elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbetting

హైదరాబాద్ అభివృద్ధిపై నీళ్లు చల్లారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ వే, మెట్రో రెండవ దశ ప్రణాళికలను పూర్తిగా పక్కన పెట్టి, హైదరాబాద్ నగర అభివృద్ధి పైన నీళ్లు చల్లారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు మెట్రోకు టెండర్లు పూర్తి చేస్తే రేవంత్‌రెడ్డి వచ్చాక రద్దు చేశారని అన్నారు. తనకు భూములు ఉన్నాయనే అనుమానంతో ఇలా చేశారని ఆరోపించారు. రాజేంద్రనగర్‌లో భూములున్నాయని సబితా ఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారని, భూములు చూపితే రాసిస్తానని సబితా ఇంద్రారెడ్డి చెబుతున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా.. భూములు ఎక్కడున్నాయో చూపాలని అన్నారు.కంపెనీలు, భవనాలు తనవే అని చెబుతూ రెండేళ్లుగా జల్లెడ పడుతున్నారని చెప్పారు. 

మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు

మన తెలంగాణ/హైదరాబాద్: మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునే ఔత్సాహికులకు ఆబ్కారీ శాఖ తీపి కబురు చెప్పింది. నూతన దుఖాణాలకు మద్యం దరఖాస్తుల గడవు ఈ నెల 23 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బిసి బంద్, బ్యాంకులు బంద్‌లతో మద్యం షాపులకు దరఖాస్తులు వేసే ఔత్సాహికులు రాలేకపోయామని, ఈ క్రమంలో దరఖాస్తుల గడువు పెంచాలని చేస్తున్న విజ్ఞప్తి మేరకు దరఖాస్తులు స్వీకరించడానికి గడువు పెంచుతున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.

ఈ నెల 23 వరకు మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరించనున్నామని, ఈ నేపథ్యంలో 23న కలెక్టర్ల సమక్షంలో జరగాల్సిన మద్యం షాపుల డ్రా ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తరువాత ఈనెల 27వ తేదీన కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపులకు డ్రాలు తీయనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. కాగా శనివారం రాత్రి 11 గంటల వరకు మొత్తం 85,363 దరఖాస్తులు వచ్చాయని, శనివారం ఒక్కరోజే 38,754 వచ్చినట్లు వెల్లడించారు.

కన్నతల్లి పై ఉన్న మమకారాన్నే తెలంగాణ ప్రజలు భూమిపై చూపించారు: రేవంత్

హైదరాబాద్: భూమి మీద ఆధిపత్యం కోసం గతంలో యుద్ధాలు జరిగాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు మీ మీద తిరగబడే అవకాశం ఉందని అన్నారు. లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్ధులకు లైసెన్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శిల్పకళావేదికలో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. కన్నతల్లి పై ఉన్న మమకారాన్నే తెలంగాణ ప్రజలు భూమిపై చూపించారని, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టం.. కొంతమంది దొరలకు చుట్టంగా మారిందని విమర్శించారు. ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకొని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలని చూశారని, తమ గెలుపునకు అనేక కారణాలు ఉండొచ్చు..బిఆర్ఎస్ ఓటమికి ధరణి చట్టమే కారణం అని అన్నారు. అధికారంలోకి వస్తే.. ధరణి నుంచి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చామని, తమ ప్రభుత్వం రాగానే ధరణి చట్టాన్ని తొలగించి భూభారతి తెచ్చామని తెలియజేశారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని..ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని, ఒకవేళ పరీక్షలు పెట్టిన ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి అని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో టిజిపిఎస్సి పునరావాస కేంద్రంగా ఉండేదని, తమ ప్రభుత్వం రాగానే టిజిపిఎస్సిని ప్రక్షాళన చేశామని రేవంత్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, తాము ఉద్యోగాలు ఇస్తుంటే.. కోర్టుల్లో కేసు వేసి ఆపాలని చూశారని మండిపడ్డారు. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశామని, త్వరలో గ్రూప్- 3,4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు. దేశ జిడిపిలో తెలంగాణ వాటా ప్రస్తుతం 5 శాతంగా ఉందని, జిడిపిలో తెలంగాణ వాటా త్వరలోనే 10 శాతానికి చేరాలని కోరారు. ఉద్యోగులు కష్టపడితేనే.. ప్రజలు సమస్యలు పరిష్కరిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మా ప్రభుత్వం రాగానే ధరణి చట్టాన్ని తొలగించి భూభారతి తెచ్చాం : రేవంత్

హైదరాబాద్: భూమి మీద ఆధిపత్యం కోసం గతంలో యుద్ధాలు జరిగాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు మీ మీద తిరగబడే అవకాశం ఉందని అన్నారు. లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్ధులకు లైసెన్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శిల్పకళావేదికలో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. కన్నతల్లి పై ఉన్న మమకారాన్నే తెలంగాణ ప్రజలు భూమిపై చూపించారని, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టం.. కొంతమంది దొరలకు చుట్టంగా మారిందని విమర్శించారు. ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకొని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలని చూశారని, తమ గెలుపునకు అనేక కారణాలు ఉండొచ్చు..బిఆర్ఎస్ ఓటమికి ధరణి చట్టమే కారణం అని అన్నారు. అధికారంలోకి వస్తే.. ధరణి నుంచి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చామని, తమ ప్రభుత్వం రాగానే ధరణి చట్టాన్ని తొలగించి భూభారతి తెచ్చామని తెలియజేశారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని..ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని, ఒకవేళ పరీక్షలు పెట్టిన ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి అని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో టిజిపిఎస్సి పునరావాస కేంద్రంగా ఉండేదని, తమ ప్రభుత్వం రాగానే టిజిపిఎస్సిని ప్రక్షాళన చేశామని రేవంత్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, తాము ఉద్యోగాలు ఇస్తుంటే.. కోర్టుల్లో కేసు వేసి ఆపాలని చూశారని మండిపడ్డారు. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశామని, త్వరలో గ్రూప్- 3,4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు. దేశ జిడిపిలో తెలంగాణ వాటా ప్రస్తుతం 5 శాతంగా ఉందని, జిడిపిలో తెలంగాణ వాటా త్వరలోనే 10 శాతానికి చేరాలని కోరారు. ఉద్యోగులు కష్టపడితేనే.. ప్రజలు సమస్యలు పరిష్కరిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: బండి సంజయ్

హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోవాలని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ సూచించారు. మావోయిస్టులకు మద్దతిస్తున్నతెలంగాణ నేతలకు బండి సంజయ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. మావోస్టులతో సంబంధాలు తెంచుకోకపోతే గుట్టు బయటపెడతామని, మావోయిస్టుల కట్టడితోనే కేంద్ర ఏజెన్సీలు ఆగిపోవు అని అన్నారు. అవినీతి, నేరగాళ్ల లింకులపై కేంద్రం నిఘా పెట్టిందని, ఎవరైనా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తప్పుడు మార్గంలో వెళితే ఎంత పెద్ద నేతనైనా వదిలిపెట్టం అని బండిసంజయ్ పేర్కొన్నారు. 

ఆస్ట్రేలియా టార్గెట్ 137

పెర్త్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 26 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 137 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. వర్షం పడుతుండడంతో  మ్యాచ్ ను 26 ఓవర్లకు కుదించారు. అక్షర పట్లేల్(31), కెఎల్ రాహుల్(38), నితీష్ కుమార్ రెడ్డి(19) గౌరవ ప్రదమైన పరుగులు చేసి పర్వాలేనిపించారు. కెప్టెన్ గిల్, రోహిత్, విరాట్, శ్రేయస్ అయ్యర్ స్వల్ప స్కోరు వెనుదిరగడంతో భారత జట్టు తక్కువ పరుగులు చేసింది. రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు చేసి హజిల్‌వుడ్ బౌలింగ్‌లో రెన్‌షాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్‌కు క్యాచ్ ఇచ్చి పరుగులేమీ చేయకుండా డకౌట్ మైదానం వీడాడు. శుభ్‌మన్ గిల్ 10 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 11 పరుగులు చేసి హజిల్ వుడ్ బౌలింగ్ లో ఫిలిప్ప్ కు క్యాచ్ ఔటయ్యాడు. అక్షర పటేల్ 31 పరుగులు చేసి కునేమన్ బౌలింగ్ లో రెన్ షాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ పది పరుగులు చేసి కునేమన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. కెఎల్ రాహుల్ 38 పరుగులు చేసి మిచెల్ ఓన్ బౌలింగ్ లో రెన్ షాకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. హర్షిత్ రాణా ఒక పరుగు చేసి మిచెల్ ఓన్ బౌలింగ్ లో ఫిలిప్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అర్షదీప్ సింగ్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజిల్ వుడ్, కునెమన్, మిచెల్ ఓన్ తలో రెండు వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్ చెరో ఒక వికెట్ తీశారు.

ఆరు చెక్ పోస్టులపై ఎసిబి దాడి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ చెక్ పోస్టులపై ఎసిబి దాడులు నిర్వహిస్త్తోంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఏకకాలంలో ఆరు చెక్ పోస్టులపై ఎసిబి అధికారులు దాడులు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా లోని క్రిష్ణా, సంగారెడ్డి జిల్లా లోని జహీరాబాద్, కామారెడ్డి జిల్లా లోని కామారెడ్డి, మద్నూర్, భద్రాద్రి కొత్తగూడం జిల్లా లోని ఆశ్వరావు పేట చెక్ పోస్ట్, కొమరంభీమ్ జిల్లా లోని వాంకిడి చెక్ పోస్టులపై దాడులు కొనసాగుతున్నాయి. అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్, రజినీ భాయి, తిరుపతి, కిరణ్ కుమార్, ఆఫ్రోజ్ లను అధికారులు విచారిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ చెక్ పోస్ట్ లపై ఏకకాలంలో ఎసిబి దాడులు నిర్వహించడం రెండవ సారి కావడం గమనార్హం.  

దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ కృషి చేశారు: రేవంత్

హైదరాబాద్: మన జాతి పిత మహాత్మ గాంధీ భారతదేశానికి పర్యాయపదం అని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గాంధీ కుటుంబం కూడా దేశానికి అదే విధంగా స్ఫూర్తినిచ్చిందని అన్నారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్బావన యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..గత 35 ఏళ్లుగా రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర జరుగుతోందని, భారత్ లో అన్ని మతాల సహజీవనం స్ఫూర్తినిస్తుందని తెలియజేశారు. తమపై పోరాడిన మహాత్మాగాంధీని బ్రిటీషర్లు ఏమీ చేయలేకపోయారని, స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది నెలల్లోనే మతతత్వ వాదులు గాంధీని పొట్టనపెట్టుకున్నారని గాంధీని హత్య చేసిన వారు బ్రిటీషర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులని తెలియజేశారు. దేశ సమగ్రత, సమైక్యత కాపాడడానికి ఇందిరాగాంధీ అసువులు బాసారని, ఇందిరాగాంధీ వారసత్వం, త్యాగాలను రాజీవ్ గాంధీ పుణికిపుచ్చుకున్నారని ప్రశంసించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ కృషి చేశారని, మతసామరస్యం దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటపుడు సద్బావన యాత్ర చేశారని, దేశ సమగ్రతను కాపాడడానికి చివరకు రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

వర్షం అంతరాయం… శ్రేయస్ ఔట్… టీమిండియా 52/4

పెర్త్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 16.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 52 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం పడుతుండడంతో ఆటను రెండో సారి నిలిపివేశారు. మ్యాచ్ ను 32 ఓవర్లకు కుదించారు.  రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు చేసి హజిల్‌వుడ్ బౌలింగ్‌లో రెన్‌షాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్‌కు క్యాచ్ ఇచ్చి పరుగులేమీ చేయకుండా డకౌట్ మైదానం వీడాడు. శుభ్‌మన్ గిల్ 10 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 11 పరుగులు చేసి హజిల్ వుడ్ బౌలింగ్ లో ఫిలిప్ప్ కు క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అక్షర పటేల్(14), కెఎల్ రాహుల్(04) ఉన్నారు. 

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కట్టడం కాదు…కూలగొట్టడం: కెటిఆర్

హైదరాబాద్: రైతుల కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో ఆ పార్టీలో పలువురు నేతలు చేరారు. రాజేంద్రనియోజకవర్గానికి చెందిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్, మాజీ ఎంపిపి చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, పెద్దషాపూర్ మాజీ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్, పాశం యాదగిరి కూతురు పాశం పల్లవి, అల్లుడు అంజిబాబు, తదితరలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కెటిఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ నాశనమైందని, తెలంగాణలో భూముల ధరలు భారీగా పడిపోయాయని, తెలంగాణ ప్రజల ఆస్తి కరిగిపోయిందన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కోటీ మందిని కోటీశ్వరులు చేయడం కాదు మహిళల పుస్తెలు ఎత్తుకోకపోతే చాలు అని చురకలంటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తానన్న తులం బంగారం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. అరాచక పాలనతో ఎవరు సంతోషంగా లేరని, ఆక్రమణల పేరుతో పేదలు ఇండ్లు కూలగొడుతున్నారని కానీ పెద్దల ఇండ్లు ఎందుకు కూలగొడుతలేరని ప్రశ్నించారు. పేదల స్థలాలు మాత్రమే కనిపిస్తున్నాయి?, పెద్దల స్థలాలు కనిపించడం లేదా? అని హైడ్రాను నిలదీశారు. ఆరు గ్యారెంటీలె ఇంకెప్పుడు అమలు చేస్తారని అడిగారు. ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారని, కోటీ 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారన్నారు. మూసీగా అడ్డంగా కడుతున్న వారిని ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. పేదల వద్ద పత్రాలు ఉన్న రాత్రికి రాత్రే కూలగొడుతున్నారని దుయ్యబట్టారు. పాలించడానికి కండకాదు, గుండె కావాలని, రేవంత్‌కు పాలన చేతగాక మాజీ సిఎం కెసిఆర్ అప్పు చేశారని మాట్లాడుతున్నారని, నెలకు పది వేల కోట్లు రేవంత్ అప్పు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇందరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కట్టడం కాదు ఇండ్లు కూలగొట్టడం అని ఎద్దేవా చేశారు.