elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişbetasuskralbethilbetsuratbetatlasbetaresbetteosbetyakabetbahiscasinobetkolikbetkolikkulisbetroyalbetyakabetkalebetroyalbetpadişahbetpadişahbetroyalbetkalebetyakabetroyalbetkulisbetbetkolikbahiscasinoyakabetteosbetaresbetatlasbetsuratbethilbetkralbetbetasusbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovisaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişaresbetbetpipohiltonbehiltonbetrealbahissuratbetroketbetenbettrendbetprizmabetrinabetyakabetyakabetrinabetprizmabettrendbetenbetroketbetsuratbetrealbahishiltonbetbetpipoaresbetpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

betosfer

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakir escort

casinowon

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

hit botu

grandpashabet

Pusulabet

jojobet

ankara escort

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

teosbet

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

betosfer

grandpashabet

matbet

marsbahis

holiganbet

kingroyal

meritking

madridbet

vdcasino

jojobet

meritking

Jojobet giriş

betticket

padişahbet

vegabet

tlcasino

jojobet giriş

betzula

bahislion

meritking

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

madridbet

ikimisli

meritking

grandpashabet

betosfer

jojobet

jojobet giriş

madridbet

hiltonbet

kulisbet

yakabet

meritking

meritking

kingroyal

Jojobet güncel giriş

kingroyal

meritking

madridbet

meritking

kingroyal

meritking

madridbet

‘అఖండ2’ కోసం సర్వేపల్లి సిస్టర్స్

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ’అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ ని నెక్స్ లెవల్ లో అందిస్తున్నారు సెన్సేషనల్ కంపోజర్ తమన్. సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యం వున్న పండిట్ శ్రవణ్ మి శ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులతో ఇప్పటికే గూస్‌బంప్స్ స్కోర్‌ని రికార్డ్ చేశారు.

ఇప్పుడు సర్వేపల్లి సిస్టర్స్‌ని పరిచయం చేస్తున్నారు. సర్వేపల్లి సిస్టర్స్ ‘అఖండ 2: తాం డవం’ కోసం తమ దైవిక గానాన్ని అందించారు. తమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ పవర్‌ఫుల్ స్కోర్‌లో సర్వేపల్లి సిస్టర్స్ ఎనర్జిటిక్ గాత్రంతో నెక్స్ లెవెల్ స్కోర్ రికార్డు అవుతోంది. ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హో త్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. అఖం డ 2: తాండవం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ముందుగా ప్రకటించిన రోజునే ‘టాక్సిక్’

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘టాక్సిక్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని హాలీవుడ్ స్థాయికి ధీటుగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనుందంటూ పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఫిల్మ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ నిర్మాతలను సంప్రదించి విడుదల తేదీపై క్లారిటీ తీసుకున్నారు. సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని నిర్మాతలు ప్రకటించినట్లే మార్చి 19, 2026కే విడుదలవుతుందని ప్రకటించారు.

ఏప్రిల్ నెల నుంచి పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా విఎఫ్‌ఎక్స్ పనులు ప్రారంభమయ్యాయి. మరో వైపు యష్ ముంబయ్‌లో రామాయణ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. టాక్సిక్ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వర్క్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతుంద’ని తెలియజేశారు. ఈ సినిమా ఇంగ్లీష్, కన్నడలో తెరకెక్కుతోంది. దీన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఖమ్మంలో సిపిఎం నేత గొంతుకోసి హత్య

చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో సిపిఎం నేతను దారుణంగా హత్య చేశారు. పాతర్లపాడులో రైతు సిపిఎం రైతు సంఘం నేత సామినేని రామారావు శుక్రవారం ఉదయం వాకింగ్ వెళ్లాడు. అతడిని గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఆళ్లగడ్డలో వజ్రాల వేట

అమరావతి: వానాకాలం చినుకులు ప్రారంభమైన తర్వాత సాధారణంగా రైతులు సాగుకు సిద్ధమవుతారు. ఏది ఏమైనప్పటికీ కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో, రుతుపవనాల వర్షాల తరువాత ప్రజలు వజ్రాల వేటలో నిమగ్నమైపోతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో నల్లమల్ల అడవుల్లో వజ్రాల వేట సందడి నెలకొంది. మహానంది – శిరివెళ్ల సరిహద్దుల్లో వాగులు , వాగుల కట్టల వద్ద వజ్రాల కోసం స్థానికులు వెతుకుతున్నారు. తెల్లవారుజామునే వజ్రాల కోసం దూర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో చిన్న చిన్న వజ్రాలు దొరికినట్లు వార్తలు రావడంతో వజ్రాల వేట మరింత వేగం పుంజుకుంది. మహిళలు, యువకులు, వృద్ధులు ఇలా అందరూ వజ్రాల ఆశతో వాగుల్లో గుంపులుగా కనిపిస్తున్నారు. ఈ సంప్రదాయం రాయలసీమలోని అనేక జిల్లాలలో ప్రబలంగా ఉంది. ప్రత్యేకించి వజ్రకరూర్ పరిసర ప్రాంతాలలో, కొందరు వ్యక్తులు రైతుల నుండి రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారుతారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో కర్నూలు జిల్లా రైతులు తమ పొలాల్లో వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభించారు. 2023లో తుగ్గలి మండల పరిధిలోని బసినేపల్లిలో ఓ రైతుకు రెండు కోట్ల విలువైన వజ్రం దొరికిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం  కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి వ్యక్తి రూ.300 కూలి పనులకు వెళ్లాడు. అతడికి నలబై లక్షల రూపాయల విలువైన వజ్రం లభించింది.

లవ్ స్టోరీని రియలిస్టిక్‌గా చేశాం

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మీడియాతో మాట్లాడుతూ “నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు చూసిన ఒక సంఘటన ఆధారంగా ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా కథ రాశాను. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా నన్ను ఈ కథ రాసేందుకు ప్రేరణనిచ్చింది. ఇలా సమయం ఉన్నప్పుడు కొన్ని స్క్రిప్ట్ రాసుకున్నాను. ఆహా వాళ్లు మాకొక ప్రాజెక్ట్ చేయండి అని అడిగారు. వారికి ‘ది గర్ల్ ఫ్రెండ్‘ కథ పంపాను. నేను, రష్మిక, గీతా ఆర్ట్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. ‘ది గర్ల్ ఫ్రెండ్‘ కథను అల్లు అరవింద్ చదివి దీంట్లో సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉంది. ఓటీటీకి వద్దు సినిమానే చేద్దామని అన్నారు. రష్మిక, మా కాంబోలో ముందుగా అనుకున్న కథ పక్కనపెట్టి ఈ కథనే సినిమాగా మొదలుపెట్టాం. -టీజర్, ట్రైలర్‌లో ఆడియెన్స్‌ను కావాలనే వేరే విధంగా ఊహించుకునేటట్టు చేశాం. మెయిన్ కంటెంట్ థియేటర్‌లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. మీకు ట్రైలర్‌లో ఉన్న హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామానే సెకండాఫ్‌లో ఉంటుంది. ఈ డ్రామా సర్‌ప్రైజ్ చేస్తుంది. ఒక జంట జీవితంలో ఇలా జరిగింది అనేది నాకు తెలిసిన పద్ధతిలో చూపించాను. అంతే కానీ ఎలాంటి సందేశాలు, నీతులు చెప్పలేదు. సినిమా చూసి ఆడియెన్స్ ఆలోచించుకుంటారనే నమ్మకం ఉంది. నేను ఇవాళ మంచిది అనుకున్నది ఐదేళ్ల తర్వాత కరెక్ట్ కాదు అని నాకే అనిపించవచ్చు. అందుకే ఎవరికీ మెసేజ్‌లు ఇచ్చే ధైర్యం చేయను. ఇంటెన్స్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరీని రియలిస్టిక్‌గా చేశాం. రియలిస్టిగానే నా క్యారెక్టర్ కనిపించాలి అని రష్మిక సపోర్ట్ చేసింది. ఈ కథలో హీరో, హీరోయిన్ ఇద్దరి పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చూపిస్తున్నాం. – ‘ది గర్ల్ ఫ్రెండ్‘ మూవీలోని విక్రమ్ క్యారెక్టర్‌కు దీక్షిత్ బాగుంటాడు అనిపించింది. మూవీలో హీరో హీరోయిన్స్ పీజీ స్టూడెంట్స్. ఒక లెక్చరర్ రోల్ ఉంది. ఆ క్యారెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆయనను సంప్రదిస్తే… వద్దు, నన్ను స్క్రీన్ మీద చూడగానే ఆడియెన్స్ నవ్వుతారు అని వద్దన్నారు. చివరకు ఆ రోల్ నేనే చేయాల్సి వచ్చింది. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా తన క్యారెక్టర్‌కు పర్పెక్ట్ గా సెట్ అయ్యింది. – హేషమ్ అబ్దుల్ వాహాబ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన మ్యూజిక్ తో మూవీలోని ఫీల్ మరింత పెరిగింది. ఇక నెక్స్ నేను డైరెక్ట్ చేయబోయే రెండు ప్రాజెక్ట్‌లు ఓకే అయ్యాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను. ఈ రెండు సినిమాల తర్వాత రష్మిక, నేను కలిసి మరో సినిమా చేయబోతున్నాం. ఆ కథ లైన్ రష్మికకు నచ్చింది. ఇంకా స్క్రిప్ట్ చేయాల్సి ఉంది. మా కాంబోలో ఆ మూవీ వస్తుంది” అని అన్నారు. 

హనుమకొండలో పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొట్టిన లారీ: ముగ్గురు మృతి

ఎల్కతుర్తి: పెళ్ల బృందంతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టడం ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పుర ఎక్స్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని బోర్‌వెల్స్ లారీ ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా 12 మంది గాయపడడంతో ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లికి చెంది యువతిని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువతి వివాహం జరిపించారు. పెళ్లి వేడుకల్లో భాగంగా వధువు బృందం వరుడు ఇంటికి వెళ్తోంది. గోపాల్‌పుర్ వద్ద బొలేరో వాహనం ఆపి స్వేద తీరారు. బోర్ వెల్స్ వేగంగా వచ్చి బొలేరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోయారు. సూదన్ పల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వరుడు, వధువు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు. 

మేఘమథనం.. ఢిల్లీ వ్యర్థ ప్రయత్నం

దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని పట్టిపీడిస్తున్న వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ బిజెపి ప్రభుత్వం చేపట్టిన మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం(29.10.25) ఉదయం ఐఐటి కాన్పూర్ సహకారంతో ఢిల్లీలోని బురారి, ఉత్తర కరోల్‌బాగ్, మయూర్ విహార్, బద్లి తదితరప్రాంతాల్లో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించారు. కాన్పూర్ ఐఐటి నుంచి ప్రయోగ విమానం బయలుదేరి 6000 అడుగుల ఎత్తులో రసాయనాలు వెదజల్లినా ఫలితం దక్కలేదు. ఈ ప్రక్రియ పూర్తయి నాలుగు గంటలైనా వర్షాలు కురవలేదు. గత ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం 2023లో ఢిల్లీలో పొగమంచు సీజన్‌లో మేఘమథనం చేపట్టాలని ప్రయత్నించినా వాతావరణం అనుకూలించక విరమించుకుంది. 2024 లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఢిల్లీ వాయునాణ్యతను అత్యవసరంగా మెరుగుపర్చడానికి మేఘమథనం ఆచరణ సాధ్యం కాదని పార్లమెంట్‌కు వెల్లడించడం ఈ సందర్భంగా గమనార్హం.

లాహోర్, బ్యాంకాక్, కౌలాలంపూర్, బీజింగ్ తదితర ప్రపంచం లోని అనేక నగరాల్లో మేఘమథనం ప్రయోగాలు నిర్వహించినా అనుకున్న లక్షాలు సాధించలేక దీన్ని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఎంతో వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపట్టడం వ్యర్థ ప్రయత్నమే తప్ప ఏమాత్రం ఉపయోగం జరగలేదు. ఆకాశంలో మేఘాలు దట్టంగా ఆవరించి ఉన్నప్పుడే మేఘమథనం పనిచేస్తుంది తప్ప స్వయం సహజ సిద్ధంగా వర్షాన్ని అందించదు. అందువల్ల పొడిగాలులు లేని శీతాకాలంలో కాకుండా వర్షాకాలం లోనే దీన్ని వినియోగిస్తారు. 2023 లో లాహోర్‌లో మేఘమథనం వల్ల కొద్దిసేపు కురిసిన వర్షం గాలి నాణ్యతను మెరుగుపర్చినా, కొన్ని గంటలకే పరిమితమైంది. ఆ తరువాత పరిస్థితి మళ్లీ మామూలే అయింది.ఈ కారణంగా ప్రపంచం లోని చాలా దేశాలు మేఘమథనాన్ని నమ్ముకోవడం లేదు. అత్యవసరంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించవలసి వచ్చినా దీని గురించి ఆలోచించడం లేదు. ప్రభుత్వాలకు ఈ వాస్తవాలు తెలిసినవే.

బిజెపి ప్రభుత్వానికి కూడా ఈ సంగతి తెలిసినా ఎందుకు మేఘమథనం చేపట్టిందో అర్థంకావడం లేదు. శీతాకాలంలో మేఘాలు చాలావరకు పశ్చిమ వైపు అలజడులనుంచి ఉత్తరాదికి వ్యాపిస్తుంటాయి. అవి స్వల్పకాలమే ఉన్నా అప్పటికే సహజంగా వర్షాలను తీసుకొస్తాయి. అందువల్ల మేఘమథనం అవసరం ఉండదు. ఎయిర్‌క్రాఫ్ట్ పరిమితుల బట్టి 5 6 కి.మీ మించి ఎక్కువ ఎత్తులో ఉన్న మేఘాలు మేఘమథనానికి వీలుపడవు. మేఘమథనం సరిగ్గా, సమర్థవంతంగా జరగాలంటే ఆకాశం దట్టమైన మేఘాలతో, అనుకూల వాతావరణంతో ఉండాలి. ఢిల్లీలో శీతాకాలం నాడు అలాంటి వాతావరణం కనిపించదు. వర్షం జల్లులు కురియడానికి సిద్ధంగా ఉన్నా అవి నేలపై రాలడానికి ముందే మేఘాల కింద ఉన్న పొడిగాలి వాటిని ఆవిరిగా దహించేస్తుంది. మరో ముఖ్యమైన విషయం మేఘమథనానికి ఉపయోగించే రసాయనాల సామర్థం విషయంలో ఆందోళన నెలకొంటోంది. ఊహించని పర్యవసానాలు ఎదురవుతున్నాయి. సూక్ష్మం గా చెప్పాలంటే అవి ఏమాత్రం పనిచేయవు. ఈ విధంగా నిరాశపరిచే ఈ ప్రయోగం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది? దీనికి సమాధానం ఢిల్లీ ప్రభుత్వ బిజెపి వర్గాల్లోనే ఉంది.

గత ఆప్ ప్రభుత్వం 2023లో చేయలేకపోయిందని, ఇప్పుడు తాము చేసి చూపిస్తామని బిజెపి ప్రభుత్వం పంతం పెట్టుకుంది. ఇది సైన్స్ గురించి తగిన పరిజ్ఞానం లేక, రాజకీయంగా సాధించాలన్న ఆలోచన తప్ప మరేం కాదని తెలుస్తోంది. ఐఐటి కాన్పూర్ ఇందులోకి తనకు తాను ప్రవేశించి అన్నివర్గాలను ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తోంది. భారత్ మొట్టమొదట 1950 లో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెయిటొరాలజీ నేతృత్వంలో పశ్చిమ కనుమల్లో మేఘమథనం జరిగింది. థాయ్‌లాండ్‌లో కృత్రిమ వర్షపాతం సృష్టించేందుకు డిపార్టుమెంట్ ఆఫ్ రాయల్ రెయిన్ మేకింగ్, అండ్ అగ్రికల్చరల్ ఏవియేషన్ అనే ప్రత్యేక విభాగమే ఉంది. ప్రపంచం లో చైనా, అమెరికా దేశాలు భారీ ఎత్తున వాతావరణ మార్పు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా వర్షాకాలంలో దుర్భిక్ష నివారణకోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. కానీ వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించే మార్గాల్లో మేఘమథనం కూడా ఒకటిగా అనుసరిస్తున్నారు. ఢిల్లీలోని వాయు కాలుష్యాన్ని, అలాగే యమునా నదీ జల కాలుష్యాన్ని శ్రీఘ్రగతిలో పరిష్కరిస్తామని బిజెపి గత కొన్నేళ్లుగా వాగ్దానాలు చేస్తోంది. యమునా నదీ కాలుష్యంపై ఆప్ ప్రభుత్వ కాలంలో ఎన్నో వివాదాలు, సవాళ్లు చెలరేగిన సంగతి తెలిసిందే.

పర్యావరణ సమస్యల పరిష్కారానికి దగ్గరి మార్గాలంటూ ఏవీ లేవు. ప్రపంచంలో ఎక్కడైనా, క్రమబద్ధమైన, శాస్త్రీయ, వైజ్ఞానిక, సాంకేతిక, పద్ధతులు, పాలకవర్గాల జవాబుదారీతనం, దీర్ఘకాలిక ప్రణాళికల అమలు వంటి చర్యలతోనే పర్యావరణ పురోగతి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ విస్మరించి కేవలం రాజకీయ ప్రాబల్యంతో వాస్తవాలను పక్కనపెట్టి అప్పటికప్పుడు నిర్ణయాలతో ఏదీ సాధ్యం కాదు. ఈ పాఠాన్ని ఢిల్లీ బిజెపి ప్రభుత్వం వంట పట్టించుకోవడం తప్పనిసరి. ప్రయోగాలు, ఆవిష్కరణలకు వాటి స్థానం వాటికి ఉంటుంది తప్ప ఆవిష్కరణలు, రాజకీయ సిద్ధాంత భావజాలాన్ని భర్తీ చేయలేవు. మనం పటిష్టమైన మౌలిక సదుపాయాలను, వ్యవస్థలను ముందుచూపుతో నిర్మించుకోలేకుంటే ఆకాశం, ప్రకృతి వనరులు, నదులు, పర్వతాలు ఇవన్నీ కలుషితమవుతూనే ఉంటూ మనం మాత్రం పురోగతి అనే భ్రమలో చిక్కుకుపోతుంటాం.

వరద బాధితులకు సర్కార్ అండ

మన తెలంగాణ/హైదరాబాద్ : వరిధాన్యం కొనుగోళ్లపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధా న్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూ చించారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్లు సిఎంకు వివరించారు. వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నామని అధికారులు సిఎంతో తెలిపారు. దెబ్బతిన్న పంటలు, రహదారులకు సం బంధించిన ప్రాథమిక వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. కేంద్ర ప్ర భుత్వం నుం చి పొందే వరదసాయం అం శాల గురించి అధికారులతో సిఎం 

చర్చించారు. ఈ నేపథ్యంలోనే తుపాన్ ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లు, అధికారులతో సిఎం రేవంత్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ కేంద్రాల దగ్గర క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని ఆయన సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్స్ హాల్స్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలి

ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతి 24 గంటల పరిస్థితిపై ప్రతిరోజూ కలెక్టర్‌కు నివేదిక అందించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 24 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్‌లను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఫీల్డ్‌లో ఉండాల్సిందేనని అధికారులను సిఎం రేవంత్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని సిఎం సూచించారు. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

అధికారులు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సిబ్బంది సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా కలెక్టర్లు చూడాలని సిఎం రేవంత్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా అప్రమత్తంగా వ్యవహారించాలని, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లీంచాలని సిఎం అధికారులకు సూచించారు. అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, వరంగల్‌లో అవసరమైతే హైడ్రా సేవలు వినియోగించుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. జిల్లా ఇన్‌చార్జీ మంత్రికి కలెక్టర్లు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియచేయాలని, ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందించాలి

వరంగల్‌లో వరద బాధితులకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సిఎం రేవంత్ ఆదేశించారు. అవసరమైనన్నీ పడవలను వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించాలని సిఎం సూచించారు. ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని తక్షణమే వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. హైడ్రా సిబ్బందిని, సహాయ సామగ్రిని కూడా ఉపయోగించుకోవాలని, ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, వరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వరద సహాయక చర్యలకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు.

జిల్లాల ఇన్‌చార్జీ మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో సిఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల గురువారం వరంగల్ పర్యటనను వాయిదా వేసుకున్నానని సిఎం అధికారులతో తెలిపారు. తుఫాను ప్రభావిత జిల్లాల ఇన్‌చార్జీ మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండాలని, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాలని, ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం హామీనిచ్చారు. వరద సహాయక చర్యలకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

భారత్ అదరహో..

 కదంతొక్కిన జెమీమా, హర్మన్

 సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం

 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా

నవీ ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీ ఫైనల్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆదివారం జరిగే తుది పోరులో సౌతాఫ్రికాతో టీమిండియా తలపడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో భారత్ చిరస్మరణీయ ఆటతో ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా ఉంచిన క్లిష్టమైన 339 పరుగుల లక్ష్యాన్ని హర్మన్‌ప్రీత్ సేన అలవోకగా ఛేదించింది. ఈ క్రమంలో లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం కూడా తీర్చుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. ఓపెనర్ షఫాలీ వర్మ 5 బంతుల్లో రెండు ఫోర్లతో 10 పరుగులు చేసి కిమ్ గార్థ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన స్కోరును ముందుకు నడిపించింది. ఇద్దరు ధాటిగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. కానీ 24 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో 24 పరుగులు చేసిన మంధానను కిమ్ గ్రాథ్ వెనక్కి పంపింది. దీంతో భారత్ 59 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

జెమీమా, హర్మన్ అద్భుత పోరాటం..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ ముందుకు సాగారు. వీరికి ఔట్ చేసేందుకు కంగారూ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు జెమీమా అటు హర్మన్ తమ మార్క్ షాట్లతో చెలరేగి పోయారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. వీరిద్దరూ కుదురు కోవడంతో భారత్ లక్షం దిశగా సాగింది. ఆరంభంలో జెమీమా దూకుడుగా ఆడింది. హర్మన్ సమన్వయంతో ఆడుతూ జెమీమాకు అండగా నిలిచింది. ఇదే సమయంలో ఇద్దరు అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత జోరును మరింత పెంచారు.

హర్మన్, జెమీమా చారిత్రక ఇన్నింగ్స్‌తో భారత్‌ను పటిష్ఠస్థితికి చేర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించారు. వీరిని ఔట్ చేసేందుకు కంగారూ బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ 88 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 89 పరుగులు చేసిపెవిలియన్ చేరింది. అప్పటికే జెమీమాతో కలిసి 156 బంతుల్లోనే మూడో వికెట్‌కు 167 పరుగులు జోడించింది. హర్మన్ ఔట్ అయినా జెమీమా తన పోరాటాన్ని కొనసాగించింది. ఆమెకు దీప్తి శర్మ, రిచా ఘోష్‌లు అండగా నిలిచారు. ధాటిగా ఆడినదీప్తి 17 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగింది. చెలరేగి ఆడిన రిచా 16 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, మరో 2 ఫోర్లతో 26 పరుగులు చేసింది. అమన్‌జోత్ కౌర్ 8 బంతుల్లో రెండు ఫోర్లతో అజేయంగా 15 పరుగులు సాధించింది. ఇక చారిత్రక బ్యాటింగ్‌ను ప్రదర్శించిన జెమీమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. చివరి వరకు క్రీజులో నిలిచిన జెమీమా టీమిండియాకు ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చింది.

లిచ్‌ఫీల్డ్ శతకం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఓపెనర్ ఫోయెబ్ లిచ్‌ఫీల్డ్, ఎలిసె పెర్రీ ఆదుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. లిచ్‌ఫీల్డ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. చెలరేగి ఆడిన లిచ్‌ఫీల్డ్ 93 బంతుల్లోనే 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 119 పరుగులు సాధించింది. పెర్రీ 88 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 77 పరుగులు చేసింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన అష్లే గార్డ్‌నర్ 46 బంతుల్లోనే 4 సిక్స్‌లు, మరో నాలుగు ఫోర్లతో 63 పరుగులు చేసింది. కీలక సమయంలో భారత బౌలర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 338 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా బౌలర్లలో శ్రీచరణి, దీప్తి శర్మ రెండు వికెట్లను పడగొట్టారు.

నేడు భారత్-ఆస్ట్రేలియా రెండో టి20.. బోణీ కొట్టేదెవరో?

మెల్‌బోర్న్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా రెండో టి20 మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్ల మధ్య కాన్‌బెర్రా వేదికగా జరిగిన తొలి టి20 వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు రెండో టి20 కీలకంగా మారింది. ఇందులో గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. ఇటు భారత్, అటు ఆస్ట్రేలియాలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశాలున్నాయి. పర్యాటక టీమిండియా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించారు. అయితే అభిషేక్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి వైస్ కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఇద్దరు వర్షం వల్ల ఆట నిలిపి వేసే సమయానికి క్రీజులో నిలిచారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన గిల్, సూర్యకుమార్‌లు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరెగితే టీమిండియా భారీ స్కోరు ఖాయం. అభిషేక్ శర్మ కూడా మెరుగైన ఇన్నింగ్స్‌ను ఆడాల్సి ఉంది. ఇక సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, రింకు సింగ్, అక్షర్ పటేల్ వంటి విధ్వంసక బ్యాటర్లు భారత్‌కు అందుబాటులో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు విజృంభించిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లకు కష్టాలు ఖాయమని చెప్పాలి.

అందరి కళ్లు శాంసన్‌పైనే..

ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు సంజూ శాంసన్‌పైనే నిలిచాయి. జట్టులో స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలంటే సిరీస్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన పరిస్థితి శాంసన్‌కు నెలకొంది. నిలకడలేమీ అతనికి ప్రతికూలంగా తయారైంది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరోదాంట్లో విఫలం కావడం అలవాటుగా మార్చుకున్నాడు. దీని నుంచి బయట పడితేనే శాంసన్ కెరీర్ గాడిలో పడే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాతో జరిగే మిగిలిన మ్యాచ్‌లు శాంసన్‌కు పరీక్షలాంటివేనని చెప్పక తప్పదు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. కొంత కాలంగా టి20 ఫార్మాట్‌లో తిలక్ అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఆసియాకప్ ఫైనల్లోనూ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో భారత్‌కు సంచలన విజయం సాధించి పెట్టాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, అక్షర్, హర్షిత్, అర్ష్‌దీప్, బుమ్రా తదితరులతో భారత బౌలింగ్ కూడా బాగానే ఉంది. రెండు విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

ఆత్మవిశ్వాసంతో..

మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. వన్డే సిరీస్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు ఈసారి కూడా జట్టులో ఉన్నారు. ఇది కూడా కంగారూలకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. వన్డే సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా టి20లోకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మిఛెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మిఛెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, నాథన్ ఎల్లిస్, హాజిల్‌వుడ్, సీన్ అబాట్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు కూడా గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు.