ankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escort

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

holiganbet

Betpas güncel giriş

Casibom

holiganbet güncel giriş

betkolik

trendbet giriş

taksim escort

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

vaycasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

izmit escort

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

vaycasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

grandpashabet

vdcasino

holiganbet

bahsegel

bahsegel

meritking

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casino levant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

vaycasino

casibom

Wbahis

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

Wbahis

grandpashabet

marsbahis

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

galabet

kingroyal

holiganbet

marsbahis

casibom

padişahbet

padişahbet giriş

queenbet

padişahbet

padişahbet giriş

casinolevant

yakabet

casinolevant giriş

casibom

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

Pendik escort, esenyurt escort

sekabet

casinolevant

casinolevant giriş

anadoluslot

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

casinolevant

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

‘హద్దు’ మీరిన వివాదం

దక్షిణ తూర్పు ఆసియాలోని రెండు చారిత్రక పొరుగు దేశాలు. థాయ్‌లాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు మరోసారి తలెత్తాయి. సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ఘర్షణల్లో థాయి సైనికుడు ఒకరు, నలుగురు కంబోడియా పౌరులు మరణించారు. ఎనిమిదిమంది థాయి సైనికులు గాయపడ్డారు. ఇరు దేశాల మధ్య గల వివాదాస్పద సరిహద్దుపై రేగిన పోరుకు కారణం మీరంటే, మీరు అంటూ ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో థాయిలాండ్‌లో సరిహద్దు ప్రాంతాల నుంచి దాదాపు 35 వేల మందిని ఖాళీ చేయించారు. ఈ వేసవిలో ఇరుదేశాల మధ్య ఐదు రోజుల పాటు జరిగిన పోరులో ఇప్పటికే 43 మంది మరణించారు. ఇరు వైపులా కలిసి దాదాపు మూడు లక్షల మంది నిర్వాసితులయ్యారు. ఇది కేవలం సైనిక ఘర్షణ మాత్రమే కాదు. ఇది శతాబ్దాల చరిత్రలో రగిలిపోతున్న సరిహద్దు వివాదం. థాయ్‌లాండ్-, కంబోడియా సరిహద్దు వివాదం 1904- 1907 మధ్య ఫ్రాన్స్- సియాం ఒప్పందాల నుండి మొదలైంది. అప్పట్లో థాయ్‌లాండ్ (సియాం) రాజ్యం, ఫ్రెంచ్ ఇండోచైనా (కంబోడియా, లావోస్, వియత్నాం) మధ్య సరిహద్దులుగా నిర్ణయించబడ్డాయి. ఫ్రెంచ్ కార్టో గ్రాఫర్లు డాంగ్రెక్ పర్వతాల వర్షపతన రేఖకు విరుద్ధంగా మ్యాపులను గీసారు.

దీనిలో ‘ప్రేహ్ విహేర్ ఆలయం’ కంబోడియా భూభాగంలో ఉన్నట్లు గీయబడింది. అయితే థాయ్‌లాండ్ ఈ మ్యాపులను మొదట అంగీకరించింది. కానీ, ఆ తర్వాత కాలంలో వాటిని తిరస్కరించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో థాయ్‌లాండ్ జపాన్‌తో కలసి ఉండి ఈ ప్రాంతాన్ని తిరిగి తీసేసుకుంది. కానీ 1946లో ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ వివాదం చేరడంతో థాయిలాండ్ దానిని తిరిగి కంబోడియాకు ఇచ్చేసింది. 1953లో కంబోడియా స్వాతంత్య్రం పొందిన తర్వాత, థాయ్ సైన్యం మరోసారి ఆలయాన్ని ఆక్రమించింది. దీనికి ప్రతి స్పందనగా కంబోడియా 1959లో అంతర్జాతీయ న్యాయస్థానం లో కేసు వేసింది. 1962లో అంతర్జాతీయ కోర్టు తీర్పు కంబోడియాకు అనుకూలంగా ఇచ్చింది ‘ప్రేహ్ విహేర్’ కంబోడియా భూభాగమని ప్రకటించింది. అయితే థాయ్‌లాండ్ దశాబ్దాలుగా ఈ సరిహద్దు మ్యాపులకు అభ్యంతరం చెప్పలేదు. కానీ చుట్టూ 4.6 చ.కి.మీ. ప్రాంతం గురించి వివాదం మాత్రం కొనసాగింది. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు థాయ్ ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. ఇది వారి జాతీయ గౌరవానికి దెబ్బగా భావించింది. ఈ వివాదం చిలువలు పలువులుగా కొనసాగుతూ 2008లో మరింత ఉధృతమైంది.

కంబోడియా ‘ప్రేహ్ విహేర్’ ను యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా జాబితా లో చేర్చగలిగింది. దీనిని థాయ్‌లాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఫలితంగా 2008- 2011 మధ్య ఘర్షణలు జరిగాయి. 30 మందికి పైగా మరణించారు. ఈ కాలంలో రెండు దేశాల్లోనూ రాష్ట్రీయవాద రాజకీయాలు ఊపందుకున్నాయి. థాయ్‌లో యెల్లో షర్ట్ వంటి సంస్థలు ఆందోళనలు చేపట్టాయి. కంబోడియాలో ‘హన్ సేన్’ ప్రభుత్వం జాతీయవాదాన్ని ఉపయోగించుకుంది. ఈ ఘర్షణలతో ఇరుదేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. పర్యాటకం, వాణిజ్యం ఆగిపోయాయి. అయినప్పటికీ, ఏషియన్ మధ్యవర్తిత్వంతో 2011లో తాత్కాలిక శాంతి వచ్చింది. కానీ 2025లో ఈ పాత గాయం మరోసారి తలెత్తింది. మే 2025లో రెండు దేశాల సరిహద్దుల దళాల మధ్య గన్ ఫైట్ జరిగింది. క్రమంగా ఇది జులైలో పూర్తి యుద్ధంగా మారిపోయింది.

గత సంవత్సరం జూలై 24 నుండి 28 వరకు ఐదు రోజులు భారీ యుద్ధం జరిగి, 40 మందికి పైగా మరణించారు. 2 లక్షల మంది అభయారణ్యం కోరారు. ఈ ఘర్షణలు ‘ప్రేహ్ విహేర్’, ‘తామున్ థామ్’ ఆలయాల చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. థాయ్‌లాండ్, కంబోడియా మొదట కాల్పులు ప్రయత్నించిందని ఆరోపించింది. దీనికి ప్రతిగా కంబోడియా సోవియట్ -(పిఎంఎన్ -2 )ల్యాండ్‌మైన్‌లు వేసిందని ఆరోపించింది. ఈ యుద్ధంలో చైనా, అమెరికా వంటి శక్తులు తలదూర్చాయి. చైనా కంబోడియాకు మద్దతుగా నిలిచింది. అమెరికా థాయ్‌లాండ్‌ను సమర్థించింది. జులై 28న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుదేశాల నాయకులతో ఫోన్ కాల్స్ చేసి సీజ్ ఫైర్‌కు ప్రయత్నించాడు. అక్టోబర్‌లో కౌలాలంపూర్‌లో ట్రంప్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కలిసి విస్తృత శాంతి ప్రకటనకు సంతకం చేశారు. కానీ మధ్యలోనే నవంబర్‌లో థాయ్‌లాండ్ శాంతి చర్చలను ఆపేసింది.

దానితో డిసెంబర్‌లో మరోసారి దాడులు మొదలయ్యాయి. ఈ యుద్ధం 500 మైళ్ల సరిహద్దులోని అనిర్ణిత ప్రాంతాల నుండి ఉద్భవించింది, ఫ్రెంచ్ మ్యాపులు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి.ఈ కారణాలు బహుముఖాలు. మొదట, వలస వారసత్వం. ఫ్రెంచ్ మ్యాపులు థాయ్‌లాండ్‌కు అన్యాయమని భావిస్తున్నారు. రెండవది, సాంస్కృతిక గుర్తింపు సమస్యలు ‘ప్రేహ్ విహేర్ ఖ్వమర్’ (కంబోడియా), ఖ్మేర్-సియాం (థాయ్) చరిత్రలో పాలుపంచుకుని ఉంది. ఇది రెండు దేశాల్లోనూ గౌరవ యుద్ధంగా మారింది. నిజానికి… ఈ ఘర్షణలు కేవలం సైనిక సమస్య కాదు. ఇది రాష్ట్రీయవాద సమస్యలు. రెండు దేశాలు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పును పూర్తిగా అమలు చేసి, సరిహద్దు మ్యాపులను తిరిగి సవరించాలి. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు మధ్యవర్తిత్వం చేయాలి. శాంతి చర్చలను పునఃప్రారంభించి, ఆలయాన్ని ఉమ్మడి వారసత్వంగా చేస్తే, ఈ ప్రాంతం సమృద్ధి సాధించగలదు. లేకపోతే, ఈ ఘర్షణలు మరిన్ని నష్టాలకు దారితీస్తాయి. 

– డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

కాలపరీక్షకు నిల్చిన భారత్-రష్యా మైత్రి

భారత్ష్య్రా 23 వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ అరుదెంచడం యావత్ ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పైనే ఉంది. ఈ సదస్సు ప్రక్రియ 2000 సంవత్సరం లో ప్రారంభమైన తరువాత పుతిన్ పర్యటన నాలుగేళ్ల విరామం చేసుకోవడం ఇంతవరకు లేదు. అగ్రరాజ్యం అమెరికా సహా నాటో కూటమి లోని అన్ని దేశాలకు చుక్కలు చూపిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించడం అమెరికాతోపాటు పొరుగున ఉన్న పాకిస్థాన్ నిశితంగా గమనిస్తోంది. భారత దేశానికి చిరకాల మిత్ర దేశంగా ఉన్న రష్యా గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌కు రక్షణ, సాంకేతిక పరిజ్ఞాన, తదితర రంగాల్లో సహాయం అందిస్తోంది. పుతిన్ తాజా పర్యటనతో భారత్ రష్యా మధ్య ఏయే రంగాల్లో ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయన్నది ఆసక్తిగా మారింది.

ఇప్పుడు ఉభయ దేశాల ప్రభుత్వాల మధ్య వ్యూహాత్మక పరస్పర ప్రయోజన ఒప్పందాలు పది వరకు, అలాగే వాణిజ్య, వాణిజ్యేతర సంస్థల మధ్య 15 ఒప్పందాలు మొత్తం 25 ఒప్పందాలు కుదురుతాయని తెలుస్తోంది. ఇవి కాక ఈ సదస్సులో రెండు లక్షాలు తెరపైకి వస్తాయని చెబుతున్నారు. మొదటిది ద్వైపాక్షిక సంబంధాలను నడిపించే నాయకత్వం, రెండోది రష్యా ఉక్రెయిన్ యుద్ధ నివారణకు చేస్తున్న ప్రయత్నాలపై సమీక్ష. ద్వైపాక్షిక సంబంధాల విషయానికి వస్తే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు కాలపరీక్షకు నిలబడుతున్నాయి. సోవియెట్ యూనియన్ పతనమైనా, భారత్‌అమెరికా సంబంధాలు బలపడినా, 2020లో చైనా భారత్ సరిహద్దుల మధ్య సంఘర్షణలు చెలరేగినా, ఉక్రెయిన్ యుద్ధం, ఆపై అమెరికా, పశ్చిమదేశాల ఆంక్షలు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల భారం అత్యధికంగా పెంచినా సరే రష్యాతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు ఏమాత్రం చెక్కుచెదరలేదు. అగ్రదేశాల ద్విధ్రువత్వం, ఏకధ్రువత్వం, బహుళ ధ్రువత్వ ప్రచ్ఛన్న యుద్ధాల నుంచి ఈ ద్వైపాక్షిక బంధాలు ఎదురొడ్డి నిలిచాయి.

స్టాక్ మార్క్‌ట్ విషయంలో భారతీయ విదేశీ విధానానికి రష్యా ఒక ఆస్తి వంటిదే. ఎలాంటి మెరుపులు లేకపోయినా, నిదానమైన, స్థిరమైన, ఊహించదగిన రాబడులను రష్యా అందిస్తోంది. గత 15 సంవత్సరాలుగా భారత్ రష్యా సంబంధాలు రూపాంతరం చెందాయి. రక్షణ రంగ సహకార సాపేక్ష ప్రాముఖ్యం నిదానంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ, కొత్త రంగాల్లో సహకారం పెరుగుతోంది. చారిత్రకంగా భారత్ రష్యా మధ్య రాజకీయ, వ్యూహాత్మక సంబంధాలు వాటి వాణిజ్యం, ఆర్థిక భాగాలకంటే అతీతమైనవి. ఇతర ప్రధాన దేశాలకన్నా ఇవి భిన్నమైనవి. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు ఎంతో నిగూఢంగా ఉన్నాయి. ఉదాహరణకు రష్యాకు భారత్ నుంచి ఎగుమతులు బంగ్లాదేశ్ కన్నా తక్కువగానే ఉన్నాయి. ఇంధన రంగంలో ఉభయదేశాల పరస్పర పెట్టుబడులు అమితంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సదస్సులో భారత్ భావి ప్రగతికి అవసరమైన ఇంధనం, ముడి వనరులు, కీలకమైన ఖనిజాలు, ఎరువులు, ఫార్మాక్యూటికల్స్, వ్యవసాయం, సముద్రమార్గాల అనుసంధానం, తదితర ముఖ్యమైన అంశాలపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు. భారత్ నుంచి మానవ వనరులను రష్యాకు పంపించడం అత్యంత ప్రభావితం చేస్తోంది. పుతిన్ పర్యటన లోని రెండో ప్రధాన లక్షం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింప చేయడం. ఈ విషయంలో రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఈ మేరకు అమెరికా, రష్యా అధ్యక్షులతో భారత్ చర్చల పరంపర కొనసాగిస్తూనే ఉంది .

ఈ ప్రయత్నాలు ఫలించినా, విఫలమైనా ప్రపంచ దేశాల మధ్య సమతుల్యతకు భంగం కలగకూడదు. ఐరోపా దేశాల ఉద్రిక్తతలు భారత్‌కు తెలుసు. ఇందులో భారత్ ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. భారత్ ఎప్పుడూ ఉక్రెయిన్ విషయంలో శాంతి ఒప్పందం కుదరాలనే ఆకాంక్షిస్తోంది. అదే భారత్ విదేశాంగ విధానం. వాస్తవానికి ఉక్రెయిన్ చుట్టూ అత్యంత సంక్లిష్ట అంశాలు ముడిపడి ఉన్నాయి. రాజకీయ మార్గం ద్వారా శాంతి వైపు చర్చలు జరపడమే పరిష్కార సూత్రం. శాంతి ప్రక్రియవైపు పుతిన్‌ను ప్రోత్సహిస్తున్నప్పటికీ అమెరికాతో పుతిన్ చర్చించేటప్పుడు భారత్ వినడమే తప్ప మరేం చేయడానికి వీలుపడదు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందం కుదిరి అమెరికారష్యాల మధ్య సంబంధాలు తిరిగి బలపడితే అవి భారత్ విషయంలో భౌగోళిక రాజకీయ వేదికను మార్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు బెడిసికొడితే మనం పూర్తి స్థాయి రెండో ప్రచ్ఛన్న యుద్ధం వైపు చూడవలసి వస్తుంది.

మరోవైపు రష్యా ఎప్పుడూ భారత్‌ను కీలక భాగస్వామ్య దేశంగానే పరిగణిస్తోంది. తన స్వప్రయోజనాలను ఆసియా లోని చైనాకు బలిపెట్టడానికి ఇష్టపడడం లేదు. మాస్కో దృష్టిలో చైనా రష్యాకు సంఘీభావం తెలుపుతూనే ఐరోపా దేశాలతో సంబంధాలను తెంచుకోవడం లేదు. ఈ విధంగా చైనా లాభపడడం రష్యాకు నష్టదాయకంగానే ఉంటోంది. సుదీర్ఘకాలంలో చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్న ఆలోచనతో రష్యా ఉంటోంది. భారత్ మాదిరి అమెరికా చైనా మధ్య మైత్రీ బంధాలు ఎలా ఉంటున్నాయో రష్యా గమనిస్తోంది. చైనాతో ట్రంప్ జి2 వ్యూహం రూపొందించుకోవడానికి ఆలోచిస్తున్నారు. అంటే అమెరికా, చైనా రెండూ ఒకే బాట, మాటపై ఉంటే ఏదైనా సాధించవచ్చని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. అయినాసరే అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నా రష్యాతో సంప్రదించకుండా చైనా ఉండదు. ఏదెలాగున్నా మనం ఇప్పుడు పొత్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇప్పుడు భారత్ష్య్రా మధ్య సాగుతున్న చర్చలు గొప్ప వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి దారి చూపిస్తాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది. 

మరో రెండు ఉపద్రవాలు

ప్రపంచానికి గాజా, ఉక్రెయిన్ అనే రెండు సమస్యలు చాలవన్నట్లు వెనిజుయేలా, జపాన్ రూపంలో రెండు కొత్త సమస్యలు తయారవుతున్నాయి. ఈ నాలుగింటికి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలతో నిమిత్తం ఉండటం గమనించదగ్గది. సంవత్సరాలుగా సాగుతున్న గాజా, ఉక్రెయిన్ యుద్ధాల గురించి తెలిసిందే. ఇపుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లుండి దక్షిణ అమెరికాలోని వెనిజుయేలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో లేని పేచీలు మొదలుపెట్టారు. మరొకవైపు, అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన జపాన్ అధ్యక్షురాలు సనే తకాయిచీ అదే పద్ధతిలో చైనాతో అక్కరలేని తగవును లేవనెత్తారు. గాజా విషయం తెలిసిందే. ఆ ప్రాంతం పాలస్తీనాలో భాగం. పాలస్తీనాను 27 సంవత్సరాల క్రితం బలవంతంగా విభజించి ఇజ్రాయెల్‌ను సృష్టించిన పాశ్చాత్య కూటమి, ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడగలవని స్వయంగా ప్రకటించి కూడా, ఆ మేరకు ఐక్యరాజ్య సమితిలో తీర్మానించి కూడా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.

పాలస్తీనా ప్రజలు అందుకు ఆగ్రహించటం వల్ల ఆవిర్భవించిందే గాజా ప్రాంతంలో హమాస్ చేసిన తిరుగుబాటు. స్వతంత్ర పాలస్తీనాకు అనుకులంగా ప్రపంచమంతా గొంతెత్తినా లెక్కచేయని ఇజ్రాయెల్, అమెరికాలు, గాజా ప్రాంతాన్ని, వెస్ట్ బ్యాంక్‌ను కూడా ఆక్రమించి ఇక పాలస్తీనా దేశమున్నదే లేకుండా చేయాలని రకరకాల కుయుక్తులు పన్నుతున్నాయి. దీనంతటిలో అమెరికా అధ్యక్షుని ప్రత్యక్ష పాత్ర ఉంది. ఉక్రెయిన్ విషయానికి వస్తే, ఆ సమస్య పరిష్కారానికి ట్రంప్ పలు విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు పైకి తోస్తుంది. కాని వాస్తవంలో ఆ సమస్యకు మూలమే అమెరికా. అందులో వ్యక్తిగతంగా ట్రంప్ పాత్ర కూడా ఉంది. సోవియెట్ యూనియన్, దానితో పాటు వార్సా సైనిక కూటమి 1991 లో రద్దయిన వెనుక ఇక ప్రచ్ఛన్న యుద్ధమంటూ లేని స్థితిలో, పాశ్చాత్య దేశాల ‘నాటో’ సైనిక కూటమిని కూడా రద్దు చేయటానికి బదులు అమెరికా, యూరప్ కలిసి అదే విధంగా కొనసాగించాయి. నాటో రద్దు కాకపోయినా కనీసం మరింత విస్తరించబోమంటూ రష్యాకు ఇచ్చిన హామీని ఉల్లంఘించి, ఇంకొక 12 దేశాలను కొత్తగా చేర్చుకుని రష్యా సరిహద్దుల వైపు విస్తరించాయి.

అదే క్రమంలో ఉక్రెయిన్‌ను కూడా నాటోలో చేర్చుకుని రష్యాను ఇక పూర్తిగా చక్రబంధంలోకి తెచ్చే ప్రయత్నం సాగటం వల్ల మాత్రమే ఆ ప్రమాదాన్ని నిరోధించేందుకు ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైంది. ఉక్రెయిన్, యూరప్‌లను ట్రంప్ ఇపుడు తప్పు పడుతున్నారు గాని, వాస్తవానికి ఆయన గత పర్యాయం అధ్యక్షునిగా ఉన్నపుడు నాటో విస్తరణకు అనుకూలురే. దానినట్లుంచితే, ఈసారి అయినా ఉక్రెయిన్ యుద్ధ పరిసమాప్తికి ఆయన ప్రయత్నాలు దోబూచులాట వలెనే ఉన్నాయి తప్ప ఖచ్చితమైన విధానం కనిపించదు. చివరకు ఏమి జరిగేదీ, ఎప్పుడు జరిగేదీ తెలియకుండా కొనసాగుతున్నదా సమస్య. పాలస్తీనా వలెనే ఉక్రెయిన్ సమస్య కూడా అమెరికా నాయకత్వాన పాశ్చాత్య దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఉనికిలోకి వచ్చి కొనసాగుతున్నాయి.

అవి రెండు అట్లుండగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు వెనిజుయేలా పై దాదాపు యుద్ధ సన్నాహాలనదగ్గవి మొదలుపెట్టారు. ఆయన తన ఎన్నికల ప్రచార సమయంలో, ఎన్నికైన తర్వాత కూడా, తను యుద్ధాలకు వ్యతిరేకమని, జరుగుతున్న యుద్ధాలను ఆపగలనని ప్రకటించారు. కొన్ని యుద్ధాలను ఆపినట్లు కూడా చెప్పుకున్నారు. కాని ఇపుడు వెనిజుయేలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై కత్తిగట్టారు. అందుకు ఏకైక కారణం ఆయన సోషలిస్టు కావటం. మదురో కన్నా ముందు అధ్యక్షుడు అయిన హ్యూగో ఛావేజ్ కూడా సోషలిస్టే. ఆయన అమెరికాను బలంగా వ్యతిరేకించారు. లాటిన్ అమెరికా మొత్తాన్ని అమెరికా మొదటి నుంచి పూర్తిగా తన నియంత్రణలో ఉండవలసిన ప్రాంతంగా పరిగణిస్తూ వస్తున్నది. అటువంటి చోట తనను ఏ దేశం ఎంతమాత్రం ధిక్కరించినా, స్వతంత్రంగా వ్యవహరించినా అక్కడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో జోక్యం చేసుకుని ఆ ప్రభుత్వాలను పడగొట్టడం, తమకు అనుకూలురను అధికారంలోకి తేవటం ఒక సర్వసాధారణ క్రీడగా మారింది. ఆ విధంగా గత 200 సంవత్సరాలలో కనీసం 20 సార్లు జోక్యం చేసుకున్నారు. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో విషయంలో వైఫల్యం, చిలీలో అలెండీ ప్రభుత్వ పతనం కేసులు సుప్రసిద్ధమైనవి. ఈ చర్యలు అన్నింటికి అన్నీ అమెరికన్ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం చేసినవే.

ఆయా ప్రభుత్వాలు వామపక్ష సిద్ధాంతాలు గలవి. అయితే ఇక చెప్పనక్కర లేదు. వెనిజుయేలాకు సంబంధించి ఈ రెండు కారణాలు కలిసి వచ్చాయి. ఛావేజ్ సోషలిస్టు కాగా, ఆయన వారసుడు మదురో కూడా సోషలిస్టు. ఇక ఆ దేశంలో చమురు నిల్వలు మొత్తం ప్రపంచంలోనే సౌదీ అరేబియాను కూడా మించి అత్యధికం కాగా, అమెరికన్ కంపెనీల చేతిలో ఉండిన ఆ నిల్వలను ఛావేజ్ జాతీయం చేశారు. మదురో అదే విధానాన్ని కొనసాగించటంతో, ట్రంప్ తన మొదటి పాలనా కాలంలోనే ఆయన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. అవే ప్రయత్నాలు ఈ రెండవ విడత పాలనలో కొనసాగిస్తున్నారు. అయితే అందుకు ఒక సాకును ముందుకు తెచ్చారు. అది, వెనిజుయేలా నుంచి కొకైన్, ఫెంటానిల్ తదితర మాదకద్రవ్యాలు అమెరికాకు రవాణా అవుతున్నాయని, అటువంటి ఉత్పత్తి, రవాణా సంస్థకు స్వయంగా మదురో అధిపతి అన్నది ట్రంప్ ఆరోపణ. కాని అది ఎంత మాత్రం నిజం కాదని మదురో నిరాకరించటమే కాదు. అమెరికా సహా ఇతర పాశ్చాత్య స్వతంత్ర సంస్థలు, నిపుణులు కూడా కాదనటం గమనించదగ్గది. కాని ట్రంప్ వంటి ధోరణి గల నాయకులకు ఏ విషయంలోనూ నిజానిజాలతో నిమిత్తం లేదన్నది ఈసరికి ప్రపంచానికి అర్థమైపోయిన విషయం. అందుకు అనుగుణంగానే ఆయన మదురోపై నిరాధారమైన ఆరోపణలు, అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే హెచ్చరికలు చేయటం మొదలుపెట్టారు. వెనిజుయేలా సమీపానికి, కరిబ్బియన్ సముద్రంలోకి ఇప్పటికే యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు పంపారు. వెనిజుయేలాలో రహస్య కార్యకలాపాలు సాగించవలసిందిగా సిఐఎను ఆదేశించినట్లు బహిరంగంగానే ప్రకటించారు.

మదురోను పడగొడితే అయిదు కోట్ల డాలర్లు ఇవ్వగలమంటూ అక్కడి సైన్యాధికారులకు ఆశపెట్టారు. ఇక ఇటీవల అయితే, మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నాయని ఆరోపిస్తూ సుమారు 20 వెనిజులా పడవలపై వైమానిక దాడులు జరిపి, దాదాపు 80 మందిని చంపించారు. అవన్నీ మామూలు మత్సకారుల పడవలని మదురో ప్రకటించారు. ఆ పడవలలో మాదక ద్రవ్యాలున్నట్లు ఆధారాలేమిటని అమెరికన్ మీడియా ప్రశ్నించగా ట్రంప్ జవాబు ఇవ్వలేకపోవటం గమనించదగ్గది. దానితో ఆయనపై అమెరికాలోనే విమర్శలు మొదలయ్యాయి. తన చర్యలు అమెరికా చట్టాలకు, అంతర్జాతీయ చట్టాలకు కూడా విరుద్ధమని నిపుణులు ఎత్తిచూపారు. దీనికిదే సమస్య కాగా, కొద్ది రోజుల క్రితం ఒక పడవపై దాడిలో కొందరు మరణించిన తర్వాత ఇద్దరు ఇంకా జీవించి ఉండగా, మరొక విడత దాడి జరిపి వారిని కూడా చంపివేయటంతో రిపబ్లికన్ సహా అమెరికన్ సెనెటర్లు సైతం తీవ్ర విమర్శలు చేస్తూ, అందుకు రక్షణ మంత్రి పీట్ హెగ్ సెట్‌పై విచారణ జరపగలమని ప్రకటించారు. ఎవరూ మిగలకుండా దాడి చేయాలని సైన్యాన్ని ఆయన ఆదేశించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది.

అటువంటి రెండవ దాడిని తాను సమర్థించబోనని స్వయంగా ట్రంప్ వ్యాఖ్యానించటం విశేషం. ఈ వివరాలు ఎట్లున్నా, అసలు ఈ పరిణామాలన్నిటికి మూలం లాటిన్ అమెరికాకు వ్యతిరేకంగా ట్రంప్ సామ్రాజ్యవాదంలో ఉందన్నది తిరుగులేని వాస్తవం. మరొక వైపు, జపాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన తకాయి ఒకవేళ చైనా సైన్యం తైవాన్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే, తైవాన్‌కు మద్దతుగా, తమ ఆత్మరక్షణ కోసం, తమ సైన్యాన్ని పంపగలమని ప్రకటించి ఒక పెద్ద వివాదాన్ని సృష్టించారు. తైవాన్ చైనాలో భాగమనే ఒకే చైనా విధానాన్ని స్వయంగా జపాన్ కూడా పాటిస్తున్నప్పుడు ఇటువంటి ప్రకటన చేయటం చైనాకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

దానితో వెంటనే తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ, జపాన్‌కు ఆర్థికపరమైన నష్టాలు కలిగించే చర్యలు తీసుకోవటం ఆరంభించింది. ఒకవేళ జపాన్ సైనిక చర్యలకు పాల్పడినట్లయితే ఆ దేశాన్ని ధ్వంసం చేయగల సైనిక శక్తి తమకున్నదని చైనా సైన్యం వరుస హెచ్చరికలు జారీ చేస్తున్నది. ఈ ఆకస్మిక పరిణామాలు జపాన్‌లోనే గాక, ప్రపంచమంతటా పెద్ద కలకలం సృష్టించాయి. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో జపాన్ ప్రధాని ఇటువంటి ప్రకటనలు చేయటం పట్ల ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అమెరికా మద్దతు లేనిదే, మద్దతు ఉందన్న ధైర్యం లేనిదే, జపాన్ వంటి దేశం చైనా వంటి దేశంపై ఇటువంటి వైఖరి తీసుకోజాలదని వేరే చెప్పనక్కర లేదు. రెండు దేశాల మధ్య యుద్ధం జరగకపోవచ్చుగాక, కాని లోగడ చైనాను, తైవాన్‌ను కూడా ఆక్రమించిన చరిత్ర గల జపాన్ తిరిగి ఈ విధంగా వ్యవహరించటం ప్రమాదకర సంకేతాలను పంపుతున్నది.

టంకశాల అశోక్

దూరదృష్టి

దార్శనికుడు అంబేద్కర్

చాలా మంది మేధావులు, విద్యావేత్తలు సమాజాన్ని మార్చాలనుకుంటారు. అందుకోసం ఎన్నో అన్వేషణలు, విశ్లేషణలు చేస్తుంటారు. అందుకు గల కారణాలను, పరిష్కారాలను సూచించాలని భావిస్తారు. అందుకోసం సత్యాన్వేషణ చేస్తారు. కాని కొందరు మాత్రమే ఆ సత్యానికి సమీపంలోకి వస్తారు. ఆ సమాజం దశ దిశను మార్చడానికి ఒక తాత్వికతను అందిస్తారు. అటువంటి వాళ్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు. భారతదేశ సామాజిక నేపథ్యానికి సరిపోయే సిద్ధాంతాన్ని, ఆచరణను, చట్టపరమైన శక్తిని అందించారు.

భారత దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకు బాబా సాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఎందుకు సరియైన సమాధానాన్ని అందించారు? ఇది అందరికీ రావాల్సిన ప్రశ్న. దానికి బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం, అనుభవాలు ప్రేరణ.

కుటుంబం, ఉపాధ్యాయుల రోజువారీ దిన చర్యలు, అందించిన చైతన్యం దానికి ఒక ఉత్ప్రేరకం. అంతేకాకుండా ఆయన అమెరికాలో అభ్యసించిన చదువు ఆయనను ఒక తాత్వికుడుగా మలిచాయి. ఆ తాత్వికత దాదాపు నలభై సంవత్సరాల రాజకీయ, సామాజిక జీవితంలో ఎన్నో సవాళ్లను, సంకటాలను అధిగమించి రెండు వేల సంవత్సరాల కుల వ్యవస్థ విషపు కోరలను పీకగలిగే సమరశక్తిని అందించాయి. బాల్యంలో, విద్యార్థి దశలో ఆయన అనుభవించిన కుల వివక్ష, అమానుషమైన అంటరానితనం ఒక అనుభవాన్ని అందించింది. కుల వివక్ష, అంటరానితనం, పుట్టుపూర్వోత్తరాలను శోధించే ఆలోచనను కలిగించాయి. దానికి కుటుంబంలో నిత్యం బోధించే కబీర్ తత్వాలు ఒక పునాదిగా ఏర్పరిచాయి. అనుభవం, ఆలోచనల నుంచి కులం గురించి అధ్యయనం చేయాలనే కాంక్షను రగిలించాయి. దానికి అమెరికా చదువు ఉపయోగపడింది. అందులో ముఖ్యంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గురువు ప్రముఖ విద్యావేత్త, జాన్ డ్యూయి ప్రతిపాదించిన ప్రజాస్వామ్య తత్వశాస్త్రం సిద్ధాంత బలాన్ని కలిగించింది. ఆ తర్వాత బాబా సాహెబ్ అంబేద్కర్ భారత దేశానికి తిరిగి వచ్చి ఆచరణ రూపకమైన కార్యాచరణను రూపొందించుకున్నారు. అది భారత దేశ రూపురేఖలను మార్చివేసింది.

భారతదేశ సమాజం ఆనాడు కులవివక్ష, అంటరానితనం చాలా దుర్మార్గంగా సమాజాన్ని పట్టిపీడిస్తున్నది. అందుకే ఆయన మొదట సామాజిక అన్వేషణ కులం పుట్టుకపైన సాగించారు. 1916లోనే కులం పుట్టుక పైన ఒక సిద్ధాంత వ్యాసాన్ని పరిశోధన పత్రంగా సమర్పించారు. అందులో కులం పుట్టుకకు ప్రధానమైన కారణం సమాజంలో చదువు, జ్ఞానం కలిగిన ఒక వర్గం తమ స్వార్థం, ఆధిపత్యం కోసం తమను తాము వేరుపరుచుకొని, తామే ఉన్నతులమని ప్రకటించుకోవడం వల్ల కులానికి బీజాలు పడ్డాయని, అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ఆ వర్గమే పూజారి వర్గం, ఆ తర్వాత బ్రాహ్మణులుగా తమకు తాము గిరి గీసుకొని తమ చుట్టూ కంచే వేసుకున్నారని, ఇది మిగతా తెగలకు ఒక నమూనాగా మారిందని కూడా అంబేద్కర్ తేల్చి చెప్పారు. అయితే కుల వ్యవస్థ హిందూ మతం బోధనలు, మత గ్రంథాల మీద ఆధారపడి ఉన్నదని, అంటరానితనం కూడా అందులో భాగమేనని అంబేద్కర్ వివరించారు.

ఈ పరిశోధన అనంతరం మరొక ఇరవై సంవత్సరాల తర్వాత కుల నిర్మూలన జరగకుండా భారత సమాజంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే భావనలకు స్థానం లేదని కూడా అంబేద్కర్ స్పష్టం చేశారు. కుల నిర్మూలన అంబేద్కర్ ప్రాథమిక లక్షం.

అయితే అందరి లాగా కుల సమస్య కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదని, ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైన సమస్యల కలయికగా చూడాలని కూడా అంబేద్కర్ ప్రకటించారు. అంబేద్కర్ 40 సంవత్సరాల రాజకీయ, అధ్యయన, పోరాట జీవితంలో ఈ విషయం మీదనే అధ్యయనం, ఆచరణ సాగించారు.

కులంలో ఆర్థిక దోపిడీ, సామాజిక అణచివేత, రాజకీయ ఆధిపత్యం కలగలిపి ఉన్నాయి. కులం పుట్టుకకు కారణమైన బ్రాహ్మణ వర్గం ఈ మూడు అంశాలను తమ గుప్పిట్లో పెట్టుకొని చాతుర్వర్ణంలోని క్షత్రియ, వైశ్య వర్ణాలను తనతో భాగస్వామ్యం కల్పించింది. అందువల్ల కులాధిపత్యంలో ఒకరికి ముగ్గురు తోడయ్యారు. అందువల్ల కుల సమస్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలుగా విస్తరించింది. అందువల్ల బాబా సాహెబ్ అంబేద్కర్ మూడు సమస్యలకు మూడు పరిష్కారాలను చెప్పారు.

మొదటిగా సామాజిక సమస్యలైన విద్య, ఉపాధి, ఉద్యోగాలకు అంటరాని కులాలకు, ఇతర వెనుకబడిన కులాలకు, ఆదివాసులకు ప్రత్యేక ఏర్పాట్లు జరగాలని, దానికి ఆయా రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించారు. దీని వల్ల ఇప్పటి వరకు విద్య, విజ్ఞాన రంగాల్లో వేళ్లూనుకునిపోయిన వర్గాలతో సమానంగా ఎదగడానికి ఉపయోగపడుతుందని భావించారు.

అదే విధంగా రాజకీయంగా ప్రాతినిధ్యం వహించడానికి ఆధిపత్య కులాలతోపాటు ప్రభుత్వ విధి విధానాలలో పాల్గొనడానికి, విధిగా అణగారిన వర్గాలకు ఓటు హక్కుతో పాటు రాజకీయ పదవులను అందుకోవడానికి రాజకీయ రిజర్వేషన్లు డిమాండ్ చేశారు. వీటితోపాటు ఆర్థికంగా, స్వశక్తిగా ఎదగడానికి ఆర్థిక సహాయంతోపాటు, దేశంలోని భూమిని, పరిశ్రమలను, ఆర్థిక సంస్థలైన బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను జాతీయం చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ అంశాలు మాత్రం రాజ్యాంగంలోకి రాకుండా ఆనాటి జాతీయ నాయకులంతా అడ్డుకున్నారు.

కుల వివక్ష, అంటరానితనం తొలగించడానికి కొన్ని రక్షణ చట్టాలను ప్రతిపాదించారు. ఇవన్నీ రాజ్యాంగంలోకి వచ్చాయి. బాబా సాహెబ్ అంబేద్కర్ తన అధ్యయనంతో కూడిన ప్రతిపాదనలన్నింటిని సాధించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అందులో కొన్నింటిని రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయత్నించి సఫలీకృతమయ్యారు. మరి కొన్ని విషయాలను ఆయన రాజ్యాంగంలోకి తీసుకు రాలేకపోయారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ లక్షం కులరహిత సమాజం. దానికి పైన పేర్కొన్న చర్యలు సాధనాలు మాత్రమే. రాజ్యాంగ రచన కూడా అందులో భాగమే. కేవలం రాజ్యాంగం మాత్రమే అంబేద్కర్ లక్షం కాదు.

బాబా సాహెబ్ అంబేద్కర్ లక్షం కుల నిర్మూలన అనే విషయాన్ని మనం ఇప్పటికే చెప్పుకున్నాం. పైన పేర్కొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులతో పాటు కులానికి మూల కారణమైన హిందూమతం తనను తాను సంస్కరించుకోవాలని ప్రతిపాదించారు. కులం, అంటరానితనం మనుగడకు హిందూ ధర్మశాస్త్రాలే కారణమని ఆయన బలమైన విశ్వాసం. ధర్మ శాస్త్రాలన్నింటా కులం, బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం ఇమిడి ఉన్నాయని, వాటిని తిరగరాయాలని, వివక్ష, అణచివేత, వెలివేత లాంటి అంశాలను ప్రతిపాదించే విషయాలను అందులో నుంచి తొలగించి ఒక ప్రత్యేకమైన గ్రంథం రూపొందించాలని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాకుండా హిందూమతంలో పూజారి వ్యవస్థను సంస్కరించాలని హిందువులలో అందరికీ పూజారి అయ్యే అవకాశం ఉండాలని, దానికి ప్రభుత్వం ఒక బోర్డును స్థాపించి, ఎవరైతే హిందూమతం విధానాలకు అర్హులవుతారో వారిని ప్రభుత్వమే నియమించాలని కూడా తన కుల నిర్మూలన పుస్తకంలో పేర్కొన్నారు.

ఇటువంటి విధానాలు మాత్రమే కులాన్ని నిర్మూలిస్తాయని పేర్కొన్నారు. అందువల్లనే బాబా సాహెబ్ అంబేద్కర్ సంస్కర్తగా కాకుండా విప్లవకారుడుగా నిలిచారు. కుల వివక్షపైన మహాత్మాగాంధీతో పాటు ఎంతో మంది వ్యాఖ్యానాలు చేశారు. కాని ఎవ్వరూ ఇటువంటి విప్లవాత్మకమైన పరిష్కారాన్ని చూపలేకపోయారు. బాబా సాహెబ్ అంబేద్కర్ తాత్కాలిక ఉపశమనాలతో పాటు సంపూర్ణంగా మార్చివేయగలిగే విప్లవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందువల్ల బాబా సాహెబ్ అంబేద్కర్ చాలా మంది సంస్కర్తలకు భిన్నంగా భారతదేశ దశ దిశ నిర్దేశకుడుగా, సామాజిక విప్లవకారుడుగా చరిత్రలో నిలిచిపోయారు. చరిత్రలో ఒకడిగా కాకుండా తానే ఒక చరిత్రగా నిలిచిపోయాడు.

మల్లేపల్లి లక్ష్మయ్య

దర్పణం

ఎందుకింత అసహనం?

మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ హిందూ దేవతలను అవమానించారని బిజెపి, దాని అనుబంధ భావజాలం కలిగిన కొందరు నానారభస చేస్తున్నారు. ఈ మధ్య హిందూమతం మీద కానీ, దేవీదేవతల మీద కానీ ఎవరేం మాట్లాడినా వీళ్లు వెంటపడుతున్నారు. ఆ మాట్లాడిన దానితో సంబం ధం లేకుండానే వీళ్ల మనోభావాలు దెబ్బతినడం మనదేశంలో మాత్రమే కనిపించే ఎనిమిదవ వింత. మనోభావాలు అంటే ఏమిటో, అవి ఎలా ఉంటాయో వీళ్ళయినా పాపం ప్రజలకు ఏనాడూ చెప్పిన పాపాన పోలేదు. ప్రజలకెవరికీ లేని, రాని మనోభావాల గొడవ సదరు గుంపు వారికే కలగటం వారికి రాజకీయంగా సంక్రమించిన హక్కు కావొచ్చు. ముఖ్యమంత్రి మాటల దగ్గరకి వస్తే -ఆయన హిందూమతం లోని బహు దేవతారాధనను ప్రస్తావించారు. ఎవరికినచ్చిన దేవుణ్ణి వారు మొక్కుతారు అన్నట్టు మాట్లాడారు.

ఎవరి మనస్తత్వానికి దగ్గరగా వుండే దేవుడిని వారు మొక్కుతారని అన్నారు. ఇదంతా ఆయన కేవలం దైవసంబంధమైన చర్చలో భాగంగా మాట్లాడింది కాదు. ఆనాటి సభలో కాంగ్రెస్ పార్టీలో గల స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ, పార్టీలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారని చెప్పి, దానికి సమర్థనగా మాత్రమే ఈ ప్రస్తావన తెచ్చారు. ఆయన ఉద్దేశంలో తప్పు లేదు. ఆయన మాటల్లో కూడా తప్పులేదు. దేవతలను కించపరచటం అన్న సమస్యే అందులో లేదు. కానీ ఈ రభస చేస్తున్న వాళ్లకు మాత్రం అందులో తప్పు కనిపించింది. ఇదే గమ్మత్తు. మొన్న నాకు దేవుని మీద నమ్మకం లేదన్న పాపానికి దర్శకుడు రాజమౌళిని ఇలాగే ఇబ్బందిపెట్టారు. ముఖ్యమంత్రి దేవుళ్లను విశ్వసించని వ్యక్తి కూడా కాదు. ఆయన కూడా హిందువే కదా! ఫలానా పార్టీలో ఉన్న హిందువులు మాత్రమే నిజమైన హిందువులుగా, మిగిలిన వారు కానట్టుగా, వాళ్లకు మతం మీద కానీ, దేవుళ్ళ మీద కానీ మాట్లాడే హక్కు లేదన్నట్టుగా ఉంది వీళ్ల ప్రవర్తన. ఆలయాల్లోకి తోటి హిందువులైన దళితులను అనుమతించకుండా అవమానిస్తుంటే దాని మీద స్పందించకుండా మౌనవ్రతాన్ని పాటించే ఈ అపర భక్తశిఖామణులు ఇట్లాంటి అనవసర రాద్ధాంతాలు దేవుళ్ల పేరుతో చేయటంలోని ఆంతర్యం ఏమిటో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వీళ్లకు మతం మీద రాజకీయాలు చేయటం తప్ప ప్రజల కష్టనష్టాలు పట్టవు. సదరు వ్యక్తులు తమ రాజకీయ జీవితంలో ప్రజలకోసం కనీసం ఒక్క శాతమైనా సమయాన్ని కేటాయించారో లేదో తెలియదు.

కానీ తొంభై తొమ్మిది శాతం మాత్రం ఈ మత రాజకీయాలకే కేటాయిస్తారు. అయితే హిందూమతం మీద గుత్తాధిపత్యం ఉన్నట్లుగా మాట్లాడే వీళ్లకు ఆ మతం తాలూకు చరిత్ర, దాని లోతులు గానీ తెలియవు. తెలిసే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల కోసం వాడుకోవడం తప్ప మతాన్ని అధ్యయనం చేసి దాని సారాన్ని ప్రజలకు తెలియజేయాలనే సంకల్పం ఉన్నవాళ్లు కాదు. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామంచంద్రా’ అని ఆవేదనతో భక్త రామదాసు పలికిన మాటల్లో భక్తి లేదా? నిష్కల్మషమైన భక్తితో తిన్నడు శివునికి మాంసం నైవేద్యంగా సమర్పించటాన్ని ఎవరైనా దోషంగా చూడగలరా? ఇట్లాంటి ఉదంతాలు హిందూమతంలో కుప్పలుగా దొరుకుతాయి.

భక్తికి సంబంధించి ప్రాచీన కాలం నుంచి ఎవరి మార్గం వారికుంది. భాగవతంలో ప్రస్తావనకు వచ్చిన నవవిధ భక్తిమార్గాలకు తోడుగా అనేక మార్గాలు దేవుడనే భావనచుట్టూ రూపొందాయి. దేవుడికి, భక్తునికి మధ్య ఇలాంటివాళ్ల జోక్యం ఎందుకో మరి? మొన్నటికి మొన్న గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారక్కల్ని అవమానిస్తూ వాళ్ళసలు దేవుల్లే కాదన్నాడు చినజీయర్ స్వామి. ఇప్పుడు నానాయాగి చేస్తున్న ఈ గుంపులోని వారు ఒక్కరూ నోరెత్తలేదు. షిరిడి సాయిబాబా మీద ఒక వర్గం వారు కించపరుస్తూ మాట్లాడినప్పుడు వీళ్ల మనోభావాలు దెబ్బతినలదు. కోట్లాది హిందువులు అటు సమ్మక్క సారక్కలను, ఇటు సాయిని కొలుస్తున్న సంగతి వీళ్లకు తెలియదా? మతం మీద శ్రద్ధ వల్లనో, దేవుని పట్ల భక్తి చేతనో వీళ్ళు రోడ్లెక్కటం లేదు. కేవలం రాజకీయాలలో భాగంగానే మతాన్ని, దేవుళ్లను పావులుగా వాడుకుంటున్నారు. మతానికి మేమే రక్షకులం అన్నట్టు వీళ్లకు వీళ్ళే కితాబిచ్చుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో మతం కానీ, దేవుళ్ళు కానీ వారి స్వంత ఆస్తి. అందుకే దేవతల ప్రస్తావన ఎవరు తెచ్చినా అందులో ఉన్న సమాచారంతో సంబంధం లేకుండా వారి మీద అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి సాధారణ ప్రజల మద్దతు ఉన్నదనే భ్రమల్లో వాళ్ళున్నారు. పాపం వాళ్ళది భ్రమ అన్న సంగతి వాళ్లకు ఎప్పుడర్థమవుతుందో?

తోకల రాజేశం

96767 61415

సం‘గ్రామం’లో గెలిచేది బీసీలే!

దివంగత కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా 1985లో ఒక మాట చెప్పారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్రం కేటాయించే ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే అర్హులకు చేరుతున్నాయని, మిగతా 85 పైసలు అవినీతి, అధికార యంత్రాంగపు లోపభూయిష్ట విధానాల కారణంగా వృథా అయిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో అట్టడుగు పేదవర్గాలు అధిక శాతం నివసించేది గ్రామాల్లోనే. రాజీవ్ గాంధీ ఆరోజు చేసిన ప్రకటన ఎంత ప్రాచుర్యం పొందిందంటే చివరకు సుప్రీంకోర్టు కూడా ఒక దశలో ఆధార్ కు సంబంధించిన ఒక తీర్పులో ఆయన ప్రకటనను ఉటంకిస్తూ కేంద్రం కేటాయించే నిధులు పేద ప్రజలకు చేరాల్సిన చారిత్రక అవసరం పారదర్శకంగా నెరవేరాలంటే ఆ నిధులు మధ్యలో గల్లంతయ్యే పరిస్థితి లేకుండా నేరుగా లబ్ధిదారుడికి అందే డీబీటీ విధానాన్ని సూచించింది.

భారతదేశం గ్రామాల్లో ఉంటుందని కదా అంటాం. అటువంటి గ్రామాల్లో స్వపరిపాలన జరగాలనే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోరుకున్నారు. అందుకే గ్రామపంచాయతీలకు రాజకీయ ప్రమేయం లేని ఎన్నికలు జరుగుతుంటాయి. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి, అక్కడ నివసించే పేదల సంక్షేమానికి పాటుపడే వారిని ఎన్నుకోవాలి. తెలంగాణరాష్ట్రంలో ప్రస్తుతం గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పంచాయతీల గడువు ముగిసి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో కేంద్రంనుంచి గ్రామ పంచాయతీలకు రావలసిన దాదాపు 2,800 కోట్ల రూపాయల నిధులు ఇప్పుడయినా ఎన్నికలు జరపకపోతే రాకుండా పోతాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పక్షం ఆ విషయం చెబుతుండగా కొద్దిమంది ఎన్నికల నిలుపుదలను కోరుతూ కోర్టును ఆశ్రయించడం దుర్మార్గం. వెనుకబడిన తరగతుల ఛాంపియన్లమని చెప్పుకునేవారు కొందరు ఆ నిధులు పోతే పోయాయి తమ రిజర్వేషన్ల సంగతి తేలేదాకా ఎన్నికలు జరపడానికి వీల్లేదని ప్రకటనలు, హెచ్చరికలు చేయడం కూడా చూస్తున్నాం.

2019లో పంచాయతీ ఎన్నికలు జరిగాక ఆ ఐదేళ్ల కాలంలో గ్రామాలకు సక్రమంగా నిధులు అందక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగా తమ సొంత డబ్బు ఖర్చు చేసి అప్పులపాలై గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులలో ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక 60 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్న విషయం ఇక్కడ ఒకసారి వీరికి గుర్తు చేయాలి.ఈ మాట్లాడుతున్న వారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కావాలంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాలి కాబట్టి అక్కడ పోరాటం చేద్దామని, అక్కడి పెద్దల మీద ఒత్తిడి తెద్దామని ఆలోచించడం లేదు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని చట్టం చెబుతున్నది. మొత్తానికి రాజకీయ రణగొణ ధ్వని ఎక్కువైపోయింది పంచాయతీల ఎన్నికల నిర్వహణ విషయంలో.

డిసెంబర్ ఆఖరులోగా గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ప్రస్తుత ఎన్నికల నిలుపుదలను అంగీకరించలేమని స్పష్టంగా చెప్పేసింది కాబట్టి ఇక ఎన్నికలు ఆగే పరిస్థితి అయితే లేదు. నిన్న శనివారంతో మొదటి దశ నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోయింది. ఎన్నికలు ఎలాగూ జరుగుతాయి కాబట్టి రాజకీయ పార్టీలన్నీ తమ శక్తియుక్తుల్ని గ్రామపంచాయతీలను కైవసం చేసుకునేందుకు ఉపయోగిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏకగ్రీవాల తంతు కూడా మొదలైంది.గ్రామాభివృద్ధి పేరిట సర్పంచి పదవుల అమ్మకాలు రాజకీయ పక్షాల పరోక్ష మద్దతుతోనే జోరందుకున్నాయి.

2028లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవాలంటే ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరగబోయే మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు తదితర అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ బలం పెంచుకోవాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, పదేళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్ష స్థానంలోకి మారిన భారత రాష్ట్ర సమితి, ఎలాగైనా తెలంగాణలో బోణీ చేయాలని తహతహలాడిపోతున్న భారతీయ జనతా పార్టీల మధ్య ఈ సంకుల సమరం ప్రారంభమైంది.

తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా మిగతా అన్ని కులాల కంటే అధికమన్న విషయం తెలిసిందే. అందుకే ఈ స్థానిక పోరు సందర్భంగా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ బీసీ రిజర్వేషన్లను అస్త్రంగా ప్రయోగిస్తున్నాయి. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు నిర్ణయిస్తూ తీర్మానం చేయడం, ఉత్తర్వులు జారీ చేయడం, గవర్నర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలకు తామే న్యాయం చేయగలమని చెప్పే విషయంలో ఒక అడుగు ముందున్నది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీలు లేకపోవడంతో కోర్టులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేయడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన కేంద్రం దగ్గర పెండింగ్ లో పడటం కాంగ్రెస్ కు కలిసి వచ్చిన అంశం. స్థానిక సంస్థలలో కొంత బలం పెంచుకుని, వచ్చే ఎన్నికల నాటికి తమ సత్తా చాటాలనుకునే భారతీయ జనతా పార్టీ మాత్రం అయోమయంలో పడింది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రంలో మాట్లాడుతున్న నేతలు, ఆందోళనలు సాగిస్తున్న వాళ్ళు కేంద్రాల్లో తామే అధికారంలో ఉన్నామన్న మాట మర్చిపోకూడదు కదా. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం పోరాడిన నాయకుడిగా పేరు ఉండి, కొంతకాలం తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేసి, ఒక పర్యాయం ఆ పార్టీ శాసనసభ్యుడిగా ఉండి, తర్వాత వై యస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడై ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోగానే రాజీనామా చేసి బిజెపిలో చేరి, ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడైన ఆర్. కృష్ణయ్య బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే తె లంగాణలో ఉద్యమాలు, ఆందోళనలు చేయడం కాదు.. ఢిల్లీలోని తన పార్టీ పెద్దల్ని ఒప్పించి పార్లమెంటులో రా జ్యాంగ సవరణ చేయిస్తే సరిపోతుంది కదా. ఇది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి, సంజయ్ కి, ఆ పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన మిగిలిన ఆరుగురు పార్లమెంట్ స భ్యులకూ, ఇతర నాయకులకూ వర్తిస్తుంది. ఇటీవలే ము గిసిన జూబ్లీహిల్స్ శాసనసభస్థానం ఉపఎన్నిక కిషన్‌రెడ్డి లోక్‌సభస్థానం పరిధిలోనిదికాబట్టి దాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉండేది, అది జరగలేదు.

ఇప్పుడివి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు కాబట్టి తన శక్తిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇటీవలే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన రామచంద్ర రావు మీద పడింది. బిజెపి పరిస్థితి ఇలా ఉంటే బీఆర్‌ఎస్ స్థితి వర్ణనాతీతం. వరుస ఓటములు, అగ్ర నాయకుడు క్రియాశీలకంగా లేని పరిస్థితి, వెలికి గురైన కుటుంబసభ్యురాలు సంధిస్తున్న అవినీతి అస్త్రాలు, పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తత కలగలిసి ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక బీసీల రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీ చేస్తున్న వాదనలో పస లేదు. బీసీ రిజర్వేషన్లు 17 శాతం ఇచ్చారని ప్రతిపక్షాలు, లేదు, లేదు.. గిరిజన గ్రామ పంచాయతీలను తీసేస్తే (అక్కడ రిజర్వేషన్లు వర్తించవు కాబట్టి) బీసీ రిజర్వేషన్లు 21.39 శాతం అని ప్రభుత్వపక్షం వాదిస్తున్నాయి. ఎనిమిది జిల్లాల్లో గతంలో కన్నా బీసీ రిజర్వేషన్లు పెరిగాయని అధికారిక అంచనా.

తెలంగాణలో అధిక శాతం జనాభాగా ఉన్న వెనుకబడిన తరగతులను మచ్చిక చేసుకోవడానికి నానా అవస్థలూ పడుతున్న రాజకీయ పక్షాలు ఒక విషయం మర్చిపోతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్లకంటే అధికంగానే బీసీలు తెలంగాణ గ్రామపంచాయతీలలో గెలుపొందుతున్నారన్నది వాస్తవం. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎక్కువ సంఖ్యలో కనీసం గ్రామపంచాయతీల సర్పంచులు, మండల పరిషత్‌లలో ఎంపీటీసీలవరకైతే అధిక సంఖ్యలో బీసీలు ఎన్నికవుతున్నారు. 2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రాతినిధ్యానికి సంబంధించిన వివరాలే కనుక చూసినట్లయితే తెలంగాణలో 12,728 గ్రామపంచాయతీల్లో 2625 పంచాయతీలు మాత్రమే బీసీలకు రిజర్వు కాగా 4274 మంది సర్పంచులు బీసీకి చెందినవారే గెలిచారు. అంటే రిజర్వేషన్ కంటే దాదాపు రెట్టింపు. సహజంగానే ఎక్కువ జనాభా ఉన్న కులాలవారే ఈ గ్రామస్థాయి ఎన్నికల్లో గెలుపొందడానికి అధికంగా అవకాశాలు ఉంటాయి. శాసనసభ, లోకసభ స్థానాల దగ్గరికి వచ్చేసరికి తక్కువ జనాభా ఉన్న అగ్రకులాల వారే ఎక్కువమంది ఎన్నికయి చట్టసభలకు వెళుతూ ఉండవచ్చు కానీ గ్రామపంచాయతీల స్థాయిలో పరిస్థితి భిన్నమని ఈ లెక్కలే చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కులాల వారి గణాంకాలు బయటకు వచ్చినప్పుడు ఈ విషయం మరోసారి స్పష్టం కాక మానదు. కాబట్టి బీసీల రిజర్వేషన్ల అంశం ఇకనైనా పక్కన పెట్టి రాజకీయపక్షాలు తమ మద్దతుదారులను ఎలా గెలిపించుకోవాలో ఆలోచిస్తే మంచిది.

చివరగా, 1981ప్రాంతాల్లో టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకసారి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడిన వెంటనే వివిధ రాజకీయ పక్షాలు ఎవరెన్ని గెలిచారో లెక్కలు వేసుకోవడంలో తలమునకలై ఉండగా ముఖ్యమంత్రి అం జయ్య మాత్రం నదురుబెదురు లేకుండా గెలిచినవాళ్లంతా మా కాంగ్రెస్ వాళ్ళే అని ప్రకటించేశారు. పార్టీరహిత ఎన్నికలు కాబట్టి అధికారంలో ఉన్న అంజయ్యకు ఆ మాటలు కలిసి వచ్చాయి. అంజయ్య అన్నారని కాదు గాని, మరో మూడేళ్లు అ ధికారంలో ఉండే పార్టీతో వైరం పెట్టుకుని గ్రామపంచాయతీల సర్పంచులు సమస్యలు ఎందుకు కొని తెచ్చుకుంటారు? అధికార పార్టీకి జై అంటే సరిపోదా. రేపు గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంజయ్య మాటనే తిరిగి వల్లె వేస్తే సరిపోతుంది.

Delete Edit

బిజెపికే సింహభాగం

బీహార్‌లో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రిమండలి కూర్పులో కానీ, మంత్రి పదవుల కేటాయింపులో కానీ జెడి(యు) కన్నా బిజెపి ఆధిపత్యమే స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరువాత రెండోస్థానంలో జెడి(యు) పార్టీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని జెడి(యు) సుప్రీం నితీశ్‌కుమార్ తిరిగి పొందగలిగారు. అయినప్పటికీ తన ఇరవై ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానంలో మొట్టమొదటిసారి ఇప్పుడు హోం శాఖపై తన ఆధిపత్యానికి అవకాశం లేక దూరం కావలసి వచ్చింది. బిజెపికి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రుల్లో ఒకరైన సమ్రాట్ చౌదరి ఇప్పుడు అత్యంత అధికార శక్తియుతమైన హోంశాఖ పగ్గాలు చేపట్టారు. అలాగే బిజెపికి చెందిన మరో ఉపముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా రెవెన్యూ, భూసంస్కరణలు, గనులు, భౌగోళిక విభాగాల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదంతా పాలనా విభాగాలపై బిజెపి నియంత్రణను మరింత బలోపేతం చేసింది. అంటే నితీశ్ కుమార్‌ను ఒక విధంగా బలహీనుడిని చేయడమే. మొత్తం 26 మంత్రి పదవుల్లో 14 బిజెపి పట్టులోనే ఉన్నాయి. ఆరోగ్యం, న్యాయం, రోడ్ల నిర్మాణం, అర్బన్ డెవలప్‌మెంట్, వ్యవసాయం వంటి కీలకమైన శాఖలు బిజెపి నియంత్రణలో ఉండటం విశేషం.

బిజెపి తన మిత్రపక్షం జెడి(యు) సోపానక్రమాన్ని తనకు అనుకూలంగా తారుమారు చేయడంలో అత్యంత సమర్థవంతంగా, చాకచక్యంగా నిర్ణయాత్మకమైన చర్య తీసుకోగలిగింది. 2020 లో బిజెపి పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ నితీశ్‌కుమార్ మంత్రివర్గంలో కీలకమైన శాఖలను తన వద్దనే ఉంచుకోగలిగారు. ఇదివరకటి అసెంబ్లీలో సామాజిక న్యాయం అనే ముఖ్యమైన సూత్రం ప్రకారం జెడి(యు) కు తన మిత్రపక్షం ఆర్‌జెడికి చోటు కల్పించడానికి అవకాశం ఉండేది. అయితే ఈసారి నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ సాధించిన అఖండ విజయం బిజెపిని అగ్రస్థానంలో పటిష్టంగా ఉంచగలగడమే కాక, సాధ్యం కాకపోయినా జెడి(యు) ద్వారా ప్రత్యామ్నాయాల అన్వేషణను కష్టతరం చేసింది. నితీశ్‌కుమార్ అనారోగ్యంతో పోరాటం సాగిస్తున్నారు. అయినా బిజెపికి నితీశ్ తప్పనిసరిగా అనివార్యం అవుతున్నారు. మరోవైపు బిజెపి తన దీర్ఘకాలిక మార్గాన్ని సుస్థిరం చేసే ప్రయత్నంలో ఉంటోంది. సామాజిక వర్గాలకు జెడి(యు) యే తమకు అనుకూల వేదిక అన్న నమ్మకం ఉన్నప్పటికీ ఆయా సామాజిక వర్గాలకు చేరువ కావడానికి బిజెపి విస్తారమైన లోతైన కులాల సంకీర్ణాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తోంది.

లాలూప్రసాద్ యాదవ్‌కు ఒకనాటి అత్యంత విధేయుడైన రామ్‌కృపాల్ యాదవ్‌ను బిజెపి ఇప్పుడు అక్కున చేర్చుకుని యాదవ సామాజిక వర్గానికి కూడా బిజెపిలో చోటు ఉందన్న సంకేతాలను అందించింది. సామాజిక వర్గాలను బుజ్జగించడం, పరిపాలనా యుక్తి, తదితర వ్యూహాలతో బీహార్ రాజకీయాల్లో బిజెపి తనకు తాను కేంద్ర స్థానంగా నిలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ రాష్ట్రంలోని 21 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేలా మొత్తం రూ. 2100 కోట్లు బదిలీ చేశారు. ఇది ప్రతి మహిళా ఓటరుకు రూ. 10 వేలు వంతున ఆర్థిక సాయం చేయడమే . అందుకే ఎన్‌డిఎ కూటమి విజయంలో మహిళలే కీలక పాత్రదారులయ్యారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి ఊరించే పథకాలతో అభివృద్ధి జరగదు. ఇప్పుడు ముందున్న అసలైన సవాలు చక్కని పరిపాలన.ఇదివరకటి తమ పరిపాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం, ఆదరణ ఉన్నందునే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగలిగామని బిజెపి వాదించవచ్చు.

కానీ బీహార్ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉందన్నది వాస్తవం. బీహార్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నితీశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదెంతవరకు సాధ్యమో ఇప్పుడు ఆలోచించవలసి ఉంది. గత రెండేళ్లుగా ప్రభుత్వ విభాగాల్లో రిక్రూట్‌మెంట్ జరగడం లేదు. ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహించే పరీక్షల్లో పేపర్‌లీక్, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి, నోటిఫికేషన్ల జారీలో విపరీత జాప్యం ఇవన్నీ గత కొన్నేళ్లుగా వెంటాడుతున్నాయి. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం బీహార్‌లో 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగ రేటు 20.1 శాతం ఉండగా, అదే వయసువారిలో జాతీయ నిరుద్యోగ సరాసరి రేటు 12.4 శాతం వరకు ఉంది. దీన్ని బట్టి బీహార్‌లో నిరుద్యోగం ఎలా తాండవిస్తుందో ఊహించాల్సిందే. కార్మిక భాగస్వామ్యం, వాస్తవానికి పనిచేస్తున్న లేదా పనికోసం నిరీక్షిస్తున్న వ్యక్తుల నిష్పత్తి దేశం మొత్తం మీద అత్యల్పంగా ఉంది.

15 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్న యువత వంద మందిలో కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మహిళల విషయానికి వస్తే ఆ సంఖ్య ఇంకా తక్కువ. ఉద్యోగాలు, ఉపాధి కరువై లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు వలసపోవడం సర్వసాధారణం. అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కొని బీహార్ రాష్ట్రాన్ని ఎలా ముందుకు ప్రగతి పథంలో కొత్త మంత్రి మండలి తీసుకెళ్తుందో ఒక అగ్నిపరీక్ష. దేశ జనాభాలో పదోవంతు జనాభా బీహార్ రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రపురోగతి సానుకూలంగా యావత్ దేశాన్నే ప్రభావితం చేస్తుంది. ఇప్పటివరకు పాలనలో లోపాలు కనిపిస్తున్నా అవన్నీ నిజాయితీగా సరిదిద్ది చక్కని పాలన అందిస్తారని ఓటర్లు ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎన్‌డిఎ కూటమికి పట్టం కట్టారు. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ పాలన వల్లనే ప్రగతి సాధ్యం అనే నినాదం పదేపదే వల్లెస్తోంది. మరి ఈసారి అదెంతవరకు ఆచరణలో నెరవేరుతుందో చూడాలి. 

మిస్టర్ జస్టిస్..మిగిలిన పెండింగ్‌ల మాటేమిటీ?

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పదిమంది శాసనసభ్యుల అనర్హత విషయమై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రానున్న నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి అని తీవ్రంగా వ్యాఖ్యానించడంతో ఎక్కడెక్కడ, ఏ ఏ వ్యవస్థల్లో, ఎన్నెన్ని కేసులు, పిటిషన్లు ఏళ్ళుపూళ్ళు గడిచిపోయినా, కాల పరిమితి ముగిసినా తుది నిర్ణయం రాకుండా పడి ఉన్నాయో, ఎంతమంది ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్న చర్చ జరగాల్సిన అవసరం ఏర్పడింది. ఇవ్వాళే జస్టిస్ బిఆర్ గవాయ్ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తుండటం కాకతాళీయం.

తెలంగాణ స్పీకర్ చేసింది తీవ్రమైన కోర్టు ధిక్కారమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి అనడం అంటే నాలుగు వారాల్లోగా పార్టీ ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకోకపోతే జైలుకు పంపుతామని చెప్పడమే కదా. పార్టీ ఫిరాయింపుల మీద తాము విధించిన మూడు మాసాల గడువు దాటిపోయినా ఒక నిర్ణయం తీసుకోనందుకు తెలంగాణ స్పీకర్ మీద ఆగ్రహించిన ఇదే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తో కూడిన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పార్లమెంట్ లేదా వివిధ రాష్ట్రాల శాసన సభలూ ఆమోదించిన బిల్లులను త్వరగా పరిష్కరించాలని కోర్టులు జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నది. బిల్లులను సుదీర్ఘ కాలం పెండింగ్‌లో పెట్టుకునే అధికారం గవర్నర్‌లకు లేదంటూనే కోర్టులు గడువు విధించలేవని చెప్పింది. తమ పరిధిలో నిర్ణయాలు తీసుకునే విషయంలో రాజ్యాంగ వ్యవస్థలకు కాల పరిమితి అంటూ ఏమీ నిర్దిష్టంగా లేదు. గురువారం నాడు సుప్రీం కోర్టు కొద్ది కాలం క్రితం రాష్ట్రపతి లేవనెత్తిన సందేహాలకు ఇచ్చిన రాజ్యాంగ పరమయిన వివరణ లేదా విశ్లేషణతో ఆ విషయం అర్థ్ధం అవుతున్నది. న్యాయస్థానాలు, రాష్ట్రపతి, గవర్నర్‌లు, పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్ వ్యవస్థలు తమకు సంక్రమించిన రాజ్యాంగ పరిధిలో తీసుకునే నిర్ణయాలకు రాజ్యాంగం లేదా చట్టాలూ స్పష్టమైన కాల పరిమితి ఏదీ విధించలేదు.

ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న కనీసం నాలుగు రాష్ట్రాలలో 33 బిల్లులు గవర్నర్‌ల ఆమోదం కోసం వేచిచూస్తున్నాయి. ఇందులో అత్యధికంగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఈ జాప్యం రాష్ట్ర ప్రభుత్వాలూ గవర్నర్‌ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఎటువంటి వివరణ లేకుండా సుదీర్ఘ కాలం బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్‌ల మీద సుప్రీం కోర్టు గడప తొక్కిన విషయం జగద్విదితం. పశ్చిమ బెంగాల్ ఉదాహరణే మళ్ళీ తీసుకుంటే ఆ రాష్ట్రం లో 2022 నుండి ఏడు బిల్లులు, 2023 నుండి ఒక బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ బిల్లులన్నీ యూనివర్శిటీ చట్టాలకూ, పట్టణ గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించినవి.

అసంఖ్యాకంగా వచ్చే కోర్టు కేసులు కూడా పరిష్కరించడానికి రాజ్యాంగం స్పష్టంగా కాలపరిమితి ఏదీ విధించలేదు. న్యాయ వ్యవస్థ తానే రూపొందించుకున్న విధానాలు, నిబంధనల ఆధారంగా వ్యవహరిస్తుంది. అయితే విచారణ వేగవంతంగా జరగాలన్న అంశం రాజ్యాంగం లోని ఆర్టికల్ 21తో ముడిపడి ఉండటమేకాక కేసుల వాయిదాల సంఖ్యా తగ్గించే క్రమంలో నిబంధనల్లో మార్పులు చేయడం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలు కొంత అక్కర కొస్తున్నాయి.

వాస్తవ పరిస్థితుల మీద ఒకసారి దృష్టి సారిస్తే దిగువ కోర్టుల్లో నాలుగు కోట్ల అరవై లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారిక లెక్కలు చెపుతున్నాయి. వివిధ హైకోర్టులలో 63 లక్షలు, సుప్రీం కోర్టు లో 87 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ ఈ ఏడాది జులై 31 నాటి గణాంకాలు. దిగువ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అధిక భాగం భూతగాదాలకు సంబంధించినవే కావడం విశేషం.

శాసన, న్యాయ వ్యవస్థలు రెండు రాజ్యాంగబద్ధమైన సంస్థలే. రెండు వ్యవస్థల అధికారాలు దేనివి దానికే ఉంటాయి. పార్టీ ఫిరాయింపుల మీద ఏ కారణం చేతనైనా ఒకవేళ తెలంగాణ శాసనసభ అధ్యక్షుడు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోలేకపోతే నిజంగానే ఆయనను జైలుకు కూడా పంపే అంతటి కఠిన నిర్ణయం సుప్రీం కోర్టు తీసుకునే అవకాశం ఉందా! అది న్యాయ వ్యవస్థ పరిధిని దాటి ఉంది అనిపించడం లేదా అన్న చర్చ జరుగుతున్నది. మరి వివిధ కోర్టు లలో పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న కోట్లాది కేసుల గురించి ఏం చెబుతారు. తెలంగాణ స్పీకర్ మీద సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య తీర్పులో భాగంగా వెలువరించింది కాదు. వాదనలు సాగుతున్న సమయంలో చేసిన వ్యాఖ్య మాత్రమే. సరే ఈలోగా గత రెండు మూడు రోజులుగా తెలంగాణ స్పీకర్ పదిమంది శాసనసభ్యుల ఫిరాయింపు వ్యవహారంలో విచారణ కూడా వేగవంతం చేశారు. నాలుగు వారాల్లోగా ఒక నిర్ణయం జరుగుతుందని స్పీకర్ తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన ఇద్దరు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, ముకుల్ రోహాత్గి కూడా సుప్రీం కోర్టు ధర్మాసనానికి హామీ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం అంతిమంగా ఎలా ఉంటుందో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

తెలంగాణ అసెంబ్లీ లో ప్రస్తుతం ఓ పదిమంది శాసన సభ్యులు భారత రాష్ట్ర సమితి నుండి అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అనర్హత వేటు పడుతుందేమో అన్న అనుమానం రావడంతో కండువా కప్పుకుంటే, నియోజక వర్గం అభివృద్ధి పనులకోసం ముఖ్యమంత్రిని కలిస్తే, సరదాగా కబుర్లు చెప్పుకుని చాయ్ తాగడానికి పిసిసి సభ్యుడిని కలిస్తే పార్టీ మారినట్టా అని బుకాయిస్తున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్టు 2014 లో రాష్ట్రం ఏర్పడి తాము అధికారం లోకి వచ్చిన దగ్గరినుండి అధికారం కోల్పోయే దాకా బిఆర్‌ఎస్ ఉజ్జాయింపుగా ఓ 38 మంది శాసన సభ్యులను ఇతర పార్టీల నుండి చేర్చుకున్న విషయం ఎవరయినా మరిచిపోతారా. అట్లా అని ప్రస్తుతం ఫిరాయించిన వారిని సమర్థించాల్సిన అవసరం లేదు. అయినా రాజకీయాల్లో నైతికత కోసం వెతకడం ఏమిటి నేతి బీరకాయల్లో నెయ్యి కోసం వెతికినట్టు.

అయితే ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన వారిలో ఇద్దరి మీద మాత్రం వేటు తప్పనిసరి. అందులో ఒకరు ఖైరతాబాద్ శాసన సభ్యుడు దానం నాగేందర్, ఆయన 2023 లో బిఆర్‌ఎస్ తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికై 2024 లోక సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచి ఓడిపోయారు, పార్టీ మారిన ఆధారం స్పష్టంగానే ఉంది. ఈయన కాంగ్రెస్ నుండి తెలుగుదేశం పార్టీకి, అక్కడి నుండి మళ్ళీ కాంగ్రెస్‌కు తిరిగి బిఆర్‌ఎస్‌కు, ఇప్పుడు తిరిగి సొంత గూడు అంటూ కాంగ్రెస్‌కు చేరుకున్నారు ప్రజా సేవ కోసం.

ఇక రెండో నాయకుడు కడియం శ్రీహరి, వీరు 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా స్టేషన్‌ఘనపూర్ నుండి గెలిచి ప్రజా సేవ కోసమే అధికార పక్షం లో చేరారు. అయితే కూతురికి కాంగ్రెస్ లోకసభ స్థానం నుండి టికెట్ ఇప్పించుకుని ఆమె గెలుపు కోసం కృషి చేయడం వల్ల అనర్హత తప్పేట్టు లేదు. శ్రీహరి రాజకీయాలతోబాటు పార్టీ ఫిరాయించడంలో కూడా సీనియర్‌యే. తెలుగుదేశం నుండి భారత రాష్ట్ర సమితికి అక్కడి నుండి కాంగ్రెస్‌కు మారారు.

వీరిరువురూ వేటు పడక ముందే రాజీనామా చేస్తారని వార్తలొస్తున్నాయి. స్పీకర్ మీద సుప్రీం కోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యం లో ఒకవేళ వేటు పడితే ఆరు నెలల వరకూ పోటీచేసే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉన్నందున తామే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని అనుకుంటున్నారని సమాచారం. మొన్ననే జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక గెలిచిన ఊపులో ఉంది అధికార పక్షం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా ఆ స్థానాన్ని పార్టీకి దక్కేట్టు చేసారు. ఆ పొరుగునే ఉన్న ఖైరతాబాద్ కూడా అదే ఊపులో గెలవచ్చన్న ధీమా ఉండొచ్చు. స్టేషన్ ఘనపూర్ గెలిస్తే కాంగ్రెస్ బలంలో ఒకటి పెరిగినట్టు, పోయినా అది ప్రతిపక్షానిదే కాబట్టి బెంగ లేదు.

మిగిలిన ఎనిమిది మంది శాసన సభ్యుల విషయంలో ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పశ్చిమ బెంగాల్‌లో జరిగింది చూసి కొంత ఉత్సాహం తెచ్చుకున్నది. ఇటీవల పశ్చిమబెంగాల్‌లో బిజెపి నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు ఫిరాయించిన శాసనసభ్యుడు ముకుల్‌రాయ్ బిజెపి వీడిపోయినట్టు ఆధారాలు లేవని ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రకటించడంతో బిజెపి వేసిన పిటిషన్ మీద హైకోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా ఒకవేళ అక్కడి స్పీకర్ లాగానే వీళ్ళంతా బిఆర్‌ఎస్ వీడిన ఆధారాలు లేవని తేల్చినట్టయితే కోర్టులు తమకు న్యాయం చేస్తాయన్నది ఆ పార్టీ ఆశ కావచ్చు. అదలా ఉంచితే ఒక విషయం ఇక్కడ తప్పనిసరిగా చర్చించాలి. 1985లో రాజ్యాంగ సవరణద్వారా ఏర్పాటైన పార్టీ ఫిరాయింపుల చట్టం పార్టీ ఫిరాయింపుల మీద శాసనసభ స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలి అన్న విషయంలో స్పష్టతనివ్వలేదు.

నిజానికి ఈ చట్టం ఎంతో లోపభూయిష్టంగా ఉన్నదనడానికి చట్టం అమల్లోకి వచ్చిననాటి నుండి నేటివరకు జరిగిన అనేక ఉదంతాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2004 2009 మధ్య అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పదిమంది శాసన సభ్యులు పార్టీ నిర్ణయాన్ని కాదని శాసనమండలి ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేసిన కారణంగా వారందరి మీద అనర్హత వేటు వేయాలని టిఆర్‌ఎస్ కోరినప్పటికీ ఆనాటి స్పీకర్ ఆ శాసనసభ పదవీకాలం ముగిసే వరకు ఈ వ్యవహారాన్ని తేల్చకుండా చివరకు 2009లో సమావేశాలు ముగింపుకొచ్చిన సమయంలో వారిని అనర్హులుగా ప్రకటించారు. ఇటువంటి ఉదాహరణలు మనకు దేశంలోని పలు శాసనసభల్లో, రాజ్యసభలో కూడా అనేకం కనిపిస్తాయి. 2019 లో ఎన్నికలలో ఓడిపోగానే తెలుగు దేశం రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన వైనం ఉదాహరణే కదా, అంతకు ముందు అధికారం లో ఉండగా ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌సిపి నుండి 23 మంది శాసన సభ్యులను, ముగ్గురు లోక్‌సభ సభ్యులను తెలుగుదేశంలో చేర్చుకుని ఓ నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు కదా చంద్రబాబు నాయుడు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యుడు పార్టీకి రాజీనామా చేయకుండానే అప్పటి టిఆర్‌ఎస్ మంత్రివర్గంలో సభ్యుడిగా చేరారు. పార్టీ ఫిరాయింపుల చరిత్ర ఈ రోజుదా, 1967 లో హర్యానాలో గయా లాల్ అనే శాసన సభ్యుడు పక్షం రోజుల్లో మూడు సార్లు పార్టీ మారాడు, కాంగ్రెస్ నుండి యునైటెడ్ ఫ్రంట్‌కు మళ్ళీ తిరిగి కాంగ్రెస్‌కు అది జరిగిన తొమ్మిది గంటల్లోనే మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్‌కు మారి ఆయారాం గయారాం అనే నానుడిని వాడుకలోకి తెచ్చారు. గెలిచి వచ్చిన పార్టీకి రాజీనామా చేయకుండా అధికార పక్షంలోకి వలసపోయిన సందర్భాలు పలు శాసనసభల్లో బోలెడు.

పార్టీ ఫిరాయింపుల విషయం అయినా, గవర్నర్‌ల దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లులయినా, కోట్లాది కోర్టు కేసులయినా ఏ మాత్రం జాప్యం లేకుండా పరిష్కారం అయిపోయే మార్గం ఆలోచించాల్సిందే తప్ప పరస్పర విమర్శల వల్ల ఫలితంలేదు. అన్ని వ్యవస్థలూ అంతిమంగా ప్రజలకే కదా జవాబుదారీగా ఉండాలి. అప్పుడప్పుడు ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పలు సమస్యలు చర్చకు వస్తాయి, పరిష్కారాల గురించి కూడా ఆలోచిస్తారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యానం నేపథ్యంలో తప్పనిసరిగా ఈసారి జరిగే స్పీకర్ల సమావేశం లో దీని మీద చర్చించి ఒక పరిష్కారాన్ని కనుగొంటే బాగుంటుంది.

Delete Edit

DeleteEdit

ట్రంప్‌పై ‘మాగా’ తిరుగుబాటు

అమెరికా అధ్యక్షపీఠాన్ని రెండవసారి అధిరోహించడానికి ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకువచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ ఉద్యమాన్ని నడపలేని నిస్సహాయతకు చేరుకోవడం తీవ్రమైన పరిణామం. అదే ఇప్పుడు ట్రంప్‌ను అల్లాడిస్తోంది. ఒకప్పుడు ‘వాషింగ్టన్ ఎస్టాబ్లిష్‌మెంట్’ను తీవ్రంగా ట్రంప్ విమర్శించేవారు. ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ట్రంప్ మాజీ అనుచరులే ప్రతినిధులయ్యారు. ఫెడరల్ ప్రభుత్వ విభాగాలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, కాంగ్రెస్ అధ్యక్ష భవనం, అత్యున్నత న్యాయస్థానం, తదితర అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నీ వాషింగ్టన్ ఎస్టాబ్లిష్‌మెంట్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ట్రంప్‌ను వ్యతిరేకించే మాజీ అనుచరులే ప్రతినిధులుగా ఉంటున్నారు. ట్రంప్‌ను ప్రశ్నించడమే కాక, ఆయనకు వ్యతిరేకంగా వెనక్కు నెట్టడానికి ‘మాగా’ ఛాంపియన్లు ప్రగతిశీల ప్రజాస్వామ్యవాదులతో కలిసి ఉమ్మడి వేదికను వెతుకుతున్నారు. లైంగిక అక్రమ రవాణాదారునిగా సంచలనం కలిగించిన జెఫ్రీఎపిస్టెయిన్ కేసులో పూర్తి పారదర్శకత కోసం మంగళవారం (18.11.25) నాడు రిపబ్లికన్లు, డెమొక్రాటిక్ సభ్యులు ఏకమై తమ నాయకత్వాలపై ఒత్తిడి తీసుకురావడం ఊహించని పరిణామం. జెఫ్రీఎపిస్టెయిన్ 2019లో కస్టడీలో ఉంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.

జెఫ్రీఎపిస్టెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోసహా అనేక ప్రముఖ అగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎపిస్టెయిన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను విడుదల చేయించడంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లు, సెనేట్ ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఈ దర్యాప్తు ఫైళ్లను విడుదల చేయడానికి ఒకప్పుడు ట్రంప్ ఇష్టపడలేదు. కానీ నవంబర్ 17న వెనక్కు తిరిగి చూసి ఈ ఫైళ్లను దాచడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించడమే కాక, ఈ బిల్లుకు ఓటు వేయాలని బహిరంగంగా రిపబ్లికన్లకు పిలుపు ఇచ్చారు. ఇదివరకు రిపబ్లికన్లు ఈ విషయంలో మాగాకు వ్యతిరేకంగా ట్రంప్‌పై సవాలు విసిరారు. కానీ దానికి ఎక్కువగానే మూల్యం వారు చెల్లించుకోవలసి వచ్చింది. 2021 జనవరి 6 న అమెరికా పార్లమెంట్ భవనంపై దాడి జరిగిన తరువాత ట్రంప్‌పై అభిశంసనానికి ఓటు వేసిన కనీసం నలుగురు రిపబ్లికన్ చట్టసభ్యులు వారి ప్రాథమిక ఎన్నికల్లో మాగా మద్దతు ఉన్న అభ్యర్థుల చేతిలో ఓడిపోవలసి వచ్చింది. మాగా తరఫున వీటో అధికారం కలిగిన ట్రంప్ ఆగ్రహం నుంచి కొంతమంది రిపబ్లికన్లు బయటపడగలిగారు. ఇప్పుడు ట్రంప్‌కు కొత్త సవాలు ఎదురవుతోంది. తాను సృష్టించి పెంచి పోషించిన రాజకీయ ప్రపంచమే తనకు దూరమైపోతోంది.

వాషింగ్టన్ ఎస్టాబ్లిష్‌మెంట్ లోని ప్రముఖ సంస్థల పదవులు, సంప్రదాయ రిపబ్లికన్లతో మమేకమవుతున్నాయని ఘోషిస్తున్నారు. అయితే దీన్ని నిరూపించడానికి ఆయనకు దక్షిణ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహంతో ఉన్న అనుబంధం తప్ప మరే ఆధారాలు లేవు. గ్రాహం 2026లో మళ్లీ ఎన్నికను ఎదుర్కోనున్నారు. 2016లో ట్రంప్‌కు బద్ధవిరోధిగా ఉండే గ్రాహం తరువాత ట్రంప్‌కు సన్నిహితుడైనా, మాగా అభ్యర్థి నుంచి ప్రాథమిక ఎన్నికల్లో సవాలు ఎదుర్కోబోతున్నారు. కానీ దేశంలో ప్రజాస్వామ్య తిరుగుబాటు వేగం పుంజుకుంటున్నందున ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. జార్జియాకు చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు మేర్జోరీ టైలర్ గ్రీన్ ఎపిస్టెయిన్ ఫైళ్ల విషయంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలిచారు. ఆమె మొదట్లో మాగా చాంపియన్‌గా ఉండేవారు. ట్రంప్ ఇప్పుడు ఆమెను దేశద్రోహి అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రిపబ్లికను థామస్, డెమొక్రాట్ రో ఖన్నాతో కలిసి కాంగ్రెస్ తరఫున ఆందోళన లేవనెత్తుతున్నారు. ఇటీవల అనేక పాలనా విధాన నిర్ణయాల్లో ట్రంప్ వైఖరి మారడం కూడా మాగా గ్రూపులో వ్యతిరేకత పెంచింది. హెచ్1 బి వీసా కార్యక్రమంపై అనేక ఆంక్షలు విధించిన ట్రంప్ ఇప్పుడు అమెరికాకు అత్యంత ముఖ్యమని ప్లేటు ఫిరాయించారు. చిప్స్, క్షిపణులు వంటి కీలకమైనవి తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన విదేశీయులకు తాను స్వాగతం పలుకుతానని ప్రకటించారు.

అమెరికాలో భారీ సంఖ్యలో ప్లాంట్లను నిర్మించనున్నామని, అందులో టెలిఫోన్లు, కంప్యూటర్లు, క్షిపణులు వంటివి తయారు చేస్తామని, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరైతే పంచుకుంటారో, ఎవరు ఈ నైపుణ్యాలను అమెరికన్లకు నేర్పిస్తారో వారికి స్వాగతిస్తామని నవంబర్ 20న ట్రంప్ వెల్లడించారు. ఇది మాగా సభ్యులకు అర్థం కావడం లేదని ఆక్షేపించారు. ఈ వైఖరి మాగా గ్రూపు వారికి అసంతృప్తి కలిగిస్తోంది. అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని ప్రకటనలు గుప్పించి, ప్రచారోద్యమం ద్వారా రెండోసారి పదవి లోకి వచ్చిన ట్రంప్ తమ వైఖరిని పూర్తిగా మార్చడం మాగా సభ్యులకు మింగుడుపడడం లేదు. దీనివల్ల మాగా ఉద్యమానికి ప్రాధాన్యం లేకుండా పోతుందని ఆగ్రహిస్తున్నారు. అమెరికాలో ఈ హెచ్ 1బి వీసా కార్యక్రమాన్ని నిరోధించే చట్టం తీసుకురావాలని రిపబ్లికన్ కాంగ్రెస్ నాయకురాలు గ్రీన్ తోపాటు మరికొందరు రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గాజాపై ఇజ్రాయెల్ దారుణంగా సాగిస్తున్న యుద్ధాన్ని నివారించకుండా ఇజ్రాయెల్‌కు ట్రంప్ బహిరంగంగా మద్దతు ఇవ్వడాన్ని కూడా కొందరు రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ట్రంప్‌కు అండదండలు అందించిన మాగా శిబిరం హెచ్1 బి వీసాలపైనే కాకుండా ఇజ్రాయెల్ యుద్ధంపై కూడా తిరుగుబాటు సాగిస్తోంది. లైంగిక రవాణాదారుడైన ఎపిస్టెయిన్ ఫైళ్ల దర్యాప్తు విషయంలో ట్రంప్ తలవంచినప్పటికీ, హెచ్1బి వీసాలు, ఇజ్రాయెల్ యుద్ధం సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చూడాలి 

పర్యావరణ వికసిత భారతం సాధ్యమా?

భారతదేశం ప్రపంచదేశాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. మన దేశం వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత, మౌలిక సదుపాయాల రంగాలలో విశేష ప్రగతి సాధిస్తోంది. వీటితోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా మన దేశం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2047 నాటికి భారతదేశం స్వాతంత్య్రం పొంది 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా అన్ని రంగాలో సమగ్రమైన అభివృద్ధి చెంది వికసిత భారత్ ( డెవలప్‌డ్ ఇండియా) గా మారడం మన ప్రధాన జాతీయ లక్ష్యం. ఇందుకు యువశక్తి , నారీశక్తి, పేదరికం, రైతులు అను నాలుగు అంశాలు ప్రధాన స్తంభాలు. ప్రకృతిని కాపాడటం, ప్రగతిని సాధించడం అనే రెండు దిశలను కలిపే భావనను వికసిత భారత్ అంటారు. భారత దేశాన్ని ప్రపంచంలో మొదటి మూడు అగ్ర ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుపటం, సేవా రంగం, వ్యవసాయ రంగాలలో సమానపురోగతి సాధించడం, పేదరిక నిర్మూలన మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, డిజిటల్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగాలలో ప్రపంచ నాయకత్వం సాధించడం, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్- ఇండియా ద్వారా యువతకు ఆవిష్కరణలలో అవకాశం కల్పించడం, రోడ్లు, రైల్వేలు, మెట్రో నగరాలు, గృహ నిర్మాణం, విమానాశ్రయాలు వంటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయటం, నూతన విద్యా విధానం- 2020 ద్వారా సృజనాత్మక ఆవిష్కరణాత్మక, నైపుణ్యవంతమైన యువతను తయారు చేయడం , ఆరోగ్య భద్రత కల్పించడం, గ్రీన్ ఎనర్జి వినియోగం, చెట్ల పెంపు, నీటి సంరక్షణ, గాలి కాలుష్యం నియంత్రణ, వాతావరణ మార్పులకు ప్రతిస్పందించేపద్ధతులు అను అంశాలు వికసిత భారత్‌కు ప్రధాన స్తంభాలుగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు అమలవుతున్న వనమహోత్సవం స్వచ్ఛదనం, -పచ్చదనం ఎకోటూరిజం, పర్యావరణ నిధి నిర్వహణ, గ్రీన్ స్కిల్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం, శుద్ధ సౌరశక్తి పథకం, క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్, సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, బయో డైవర్శిటీ రిజిస్టర్ , సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ పథకం, క్లైమేట్ చేంజ్ సెల్, తెలంగాణ నెట్ జీరో మిషన్, గ్రీన్ బిల్డింగ్ పథకం, లేక్ రీజునివేషన్ పథకాలు పర్యావరణ వికసిత భారత్‌కు ఆలంబనగా ఉన్నాయి. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ భవనాలు, పరిశ్రమలు కాదు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, పచ్చని ప్రకృతి, జీవవైవిధ్య, రక్షణ, పునరుత్పత్తి శక్తి వినియోగం కూడా అందులో భాగమేనని, ఈ తాత్విక చింతనతోనే మన దేశం పర్యావరణ వికసిత భారతం వైపు అడుగులు వేస్తోంది.

పచ్చని పర్యావరణం దిశగా భారత్

మన దేశానికి స్వాతంత్య్రం లభించి 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తి అయింది. 2022 నుండి 2047 మధ్య కాలాన్ని కేంద్ర ప్రభుత్వం అమృత కాలంగా ప్రకటించింది. ఈ కాలంలో మన దేశం వికసిత భారత్‌గా మారడానికి అనేక పథకాలు, కార్యక్రమాలు, సదస్సుల నిర్వహణ ద్వారా లక్ష్యసాధనలో దూసుకపోతోంది. తాజాగా నీతిఆయోగ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2025 న న్యూఢిల్లీలో 22 జులై 2025న గాంధీనగర్‌లో, 17 అక్టోబర్ 2025న న్యూఢిల్లీలో వికసిత భారత్‌పై జాతీయ సదస్సులు జరిగాయి. 19 మార్చి 2025న న్యూఢిల్లీలో వాతావరణ సంక్షోభంపై జరిగిన జాతీయ సదస్సులో పర్యావరణ అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరిగింది. స్వయం సమృద్ధ దేశం వైపు దేశీయ ఉత్పత్తి పెంపు కోసం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన దేశం కోసం స్వచ్ఛభారత్ అభియాన్, ప్రతి ఇంటికి తాగునీరు, నీటి వనరుల సంరక్షణ కోసం జలజీవన్ మిషన్, రవాణా, విద్యుత్, వాణిజ్యం వంటి రంగాలను ఒకే ప్లాట్ ఫారంలో అనుసంధానించడం కోసం పిఎం గతిశక్తి, రైతుల ఆదాయం పెంపు, పంటల రక్షణ, నీటి వినియోగ సామర్థ్యం పెంపుదల కోసం పిఎం కిసాన్ ఫసల్ బీమా యోజన, 2030 నాటికి మొత్తం విద్యుత్‌లో 50 శాతం పునరుత్పత్తికి సౌర, జల, వాయు, బయోమాస్ వంటి క్లీన్ ఎనర్జీ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ- మొబిలిటీ మిషన్, ఎలక్ట్రికల్ కార్లు, బస్సులు చార్జింగ్ స్టేషన్లకు ప్రోత్సహించేందుకు ఫేమ్ ఇండియా పథకం, 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమలులో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్‌లను నిర్వహిస్తోంది.

2070 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడం కోసం నెట్ జీరో కార్బన్ ఎమిషన్ సాధనకు కట్టుబడి ఉండటం, నగరాల్లో వాయు కాలుష్యం తగ్గింపునకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలు పర్యావరణ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఇంధన రంగంలో హరిత ఇంధన వినియోగానికై గ్రీన్ హైడ్రోజన్ మిషన్, భూగర్భ జలాల రీచార్జింగ్ కోసం అటల్ భూజల్ యోజన, సాంప్రదాయ చెరువులు, కుంటల పునరుద్ధరణ కోసం మిషన్ అమృత్ సరోవర్, ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానల్‌ల ఏర్పాటు కోసం పిఎం సూర్యఘర్, ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ ఏర్పాటు, 2030 నాటికి 500 గిగా వాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యంగా నేషనల్ సోలార్ మిషన్, పర్యావరణ సేవల ఫలితాల నమోదుకు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం, వ్యర్థాలను విద్యుత్ ఎరువుల రూపంలో ఉపయోగించేందుకు వ్యర్థాల నుండి శక్తి(వెస్ట్ టు ఎనర్జీ) ప్రాజెక్టుల రూపకల్పన, పర్యావరణ స్నేహపూర్వక పట్టణాల అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీస్ మిషన్, హరిత పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు, పెట్టుబడులు, పర్యావరణ అనుకూల సాంకేతికతల వినియోగం కోసం గ్రీన్ టెక్నాలజీ పథకం, దేశంలో అడవుల విస్తరణ, పచ్చదనం పెంపుల కోసం గ్రీన్ ఇండియా మిషన్, సేంద్రియ వ్యవసాయం సహజ వ్యవసాయ విధానాల ప్రోత్సాహం, మట్టి నాణ్యత పునరుద్ధరణకు సాయిల్ హెల్త్ కార్డ్ పథకం, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు నిమిత్తం పిఎం ప్రాణం పథకం, ప్రజలు, యువత, విద్యార్థులలో పర్యావరణ చైతన్యం పెంచడం, పర్యావరణ అనుకూల జీవన విధానంను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రపంచ స్థాయి పర్యావరణ ప్రవర్తనా, పరివర్తనోద్యమం మిషన్ లైఫ్ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్) వంటి అంశాలు పర్యావరణ వికసిత భారత్ లక్ష్యసాధనకు మైలు రాళ్ళుగా ఉన్నాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జి -20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో భారత్ ఇచ్చిన వన్‌ఎర్త్ వన్ ఫ్యామిలి వన్ ఫ్యూచర్ నినాదం ప్రపంచ పర్యావరణ ఐక్యతకు, ప్రజల భాగస్వామ్యానికి సంకేతంగా నిలుస్తున్నది.

అవశ్యమైన ప్రజల భాగస్వామ్యం

వికసిత భారత్ అనేది కేవలం ప్రభుత్వ ప్రణాళిక కాదు, ఇది భారత ప్రజల సంయుక్త సంకల్పం. మన భవిష్యత్తు తరాల కోసం చేసిన వాగ్దానం. దీనిని 2047 నాటికి సాకారం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రణాళికలు; పథకాలు అమలు పరిచినా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఫలితం ఉండదు. కనుక పన్నులు చెల్లించడం, సేవా భావంతో పనిచేయడం, విద్య, ఆరోగ్యం, శుభ్రత, హరిత వాతావరణం పట్ల బాధ్యతాయుతమైన భాగస్వామ్యం కలిగి ఉండటం ప్రజల ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. ఏక్ పేడ్ మా కే నామ్ లో తల్లి పేరుతో ఒక వ్యక్తి -ఒక చెట్టు నాటడం, నీటి, ఆహార వృథాను అరికట్టడం, ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం తగ్గించడం, సౌర విద్యుత్ వాడకం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం, త్రీ అర్స్ సూత్రాన్ని పాటించడం వంటి పర్యావరణ క్రమశిక్షణ గల చర్యలను ప్రతి పౌరుడు పాటించాలి.

వికసిత్ భారత్ లక్ష్యంగా నూతన కల్పనలు, సృజనాత్మకత సమస్య పరిష్కార సామర్థ్యాలను, పర్యావరణ అవగాహనను పెంపొందించేందుకు ఉద్దేశించబడిన ఇన్స్‌ఫైర్, బాలల విజ్ఞాన ప్రదర్శిని, విజ్ఞాన్ మంతన్, ఎకోక్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ , స్టెమ్ ప్రోగ్రాం వికసిత్ భారత్ బిల్ద్ ధాన్- 2025 కార్యక్రమాలలో విద్యార్థులు విరివిగా పాల్గొనాలి. గ్రామం నుండి దేశస్థాయి వరకు ప్రజలందరిలో పర్యావరణ అనుకూల ప్రవర్తన పెంపొందే కార్యక్రమాలు చేపట్టాలి. పాఠశాల స్థాయి నుండి పర్యావరణ విద్యను తప్పనిసరి చేయాలి. స్వాతంత్య్ర సమరయోధులు స్వేచ్ఛ కోసం పోరాడినట్లే మనం సుస్థిర పర్యావరణ అభివృద్ధి కోసం కృషి చేయాలి. అప్పుడే మన దేశం సాంస్కృతిక , విద్య, సాంకేతిక, పర్యావరణ సమతుల్య అభివృద్ధికి ప్రతీకగా ఉంటుంది. అభివృద్ధి, సాంకేతిక పురోగతికి ప్రజల భాగస్వామ్యం కలిస్తే మన దేశం ప్రపంచంలో పర్యావరణ వికసిత భారత్‌గా నిలుస్తుంది.

భారత రవీందర్ 99125 36316