admin
పాకిస్తాన్లో భారీ పేలుడు.. 10 మంది మృతి
మహిళల వన్డే ప్రపంచకప్… రెండో వికెట్ కోల్పోయిన భారత్
రెయిన్ అలర్ట్.. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు!
ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు: విజయ్
చెన్నై: కరూర్ తొక్కిసలాటపై తమిళగ వెట్రి కజగం (టివికె) పార్టీ అధినేత విజయ్ వీడియో సందేశం విడుదల చేశారు. ఘటన జరిగిన తర్వాత తొలిసారి విజయ్ తన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరూర్ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. నాపై అమితమైన ప్రేమతో ప్రజలు ర్యాలీకి తరలివచ్చారు. త్వరలోనే కరూర్ వెళ్లి బాధితులను పరామర్శిస్తా. మేము ఎలాంటి తప్పు చేయకున్నా మాపై కేసు పెట్టారు. నిజం త్వరలోనే బయటపడుతుంది. ఏం జరిగిందనేది ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నా హృదయం ఆవేదనతో నిండిపోయింది. సిఎం స్టాలిన్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారా.? స్టాలిన్ కావాలంటే నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ, నాపై కోపం.. మా నాయకులపై చూపించవద్దు. కరూర్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. నేను ఎప్పుడూ ఎవరికీ అపకారం తలపెట్టలేదు. మా నాయకులపై కేసులు ఎందుకు పెడుతున్నారు. ర్యాలీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఊహించని ఘటన జరిగింది. ఇకపై మరింత బలంగా ప్రజల్లోకి వెళ్తాం’’ అని అన్నారు.
సెప్టెంబర్ 27వ తేదీన కరూర్లో నిర్వహించిన విజయ్ రాజకీయ ర్యాలీకి పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోగా.. 83 మందికి పైగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తమిళనాడు పోలీసులు ఇప్పటివరకూ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఘటనపై విచారణ పూర్తి అయ్యే వరకూ విజయ్ ఎలాంటి ర్యాలీలు చేయకుండా ఉండేందుకు ఆదేశాలు ఇవ్వాలని బాధిత కుటుంబసభ్యులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
దారుణం.. ఏడో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ బాబాయ్
విజయవాడ: ముక్కపచ్చలారని ఓ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. వరుసకు బాబాయ్ అయినప్పటికీ తన వరుస మర్చిపోయి దారుణానికి పాల్పడ్డాడు. ఏడో తరగతి చదువుతున్న బాలికపై బాబాయి అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయవాడ నగర శివారులోకి పాయకాపురంలో చోటు చేసుకుంది. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు చని పోవడంతో.. పిన్ని, బాబాయ్ దగ్గర ఆమె ఆశ్రయం పొందుతోంది. ఈ క్రమంలో బాబాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక నున్న గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనారోగ్యంతో ఉన్న బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఆసీస్ సిరీస్కి ముందు టీం ఇండియాకు షాక్
ఆసియాకప్ విజయంతో టీం ఇండియా ఫుల్ జోష్లో ఉంది. అయితే త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్కి ముందు భారత్కు ఊహించని షాక్ తగిలింది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్కు స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆసియాకప్లో గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్లో హార్థిక్ అడలేదు. అతని స్థానంలో రింకూ సింగ్ జట్టులోకి వచ్చాడు. హార్థిక్ ఎడమ తొడ భాగంలో గాయమైనట్లు సమాచారం. వైద్యులు అతడిని నాలుగు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది.
డాక్టర్లు చెప్పినట్లు నాలుగు వారాల్లో హార్థిక్ కోలుకుంటే ఆసీస్తో జరగబోయే సిరీస్లో అతడు ఆడే అవకాశం ఉంది. భారత్ మూడు వన్డేలు, ఐదు టి-20ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత వన్డేలు జరుగుతాయి. ఇక వేళ గాయం కారణంగా హార్థిక్ వన్డేలకు దూరమైనా.. టి-20 సిరీస్కి అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్, ఆస్ట్రేలియాల మధ్య అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాగా.. 29 అక్టోబర్ నుంచి టి-20 ప్రారంభం అవుతుంది.
వరల్డ్కప్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
గువాహటి: భారత మహిళ జట్టు మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో తమ ప్రతిభ కనబరిచేందకు సిద్ధమవుతోంది. ఐసిసి వన్డే ప్రపంచకప్-2025 మంగళవారం నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. తొలి మ్యాచ్లో అతిథ్య దేశాలు భారత్-శ్రీలంక తలపడుతున్నాయి. బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఆరంభ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించి.. టోర్నమెంట్ని ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
తుది జట్లు:
భారత్: ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లిన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిక్స్, రిచా ఘోష్(కీపర్), దీప్తీ శర్మ, అమన్జోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ ఛారణి.
శ్రీలంక: చమరి ఆటపట్టు(కెప్టెన్), హాసిని పెరెరా, హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(కీపర్), అచ్చిని కులసూర్య, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోధని, ఇనోకా రణవీర.
ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకు వెళ్తాం : ఎంపి రఘునందనరావు
హైదరాబాద్: మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని బిజెపి ఎంపి రఘునందనరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ జపం చేస్తోందని విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నార్సంగిలో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయని, ఆదిత్య వింటేజ్ బంగ్లాను మూసీ పరివాహకంలో నిర్మాణం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆదిత్య వింటేజ్ నిర్మాణం ఆపివేస్తామందని, ఆదిత్య వింటేజ్ విషయాన్ని సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్దకు తీసుకెళ్లాలని రఘునందన్ రావు అన్నారు. సర్వీస్ రోడ్డు ఆక్రమించి కట్టే భవనానికి హెచ్ఎండిఎ ఎట్లా అనుమతించిందని ప్రశ్నించారు. ఆదిత్య వింటేజ్ నిర్మాణాన్ని పూర్తిగా ఎఫ్ టిఎల్ లోనే నిర్మిస్తున్నారని, ఆదిత్య వింటేజ్ నిర్మాణాలపై సిఎం, హైడ్రా కమిషనర్ కు లేఖ రాస్తున్నానని తెలియజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకు వెళ్తాం అని హెచ్చరించారు. ఆదిత్య వింటేజ్ నిర్మాణంపై ఏ గద్ద వాలిందని.. ఎన్ని సూట్ కేసులు ఎత్తుకెళ్లిందని ఎంపి రఘునందనరావు ఎద్దేవా చేశారు.