో వారు, పక్కవారిని పలకరించడం కాదు కదా కుటుంబ సభ్యులతో సరిగా కలిసి జీవించలేని ఈ బిజీ బిజీ టెన్షన్ జీవనాలలో మన ఆరోగ్యాలను కాపాడుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని వైద్యులు అంటున్నారు. గత పది సంవత్సరాల క్రితం గుండె పోటు మృతులు అంతగా ఉండేవి కావని, ఈ నాలుగైదు సంవత్సరాల నుండి గుండె పోటులతో అధిక శాతం మృత్యువాత పడుతున్నారని వైద్యులు అంటున్నారు. కరోనాకు ముందు గుండెపోటుతో తక్కువ మంది మృతి చెందేవారని, కరోనా అనంతరం గుండెపోట్లతో మృతుల సంఖ్య పెరిగిందని, సర్వత్రా వైద్య విశ్లేషకులు, మేధావులు అంటున్నారు. అందుకే ఆరోగ్యం కాపాడుకోవడంలో అధిక శ్రద్ధ వహిస్తూ జాగ్రత్తగా జీవనాలు గడపాలని, గుండెపోటు పట్ల తస్మాత్ జాగ్రత్త అని కొందరు హెచ్చరిస్తున్నారు.

-నింగి సాయిలు

97012 08014

నగరమా.. నరకమా?

దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటింది. ప్రపంచంలో నివాసయోగ్యం కాని నగరం ఏదైనా ఉన్నదా అంటే దానికి సమాధానం ఢిల్లీ అని చెప్పవచ్చు. తీవ్రస్థాయిలో విషపూరిత పొగమంచు దేశ రాజధాని ఢిల్లీ మొత్తాన్ని కమ్మేసింది. దీంతో ఊపిరి పీల్చుకోవడానికి ఢిల్లీ తల్లడిల్లిపోతోంది. దేశ రాజధాని నరకంలా మారింది. ఢిల్లీ వరుసగా మూడో రోజూ వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. ఇవాళ వాయు నాణ్యత సూచీ 402 కి చేరింది. జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 506, సోనియా విహార్‌లో 462 కి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మితిమీరిన కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని నగరాన్ని నరకంగా మార్చేసిన వాయు కాలుష్యం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్‌ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ ప్రకటించింది. కాలుష్యం కేవలం ఢిల్లీకే పరిమితం కావడం లేదు. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గ్రేటర్ నోయిడా తదితర ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత దిగజారింది.

ఢిల్లీలో విష వాయువుల గాఢత ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితుల కంటే 50 రెట్లు ఎక్కువగా ఉండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం కారణంగా ఢిల్లీలో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, కంటి దురదతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో ఇలా కాలుష్య తీవ్రత పెరగడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీ- ఎన్‌సిఆర్ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గత దశాబ్ది కాలంగా ఇదే పరిస్థితి. ఢిల్లీ, యుపి, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో పంటలను తగులపెట్టడం వల్ల, అలాగే పరిశ్రమల నుండి వెలువడుతున్న విష వాయువుల వల్ల విపరీతమైన దుస్థితి ఏర్పడింది. ఈ పాపం నాది కాదు అంటే నాది కాదని రాష్ట్రాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న వాయు కాలుష్యం సోమవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 402, అలాగే రెస్పిరబుల్ పార్టీకు లెట్ మ్యాటర్ 380, నైట్రోజెన్ డయాక్సయిడ్ 32, సల్ఫర్ డయాక్సయిడ్ 13, ఓజోన్ 68, కార్బన్ మోనాక్సయిడ్ 21 గా ఉంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా వయోజనులు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఢిల్లీ సహా పరిసర ప్రాంత ప్రజలు గడపదాటి బయటకు రావాలంటే మాస్కు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది. కోరలు చాచిన వాయు కాలుష్యం ఈదుస్థితిని తీసుకొచ్చింది. చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో పీల్చే గాలి విషంగా మారుతున్నది. రుతుపవనాల తిరోగమనం అనంతరం ఉత్తరాదిన ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే, మానవ తప్పిదాలు ఈ వాయు కాలుష్యం స్థాయిలను మరింత పెంచి పీల్చే గాలిని విషతుల్యం చేస్తున్నాయి. ఢిల్లీ నగరంలోని వాహన ఉద్గారాలు తోడు పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హర్యానా రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడే పొగ శీతాకాలంలో సహజ సిద్ధంగా ఏర్పడే పొగమంచులో కలిసిపోయి ఊపిరి పీల్చుకోలేని ఉక్కిరిబిక్కిరి పరిస్థితి సృష్టిస్తున్నాయి. భవన నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే దుమ్ము, ధూళి అన్నీ కలగలిపి గాలి నాణ్యతను దారుణంగా దెబ్బ తీస్తున్నాయి.

పొల్యూషన్ మానిటరింగ్ మెకానిజం లేక ప్రజలకు కాలుష్యం దుష్ప్రభావాలు తెలియక తీవ్ర సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణి, వ్యవసాయానికి, మానవుని అభివృద్ధికి తోడ్పడుతుంది. వాయువులు, కణాలు, జీవ అణువులతో సహా హానికరమైన లేదా అధిక పరిమాణంలో ఉన్న పదార్థాలను భూమి వాతావరణంలోకి ప్రవేశపెట్టినప్పుడు వాయు కాలుష్యం సంభవిస్తుంది. ఇది మానవులకు వ్యాధులు, అలెర్జీలు, మరణానికి కారణం కావచ్చు. ఇది జంతువులు, ఆహార పంటలు వంటి ఇతర జీవులకు కూడా హాని కలిగించవచ్చు. సహజమైన లేదా నిర్మించిన వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. మానవ కార్యకలాపాలు, సహజ ప్రక్రియలు రెండూ వాయు కాలుష్యాన్ని సృష్టించగలవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, వాయు కాలుష్యం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8 మిలియన్ల మంది మరణాలకు కారణమైంది.

పరిశ్రమలు, రవాణా మొదలైన ప్రజల కార్యకలాపాల ద్వారా తయారైన విష పదార్థాలు సమాజాన్ని చుట్టే గాలిని కలుషితం చేస్తాయి. ప్రధాన కాలుష్య కారకాలు దహన, చెత్తను తగులబెట్టినప్పుడు రసాయన ప్రతిచర్యల వల్ల దుమ్ము, మసి, ఆటోమొబైల్ పెట్రోలియం వాహనాల ద్వారా ఎగ్జాస్ట్ గ్యాస్ వంటి సల్ఫరస్ వాయువులో ఉండే నత్రజని ఆక్సైడ్లు, కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని, ఆస్తిని, జంతువులు, మొక్కలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. సహజ పరిస్థితులు, క్షీణత, శ్వాసకోశ వ్యాధులు, శ్వాసనాళ ఆస్తమా వంటి వివిధ వ్యాధుల ప్రేరణ. వాయు కాలుష్యం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణమయ్యే పిఎం 2.5, పిఎం 0.5 వంటి చక్కటి రేణువుల హానికరమైన పదార్థాలను కలిగి ఉంది. ఎసిలు, రిఫ్రిజిరేటర్లు విపరీతంగా వాడడం వలన క్లోరోఫ్లోరో కార్బన్లు, ద్రావకాలు, రిఫ్రిజిరేటర్లకు ఉపయోగించే వాయువుల ద్వారా ఓజోన్ పొరను నాశనం చేసి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు సాంద్రత పెరగడం వల్ల గ్రీన్‌హౌస్ ప్రభావం వాతావరణంలో పర్యావరణ విధ్వంసం సమస్యగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

– డా. ముచ్చుకోట సురేష్ బాబు

– 99899 88912

వంతెనలపై రాజకీయ రగడ

నిజామాబాద్ జిల్లాలో ఏళ్ల తరబడిగా సాగుతున్న వంతెనల నిర్మాణాలు రాజకీయ రగడకు దారితీస్తున్నాయి. ఇద్దరు దిగ్గజ నేతలు ఒకరి మీద ఒకరు ఉరుముతున్నారు. నిజామాబాద్ నగర శివారులో రెండు వైపుల సాగుతున్న రెండు వంతెనల నిర్మాణాల్లో జాప్యం రెండు జాతీయ పార్టీల నేతల మధ్య రాజకీయ రచ్చకు తెరలేపాయి. ఈ వివాదం ఇప్పుడు ఎంపి అర్వింద్ వర్సెస్ పిసిసి చీఫ్ మహేశ్‌గా మారింది. వారం రోజుల గడువులో జిల్లా పర్యటనకు వచ్చిన ఈ ఇద్దరు నేతలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనే ఇద్దరి నేతల మధ్య మాట యుద్ధానికి దారి తీసినట్లయింది. పదిహేను రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వంతెనకు అవసరమైన నిధులు ఇవ్వకపోతే నిరాహార దీక్షకు దిగుతాననంటూ ఎంపి అర్వింద్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. నిజామాబాద్ శివారు ప్రాంతాలైన మాధవనగర్, ఆర్సపల్లిలో రైల్వేట్రాక్‌లపై రెండు వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే నిధులు మంజూరు చేసింది. కానీ ఇందులో రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు కూడా అనివార్యం కావడం వంతెనల నిర్మాణానికి శాపంగా మారింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలోనే వంతెనలు ప్రారంభమయ్యాయి.

పనులు మొదలైనప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు క్లియర్ కావడంలో పేచి మొదలైంది. దీంతో గుత్తేదారు తరచూ పనులను నిలిపివేస్తూ వచ్చారు. సహజంగానే నిర్మాణం జరుగుతున్న పనుల జాప్యంపై ప్రజల్లో అసహనం వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎంపి అర్వింద్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ఈ వంతెనలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయించారు. ఆ తర్వాత కథ షారా మామూలైంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు మంజూరు చేయడం లేదంటూ బిజెపి నేతలు గత పది రోజుల క్రితమే మాధవనగర్ వంతెన వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వ మొండి వైఖరిని బిజెపి నేతలు ఎండగట్టారు. వారం రోజుల గడువులోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజామాబాద్ నగరానికి వచ్చారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తల్లి దినకర్మకు వచ్చిన సిఎం రేవంత్‌రెడ్డి కలవడానికి బిజెపి ఎంఎల్‌ఎ ఏకంగా రోడ్డు మీదే బైఠాయించారు.

చివరికి రేవంత్ కలిసి ఇదే విషయమై వినతి పత్రం ఇచ్చారు. బిజెపి నేతలు బైఠాయించిన ఘటనపై మరుసటి రోజు పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్ ఘాటుగా స్పందించారు. అర్వింద్‌ను టార్గెట్ చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెంటనే ఇప్పించాలన్నారు. ఈ మేరకు ఆయన సంబంధిత అధికారులతోనూ వంతెన పనుల పురోగతిని ఆరా తీశారు. రెండు రోజుల తర్వాత జిల్లాకు వచ్చిన ఎంపి అర్వింద్ సైతం మహేశ్ వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మాధవనగర్ ఒక్కటే కాదు జిల్లా లో కేంద్రం వాటా నిధులు మంజూరు అయినా పనులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వడంలో ఎలా జాప్యం చేస్తుందో ఏకరువు పెట్టారు. మాధవనగర్ వంతెన పనులు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఆగిపోయాయని పది రోజుల్లో నిధులు ఇవ్వకపోతే ఎంపిగా తానే నిరాహార దీక్షకు దిగుతానని అర్వింద్ అల్టిమేటం ఇచ్చారు.

అసలు తాను ఇప్పటి దాకా ఎప్పుడు దీక్ష చేయలేదని కానీ వంతెన నిధులకు తప్పడం లేదని చెప్పారు. అర్వింద్ ఎదురు దాడికి ఇంకా కాంగ్రెస్ నుంచి ఎలాంటి కౌంటర్ మాత్రం రాలేదు. మాధవనగర్ రైల్వేట్రాక్ వద్ద వంతెన పనులు ఏళ్ల తరబడిగా సాగుతుండడంతో రోజు హైదరాబాద్ వైపు వెళ్లే వేలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఎంపి అవ్వకముందే అర్వింద్ మాధవనగర్ వద్ద రైల్వే వంతెన డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆయన ఎంపి అవ్వగానే ఆరు నెలలోనే నిధులు మంజూరు చేయించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం మెలికపెట్టింది. దీనితో అప్పటి నుంచే ఈ వంతెన రాజకీయ రచ్చకు వేదిక అయింది. ఆర్ అండ్‌బి మంత్రి ప్రశాంత్‌రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తే అయినా వంతెన ఖ్యాతి అర్వింద్ రాకుండా సర్వశక్తులు ఒడ్డారు.

కానీ అప్పట్లోను అర్వింద్ మరోసారి ఈ నిధుల కోసం రోడ్డెక్కడానికి సిద్ధం అయ్యారు. దీనితో ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. కానీ టెండర్ల ప్రక్రియ దాటుకొని పనులు మొదలు కావడంలో నెలల తరబడి జాప్యం జరిగింది. పనులే ఆలస్యంగా మొదలు పెట్టించిన సర్కార్ గుత్తేదారుకు నిర్ణీత కాలంలో బిల్లులు క్లియర్ చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎంపి అర్వింద్ నేరుగా సిఎం రేవంత్‌ను కలిసి గుత్తేదారుకు పెండింగ్ ఉన్న బిల్లులు క్లియర్ చేయించారు. దీనితో ఆరు నెలలు పనులు శరవేగంగా సాగాయి. ఆ తర్వాత కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఆరు కోట్ల రూపాయల మేరకు బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు వేగంగా మంజూరు చేస్తూ పనులు చేయిస్తే కేంద్రం కూడా నిర్ణీత గడువులోనే నిధులు మంజూరు చేస్తుందని అర్వింద్ చెప్తున్న మాట. కానీ కేంద్రం ఇవ్వాల్సిన ఫండ్‌ను ఇవ్వకపోవడం వల్లే పనులు ఆలస్యం అవుతున్నాయనేది అధికార పార్టీ నేతలు అంటున్నారు. మొత్తానికి ఈ వివాదం రాజకీయ రగడగా మారింది. అర్వింద్ అల్టిమేటం ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనన్నదే ఆసక్తిగా మారింది.

– ఎ. రామకృష్ణ ప్రసాద్

94410 41433

(నిజామాబాద్ బ్యూరో) 

లద్దాఖ్ ఉద్యమంపై నిఘా ఎందుకు?

లద్దాఖ్ స్వయం ప్రతిపత్తి కోసం గత కొన్నేళ్లుగా ప్రజా పోరాటాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటంలో కీలక పాత్ర వహించిన ఉద్యమ నేతలను జాతీయ భద్రత నెపంతో అక్రమంగా కేసులు బనాయించి నిర్బంధించడం తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది. ఈ ఆందోళనలు సెప్టెంబర్ 24న హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. ఈ హింసాకాండకు పర్యావరణ ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్ సూత్రధారి అన్న ఆరోపణలతో అరెస్టు చేసి రాజస్థాన్ లోని జోథ్‌పూర్ జైలులో నిర్బంధించారు. అంతేకాదు ఆయన భార్య గీతాంజలి ఆంగ్‌మోపై కూడా తీవ్ర నిఘా కొనసాగిస్తుండడం కేంద్ర ప్రభుత్వ దమననీతికి తార్కాణం. ఆమెకు వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా, ఎక్కడికీ వెళ్లనీయకుండా దర్యాప్తు సంస్థలు నీడలా వెంటాడుతున్నాయి.

జోథ్‌పూర్ జైలులో ఉన్న తన భర్త వాంగ్‌చుక్‌ను కలుసుకోవడానికి ఆమె వెళ్లినప్పుడల్లా లేనిపోని ఇబ్బందులను సృష్టించడం పరిపాటిగా సాగుతోంది. అక్టోబర్ 7, 11 తేదీల్లో జోథ్‌పూర్ వెళ్లినప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) అధికారులు, రాజస్థాన్ పోలీసులు ఏ విధంగా నిబంధనల చట్రంలో ఇరికించారో, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలా ఆటంకం కలిగించారో అఫిడవిట్ ద్వారా సుప్రీం కోర్టుకు విన్నవించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విమానాశ్రయం నుంచి తాను బయటకు రాగానే దర్యాప్తు అధికారులు నేరుగా తనను తమ కారులో జైలు సూపరింటెండెంట్ ఆఫీసుకు తీసుకెళ్లారని, ఆ కారు కిటికీలకు తెల్లటి తెరలు కప్పి ఉంచారని ఆరోపించారు. తన భర్తతో మాట్లాడుతున్నంత సేపు ఇద్దరు ఆఫీసర్లు అక్కడే కూర్చుని అంతా ఆలకిస్తుంటారని ఇలా ప్రతిసారీ జరుగుతోందని ఆమె ఆరోపించారు.

తాను భర్తతో ఏం మాట్లాడుతున్నానో ఎవరికీ తెలియకుండా గోప్యత పాటించవలసిన తమ హక్కుకు విరుద్ధంగా వారు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అని ఆమె ప్రశ్నించారు. ఈ చర్యలన్నీ ఆర్టికల్ 19 (స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ హక్కు), ఆర్టికల్ 21 (వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు) లను ఉల్లంఘించడమే అవుతుందని ఆమె సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేశారు. జోథ్‌పూర్‌లో తాను ఎవరినీ కలియనీయకుండా నేరుగా రైల్వేస్టేషన్‌కు తీసుకు వచ్చి, రైలెక్కించడం దగ్గరనుంచి వచ్చే స్టేషన్ వరకు ఎస్కార్ట్ ఉంటోందని ఆమె ఆరోపించారు. ఢిల్లీలో తన బస నుంచి ఎక్కడకు వెళ్లినా కారు వెంబడిస్తుందని, దాంతోపాటు మోటారు సైకిల్‌తో మరొకరు అనుసరిస్తుంటారని ఈ విధంగా నిఘా వెంటాడడం ఎంతవరకు న్యాయం? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఓ భారతీయ స్వేచ్ఛా పౌరురాలిగా నాకు నచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు జోథ్‌పూర్‌కు వెళ్లే హక్కు నాకుంది.

రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా నా భర్తను కలుసుకునే హక్కుంది. తాను ఉగ్రవాదినా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే గీతాంజలి ఆంగ్‌మో ఆరోపణలన్నిటినీ యథాప్రకారం నిరాధారమైనవిగా లదాఖ్ కేంద్ర ప్రాంత హోమ్ డిపార్ట్‌మెంట్, కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతున్నాయి. పర్యావరణ ఉద్యమనేత సోనమ్ వాంగుచుక్‌ను అరెస్టు చేయడం సరిహద్దులో అత్యంత సున్నితమైన రీజియన్ లద్దాఖ్‌లో పరిస్థితి మరింత క్షీణించడానికి దారి తీస్తోంది. రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్‌ను అనుసంధానించి లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రభుత్వ హోదా కల్పించాలన్న డిమాండ్లతో లద్దాఖ్ లోని పౌర సంఘాలు సాగిస్తున్న ఆందోళనలకు వాంగ్‌చుక్ ప్రధాన కారకుడని కేంద్రం వాదిస్తోంది. వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడానికి కేంద్రం ఉపక్రమించడం ఏమంత తెలివైన పని కాదని, వాస్తవాలకు విరుద్ధం గా ఉంటోందని తెలుస్తోంది. లేహ్ లోని స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (సెక్మోల్)పై దర్యాప్తులు సాగిస్తున్నారు.

ఆ స్కూల్‌కు వాంగ్‌చుక్ సహ సంస్థాపకులు అయినప్పటికీ, ఆ సంస్థ యాజమాన్యంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్రం ఆ సంస్థకు సంబంధించిన ఎఫ్‌సిఆర్‌ఎ (ఫారెన్ కంట్రిబ్యూషన్ చట్టం) లైసెన్సును రద్దు చేసింది. పూర్వపు జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చిన వారిలో వాంగ్‌చుక్ ఒకరు. దీనివల్ల లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా వస్తుందని, రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్‌ను చేర్చడం వల్ల లద్దాఖ్ సహజ సంస్కృతి, వారసత్వాలకు రక్షణ కలుగుతుందని వాంగ్‌చుక్ ఆశించారు. కనీసం ఆరో షెడ్యూల్‌నైనా కల్పిస్తామని బిజెపి ప్రభుత్వం బహిరంగంగా హామీ ఇచ్చింది.

కానీ కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ను విభజించిన తరువాత జరిగిన పరిణామాలు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక పద్ధతులను అవలంబించడానికి దారి తీశాయి. స్థానిక జనాభాను దూరం చేస్తున్నారన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీంతో కేంద్రం తాత్కాలిక ఒప్పందానికి వచ్చి గత మే 27న ఆయా గ్రూపులతో చర్చలు ప్రారంభించినా అస్పష్టమైన కారణాలు బయటపడ్డాయి.కేంద్రంపై అసమ్మతి వర్గాల అపనమ్మకం స్పష్టమైంది. వాంగుచుక్ జోథ్‌పూర్ జైలులో ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చర్చలు కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. అక్టోబర్ 22న కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. లద్దాఖ్ ప్రతినిధులైన లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఎబి), కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ (కెడిఎ) పాల్గొన్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ సహా అరెస్టు అయిన ముఖ్యమైన నాయకులను వెంటనే విడుదల చేయాలని లద్దాఖ్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఈ చర్చలు ఇంకా ఎటూ తేలలేదు. మరోసారి చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. 

గాజా వలె కాదు ఉక్రెయిన్

గాజా యుద్ధం “ముగిసిపోయిం”దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారో లేదో, ఇక ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ముగింప జేయగలరని భావించారు పలువురు. ఆ మేరకు పాశ్చాత్య మీడియాలో కొన్ని వ్యాఖ్యానాలు కూడా వెలువడ్డాయి. ఒక యుద్ధం ఆగినపుడు ఆ వాతావరణంలో ఇటువంటి ఆలోచనలు కలగటం సహజం. పైగా, ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఎప్పుడు ఏ దేశాధినేత చేయని విధంగా బహిరంగంగా, తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్న రోజులవి. చివరకు తనకు ఆ బహుమతి రాకపోవటం ఒకటి కాగా, అసలు గాజా యుద్ధం నిజంగా ఆగినట్లేనా అనే సందేహాలు ఏర్పడటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. గాజా అన్నది కేవలం గాజా ప్రాంతానికి పరిమితమైన ప్రశ్న కాదు. గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్‌ను కూడా కలుపుకొన్న విస్తృతమైన పాలస్తీనా విషయమది.

ఇజ్రాయెల్ హమాస్ మధ్య తీవ్రమైన సాయుధ ఘర్షణలు గాజాలో జరిగినందున చర్చ అంతా గాజా గురించి జరిగింది. అమెరికా అధ్యక్షుని 20 అంశాల ప్రాతిపదికగా జరిగింది కాల్పుల విరమణే తప్ప యుద్ధ విరమణ కాదు. అయినప్పటికీ పాశ్చాత్య మీడియా ఆ విధంగా ప్రచారం చేసింది. అదట్లుంచి, ఆ 20 అంశాల ప్రణాళిక అయినా సమస్యకు చిరకాల పరిష్కారం చూపగలది కాదు. ఆ అంశాలను ఒక్కొక్కటిగా, జాగ్రత్తగా పరిశీలించినపుడు, వాటిలో చిక్కులమారివి అనేకం కనిపిస్తాయి. ప్రస్తుత కాల్పుల విరమణ అన్నది తాత్కాలికమైన తొలి దశ కాగా, దాని అమలు అయినా ఎంత సజావుగా జరగవచ్చుననే సందేహాలు వెంటనే తలెత్తాయి. అందుకు తగినట్లే ఇజ్రాయెల్ తమ బందీలను విడుదల చేయించుకున్నదో లేదో గాజాపై ఏదో ఒక సాకు చెప్తూ తిరిగి దాడులు ఆరంభించింది. సహాయ సరఫరాలకు ఆటంకాలు కల్పించటం మొదలు పెట్టింది. తాము, ఇజ్రాయెల్ కలిసి హమాస్‌ను నాశనం చేయగలమంటూ బెదిరింపులు జారీ చేయటం ఆరంభించారు ట్రంప్.

పరిస్థితి మామూలు అంశాలలోనే, కొద్ది వారాలలోనే ఈ విధంగా పరిణమిస్తున్నపుడు, 20 అంశాల ప్రణాళికలో గల కీలక అంశాల అమలు దశకు వెళ్లినపుడు ఏమి జరగవచ్చుననే భయాలు కలుగుతున్నాయి. ఆ కీలక అంశాలలో బయటి వారితో తాత్కాలిక పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు, తాత్కాలిక శాంతి భద్రతల వ్యవస్థ ఏర్పాటు, గాజా అభివృద్ధికి బయటివారే ప్రణాళిక రచనచేసి అమలు పరచటం వంటివి ఉన్నాయి. ఇక సమస్య అంతటికీ మౌలిక అంశమైన స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు సంబంధించి గల మాటలను గమనిస్తే, అసలు ఆ ఉద్దేశమైనా ఉందా లేదా అనిపిస్తుంది. పాలస్తీనా ఏర్పాటుకు ఎంత మాత్రం అంగీకరించేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూనే నేటికీ ప్రకటిస్తుండటం, ఆ విషయమై ట్రంప్ మౌనాన్ని గమనించినపుడు ఎవరికీ అసలా నమ్మకమే ఏర్పడటం లేదు. ఇదంతా చూసినపుడు, అమెరికా ఇజ్రాయెల్‌ల ఉమ్మడి ప్రణాళిక గాజాను, వెస్ట్ బ్యాంక్‌ను క్రమంగా స్వాధీనపరచుకుని, నెతన్యాహూ అంటున్నట్లు గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పాటు చేయటమనే అభిప్రాయం కలుగుతుంది. అందువల్ల, గాజాలో జరిగింది యుద్ధ విరమణ కాదు గదా కనీసం కాల్పుల విరమణ అని కూడా నిజమైన అర్థంలో అనలేము. ఇక రాగల రోజులలో ఏమి జరగవచ్చునన్నది వేచి చూడవలసిందే.

ఇదంతా అట్లుంచితే, అమెరికా శిబిరపు దృక్కోణం నుంచి చూసినపుడు గాజా, ఉక్రెయిన్ పరిస్థితుల మధ్య పోలికలు, తేడాలు రెండూ కనిపిస్తాయి. ఆ శిబిరపు సామ్రాజ్యవాద ప్రయోజనాల దృష్టా వ్యూహాత్మక అంశాలు రెండు చోట్లా ఉన్నాయి. పాలస్తీనా అన్నది పశ్చిమాసియాలో మధ్యధరా సముద్ర తీరాన ఉంది. భౌగోళిక వ్యూహాల రీత్యా అది కీలక ప్రదేశం. అదిగాక ఆ ప్రాంతమంతటా అపారమైన ఇంధన నిక్షేపాలున్నాయి. యూరప్‌ను ఆఫ్రికా, ఆసియాలలో అనుసంధానం చేసే సూయెజ్ కాల్వ ఉంది. కనుకనే బ్రిటిష్ వలస రాజ్యం అక్కడ తమ పాగా వేసేందుకు ఇజ్రాయెల్‌ను సృష్టించింది. అమెరికా సామ్రాజ్యవాదం, యూరప్‌లు అందుకు జత చేరాయి. అప్పటి నుంచి పాలస్తీనాను ప్రత్యక్షంగా, ఆ ప్రాంతంలోని అనేక అరబ్ రాజ్యాలను పరోక్షంగా తమ చెప్పుచేతలలో ఉంచుకుంటూ వస్తున్నాయి. అక్కడి వారికి కొరకరాని కొయ్యగా మిగిలింది ఇరాన్ ఒక్కటే. దానితోపాటు వివిధ తిరుగుబాటుదార్ల సంస్థలు.

ఈ నేపథ్యాన్నంతా చూసినపుడు అమెరికన్ శిబిరానికి గాజాగాని, వెస్ట్ బ్యాంక్ గాని వ్యూహాత్మకంగా ఎంత కీలకమైనవో గ్రహించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో హమాస్ రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌పై జరిపిన ఆకస్మిక దాడి యావత్ అమెరికన్ శిబిరాన్ని, దానికి అనుబంధంగా మారిన అరబ్ రాజ్యాలను పెద్ద కుదుపు కుదిపింది. ఈజిప్టు ఒకప్పటి అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాసర్ కాలంలో ఉండిన పాన్ అరబిజం ఆయన మరణం తర్వాత సమసిపోగా, ఆ తర్వాత నుంచి అమెరికాను అనుకూలంగా మారిన అరబ్ రాజ్యాలు తద్వారా ఇజ్రాయెల్‌తో మైత్రీ సంబంధాలు ఏర్పరచుకోసాగాయి. కొందరు ఆ పని చేసి, మరికొందరు కూడా చేయనుండగా చోట చేసుకున్న హమాస్ దాడితో వారు వెనుకడుగు వేయవలసి వచ్చింది.

గాజాపై ఇజ్రాయెల్ మారణకాండ ఐక్యరాజ్య సమితి సహా వివిధ అంతర్జాతీయ సంస్థలలో, ప్రపంచ దేశాలలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొనగా, ఆ స్థితి నుంచి బయటపడటం అమెరికా శిబిరానికి అవరసమైంది. దానితో, పాలస్తీనా దేశం ఏర్పాటు ఉద్దేశమైతే ఇప్పటికీ లేదు గాని, ఏదో ఒక విధంగా ప్రస్తుత క్లిష్ట స్థితిని తప్పించుకోజూసారు. ఆ విధంగా, 20 అంశాల ప్రణాళిక పేరిట మభ్యపెట్టే పథకం ఒకటి తయారు చేసారు. ఇక్కడ గుర్తించవలసింది ఏమంటే, గాజా ఒక చిన్న ప్రాంతం, హమాస్ ఒక పరిమిత శక్తి, అరబ్ రాజ్యాలకు చిత్తశుద్ధి లేకపోవటం అనే వాటిని అనువుగా చేసుకుని అమెరికా తన జిత్తులమారి వ్యూహాన్ని అమలుకు తేగలిగింది. ఆ విధంగా మొత్తం పశ్చిమాసియాలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను నిలబెట్టుకోగలుగుతున్నది. ఆ పని తేలికగానూ జరుగుతున్నది.

కాని ఉక్రెయిన్ పరిస్థితి అటువంటిది ఎంత మాత్రం కాదు. పాశ్చాత్య ప్రయోజనాల రీత్యా ఉక్రెయిన్ కీలక స్థానం తక్కువ అనలేము. ఇంకా చెప్పాలంటే పశ్చిమాసియా కన్న ఎక్కువ. ఎందుకంటే అక్కడికి పొరుగున తమ పోటీదారులు, బద్ధశత్రువులు, దీర్ఘకాలిక సవాలుగా నిలిచేవి అయిన రష్యా, చైనాలున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా ప్రపంచాధిపత్యానికే సవాలు అన్నదగ్గవి లేవు. కాని ఉక్రెయిన్‌కు తూర్పున రష్యా, చైనాలు ఉన్నాయి. అందువల్ల ఆ సవాలు అతి తీవ్రమైనది. ఉక్రెయిన్ సమస్య గాజా వంటిది కాదనటం అందువల్లనే.

గాజాకు, వెస్ట్ బ్యాంక్‌కు భిన్నంగా రష్యా, చైనాలు అతి విశాలమైనవి. మహా శక్తివంతమైనవి. ఆ రెండింటి నాయకత్వాలు పటిష్టమైనవి. రష్యాతో పోల్చితే ఉక్రెయిన్ బలం ఎందుకూ కొరగాదు. అమెరికా, యూరోపియన్ యూనియన్‌ల ఆయుధ, ఆర్థిక సహాయాలు ఉండి కూడా నిలవలేకపోతున్నది. భూభాగాలను క్రమంగా కోల్పోతుండగా సైన్యాన్ని నష్టపడుతున్నది. అమెరికా, యూరప్‌తోడు నిలవకపోతే ఎన్నడో ఓడిపోయేది. రష్యాపై అమెరికా, యూరప్‌లు వందలాది ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు విధించినా ఫలితం ఉండటం లేదు.

ఇతరత్రా ఏ హెచ్చరికలూ పనిచేయటం లేదు. ఉక్రెయిన్‌ను మరింత ఆధునికమైన ఆయుధాలు ఇవ్వగలమని పాశ్చాత్య దేశాలు ప్రకటించినపుడల్లా రష్యా సరికొత్త ఆయుధాలను రంగంలోకి తెచ్చి ప్రయోగిస్తున్నది. అణ్వస్త్రాలను ఉపయోగించే ఉద్దేశమైతే లేదు గాని, అవసరమైతే ఆ పని చేయగలమని పలుమార్లు హెచ్చరించింది. అందుకు అనుగుణంగా తమ అణ్వస్త్ర ప్రయోగ విధానాన్ని ఇప్పటికే సవరించింది కూడా. గత విధానం ప్రకారం, ఒకవేళ శత్రువు దాడి తన ‘ఉనికికే’ ముప్పు కలిగించినట్లయితే ఆత్మరక్షణ కోసం అణ్వస్త్రాలు ఉపయోగిస్తారు. సవరించిన విధానం ప్రకారం ఒకవేళ తమ ‘సార్వభౌమత్వానికి, భౌగోళిక సమగ్రతకు.. తీవ్రమైన ప్రమాదం’ కలిగితే ఉపయోగిస్తారు. బైడెన్ అధ్యక్షునిగా ఉన్నపుడు ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేసే ప్రతిపాదన చేయగా పుతిన్ తమ విధానాన్ని ఆ విధంగా మార్చారు. దానితో బైడెన్ క్షిపణులు ఆగిపోయాయి. అదే విధంగా ట్రంప్ గత వారం సరఫరా చేయగలమన్న తొమాహాక్ క్షిపణులు.

ఇటువంటివి అనేకం పరిగణనలోకి తీసుకున్నందువల్లనే, ఉక్రెయిన్ సమస్య గాజా వంటిది కాదని అనవలసి వస్తున్నది. అమెరికా శిబిరం ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎంత భయపెట్ట జూసినా, ఉక్రెయిన్‌కు సహాయపడుతూ యుద్ధాన్ని ఎంతకాలం కొనసాగించినా, హమాస్ వలె రష్యాను ఏదో ఒక ఉపాయంతో లొంగదీయటం అసంభవం. ఇది గత మూడేళ్ల యుద్ధకాలంలో ఉక్రెయిన్, అమెరికా, యూరప్‌లకు బాగా బోధపడిన విషయమే, అందువల్ల ఆ శిబిరం వాస్తవాలను అంగీకరిస్తూ రష్యాతో రాజీపడటం మినహా గత్యంతరం లేదు. విచిత్రమేమంటే ఈ మాట ట్రంప్‌కు సరిగానే అర్థమైంది. భేషజాలకు పోతున్నది ఉక్రెయిన్, వారి యూరోపియన్ మిత్రులే.  

– టంకశాల అశోక్ (దూరదృష్టి) 

– రచయిత సీనియర్ సంపాదకులు

దళపతులుగా దళితులు ఎదగాలి

దేశంలో జరుగుతున్న పరిణామాలు, రోజు రోజుకు పెరుగుతున్న దాడులు, అణగారినవర్గాలను అణగాదొక్కే ప్రయత్నాలు, అమాయక బహుజనులపై రాక్షసతత్వం నాటి కన్నా నేడే ఎక్కువగా కనబడుతున్నది. డా. అంబేద్కర్ కాలంలో అంటరానితనం, కులవివక్ష లాంటి మానసిక దాడులుండేవి. నేటి స్వాత్రంత్య్ర భారతంలో వాటితోపాటు భౌతిక దాడులనూ చూస్తున్నాం. దేశంలో ప్రతి రోజు సాధారణ దళిత ప్రజలపై ఎక్కడోచోట ఏదో ఘటన నమోదవుతున్నది. ఇప్పుడు ముఖ్యవ్యక్తులపై దాడులతో ఆధిపత్య కులాల అధిపత్యాన్నిచాటే సంఘటనలు చూడాల్సిన దౌర్భాగ్యం నెలకొన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూటుదాడి, ఐపిఎస్ పురాన్ కుమార్ కులవివక్ష ఘటనలు ఇలా అనేక ఘటనలు ఒక ట్రెండ్‌గా మారుతున్నాయి. దళితుల ప్రాణాలకు రక్షణ లేదు, దళిత బాలికల, మహిళలపై లైంగిక హింసలు, వారి మానవ విలువలకు లెక్కే లేకుండా పోతుంది.

అందుకే దళితశక్తి దళపతి రూపం దాల్చాలి. బాబా సాహెబ్ మార్గంలో నడిచే విద్యావంతులు, మేధావులు నాయకులుగా తయారవ్వాలి. మానవులను జంతువులుగా చూసే క్రూరమృగాలను రూపుమాపి, మానవత్వమే అసలైన మతం అని చాటి చెప్పి శాంతి మార్గంలో నడిపించే దళపతులుగా ఎదగాలి. ఆనాడు దళితుల హక్కులకై, అసమానతలపై, కులవివక్షకు వ్యతిరేకంగా సుదీర్గ కాలం పాటు పోరాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ నేడు లేరు. నేడు కుల వివక్ష దారుణాలు విచ్చలవిడిగా పెరిగిపోయిన దారుణాలు చూస్తుం టే నాయకత్వ పటిగల అభినవ అంబేద్కరులు ప్రతిచోట పుట్టాలని దళిత వర్గం ఎదురు చూస్తున్నది. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలిలో ఒక దళిత యువకుడిని మూకుమ్మడిగా కొట్టి చంపిన వీడియో వైరల్ అవడంతో ఆ రాష్ట్రం మొత్తం అట్టుడుకిపోయింది.

ఇలా చెప్పుకుంటూపొతే దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. దళితులు వేరే కులం వారితో పెళ్లి చేసుకున్న సంఘటనల్లో అబ్బాయి, అమ్మాయి అనే తేడా చూడకుండా బట్టలూడదీసి, గుండు గీయించి దాడిచేసే అఘాయిత్యాలను, కొన్ని వికృత చేష్టలను చూస్తే ఒళ్ళు జుగుప్సాకరంగా మారుతుంది. 2022లో మధ్యప్రదేశ్ లో దళిత దంపతులను కొడుకుతో సహా కాల్చి చంపారు. 2025 ఆగస్టులో తమిళనాడులో దళిత పాఠశాల విద్యార్ధిపై మరో వర్గ ముగ్గురు విద్యార్థులు కలిసి కేవలం కుల కారణంగా కత్తులతో దాడి చేయడం దిగ్భ్రాంతికర విషయం. నిన్నగాక మొన్న అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 16 ఏళ్ల దళిత బాలిక అయిదుగురి చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురికావడం ఆమె కుటుంబంలో రక్తం మరిగేలా చేసిందేమో కానీ సమాజంలో కొందరికి చీమకుట్టినంత బాధకూడా కలగక పోవచ్చు! మరో సంఘటనలో మధ్యప్రదేశ్‌లో (2025 మార్చి నెల) ఓ దళిత వరుడు పెళ్ళికి గుర్రంపై వెళ్లినందుకు రాళ్ళతో కొట్టి చంపారు.

మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి వేడుకలలో శబ్దం పెంచి డిజె పాటలు పెట్టారని ఒకేసారి 40 మంది దాడి చేసి రాళ్ళతో కర్రెలతో దాడులు చేసి పెళ్ళి జరగకుండా ఊర్లోకి రానివ్వలేదు. ఇలా చెప్పుకుంటూపోతే వందల వేల ఉదాహరణలు దేశంలో ప్రతి రాష్ట్రం లో చోటు చేసుకుంటున్నాయి. దళితులపైన జరుగుతున్న అఘాయిత్యాలపైన దేశంమొత్తంలో నమోదైన అట్రాసిటీ కేసులు చూసినట్లయితే 2020లో 50 వేలు, 2021లో 50,744, 2022లో 57428 నమోదైనట్లు అధికారిక నివేదికలు స్పష్టంగా ఉన్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో అధికంగా, తర్వాత స్థానాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలున్నాయి. ఇలా ప్రతి రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతూనే ఉంది. మరీ వీటిని ఆపేదెవారు? ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత రక్షణ కల్పించినప్పటికీ రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు! దళితులతోపాటు మైనారిటీలపైనా దాడులు జరుగుతున్నాయి. వీటిని ఆపేదెవరు, పరిష్కారం ఎక్కడ? దేశం శాంతి మార్గంలో నడిచేదెప్పుడు, కుల మతాల మంటలు ఆరేదెప్పుడు.? ముందుకు వచ్చే నాయకులెవ్వరు? దళితుల కోసం, పీడిత వర్గాల కోసం పోరాటం చేయడానికి ‘చేగువేరా’ జార్జిరెడ్డి లాంటి నాయకులు మళ్ళీ ఎప్పుడు పుడుతారో అని ఎదురు చూస్తుందీ సమాజం.!

– సయ్యద్ జబి, 9949303079

విషాదాలతో వెలవెలబోయిన దీపావళి

అక్టోబర్ 20న సాయంత్రం భారతదేశం అంతటా దీపావళి వెలుగులు విరజిమ్ముతుండగా, ఆనందాల పండుగ మరో సారి పొగ కమ్ముకుంది. చాలా కాలంగా వేడుగలకు ప్రతీకగా నిలుస్తున్న టపాకాయలు, బాణాసంచా, ఆరోగ్యం, పర్యావరణం, ఎన్నికల అవకాశవాదంపై జాతీయ చర్చలలో కేంద్రాలుగా మారాయి. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఎఒఐ) ప్రతిదినం ప్రమాదకర స్థాయిని దాటి హెచ్చుతోంది. సుప్రీం కోర్టు నిర్ణీత గంటల్లో పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్లను అమ్మకాలను అనుమతించడం వల్ల నిబంధనలు అమలు క్లిష్టంగా మారింది. అసోంలో సంబరాలు లేవు. రాష్ట్రం విషాదంలో మునిగిపోయింది. గాయకుడు జుబీన్ గార్గ్ మృతికి ప్రజలు సామూహిక సంతాపం ప్రకటించడంతో ఈ ఏడాది దీపావళికి బాణాసంచా కాల్చరాదని ప్రతినబూనారు. ఈ పండుగ కేవలం టపాసులు కాల్చడానికే పరిమితం కాలేదు. మతపరమైన సానుకూలతకోసం ఉపయోగించుకునే రాజకీయాలు, దీర్ఘకాలిక మనుగడ కంటే స్వల్పకాలిక ఆర్థిక లాభాలకు కక్కుర్తిపడే వారి అంతరాలను బహిర్గతం చేసే యుద్ధభూమిగా మారింది.

ఢిల్లీలో విషపూరిత దీపావళి, బిజెపి పాలనకు సవాల్ ఢిల్లీ వాయు కాలుష్య సంక్షోభం ఏటా భయంకరమైన ఓ బెడద. శీతాకాలం దగ్గరపడేకొద్దీ కమ్మేసే పొగమంచు, పొరుగు రాష్ట్రాల నుంచి కాల్చే చెత్త, వ్యవసాయ వ్యర్థాలవల్ల వెలువడే పొగ, పారిశ్రామిక ఉద్గారాలు, వీటికితోడు బాణాసంచాల ద్వారా పెరిగే విషపూరిత మిశ్రమాలు వేలాదిమంది ఉసురును తీస్తోంది. ప్రతి ఏడాది దీపావళి సీజన్‌లో శ్వాసకోశ వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆస్పత్రుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. సుప్రీంకోర్టు అక్టోబర్ 2025లో ఇచ్చిన ఆదేశం ప్రకారం దీపావళి నాడు సాయంత్రం 6-9 గంటల మధ్య కొన్ని ప్రదేశాల్లో రాత్రి -10 గంటల వరకూ పర్యావరణ అనుకూల (కాలుష్యం తగ్గించే) గ్రీన్ క్రాకర్లను మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంది.

జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) వెలుపల పూర్తిగా విషేధాన్ని విధిస్తుంది. ఇది బాణాసంచాపై పూర్తి నిషేధం కాదు. జాగ్రత్తలతో కూడిన ఆదేశం. అమ్మకాలు అధికార అవుట్‌లెట్‌లకే పరిమితం చేశారు. బాణాసంచా కాల్చుకునే సమయాన్ని పరిమితం చేశారు. అమలు బాధ్యత ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులపై ఉంటుంది. దీనికి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు మద్దతు ఇస్తుంది. అయినా, 2025 ఫిబ్రవరిలో రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన బిజెపి నేతృత్వంలోని పాలనా యంత్రాంగంపై పెద్ద బాధ్యతే ఉంది. 1998 తర్వాత ఢిల్లీలో బిజెపి తొలిసారి అధికార పగ్గాలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంతో డబుల్ ఇంజన్ హామీతో ముందుకు వచ్చింది. కానీ, కాలుష్య నియంత్రణ చర్యలపై ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటోంది. జాతీయ ట్రాక్ రికార్డు తరచు ప్రజారోగ్యం కంటే, పారిశ్రామిక వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే విధానమే ఇప్పుడు సమస్య అయింది. గ్రీన్‌క్రాకర్స్‌కు సంబంధించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసర్చ్ (సిఎస్‌ఐఆర్) సర్టిఫికేషన్ లేకపోవడం వ్యవస్థాగత వైఫల్యాన్ని వెల్లడిస్తోంది. ప్రతి బ్యాచ్‌ను ప్రమాణీకరించడానికి ప్రయోగశాల పరీక్షలు, క్షేత్రస్థాయిలో తనిఖీలు అవసరం.

కానీ, చాందీనీ చౌక్, సదర్ బజార్ అంతటా నకిలీవస్తువులను అమ్మకందార్లు విక్రయిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈ సవాల్ కేవలం లాజిస్టికల్ మాత్రమే కాదు. రాజకీయమైనది. కేంద్రం, రాష్ట్రస్థాయి లో బిజెపి పర్యావరణ విధానాలను దారుణంగా మారుస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. హస్టియో అరండ్ వంటి జీవవైవిధ్యంగల కీలక ప్రాంతాలలో బొగ్గుగనుల తవ్వకాలకు అనుమతిలు ఇవ్వడం, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన కాలుష్యానికి సంబంధించిన నిబంధనలను సడలించడం వరకు బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దశాబ్దికాలంగా వాతావరణం కన్నా, పారిశ్రామిక లాబీలకే ప్రాధాన్యత ఇస్తోంది.హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో బిజెపియే అధికారంలో ఉన్నా పంటలను తగులబెట్టడాన్ని అరికట్టడంలో వైఫల్యం, బిజెపి పాలిత ఢిల్లీకి సంకటంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేపట్టిన కాలుష్య నియంత్రణ చర్యలను హిందూ వ్యతిరేకతగా చిత్రీకరించిన బిజెపి, ఇప్పుడు ఇరకాటంలోపడింది.

పార్టీ ఈ మధ్య చేస్తున్న ప్రచారాలు, దాని పర్యవేక్షణలో వెలవెలబోతున్నాయి. దీపావళికి సంబంధించి దాని నినాదాలకు, దాని చర్యలకు మధ్య వైవిధ్యం తేటతెల్లమవుతోంది. ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో రాజధానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పొగమంచు మధ్య మెరుగైన పాలన అందించాల్సిన బాధ్యత బిజెపిపైనే ఉంది. ఈ దీపావళి రోజున, ఆనంద్ విహార్, ద్వారక వంటి కీలక ప్రాంతాల్లో అర్ధరాత్రికి వాయు నాణ్యత స్థాయి 400 ప్లస్‌కు దిగజారిందని అంచనా. నిజమైన పరీక్ష ఇప్పుడే ఎదురయింది. రాజధానిలో గస్తీకి తగినంతమంది పోలీసులను నియమించారా. సిపిసిబి రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ కాలుష్యనియమాలు ఉల్లంఘించేవారిని సమర్థంగా గుర్తించాయా. నిర్దిష్ట సమయంలోనే బాణాసంచా కాల్చాలన్న ప్రచారం, కాలుష్యం వల్ల అనర్థాలను తెలుపుతూ, స్కూళ్లలో చేపట్టిన కార్యక్రమాలు, లేజర్ షోల వంటివి చాలా కీలకం. అయినా, పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాల తగులపెట్టడం వల్ల అంతర్రాష్ట్ర కాలుష్య నియంత్రణకు కేంద్రం గట్టిచర్యలు తీసుకోని పక్షంలో కేంద్రం వైఫల్యం తీవ్ర పరిణామాకు దారితీస్తుంది.

అసోం రాజకీయ ప్రతిఘటనల మధ్య జుబీన్ గార్గ్ సంతాపం ఢిల్లీ రాజధానిలో ఊపిరి సలపని పరిస్థితి ఉంటే, ఈశాన్య రాష్ట్రాల బలహీన పర్యావరణ వ్యవస్థలు దీపావళి వేడుకలను భిన్నంగా కోరుకుంటున్నాయి. బ్రహ్మపుత్ర వరద మైదానాలు, తూర్పు హిమాలయాలతో కూడిన అసోం ముప్పులోఉన్న జీవవైవిధ్యానికి ప్రతీక. అసోంలో గాలి నాణ్యత ఢిల్లీ కన్నా చాలా మెరుగ్గా, శుభ్రంగా ఉన్నా, బయోమాస్ ధ్వంసం, బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దును వచ్చే పొగమంచుకు ఇబ్బందుల పాలవుతున్నది. ఈ ప్రాంతంలో సమాజాలు దీపావళిని బిహు సంప్రదాయంలో కలుపుతూ బాణాసంచా కంటే నూనె దీపాలు మట్టి దీపాలతోనే పండుగ జరుపుకునేందుకు ఇష్టపడతాయి. పర్యావరణ పరిరక్షణలను దెబ్బతీస్తూ ఎన్నికల ప్రయోజనంకోసం హిందూ పండుగలను ఉపయోగించుకోవడం దారుణం. దీపావళి, చీకటిపై వెలుగుకు ప్రతీకగా నిలవడంతో పార్టీ సాం సృ్కతిక జాతీయవాదంలో ఓ ఆసరాగా మారింది. ఢిల్లీలో ఆప్ అధికారంలోఉన్నప్పుడు చేపట్టిన కాలుష్య నియంత్రణ చర్యలను హిందూ వ్యతిరేక చర్యగా బిజెపి ప్రచారం చేసింది.

అసోంలో బిశ్వశర్మ టపాకాయల అమ్మకందారుల పై చూపుతున్న ప్రేమ కాలుష్యాన్ని పెంచి పోషించే పారిశ్రామికవేత్తలతో ఆయన అనుబంధాన్ని చూపుతున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా సాగుతున్న వ్యూహం. బిజెపి అధికారంలో ఉన్న దశాబ్దకాలంలో పారిశ్రామిక ఉద్గారాల అనుమతులు 30% పెరిగాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డేటా చెబుతోంది. బిజెపికి పౌరుల ఆరోగ్యంపట్ల, పర్యావరణ సమతుల్యతపట్ల శ్రద్ధ లేదని, గిరిజనులు వ్యతిరేకిస్తున్నా,ఒడిశాలో నియమగిరి కొండలలో బాక్సైట్ గనుల తవ్వకాలకు ఈ మధ్య అనుమతి ఇవ్వడం ద్వారా రుజువైంది. మతపరమైన దోపిడీ లోతుగా సాగుతోంది. నిషేధాలను హిందూ విశ్వాసాలపై దాడిగా చిత్రీకరించడం ద్వారా బిజెపి, ఉత్తరప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలలో ఓట్లను సంపాదించడానికి పడుతున్న ఆందోళనను చూపుతోంది.

భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. హిందువులే కాదు, జైనులు, సిక్కులు, బౌద్ధులు కూడా పంచుకునే దీపావళి సార్వత్రిక ఆనందాన్ని విషపూరితం చేయకూడదు ప్రజా సంతాపాన్ని కించపరచకూడదు. ఈ దీపావళి పరివర్తనపరమైన మార్పునుకోరుతోంది. అందరి సహకారం వల్లనే ఢిల్లీలో పర్యావరణపరమైనవిజయం ఆధారపడిఉంది. బాణాసంచా రియల్ టైమ్ పేలుళ్లను గుర్తించేందుకు ఆప్ 11 జిల్లాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యవేక్షించే డ్రోన్‌లను మోహరించాలని కోరుతోంది. కానీ కేంద్రం పంటల వ్యర్థాల ధ్వంసం అరికట్టేందుకు ఉపగ్రహ ట్రాకింగ్, రైతులకు సబ్సిడీలతో రాజధాని వ్యాప్తంగా గడ్డినిషేధాలను అమలు చేస్తున్నది. పౌరులసహకారం అన్నిటికన్నా అవసరం. ఉల్లంఘనలను గుర్తించేందుకు మొబైల్ యాప్‌లు, కాలుష్యనియంత్రణపై అవగాహన కల్పించేందుకు పాఠశాల డ్రైవ్‌లు, లేజర్‌షోలు వంటి పర్యావరణ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం అవసరం. 

– గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)

– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు

‘జనరల్ జెడ్’ నిరసనలు

ఆండీస్ నుండి హిమాలయాల వరకు, ప్రపంచ వ్యాప్తంగా కొత్త నిరసనల తరంగం చెలరేగుతోంది. ప్రభుత్వాలపై తరతరాలుగా అసంతృప్తి, యువతలో నెలకొన్న ఆగ్రహావేశాలు ప్రభుత్వాలలో మార్పులకు దారితీస్తున్నాయి. ఇటీవల మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినాను సైనిక తిరుగుబాటు తర్వాత అధికారం నుండి తొలగించి దేశం నుండి బయటకు పంపారు. యువ నిరసనకారులు తమను తాము ‘జనరల్ జెడ్ మడగాస్కర్’ అని పిలుచుకుంటూ వారాల తరబడి జరిగిన ప్రదర్శనల పరాకాష్ట ఇది. ఈ హిందూ మహాసముద్ర ద్వీప దేశంలో చెలరేగిన రాజకీయ నాయకత్వంపై ఆగ్రహం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో కనిపిస్తున్నది. నేపాల్, ఫిలిప్పిన్స్, ఇండోనేషియా, కెన్యా, పెరూ, మొరాకో వంటి దేశాలలో ఇటీవలి కాలంలో ఇటువంటి నిరసనలు చూసాం. ఈ నిరసనలు పేరుకుపోయిన అసంతృప్తితో చెలరేగినవే. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక అనిశ్చితి, అవినీతి, నాయకుల బంధుప్రీతి వంటి దీర్ఘకాలిక సమస్యలకు పరాకాష్టగా మారుతున్నాయి.

చెప్పుకోదగిన నాయకత్వం అంటూ లేకుండా, దాదాపు అన్ని రాజకీయ పార్టీలపై అసహనం వ్యక్తం చేస్తూ, తమను తాము ‘జనరల్ జెడ్’ అని ముద్ర వేసుకుంటూ నిరసనలకు దిగుతున్నారు. వారు సుమారుగా 1996 నుండి 2010 మధ్య జన్మించిన వారుగా, అంటే పూర్తిగా ఇంటర్నెట్ యుగంలో పెరిగిన మొదటి తరం అని చెప్పవచ్చు. ఇవ్వన్నీ దాదాపు ఒకే వరుసలో జరుగుతూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. సాధారణ అంశం ఏమిటంటే ఈ యువతకు సాంప్రదాయ రాజకీయ పార్టీలు, నాయకులపై విశ్వాసం సన్నగిల్లింది. మెరుగైన పాలన అందీయగల వారి సామర్థ్యంపై తీవ్ర అసంతృప్తి నెలకొంటుంది. సాధారణ పౌర సమస్యలపై నిరసనలు ప్రారంభం కావడం, అవి చివరకు ప్రభుత్వంలో మార్పుకు దారితీయడమా, చివరకు హింసాయుత చర్యలకు సైతం పాల్పడటం జరుగుతూ వస్తున్నది.

‘ఈ యువత నేతృత్వంలోని నిరసనలను కలిపేది ఏమిటంటే, సాంప్రదాయ రాజకీయ వ్యవస్థలు తమ తరం ఆందోళనలకు, అది అవినీతి, వాతావరణ మార్పు లేదా ఆర్థిక అసమానత వంటి వాటికి ప్రతిస్పందించవు అనే ఉమ్మడి భావన. సంస్థాగత వ్యవస్థలు విఫలం భావించినప్పుడు’ అని నిరసనలు, సామాజిక ఉద్యమాలపై పరిశోధన చేసిన యుకె ఆధారిత లాభాపేక్షలేని సోషల్ ఛేంజ్ ల్యాబ్ డైరెక్టర్ సామ్ నాడెల్ పేర్కొన్నారు. వారి నిర్దిష్ట డిమాండ్లు భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ నిరసనలలో ఎక్కువ భాగం ప్రభుత్వ అతిక్రమణ లేదా నిర్లక్ష్యం కారణంగా చెలరేగాయి. కొన్ని భద్రతా దళాల కఠినమైన స్పందన, క్రూరమైన అణచివేతను కూడా ఎదుర్కొన్నాయి. మొరాకోలో, మొరాకో డయలింగ్ కోడ్ పేరు పెట్టబడిన జెన్ జెడ్ 212 అనే నాయకుడు లేని సమష్టి మెరుగైన ప్రజాసేవలు, ఆరోగ్యం, విద్యపై ఖర్చు పెంచాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చింది.

పెరూలో, పెన్షన్ చట్టంపై నిరసనలు విస్తృత డిమాండ్లుగా చెలరేగాయి. వీటిలో పెరుగుతున్న అభద్రత, ప్రభుత్వంలో విస్తృతమైన అవినీతి తోడయ్యాయి. ఇండోనేషియాలో, చట్టసభ సభ్యుల ప్రోత్సాహకాలు, జీవన వ్యయంపై ఘోరమైన నిరసనలు చెలరేగాయి. అధ్యక్షుడు కీలకమైన ఆర్థిక, భద్రతా మంత్రులను భర్తీ చేయవలసి వచ్చింది. ‘జనరల్ జెడ్’ నిరసనగా పిలువబడే అత్యంత విస్తృతంగా గుర్తింపు పొందిన ఉద్యమం నేపాల్‌లో జరిగిన ఘోరమైన తిరుగుబాటు. ఇది సెప్టెంబర్‌లో ప్రధానమంత్రి రాజీనామాతో ముగిసింది. దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలలో విజయవంతమైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల నుండి నిరసనకారులు ప్రేరణ పొందారు. 2022లో శ్రీలంక, 2024లో బంగ్లాదేశ్ నిరసనలు ప్రభుత్వాల తొలగింపుకు దారితీసాయి.

మడగాస్కర్‌లో, నిరసనకారులు నేపాల్, శ్రీలంకలోని ఉద్యమాల ద్వారా తాము ప్రత్యేకంగా ప్రేరణ పొందామని చెప్పారు. సాధారణమైన నీటి సరఫరా, విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. కానీ అధ్యక్షుడు, ఇతర మంత్రులు రాజీనామా చేయాలని ప్రదర్శనకారులు పిలుపునివ్వడంతో త్వరగా విస్తృత అసంతృప్తిగా మారాయి. దానితో మడగాస్కర్ సైనిక తిరుగుబాటు నాయకుడు తాను ‘అధ్యక్ష పదవిని తీసుకుంటున్నానని’ చెప్పాడు. పలు దేశాలలో, ఒక ఏకైక పాప్ సంస్కృతి చిహ్నం ఉద్భవించింది: నవ్వుతున్న పుర్రె, క్రాస్‌బోన్‌లను గడ్డి టోపీ ధరించి చూపించే నల్ల జెండా. ఈ జెండా ‘వన్ పీస్’ అనే కల్ట్ జపనీస్ మాంగా, అనిమే సిరీస్ నుండి వచ్చింది. ఇది అవినీతి ప్రభుత్వాలను ఎదుర్కొనే దొంగల బృందాన్ని అనుసరిస్తుంది. నేపాల్‌లో, నేపాల్ ప్రభుత్వ స్థావరాలైన సింఘా దర్బార్ గేట్లపై, మంత్రిత్వ శాఖలపై నిరసనకారులు అదే జెండాను వేలాడదీశారు. వీటిలో చాలా వాటిని నిరసనలలో దహనం చేశారు.

ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మొరాకో, మడగాస్కర్‌లలో కూడా జనసమూహం అదే విధంగా చేసింది. పెరువియన్ రాజధాని లిమాలో, 27 ఏళ్ల ఎలక్ట్రీషియన్ డేవిడ్ టాఫర్ శాన్ మార్టిన్ స్క్వేర్‌లో అదే జెండాతో నిలబడ్డాడు. ‘మేము అదే పోరాటం చేస్తున్నాము మా విషయంలో, హంతకులు కూడా అయిన అవినీతి అధికారులపై’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. 500 కంటే ఎక్కువ నిరసనలలో 50 మంది పౌరులు మరణించినప్పటికీ అధ్యక్షుడు దినా బోలువార్టే ప్రభుత్వం డిసెంబర్ 2022 నుండి అధికారంలో ఉందని గుర్తుచేసుకున్నారు. ‘నా విషయంలో, ఇది అధికార దుర్వినియోగం, అవినీతి, మరణాలపై ఆగ్రహం’ అని టఫూర్ పేర్కొన్నారు. 2017 నుండి దక్షిణ అమెరికాను పీడిస్తున్న హత్యలు, దోపిడీల పెరుగుదలను ప్రస్తావిస్తూ, నేరాలను ఎదుర్కోవడానికి ప్రయత్నాలను బలహీనపరిచిన కొత్త చట్టాల మధ్య. 2022లో లంచం తీసుకోవడం, నిరసనకారులపై ఘోరమైన అణచివేతలో పాల్గొనడం వంటి వివిధ ఆరోపణలపై బోలువార్టే నెలల తరబడి విచారణలో ఉన్నారు.

చివరకు తాత్కాలిక అధ్యక్షుడు జోస్ జెరీ ఆమె స్థానంలోకి రాగా అది సరిపోదని టఫూర్ పేర్కొన్నారు. ‘అధ్యక్షుడు కాంగ్రెస్‌కు మిత్రుడు, ఆయన అక్కడి నుండి వెళ్లిపోవాలి’ అని స్పష్టం చేశారు. గతంలో 2011లో వాల్ స్ట్రీట్ ఆక్రమణ, 2010 నుండి 2012 మధ్య అరబ్ స్ప్రింగ్, హాంకాంగ్‌లో 2014 అంబ్రెల్లా విప్లవం వంటి అనేక ముఖ్యమైన నిరసనలకు యువత నాయకత్వం వహించారు. వారు సామూహిక సమీకరణ కోసం ఇంటర్నెట్, సోషల్ మీడియాను కూడా ఉపయోగించినప్పటికీ, జనరల్ జెడ్ నిరసనకారులు దానిని మరొక స్థాయికి తీసుకు వెళుతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు సమాచారాన్ని పంచుకోవడానికి, కనెక్షన్‌లను నిర్మించడానికి శక్తివంతమైన సాధనాలు. కానీ అత్యంత ప్రభావవంతమైన ఉద్యమాలు తరచుగా డిజిటల్ సమీకరణను సాంప్రదాయ వ్యక్తిగత నిర్వహణతో మిళితం చేస్తాయి. ఈ ఇటీవలి నిరసనలలో మనం చూసినట్లుగా, అని సోషల్ ఛేంజ్ ల్యాబ్ నుండి నాదెల్ పేర్కొన్నారు. నేపాల్‌లో ఉధృతమైన నిరసనలు ప్రారంభానికి కొన్ని రోజుల ముందు, రిజిస్ట్రేషన్ గడువును పాటించనందుకు ప్రభుత్వం చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లపై నిషేధాన్ని ప్రకటించింది. చాలా మంది యువ నేపాలీలు దీనిని తమను నిశ్శబ్దం చేసే ప్రయత్నంగా భావించారు. గుర్తింపును తప్పించుకోవడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా సోషల్ మీడియా సైట్‌లను యాక్సెస్ చేయడం ప్రారంభించారు.

తరువాతి కొద్ది రోజుల్లో, వారు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లను ఉపయోగించి రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవనశైలిని హైలైట్ చేశారు. నేపాల్‌లోని ధనిక, పేదల మధ్య అసమానతలను ఎత్తిచూపారు. ప్రణాళికాబద్ధమైన ర్యాలీలు, వేదికలను ప్రకటించారు. తరువాత, వారిలో కొందరు గేమింగ్ చాట్ ప్లాట్‌ఫామ్ డిస్కార్డ్‌ను ఉపయోగించి దేశానికి తాత్కాలిక నాయకుడిగా ఎవరిని నామినేట్ చేయాలో సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా లేదా అన్యాయానికి వ్యతిరేకంగా ఏదైనా ఉద్యమం జరిగినా, అది డిజిటల్ మీడియా ద్వారా వ్యాపిస్తుంది. నేపాల్‌లో కూడా అదే జరిగింది. నేపాల్‌లో జనరల్ జెడ్ నిరసనల తర్వాత జరిగిన మార్పులు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. ఇతర దేశాలను కూడా ప్రభావితం చేశాయి’ అని ఓ నిరసనకారుడు తెలిపారు. నేపాల్‌లో జరిగిన నిరసనలు యువతను మాత్రమే కాకుండా ఇతర తరాలను కూడా మేల్కొలిపిందని ఆయన పేర్కొన్నారు. మనం ప్రపంచ పౌరులమని, డిజిటల్ స్థలం మనందరినీ కలుపుతుందని, ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన పాత్ర పోషిస్తుందని మేము గ్రహించాము అని చెప్పారు.

చలసాని నరేంద్ర

98495 69050

పెంటగాన్‌పై కలాల ధిక్కారం

ఇక్కడ కాదు లెండి, అమెరికాలో. అమెరికా రక్షణ కార్యాలయ కేంద్రం పెంటగాన్‌లో ఇది సంభవించింది. స్వేచ్ఛకు ప్రతీకగా పేరొందిన అమెరికాలో ఇలాంటి బహిష్కరణలు జరగడంలో వింత ఏమీ లేదు. జర్నలిజం వృత్తి ఆ నేలపై అత్యంత గొప్ప వృత్తిగా పేరొందింది. జర్నలిజం అంతా వ్యాపారంగా మారిపోయిన తరువాత కూడా ప్రపంచంపై అమెరికా పెత్తనానికి గుండెకాయ లాంటి పెంటగాన్ విలేకరుల సమావేశం బహిష్కరించడం సాధారణ పరిణామం కాదు. ఈ కారణంగా బహిష్కరణ అనేది అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన పరిణామం అనే చెప్పాలి. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే అమెరికాలో జర్నలిజం స్వతంత్రంగానే కొనసాగుతున్నది. కార్పొరేట్ యాజమాన్యాల గుప్పిట్లో మీడియా చిక్కుకొని సంపూర్ణ వ్యాపారంగా మారిపోయినా అమెరికాలో జర్నలిస్టులు తమ వృత్తి పట్ల ఇంకా నిబద్ధతతోనే పని చేయగలుగుతున్నారని ఈ పరిణామం చెబుతున్నది. అయితే ఇదేమీ సాధారణ బహిష్కరణ కాదు.ఒక పత్రికా సమావేశానికి మాత్రమే పరిమితమైనది కూడా కాదు.

అమెరికా రక్షణశాఖ పెంటగాన్ కార్యాలయంనుంచి నిత్యం పనిచేసే జర్నలిస్టులపై విధించిన ఆంక్షల ఫలితం ఇది. తాము చెప్పిన విషయాలను మాత్రమే రాయాలని, ఇతర విషయాలను రాయడానికి, ప్రసారం చేయడానికి ఎంతమాత్రం వీలు లేదని ప్రకటించింది అమెరికా రక్షణశాఖ పెంటగాన్. జర్నలిస్టులు స్వతంత్రించి పెంటగాన్ కార్యాలయంలో ఏ అధికారినైనా కలవడానికి వీలు లేదని, అందుకు గాను తమ అనుమతి తప్పనిసరి అని పేర్కొంటూ ట్రంప్ నేతృత్వంలోని రక్షణశాఖ జర్నలిస్టులపై చాంతాడంత పొడవైన పెద్ద ఆంక్షల జాబితానే ప్రకటించింది. అంతేకాదు, తాము విధించిన ఆంక్షలను అంగీకరిస్తూ ఒక పత్రం (అఫిడవిట్) పై జర్నలిస్టులు అందరూ సంతకాలుచేసి తీరాలని పెంటగాన్ కార్యాలయం బీట్ జర్నలిస్టులను ఆదేశించింది. పెంటగాన్ జర్నలిస్టులు దీనిని వ్యతిరేకించారు. అభ్యంతరం తెలిపారు. పెంటగాన్ యంత్రాంగం దీనినేమీ పట్టించుకోలేదు. సంతకాలుచేసిన తరువాతనే విలేకరుల సమావేశానికి అనుమతిస్తామని ప్రకటించింది. దీంతో ఆ బీట్ జర్నలిస్టులు అందరూ మూకుమ్మడిగా అమెరికా రక్షణ మంత్రి సమావేశాన్ని బహిష్కరించారు. పెంటగాన్ కార్యాలయంలో వార్తల కవరేజీకోసం తమకు జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులను జర్నలిస్టులు అందరూ మూకుమ్మడిగా ఆ యంత్రాంగానికి అప్పగించి వేశారు.

వార్తల కవరేజి కోసం అక్కడ తాము స్థిరంగా ఏర్పాటు చేసుకున్న కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తు పరికరాలు అన్నిటిని సమావేశ బహిష్కరణ సందర్భంగా కార్యాలయం నుంచి తీసుకొని వెళ్లిపోయారు. ఇకపై తాము పెంటగాన్‌కు రాబోవడం లేదని సంకేతాత్మకంగా, స్పష్టంగా నిరసన తెలిపారు అమెరికా జర్నలిస్టులు. కానీ పెంటగాన్ సమాచారాన్ని వార్తలు నివేదించే తమ వృత్తిగత కర్తవ్యాన్ని నిలిపివేయబోమని, దానికి అవసరమైన సమాచారాన్ని తాము స్వతంత్రంగా తమ స్వంత పద్ధతుల్లో సేకరిస్తామని వాళ్లు ప్రకటించారు. గత మంగళవారం నాడు ఈ పరిణామం సంభవించింది. సుమారు 250 యేళ్లక్రితం అమెరికా బ్రిటిష్ పరిపాలననుంచి స్వతంత్ర దేశం గా అవతరించింది. నాటి నుంచి నేటి వరకు అమెరికా సమాజానికి వార్తలు సమాచారాన్ని అందించడంలో ఏనాడూ రాజీపడలేదు. సర్కారుకు లొంగి పోలేదు. అమెరికా సమాజ ప్రయోజనాల పరిరక్షణకు విశేష స్థాయిలో కృషిచేసింది. ఒక్క అమెరికా మాత్రమే కాదు యూరప్‌లోని చాలా దేశాల్లో కూడా ఇండియాతో పోల్చితే జర్నలిజం స్వతంత్రంగానే పని చేస్తున్నది. అలాంటిది ఇండియాలో సంభవించి ఉంటే నిజంగా చాలా పెద్ద ఆశ్చర్యమే.

కానీ ఈ నేలపై అలాంటివి సంభవించే అవకాశాలు దాదాపుగా కనుమరుగైపోయాయి. ఇండియా కూడా 75 యేళ్లక్రితం బ్రిటిష్ వలసపాలన నుంచే స్వాతంత్య్రం పొందింది. వలస పాలనలో భారత జాతి ప్రయోజనాల కోసం భారతీయ జర్నలిజం పోషించిన పాత్ర అత్యంత ఘనమైనదే. వృత్తి నిబద్ధతలో అమెరికా, ఇండియా జర్నలిస్టుల శీలం శంకించేదేమీ కాదు. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించేవరకు చాలా భారతీయ పత్రికలు, జర్నలిస్టులు చాలా వరకు స్వతంత్రంగానే పని చేశాయని చెప్పాలి. ఇందిర నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి జాతిని జాగృతంచేశాయి. పత్రికా స్వతంత్ర రక్షణకోసం నాడు హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలు పోషించిన పాత్ర జర్నలిజం చరిత్రలో గర్వించదగినది. అలా పత్రికలు, జర్నలిస్టులు తమ వృత్తి నిబద్ధతను గట్టిగా చాటుకొని అసలైన పత్రికా స్వేచ్ఛను నాడు నిలబెట్టుకున్నాయి. కానీ నేడు ఆ స్థితి లేదు. స్వతంత్ర ఉద్యమం, ఎమర్జెన్సీ వరకు ఒక లెక్క. ఎమర్జెన్సీ తదనంతరం జర్నలిజంలో భారతీయ జర్నలిజంలో వ్యాపార పోకడలు ప్రవేశించాయి. అయినా కూడా జర్నలిస్టులు స్వతంత్రంగానే వ్యవహరించి పౌరుల భావస్వేచ్ఛను కాపాడే కృషిని విశేష స్థాయిలో నిర్వహించారు. నాటివరకు వాస్తవాలను సమాజానికి అందిస్తూ సాగిన కలం సాగు జర్నలిజం పూర్తిగా వ్యాపారుల చేతుల్లోకి వెళ్లడం మొదలైంది.

90లలో దేశంలో ఆర్థిక సరళీకరణ మొదలవడంతో దేశంలోని మీడియాలోకి అంతర్జాతీయ వ్యాపారుల పెట్టుబడుల ప్రవేశం పెరిగిపోయింది. మీడియాలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడంతో మొత్తం భారతీయ జర్నలిజం తీరుతెన్ను సంపూర్ణంగా వ్యతిరేక దిశ మళ్లింది. క్రమంగా పత్రికలు, టెలివిజన్ రంగంలోకి విదేశీ పెట్టుబడుల వాటా పెరిగిపోయింది. దీంతో పత్రికల ఎడిటోరియల్ విధానం పూర్తిగా భిన్నరూపం సంతరించుకుంది. దీంతో యథాతథంగా వార్తలు, సమాచారం అందించడంలో మీడియా ఎడిటోరియల్ విధానం జోక్యం పెరిగింది.ఫలితంగా జర్నలిస్టు కలం స్వేచ్ఛకు పరిమితులు, ఆంక్షలు మొదలయ్యాయి. విదేశీ పెట్టుబడులు ప్రవేశించకముందు అనేకమంది జర్నలిస్టులే పత్రికలను సామాజిక సేవ లక్ష్యంతో నిర్వహించేవారు. భారతీయ కార్పొరేట్లు, విదేశీ పెట్టుబడుల ప్రవేశంతో పత్రికలను జర్నలిస్టులు నడిపించగల పరిస్థితులు దాదాపుగా అంతరించిపోయాయి. అలాంటి ఒకటీ, అర పత్రికలు అక్కడక్కడా ఉన్నప్పటికీ జర్నలిజం వ్యాపారుల ఆర్థిక శక్తియుక్తుల ముందు అవి మనుగడ సాగించగల స్థితి లేదిప్పుడు. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం అది సామాన్యులకు కూడా చవకగా లభిస్తూ ఉండడంతో మాస్, సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా వ్యాపించింది. ప్రపంచంలోని ఏ మూలన జరిగిన పరిణామమైనా క్షణాల్లో అందరికీ తెలిసే వెసులుబాటు కలిగింది. దీంతో సోషల్ విస్తృతి విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా సమాచారంకోసం మీడియాపై ఆధారపడడం తగ్గిపోయింది. ఫలితంగా మీడియా ప్రభావం, ప్రాధాన్యత సమాజంపై కొంత తగ్గింది. పదేళ్లుగా దేశంలో మీడియా స్వేచ్ఛ బలహీనపడడం మొదలైంది.

జర్నలిస్టుల వృత్తి నిర్వహణకు అనేక రకాల ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఫలితంగా భారతీయ జర్నలిజం విశ్వసనీయత క్షీణ దశ మొదలైంది. ఈ క్రమంలో పత్రికాస్వేచ్చ, పౌరుల భావస్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయాయి. ఈ ఒత్తిళ్లు ఇలాగే కొనసాగితే భావస్వేచ్ఛ అనేది ఈ నేలపై ఒక చరిత్రగా మాత్రమే మిగిలి పోయే ప్రమాదం కనిపిస్తున్నది. ఇక్కడ పత్రికలు, వార్తా చానెళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు, వార్తా సంస్థలకు కొదవ ఏమీ లేదు. రాశిలో వాటి సంఖ్య ఘనమైనదే. కానీ వాస్తవాలను వెలుగులోకి తేవడంలో జర్నలిస్టులకు అడుగడుగునా అనేక ఇబ్బందులు, ఒత్తిళ్లున్నాయి, భయాలున్నాయి. ఇటీవలి కాలంలో వృత్తి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు జాబితాకూడా పెద్దదే. ఈ సంఖ్య జర్నలిజం ఎదుర్కొంటున్న ప్రమాద పరిస్థితులకు ఒక నిదర్శనంగా చూడాలి. ఇలాంటి అనేక సవాళ్ల మధ్య కూడా భారతీయ జర్నలిస్టులు కత్తిమీద సాములాగా తమ వృత్తిని కొనసాగిస్తున్నారు.

పత్రికా రచన ఈ దేశంలో ఒకనాడు అత్యంత గౌరవనీయ వృత్తి. నాడు పత్రికల్లో వచ్చే వార్తలకు ఎంతో విశ్వసనీయత ఉండేది.ఇప్పుడు మాత్రం ఆ స్థితి లేదు. ఇప్పుడు ఆ విశ్వసనీయతను వెదుక్కోవాలి. ఇప్పుడు ఈ దేశంలో మీడియాకు సమాంతరంగా మాస్, సోషల్ మీడియా విస్తరించిపోయింది. కానీ ప్రచురించే, ప్రసారం చేసే వార్తలు, కథనాల్లో నిజానిజాలను బేరీజు వేసుకోవడం పాఠకుడు, వీక్షకుడికి చాలా కష్టమైన పనిగా మారిపోయింది. పెంటగాన్ జర్నలిస్టుల బహిష్కరణ ఇప్పుడు మొత్తం జర్నలిజానికి ఒక స్ఫూర్తిగా నిలవదగ్గ పరిణామంగా చెప్పాలి. ఈ బహిష్కరణనుంచి స్ఫూర్తి పొందగలిగితేనే ఏ దేశ జర్నలిజం అయినా నిలదొక్కుకొని ఆయా దేశాల్లో ప్రజాస్వామిక వ్యవస్థలు మనుగడ సాగిస్తుస్తాయి. అలా కాకుంటే తిరిగి పూర్వపు క్రూరమైన రాచరిక వ్యవస్థలు నియంతృత్వాల పునరుద్ధరణ ప్రమాదం పొంచి ఉంటుంది. అది ఆయా పౌర సమాజాల చైతన్యస్థాయిపై ఆధారపడి ఉంటుంది.

గోవర్ధన్ గందె

93470 56621