admin
టిజిఎస్ఆర్టీసి కొత్త ఎండిగా నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు సంఘటనల్లో నలుగురి మృతి
టీవీకే పార్టీనే పవర్కట్ చేయమని కోరింది : తమిళనాడు విద్యుత్తు బోర్డు
చెన్నై : కరూర్ జిల్లాలో టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో కుట్ర కోణం ఉందని విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంత సమయం పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చేసిన ఆరోపణలపై తమిళనాడు విద్యుత్తు బోర్డు స్పందించింది. విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా ఆపేయాలని టీవీకేనే తమకు వినతి పత్రం ఇచ్చిందని ఆ రాష్ట్ర విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి ధ్రువీకరించారు. అయితే అందుకు తాము అంగీకరించలేదని వెల్లడించారు.
సెప్టెంబర్ 27,2025 రాత్రి ఈ రోడ్డు లోని వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వేస్తూ , టీవీకే నుంచి లేఖ అందిందని, విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మిపేర్కొన్నారు. అందులో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని … విజయ్ మాట్లాడుతున్న సమయంలో కొంతసేపు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని కోరారన్నారు. కానీ ఆ అభ్యర్థనను తాము తిరస్కరించామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తూ తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద కరెంటు కోత లేదని తెలిపింది. ఆ పార్టీ ఏర్పాటు చేసిన జనరేటర్లలో సమస్య కారణంగా కొన్ని లైట్లు మసకబారాయని జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు.
అయితే ఘటన అనంతరం టీవీకే మాత్రం దీనిలో కుట్ర కోణం ఉందని ఆరోపించింది. తమ నేత విజయ్ ర్యాలీ వేదికకు చేరుకున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేశారని పేర్కొంది. దీంతో అభిమానులు ఆయనను చూసేందుకు ముందుకు కదిలారని, ఈ క్రమం లోనే తొక్కిసలాట జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తొక్కిసలాటకు ముందు కొంతసేపు కరెంటు సరఫరా నిలిచిపోయినట్టు పలువురు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.
పాక్కు వ్యతిరేకంగా పీవోకేలో భారీ ఆందోళన
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హులే
పంచాయతీ కార్యదర్శుల బిల్లులకు రూ.104 కోట్లు విడుదల
ఆటోను ఢీకొన్న కారు.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
నేను ఎక్కడికీ పారిపోను : నేపాల్ మాజీ ప్రధాని ఓలి
ఫ్యాన్స్కి బ్యాడ్న్యూస్.. అంతర్జాతీయ క్రికెట్కి ఆల్రౌండర్ గుడ్బై
లండన్: క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్న్యూస్. ఇంగ్లండ్ ఆల్రౌంటర్ క్రిస్ వోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణమే రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. 36 ఏళ్ల క్రిస్ వోక్స్ ఇంగ్లండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 217 మ్యాచులు ఆడాడు. బౌలింగ్లో 396 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో 3,705 పరుగులు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్, 2022 టిం ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. ఈ ఏడాది భారత్తో జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్లో ఆఖరి టెస్ట్లో తీవ్రంగా గాయపడినప్పటికీ.. క్రిస్ వోక్స్ బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చాడు.
ఫీల్డింగ్ చేస్తుండగా.. భుజం ఫ్రాక్చర్ కావడంతో క్రిస్ ఒంటి చేత్తోనే బ్యాటింగ్కి వచ్చాడు. దీంతో అందరూ అతనిపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ గాయమై క్రిస్ రిటైర్మెంట్ ప్రకటించేందుకు కారణంగా అనిపిస్తోంది. ‘‘అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చింది. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఇంగ్లండ్ తరఫున ఆడాలన్నది నా చిన్ననాటి కల. అది నిజమైనందుకు నేను అదృష్టవంతుడిని. ఇంగ్లండ్ తరఫున ఆడటం.. మూడు సింహాలు ముద్రించి ఉన్న జెర్సీని ధరించడం.. గత 15 ఏల్లుగా సహచరులతో మైదానంలో గడపటం మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాయి. సహచర ఆటగాళ్లు చాలామంది నా జీవితకాల మిత్రులుగా మారిపోయారు. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అంటూ క్రిస్ వోక్స్ సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే కౌంటీ క్రికెట్ కొనసాగిస్తానని.. ఫ్రాంజైజీ క్రికెట్లో అవకాశాలను అన్వేషిస్తానని అతడు తెలిపాడు.