admin
ప్రియురాలి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి… నీటి డ్రమ్ములో యువతి మృతదేహం
భోపాల్: ఓ ఇంట్లోని నీటి డ్రమ్ములో ఓ యువతి మృతదేహం కనిపించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లక్షిత చౌదరి అనే యువతి కాలేజీ వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తుండగా తానే లక్షితను చంపేశానని మోను అనే యువకుడు లొంగిపోయాడు. లక్షితను గాఢంగా ప్రేమించానని, ఆమె మరో యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తుండడంతో హత్య చేశానని వివరించారు. లక్షిత కాళ్లు చేతులు కట్టేసి అనంతరం నీటి డ్రమ్ములో ముంచి చంపేశానని చెప్పాడు. నీటి డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం దేవాస్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం పై స్పందించిన జాతీయ ఎస్సి కమిషన్
అమరావతి: దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేసిన ఘటనపై ఎంపి గురుమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జాతీయ ఎస్ సి కమిషన్ స్పందించడంతో చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పిలకు నోటీసుల జారీ చేసింది. దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పిలకు 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించమని ఆదేశిస్తూ, నివేదికలో ఎఫ్ఐఆర్ వివరాలు, నమోదు చేసిన సెక్షన్లు, అరెస్టులు, చార్జ్ షీట్ స్థితి తదితర సమాచారం ఇవ్వాలనీ ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
దేవళంపేట అంబేడ్కర్ విగ్రహ దహనం ఘటనపై తిరుపతి ఎంపి గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జాతీయ ఎస్సీ కమిషన్కు గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు పేర్కొన్నారు. ఇది కేవలం విగ్రహ ధ్వంసం మాత్రమే కాదు, దళితుల గౌరవం, ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కులపై నేరుగా దాడి అని ఎంపి ఫిర్యాదులో వివరించారు.