elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXM

కోడళ్లు తాను చెప్పినట్టే ఉండాలన్న పట్టింపుల్లేవు: అక్కినేని అమల

సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున ఇంట ఇటీవల కాలంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. నాగార్జున ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2024లో హీరోయిన్ శోభిత దూళిపాళను చైతన్య వివాహం చేసుకోగా… ఈ ఏడాదే ముంబైకి చెందిన వ్యాపారవేత్త జైనబ్ రివ్జీను అఖిల్ పెళ్లాడారు. దీంతో కొత్త కోడళ్ల రాకతో అక్కినేని వారి ఇల్లు కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో కోడళ్లతో తన అనుబంధం గురించి నాగార్జున సతీమణి అమల మాట్లాడుతూ తమ ఇంటికి కోడళ్లు శోభిత, జైనబ్ రావడంతో తనకు గర్ల్ సర్కిల్ ఏర్పడిందని అన్నారు. వాళ్లు ఎప్పుడూ ఆనందంగా కనిపిస్తారని, వాళ్ల వల్లే జీవితం సరికొత్తగా మారిందని చెప్పారు. కోడళ్లతో ఉన్నప్పుడు భలే సరదాగా ఉంటుందని, ఇక వాళ్ల వ్యక్తిగత విషయాల్లో తాను తలదూర్చనని తెలిపారు. అలాగే ఇంట్లో వాళ్లకు ఎంతో స్వేచ్ఛ ఉంటుందని, కోడళ్లు తాను చెప్పినట్టే ఉండాలన్న పట్టింపులేమీ తనకు లేవని అమల చెప్పారు. వాళ్లు తమ తమ రంగాల్లో రాణిస్తూ బిజీగా ఉండడం వల్ల తనకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని కోరుకోనని తెలిపారు.

బహుమతిగానూ ఫాస్టాగ్ వార్షిక టోల్‌పాస్

న్యూఢిల్లీ : జాతీయ రహదారులపై టోల్ ఫీజుల చెల్లింపులకు సంబంధించిన ఫాస్టాగ్‌పై మరో కొత్త సౌలభ్యం కూడా అందుబాటులోకి వచ్చింది. వార్షిక టోల్‌పాస్‌ను ఇకపై మనం ఎవరికైనా గిఫ్ట్‌గా కూడా ఇవ్వొచ్చు. దీపావళి సందర్భంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. మీరు ఎవరికైతే టోల్‌పాస్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారో యాప్‌లోకి వెళ్లి ‘యాడ్ పాస్’ విభాగంలోకి వెళ్లాలి. మనం ఎవరికైతే గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నామో వారి వాహనం నెంబర్, కాంటాక్ట్ వివరాలు జతపరచాల్సి ఉంటుంది. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత మీ ద్వారా బహుమతిగా పొందిన వ్యక్తి దాన్ని ఉపయోగించుకునే సౌలభ్యం దొరుకుతుంతని ఎన్‌హెచ్‌ఎఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదిలావుండగా ఏడాదికి రూ.3వేలతో వార్షిక టోల్ పాస్ తీసుకుంటే ఏడాది పాటు లేదా 200 సార్లు టోల్‌ప్లాజాలు దాటే అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. 

మల్లికార్జున ఖర్గేని పరామర్శించిన మంత్రి సీతక్క

 ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క శనివారం బెంగళూరులో పరామర్శించారు. ఖర్గే యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.

యూట్యూబర్లపై పోక్సో కేసు

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ ఛానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ నుంచి వీడియోలను డిలిట్ చేశారు. కంటెంట్ డిలిట్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు రెండు యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉందని, ఇష్టం వచ్చినట్లు మైనర్లపై కంటెంట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే చర్యలు తీసుకుంటామని సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు. ఇక నుంచి కూడా అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో పెడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. యూట్యూబ్ ఛానళ్లపై 67,67ఏ, 67బి, ఐటి యాక్ట్, 294,79,49,8,7,12,11,14,13,17,16 పోక్సో యాక్ట్ 20212 కింద కేసు నమోదు చేశారు.

ఎసిబికి చిక్కిన విద్యుత్ శాఖ ఎఈ

 కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా విద్యుత్ శాఖ ఏఈని ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజేంద్రనగర్, గంధంగూడ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని హిమాయత్‌సాగర్ అమర్ సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్‌సికే ప్రాజెక్ట్ పేరుతో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు అనుమాతి కావాల్సి ఉండడంతో కాంట్రాక్టర్ ఎఈని సంప్రదించారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు అమర్ సింగ్ రూ.30,000 డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఎసిబికి ఫిర్యాదు చేశారు. ఎసిబి అధికారుల సూచనల మేరకు ఎఈ అమర్ సింగ్‌కు రూ.30వేలు ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. గంధంగూడ విద్యుత్ కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు చేశారు. ఎఈని అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాలతో ఎఈ అమర్ సింగ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీ నష్టం..

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కటకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్ సేల్ అండ్ రిటైల్ టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. టపాసుల ప్యాకింగ్ పేపర్ల వ్యర్థాల్లో ప్రమాదవశాత్తు నిప్పురవ్వ పడి మంటలు చెలరేగాయి. గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన హోల్‌సేల్ అండ్ రిటైల్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చ మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి విలువైన టపాసులు కాలిపోయాయని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు.

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి

 ప్రభుత్వ వైద్యుల నిర్లక్షంతో గర్భిణి మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా, మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..లింగంపల్లి గ్రామానికి చెందిన పంతంగి మానస (25) 7 నెలల గర్భిణి. శుక్రవారం ఆమె ఐరన్ ఇంజక్షన్ కోసం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్షంతో ఎలాంటి టెస్టులు చేయకుండానే వైద్యులు ఐరన్ ఇంజక్షన్ ఇవ్వడంతోనే మానస మృతి చెందిందని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి బంధువులు, గ్రామస్థులు మంచాల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ముందు బైఠాయించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు పార్టీల నాయకులు, బంధువులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా వైద్యాధికారులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పరువు హత్య

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, దహెగాం మండలం, గెర్రె గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. నిండు గర్భిణి అయిన కోడలిని స్వంత మామే గొడ్డలితో దారుణంగా నరికి హతమార్చాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తలండి లచ్చయ్య, అనసూర్య దంపతుల కుమార్తె శ్రావణి (23), అదే గ్రామానికి చెందిన శివర్ల సత్తయ్య, సత్తక్క దంపతుల చిన్న కొడుకు శేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రావణి 9 నెలల గర్భిణి. వచ్చే నెల వైద్యులు ప్రసవం కోసం ఆమెకు డేట్ కూడా ఇచ్చారు. అయితే, శ్రావణి, శేఖర్ కులాలు వేర్వేరు కావడంతో శేఖర్ తండ్రికి వీరి వివాహం ఇష్టం లేదు. శ్రావణి ప్రస్తుతం వారి తల్లిగారింటిలో ఉంది. వారి ఇంటిలో ఎవరూ లేని సమయం చూసిన మామ సత్తయ్య గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. కాగజ్‌నగర్ డిఎస్‌పి వహిదుద్దీన్, సిఐ కుమార స్వామి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు శ్రావణి తండ్రి లచ్చయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాల్లో విమానం.. బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా మంటలు..

ఎయిర్ చైనాకు చెందిన ఓ విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. శనివారం ఎయిర్‌ చైనా విమానయాన సంస్థకు చెందిన విమానం తూర్పు చైనాలోని హాంగ్‌జౌ నుంచి దక్షిన కొరియాలోని సియోల్ సమీపంలోని ఇంచియాన్‌కు బయలు దేరింది. విమానం గాల్లోకి లేచిన కొంత సేపటికే ఓ ప్రయాణికుడి లగేజీలో ఉన్న లిథియం బ్యాటరీ పేలి.. మంటలు అంటుకున్నాయి. మంటలు ఓవర్‌హెడ్ బిన్ నుంచి బయటకు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ఎయిర్ చైనా వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ ప్రయాణికులు సోషల్‌మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌గా మారాయి.

బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రం బీసీ బిల్లును ఆమోదించాలి:మంత్రి సీతక్క

తెలంగాణలో బీసీలకు న్యాయం చేయాలంటే కేంద్రం బీసీ బిల్లును ఆమోదించాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి సీతక్క డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. అందుకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, కులగణన ప్రక్రియను ఎక్కడా లోపం లేకుండా పూర్తి చేశామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోరుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించామని, అయితే ఆ బిల్లు ఆరు నెలలుగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణ బంద్‌ను ప్రజాభవన్‌లోని మంత్రి సీతక్క నివాసంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి శనివారం పర్యవేక్షించారు. అనంతరం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఇతర నేతలతో కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు.

రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేతలు జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశ్యంతో బీసీ బంద్ నిర్వహించామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయకుండా బిల్లును నిలిపి వేస్తోందని ఆమె విమర్శించారు. బిజెపి పార్టీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరించడం దారుణమని అన్నారు. తెలంగాణలోని బిజెపి నేతలు బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామంటారు, కానీ ఢిల్లీలో వారి పెద్దలు ‘నో’ అంటారని తెలిపారు. బీసీ అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ బీసీ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలని సీతక్క డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బిజెపి, బిఆర్‌ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. కులగణనలో పాల్గొనని వారు బీసీల హక్కులపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వారికి ప్రజలే సమాధానం చెబుతారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

……………..