Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

realbahis

holiganbet

jojobet giriş

sekabet

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

jojobet güncel giriş

Mavibet

Mavibet Giriş

holiganbet güncel

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

marsbahis

vdcasino giriş

betnano

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

padişahbet

betcio

grandpashabet

ultrabet

marsbahis

sekabet

vegabet

sekabet

grandpashabet

meritking

Sweet Bonanza

jojobet

aresbet

tlcasino

kingroyal

matbet

matbet giriş

bets10

cratosroyalbet

kingroyal

cratosroyalbet

cratosroyalbet

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

vdcasino

betebet

marsbahis

dinamobet

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

విజయం మనదే

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం మనదేనని, కాంగ్రెస్ జెండా పాతాలని సిఎం రేవంత్‌రెడ్డి డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముం దు కు సాగుతోందని, ఈ నేపథ్యంలోనే ప్రతి అం శాన్ని అనుకూలంగా మలుచుకోవాలని, అ హర్నిశలు శ్రమించాలని, అందరూ అ ప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి సూ చించారు. ఈ క్రమంలోనే తాజాగా జూబ్లీహి ల్స్ ఉప ఎన్నిక, ప్రచార సరళిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. గురువా రం జూబ్లీహిల్స్ లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతో ఇప్పటి వరకు సాగిన ప్రచారంపై సిఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసిసి వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మన అభ్యర్థి గెలవబోతున్నారని మంత్రులు, పార్టీ నాయకులందరూ మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. బిఆర్‌ఎస్, 

బిజెపి పార్టీలు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా బిఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని ఆయన సూచించారు. మంత్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోజుకో సర్వేను వదులుతూ ప్రజలను, ఓటర్లను బిఆర్‌ఎస్ సోషల్ మీడియా గందరగోళానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఫీల్డ్‌లో కాంగ్రెస్‌కు బలం ఉందని, నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయని సిఎం రేవంత్ తెలిపారు. ప్రచారానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉందని, ఈ రోజు నుంచి ప్రతి గంట సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఓటరుకు మన వాయిస్ చేరాలని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మూడురోజుల ప్రణాళికల గురించి సిఎం వారికి సూచించారు. ప్రతి డివిజన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించాలని యువ ఓటర్లను ఆకర్శించే విధంగా సోషల్‌మీడియాను బలోపేతం చేయాలని, బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుకోవాలని సిఎం పేర్కొన్నారు.

‘హైడ్రోజన్ బాంబ్’ పేలిందా?

హర్యానా శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత భారత రాజకీయాల్లో తీవ్ర కలకలం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘హైడ్రోజన్ బాంబ్’ పేరుతో బిజెపిపై ఓటు చోరీ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రఖ్యాత మీడియా ఛానెల్స్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించాయి. దేశీయ, విదేశీ మీడియా కవరేజ్ ఈ ఆరోపణల లోతును తెలియజేస్తోంది. ఎన్నికల కమిషన్‌పైనా ప్రశ్నలు లేవనెత్తారు. రాహుల్ గాంధీ ఆరోపణలు తీవ్రమైనవి. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లతో బిజెపి గెలిచిందని చెప్పారు. ఓటరు జాబితాల్లో డూప్లికేట్‌లు, తప్పు చిరునామాలు, నకిలీ ఫోటోలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకే ఫోటోతో 22 ఎంట్రీలు, బ్రెజీలియన్ మోడల్ ఫోటోను ఉపయోగించి స్వీటీ, సీమ, సరస్వతి వంటి పేర్లు పెట్టారని ఆరోపించారు. ఈ మహిళ ఫోటో 10 పోలింగ్ బూత్‌ల్లో కనిపించిందని, అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. ఒకే నియోజకవర్గంలో 100 ఓటర్ కార్డులు ఒకే ఫోటోతో ఉన్నాయని హైలైట్ చేశారు. మరో మహిళ ఫోటో 223 సార్లు కనిపించిందని తెలిపారు.

ఒక ఇంట్లో 501 మంది ఓటర్లు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినవారికి ఓటు హక్కు కల్పించారని ఆరోపణ. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ప్రధాని మోడీ, అమిత్ షా మధ్య సంప్రదింపులు జరిగాయని కూడా చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ గెలుపు అంచనా వచ్చినా, ఫలితాలు బిజెపికి ఎక్కువని గుర్తు చేశారు. హర్యానా సిఎం నాయబ్ సింగ్ సైనీ ఏర్పాట్ల వార్తలు, బిజెపి గెలవబోతుంది అన్న వీడియోను రుజువుగా చూపించారు. పోస్టల్ ఓటింగ్‌లో అసాధారణ తేడాలు, 8 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోవడం, మొత్తం 22,779 ఓట్ల తేడాతో పరాజయం – ఇవన్నీ ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’లో భాగమని ఆరోపించారు. దేశీయ మీడియా ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది. ఎన్‌డిటివి ఎడిటర్ రవిష్ కుమార్ రాహుల్ గాంధీ ఆరోపణలు భారత ప్రజాస్వామ్యానికి ముప్పు. 25 లక్షల నకిలీ ఓట్లు అంటే ప్రతి 8 మందిలో ఒకరు నకిలీ. ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాలి అని కామెంట్ చేశారు.

ఇండియా టుడే చానెల్‌లో రజత్ శర్మ ‘హైడ్రోజన్ బాంబ్’ పేరు భయపెట్టేలా ఉంది. కానీ ఆధారాలు రుజువైతే, ఇది ఎన్నికల వ్యవస్థపై పెద్ద ప్రశ్న. బిజెపి ఖండన తప్పుడు మాత్రమే కాదు, విచారణ కావాలి అని మండిపడ్డారు. టైమ్స్ నౌ డిబేట్‌లో అర్నబ్ గోస్వామీ రాహుల్ ఓటు చోరీ ఆరోపణలు ఎక్కువ, ఆధారాలు తక్కువ అని అన్నారు. కానీ బ్రెజిల్ మోడల్ ఫోటో విషయం ఆసక్తికరం. ఎక్స్‌పోజ్ చేయాలి అని ప్రశ్నించారు. ఎబిపి న్యూస్‌లో ప్రణబ్ రాయ్ ‘కాంగ్రెస్ ఘన విజయాన్ని ఓటమిగా మార్చారు. ఎన్నికల కమిషన్ బిజెపి సాథీభావం చూపిందా? 35 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపణ తీవ్రమైంది’ అని అన్నారు. రిపబ్లిక్ టివిలో అర్ణబ్ మళ్లీ ‘రాహుల్ వైఫల్యాలను కవర్ చేసుకోవడానికి ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తున్నారు. కానీ నకిలీ ఓట్ల ఆధారాలు వెరిఫై అవుతే, దేశానికి షాక్’ అని హెచ్చరించారు. సిఎన్‌ఎన్ -న్యూస్18 లో రాఘవ్ బాపట్ల ‘పోస్టల్ ఓటింగ్ అసాధారణత్వం, ఒక ఇంట్లో 501 ఓటర్లు ఇవి రిగ్గింగ్ సంకేతాలు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి అని సూచించారు.

విదేశీ మీడియా కూడా ఈ ఆరోపణలను పట్టుకుని చర్చించింది. బిబిసి న్యూస్‌లో సౌమ్యా గుప్తా రాహుల్ గాంధీ చేసిన హైడ్రోజన్ బాంబ్ వ్యాఖ్యలు భారత ఎన్నికల సమగ్రతలో ఉన్న పగుళ్లను బహిర్గతం చేశాయి. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు బయటపడటంతో, ఎన్నికల కమిషన్ (ఇసిఐ) తటస్థతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది మోడీ ప్రజాస్వామ్య ప్రతిఛాయను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీయవచ్చు అని కామెంట్ చేసింది. అల్ జజీరాలో మెహ్దీ హసన్ ‘హర్యానాలో బిజెపి నకిలీ ఓటర్ల ద్వారా విజయాన్ని దొంగిలించిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ బ్రెజిలియన్ మోడల్ ఫోటోలతో నకిలీ ఐడిల ఆధారాలను చూపించారు. అంతర్జాతీయ పరిశీలన అవసరమయ్యే కుంభకోణం. భారత ఎన్నికల కమిషన్ కాదా అని ప్రశ్నించారు. రాయటర్స్ రిపోర్ట్‌లో ‘ఆపరేషన్ సర్కార్ చోరి’లో ప్రధాని మోడీ, సిఇసి కుట్రపూరితంగా వ్యవహరించారని గాంధీ ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది. కానీ బిజెపి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించింది. నకిలీల ద్వారా 125% ఓటర్ల ద్రవ్యోల్బణం ప్రజాస్వామ్యంపై ఎర్ర జెండాలు ఎగురవేస్తోంది’ అని పేర్కొన్నారు. న్యూస్ వీక్ మ్యాగజైన్‌లో ‘హర్యానాలో బిజెపి విజయంపై రాహుల్ గాంధీ హెచ్-బాంబ్’ పేల్చారు. 25 లక్షల బోగస్ ఓట్లను ఆరోపిస్తున్నారు.

యుపి వలసదారుల నుండి జీరో అడ్రస్ ఇళ్ల వరకు, ఆరోపణలు వ్యవస్థాగత మోసాన్ని చిత్రీకరిస్తున్నాయి. ఇసిఐ పారదర్శకంగా స్పందించాలి’ అని విశ్లేషించారు. గార్డియన్ పేపర్‌లో భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్ జరిగిందని పేలుడు ఆరోపణలు చేస్తున్నారు. 100 కార్డులలో ఒక ఫోటో ఆధారాలతో, ఈ ‘హైడ్రోజన్ బాంబు’ ఎన్నికల సంస్కరణల కోసం పిలుపులను రేకెత్తించవచ్చు’ అని రాశారు. సిఎన్‌ఎన్ ఇంటర్నేషనల్‌లో క్రిస్టియన్ అమపౌర్ ‘హర్యానా ఎన్నికల వివాదం భారతదేశ ఓటింగ్ వ్యవస్థలోని దుర్బలత్వాలను హైలైట్ చేస్తుంది. వీడియోలు, డేటా మద్దతుతో గాంధీ వాదనలు మోడీ పాలనలో న్యాయాన్ని సవాలు చేస్తున్నాయి. గ్లోబల్ వాచ్‌డాగ్‌లు దర్యాప్తు చేయాలి’ అని అన్నారు. ఫారిన్ పాలసీ మ్యాగజైన్‌లో ‘నకిలీ ఓటర్లపై రాహుల్ బహిర్గతం 5.2 లక్షల నకిలీలు, 98 వేల తప్పుడు చిరునామాలు బిజెపి 2024 హర్యానా విజయాన్ని ప్రశ్నిస్తుంది. నిరూపిస్తే, అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని తగ్గిస్తుంది’ అని విశ్లేషణ చేశారు. ఈ మీడియా కామెంట్స్ ఆరోపణల లోతును తెలియజేస్తున్నాయి. దేశీయ ఛానెల్స్ రాజకీయ డిబేట్‌లకు దారి తీశాయి. విదేశీ మీడియా భారత ప్రజాస్వామ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తోంది. బిజెపి ఈ ఆరోపణలను ‘తప్పుడు, ఆధారరహితం’ అని ఖండించింది.

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాహుల్ తన వైఫల్యాలను దాచుకోవడానికి ఎన్నికల వ్యవస్థను అసత్యాలతో ఆరోపిస్తున్నారు’ అని చెప్పారు.కానీ మీడియా ఆధారాలపై దృష్టి పెట్టింది. రాహుల్ చూపిన వీడియోలు, డేటా రిపోర్టులు విశ్వసనీయమని చాలా చానెల్స్ అభిప్రాయపడ్డాయి. ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. ఇది వివాదాన్ని మరింత పెంచుతోంది. ఈ ఘటన భారత ఎన్నికల వ్యవస్థపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. నకిలీ ఓట్లు, డూప్లికేట్ ఐడిలు ఎలా జరిగాయి? ఎన్నికల కమిషన్ స్వతంత్రమా? ఎగ్జిట్ పోల్స్‌తో ఫలితాల మధ్య తేడా ఎందుకు ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలి. రాహుల్ ఆరోపణలు నిజమైతే, ఎన్నికల సంస్కరణలు అవసరం. తప్పితే, కాంగ్రెస్ విశ్వసనీయతపై ప్రశ్నలు. ఇది రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి దారి తీస్తుంది. ప్రజాస్వామ్యం బలపడాలంటే, పారదర్శకత ముఖ్యం. ఈ ‘హైడ్రోజన్ బాంబ్’ పేలుడు దేశాన్ని మేల్కొల్పాలి.

కోలాహలం రామ్ కిశోర్

98493 28496

మార్పుకు న్యూయార్క్ నాంది

ప్రపంచ దేశాల్లో మార్పు తథ్యం అనిపిస్తున్నది. అమెరికాలో భారతీయ మూలాలున్న నాయకులు కీలక రాజకీయ పదవులు అధిరోహిస్తున్న నేపథ్యంలో ఇది మరింత బలపడుతోంది. ఇటీవలి ఎన్నికల్లో పలువురు భారతీయ- అమెరికన్లు విజయాలు సాధించడం, అమెరికాలో 44 లక్షలకు పైగా ఉన్న భారతీయ వంశీయుల రాజకీయ ప్రభావం పెరుగుతున్నదనే సంకేతాలు ఇస్తోంది. అత్యంత ప్రధానంగా న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలలో జోహ్రాన్ మమ్దాని విజయం సాధించి నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 34 ఏళ్ల వయసులో, ఒక శతాబ్దం తరువాత న్యూయార్క్‌కు అత్యంత యువ మేయర్‌గా ఆయన నిలవనున్నారు. ఉగాండా భారతీయ మూలాల తల్లిదండ్రులకు జన్మించిన మమ్దాని, గృహ వసతి, వలసదారుల హక్కులు, ప్రజారవాణా వంటి అంశాలపై పనిచేసినందుకు సిద్ధ్దపడుతున్నారు.

ప్రపంచంలో ఏది తప్పుగా జరుగుతోంది? ఏ అన్యాయానికి పరిష్కారం అవసరం? ఏ కథ లోకానికి చెప్పడం లేదు?’ అన్న అంశాలపై జోహ్రాన్ చర్చించారు. ఆ విశ్లేషణలను వింటూ పెరిగిన వాడు ఇప్పుడు ప్రపంచమంతా తన వైపు తిప్పుకునేంత ఎత్తు ఎదిగారు. అమెరికా గడ్డపై న్యూయార్క్ పట్టణ మేయర్‌గా తొలిసారి ఓ సోషలిస్టుగా ఎన్నికై తన పేరును చరిత్ర పుటల్లో లిఖించాడు. జోహ్రాన్ చిన్నవయస్సులోనే సమకాలీన అంశాలను విశ్లేషించే వారు. మతతత్వశక్తులపై నిరసనలు తెలియచేసారు. భారత్‌లో రామ్ మందిర్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, గాజాలోని ముస్లింలపై దాడులను నిరసన వ్యక్తం చేసారు. జోహ్రాన్ 1991లో ఉగాండాలోని కంపాలలో జన్మించారు. తల్లి మీరానాయర్, తండ్రి మహ్మద్ మమ్దానీ. ఇద్దరూ భారతీయులే. మీరా బాలీవుడ్ చిత్రరంగంలో అవార్డులు కొల్లగొట్టిన ప్రముఖ చిత్రాలు ‘సలాం బాంబే’, ‘మాన్‌సూన్ వెడ్డింగ్’ వంటి సినిమాలని తెరకెక్కించారు.

ఈ కుటుంబం జోహ్రాన్‌కి ఐదేళ్లప్పుడు దక్షిణాఫ్రికాకి వెళ్లి, ఆ తరువాత న్యూయార్క్ నగరంలో స్థిరపడ్డారు. బాల్యం నుండి న్యూయార్క్ వీధుల్లో పెరిగిన జోహ్రాన్ ఎన్నోసార్లు వివక్షని ఎదుర్కొన్నాడు. ఆ సందర్భాన్ని ఒకసారి ఆయన ఇలా చెప్పారు. ‘నా స్నేహితుడు ఒకసారి నన్ను ‘మీరు సనాతనవాదులు కారు’ అని చెప్పాడు. జోహ్రాన్ బదులిస్తూ మేము బుద్ధిమంతులం, తెలివిపరులమని తెలియజేసారు. మా కుటుంబంలో ప్రార్థన ఉంది. కవిత్వమూ ఉంది. మా ఇంట్లో ఉర్దూ గజల్స్ ఉంటాయి. ఆఫ్రికన్ జానపద కథలు వినిపిస్తాయి’ అని చెప్పాడు. ఎన్నో చేదు అనుభవాలు అతనికి ఎదురయ్యాయి. ‘తనని ఇంతటి శక్తిమంతుడిగా తీర్చిదిద్దింది అమ్మానాన్నే’ అని జోహ్రాన్ గర్వంగా చెబుతారు. ‘వలస వెతలు, బాల కార్మికులు, గుర్తింపు, సంస్కృతి వంటి ఇతివృత్తాలను అద్భుతంగా తెరకెక్కించిన తల్లి పెంపకంలో తాను ఉన్నతంగా ఎదిగానని జోహ్రాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరోసారి తన తల్లి గురించి ఆయన ఇలా అన్నారు. ‘హ్యారీ పోర్టర్ లాంటి సినిమాలని ఏ మంచి దర్శకుడైనా రూపొందిస్తారు.

కానీ అమ్మ తీసిన చిత్రాలు కేవలం ఆ వ్యక్తులు, వాళ్ల బాధలను పట్టించుకునే వ్యక్తులకు మాత్రమే సాధ్యం. సమాజంలో వివక్షకు గురవుతున్న వర్గాలపట్ల నా తల్లిదండ్రీ నిలబడడం నిజంగా నాకు గర్వకారణం. వాళ్లు చెప్పిన కథలు గ్లామర్‌గా ఉండవు. అవి సృజనాత్మకతని, విలువైన విషయాలు, ప్రపంచం చూడని కథలని ఎత్తి చూపుతాయి. వాటి శక్తిని అర్థం చేసుకోవడం అంటే ప్రజా విధానాన్ని అర్థం చేసుకోవడమే అని నా అభిప్రాయం’ అని చెబుతున్న జోహ్రాన్, తల్లిదండ్రుల సంరక్షణలో క్రియాశీలకమైన భావజాలంతో పెరిగారు. ప్రపంచంలో నెలకొన్న అసమానతలని చిన్నప్పటి నుండి అతను అవగతం చేసుకోవడం మొదలుపెట్టారు. జోహ్రాన్ మాటల్లో చెప్పాలంటే ‘కళ’, ‘క్రియాశీలత’ వేరు కాదని నేర్పించారు’ అంటారు. భారతదేశం, ఇజ్రాయెల్, పాలస్తీనా వంటి ప్రపంచ రాజకీయ అంశాలపై ఆయన వ్యక్తపరచిన అభిప్రాయాలు కొంత వివాదాస్పదంగా మారాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మమ్దాని పాలన శైలి, స్థానిక సమస్యలపై ఆయన ప్రాధాన్యత, రాబోయే కాలంలో ప్రధానంగా గమనించబడనుంది. ఇదిలా ఉండగా, వర్జీనియా రాష్ట్రంలో ఘజాలా హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై ఆ రాష్ట్రంలో తొలి ముస్లిం, దక్షిణాసియా మూలాల నాయకురాలిగా చరిత్ర సృష్టించారు. 61 ఏళ్ల డెమొక్రాట్ నాయకురాలు హష్మీ, 54%కు పైగా ఓట్లు సాధించారు. ఆమె తన లెజిస్లేచర్‌గా పనిచేసిన కాలంలో ప్రజా విద్య, ఓటు హక్కులు, ఆరోగ్య సేవలు, పర్యావరణ సంరక్షణ అంశాలపై చురుకుగా పని చేశారు.

అలాగే, ఓహియో రాష్ట్రం సిన్సినాటి నగర మేయర్‌గా అఫ్తాబ్ ప్యూరవాల్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన 2021లో తొలి ఆసియా మూలాల మేయర్‌గా ఎన్నికై, ఈసారి రిపబ్లికన్ ప్రత్యర్థిని ఓడించి రెండోసారి బాధ్యతలు కొనసాగిస్తున్నారు. ప్యూరవాల్ తల్లి టిబెటన్ శరణార్థి కాగా, తండ్రి పంజాబీ. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికన్ నగరాలు, రాష్ట్రాలలో భారతీయ మూలాల నాయకులు ఎదగడం, వలసదారుల కృషి, విద్య, సామాజిక సేవల రంగాలలో వారి బలమైన పాత్రను ప్రతిబింబిస్తోంది. ఈ నాయకుల ఎదుగుదల, అమెరికా రాజకీయ వ్యవస్థ పైనేకాక ప్రపంచ సమగ్రత వైపు సాగుతున్నదనే సంకేతాన్ని ఇస్తున్నది. మమ్దాని న్యూయార్క్ నగర పాలనలో అడుగుపెడుతుండగా, హష్మీ వర్జీనియా రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్యూరవాల్ తన రెండో పదవీకాలాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ముగ్గురు నాయకుల పాలనా నిర్ణయాలు రాబోయే సంవత్సరాల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. రాబోయే రోజుల్లో మెరుగైన పౌరసమాజం మూలస్తంభాలైన సామాజిక సమగ్రత, సోషలిజం,ప్రజాస్వామ్యం వైపు ప్రపంచం కదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డా. ముచ్చుకోట సురేష్ బాబు

99899 88912

రావొచ్చినా..రెడ్డొచ్చినా ఒవైసి చెప్పిందే వినాలి

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్ నియోజకవ ర్గం ఉప ఎన్నికల ప్రచారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఆయన రోడ్ షో, సమావేశాలకు అనుమతిలేదని పోలీసులు ముందు చెప్పడంతో బిజేపి శ్రేణులు రాష్ట్ర పోలీసులపై విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మజ్లిస్ చెప్పినట్లు పోలీసులు వింటున్నారని, తాను పర్యటనకు వస్తానని, ఎవరు ఆపుతారో చూస్తానంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించడం కలవర పెట్టింది. బిజెపి కార్యకర్తలంతా బోరబండ ఎన్నికల ప్రచారానికి తరలిరావాలని పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సాయంత్రానికి పోలీసులు అనుమతిస్తున్నట్లు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.బోరబండ ఎన్నికల సభలో బండి సంజయ్ మాట్లాడుతూ ‘నేను హిందువును, టోపీ పెట్టి, దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపర్చను, ఒక వేళ టోపి పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా’ అని సంచలన వ్యాఖ్య లు చేశారు.

ఇక కెసిఆర్ కుమార్తె కవితపైనా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. మీ తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకో అంటూ కవితకు సూ చించారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే రూ.9 వేల కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరినట్లు? అని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అని నిలదీశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని హిందువులారా 70 శాతం ఓట్ల సత్తా ఏందో చూపించండని పిలుపునిచ్చారు. రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఒవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు అంటూ మంత్రులు, నేతలపై సంజయ్ ఘాటుగా విమర్శించారు. టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డిని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొచ్చాడని ఎద్దేవా చేశారు. అజహరుద్దీన్ చేత గణేష్ మంత్రం చదవించే దమ్ముందా?, ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ ఆలయానికి తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా? అని ప్రశ్నించారు.

దీపక్‌రెడ్డి గెలవాలి: రాంచంద్రరావు

బోరబండలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ హిందు టైగర్ బండి సంజయ్ ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడారో మీకు తెలుసునని అన్నారు. బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలవాలి, ఆయన అసెంబ్లీకి వెళ్లి మన వాణి వినిపించాలని బండి సంజయ్ అలా మాట్లాడారని అన్నారు. హిందువుగా స్వాభిమానాన్ని కాపాడాలంటే జూబ్లిహిల్స్ ఎన్నికల్లో దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రేవంత్ రెడ్డి రేవంతుద్దీన్ గా మారిపోయిన సంగతి తెలిసిందేనని ఎద్దేవా చేశారు. ఆయన మారినట్లుగానే మనం రహమత్ నగర్‌ను మీనాక్షి నగర్‌గా పేరు మార్చుదామని అన్నారు.  

నాలుగో టీ20లో భారత్ ఘన విజయం..

క్వీన్స్‌లాండ్: ఆస్ట్రేలియాతో గురువారం జరిగే కీలకమైన నాలుగో టి20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసినటీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు జట్టుకు శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన అభిషేక్ 21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28 పరుగులు చేశాడు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ 39 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో శివమ్ దూబె (22), కెప్టెన్ సూర్యకుమార్ (20) నిరాశ పరిచారు. తెలుగు కుర్రాడు తిలక్‌వర్మ (5), వికెట్ కీపర్ జితేశ్ శఱ్మ (3) కూడా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (12) పరుగులు చేయగా, అర్ష్‌దీప్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ధాటిగా ఆడిన అక్షర్ పటేల్ 11 బంతుల్లోనే 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, జంపా మూడేసి వికెట్లను పడగొట్టారు.

శుభారంభం లభించినా..

తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మాథ్యూ షార్ట్, మిఛెల్ మార్ష్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే రెండు ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన షార్ట్‌ను అక్షర్ వెనక్కి పంపాడు. కొద్ది సేపటికే జోష్ ఇంగ్లిస్ (12) కూడా ఔటయ్యాడు. ఆ వెంటనే కెప్టెన్ మార్ష్ (20) కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు, అక్షర్ పటేల్, శివమ్ దూబె రెండేసి వికెట్లను పడగొట్టారు.

హైదరాబాద్ అభివృద్ధికి రూ.1.30లక్షల కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు కేంద్రం ఏం చే సిందని కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు ప్రశ్నిస్తున్నాయని, నిజానికి ఒక్క హైదరాబాద్‌లోనే రూ.1.30లక్షల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. రైల్వే, జాతీయ రహదారులతో పాటు భారీ వంతెనాలు, ట్రిబుల్ ఆర్ తదితర ఎన్నో ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసి ని ధులు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎ న్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలపై స్ప ష్టత ఇవ్వకుండా ప్రతి దానికి ఉచిత బస్సు గురించే చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగితే వాటి గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉచిత బస్సు పథకం గురించి మాట్లాడుతూ అన్ని సమస్యలకు అదే పరిష్కారమన్నట్లు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చెప్పడం వారి మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నూతన పాలకవర్గం గురువారం నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’లో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఆ పార్టీతో కలిసి పని చేసే ప్రసక్తి లేదని అన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పరిమితమైందని గుర్తు చేశారు. భవిష్యత్తులో బిఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తి లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిది మూడో స్థానం అయితే, లోక్ సభ ఎన్నికలో రెండో స్థానానికి వచ్చామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల ప్రచార తీరుపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత, బీఆర్‌ఎస్‌పై నమ్మకం లేకపోవడంతో జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేకపోతున్నారని అన్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోరు జరుగుతోందని అన్నారు. ఈ గందరగోళం సర్వేల్లోనూ ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికల అంశంలో సర్వేల్లో స్పష్టత లేదని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో జరిగే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ వెనుకబాటుకు బీఆర్‌ఎస్ బాధ్యత వహించాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,

మంత్రులు తమ హామీల గురించి ప్రస్తావించకుండా బిజెపిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో ఎక్కువ వాటా కేంద్రానిదేనని, ఆ పథకాన్ని ఆపేస్తామని సీఎం ఎలా అంటారని ప్రశ్నించారు. రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యంలో ప్రతి కిలోకి రూ.42 కేంద్రం భరిస్తోందని, సన్నబియ్యం అంటూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని దానికి కలపడం వల్ల మరో రూ.15 అదనంగా చెల్లిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏమీ ఖర్చు చేయడం లేదని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి కూడా నిధులు లేవని విమర్శించారు.

మజ్లిస్ మెప్పు కోసం ముఖ్యమంత్రి తహతహ

రాష్ట్రంలో ఏం చేయాలన్నా మజ్లిస్‌ను అడిగి, వారి మెప్పు పొందిన తర్వాతే చేస్తున్నారని కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ’ఇజ్జత్’ అంటావు, మరి హిందువులు ఇజ్జత్ కాదా రేవంత్‌రెడ్డి అని ప్రశ్నించారు. ఎర్రగడ్డలో ఖబర్‌స్తాన్‌కు స్థలం కేటాయించడం సరైనదేనా అని ప్రశ్నించిన ఆయన బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాల స్థలం ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. హిందువులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ అనుబంధాన్ని ఎంతకాలం కొనసాగిస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తన పరిధిలో విచారణ చేయకుండా బీజేపీపై ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ తో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై సీబీఐ కేసు నమోదు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై కిషన్ రెడ్డి స్పందిస్తూ దీనిపై కేంద్రం దర్యాప్తునకు సిద్ధంగా ఉందని చెప్పారు. బోరబండలో పాదయాత్ర చేస్తే ఎంత మేర అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని అన్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం బాధ్యత వహిస్తుంది

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం బాధ్యత వహిస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం ఏం చేయాలో అవన్నీ చేస్తుందని అన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్ ఉంటుందని, అంతేకాని తెలంగాణకు ఒకటి, ఆంధ్రాకు ఒకటి, కేరళ, తమిళనాడుకు ఒక బడ్జెట్ ఉండదని అన్నారు. అయితే అక్కడ ఉన్న ప్రాధాన్యతలను బట్టి కొన్ని చేయాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులకు సంబంధించి భూ కేటాయింపుల కోసం 40 ఉత్తరాలు రాశానని, అయినా ఒక్కదానికి సమాధానం రాలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 101 అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ పరిధిలో జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీబీనగర్ ఎయిమ్స్ శాశ్వత భవనాలను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తారని తెలిపారు. తాను కేంద్రమంత్రిగా హైదరాబాద్‌కే కాకుండా తెలంగాణకు ఏది అవసరమో దాని కోసం ప్రయత్నించి వీలైనన్ని ప్రాజెక్టులు తెచ్చామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

స్వచ్ఛ విద్యుత్‌కు పచ్చజెండా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 7460 మెగా వాట్ల స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ములు గు జిల్లా ఇప్పగూడెంలో 3,960 మెగావాట్లు, ఆదిలాబాద్ జిల్లా జారీలో 950 మెగావాట్లు ఉత్పత్తి చే సేందుకు గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముం దుకు వచ్చింది. అలాగే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని రాణాపూర్ గ్రామంలో 900 మెగావాట్ల వి ద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సిద్ధార్డ్ ఇన్‌ఫ్రాటెక్ అం డ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, నిజామాబాద్ జిల్లా మైలారంలో 750 మెగా వాట్ల వి ద్యుత్ ఉత్పత్తికి అష్టా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆదిలాబాద్ జిల్లా రామాపుర గ్రామంలో 900 మెగావాట్ల విద్యు త్ ఉత్పత్తికి సెరులీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ టిజి రెడ్కోకు ప్రతిపాదనలను అందించాయి. టి జి రెడ్కో అధికారులు ఈ ప్రతిపాదనలను టిజి జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్‌కు పంపగా ఒప్పందాల కోసం విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదకతను పెంచి భవిష్యత్తు అవసరాలకు సరిపడే వి ద్యుత్తును సమకూర్చుకునేందుకు తెలంగాణ ప్రభు త్వం ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025’ని రూ పొందించింది.

సిఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఇటీవల కొత్త పాలసీని ఆమోదించింది. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం అదనంగా సమకూర్చుకోవాలనేది కొత్త పాలసీ లక్ష్యం. ఈ క్రమంలో రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి కొత్త విధానం సరికొత్త బాటలు వేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో రాబోయే పదేండ్లలో 1.98 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు 1.14 లక్షల ఉద్యోగ అవకాశాల సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రంలో ఇప్పుడున్న కాలుష్య కారక తీవ్రత పదేండ్లలో 33 శాతం తగ్గుతుందని అంచనా వేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మాసిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక కారిడార్లు తదితర అభివృద్ధి పనులతో భవిష్యత్తులో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరగనుంది. 2024-25లో రాష్ట్రంలో 15,623 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉండగా 2034-35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. సౌర విద్యుత్‌తో పాటు ఫ్లోటింగ్ సోలార్, విండ్ పవర్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఈ విధానం రూపొందించింది.

పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులు : గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులతో పాటు సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలను ఈ పాలసీలో పొందుపరిచింది. మన రాష్ట్రంలో ఉన్న వాతావరణం ఏడాదిలో 300 రోజులు సౌర విద్యుత్తు ఉత్పత్తికి అనుకూలిస్తుంది. దేశంలోనే బలమైన గాలులు వీచే 8 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో పవన విద్యుత్తు ఉత్పత్తికి మెండుగా అవకాశాలున్నాయి. కొత్త విధానం ప్రకారం సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాలను స్థాపించేందుకు ముందుకు వచ్చే డెవెలపర్లను ప్రోత్సహిస్తారు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో కొత్త ప్లాంట్లకు అనుమతులిస్తారు. వీటికి ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకు ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న వారు డిస్కంలకు లేదా ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా అమ్ముకునే అవకాశాన్ని కల్పించారు.

కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ఈ పాలసీ కింద ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్ విధానంలో కేటాయించనున్నారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రోత్సహిస్తుంది. 500 కిలోవాట్ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశమిస్తుంది. డిస్కంలు ఈ విద్యుత్‌ను కొనుగోలు చేస్తాయి. ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై రూఫ్ టాప్ సౌరవిద్యుత్ ప్లాంట్లను ప్రోత్సహిస్తారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ, ఇతర పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే స్థలాలను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. సీలింగ్ పరిమితి ఉండదు. భూ వినియోగ మార్పిడి అనుమతులు అవసరం ఉండదు.

టీజీ-ఐపాస్ ద్వారా అనుమతులు : టీజీ-ఐపాస్ ద్వారా అన్ని రకాల అనుమతులను వేగంగా జారీ చేస్తారు. ప్లాంట్ల స్థాపనకు కొనుగోలు చేసిన భూములకు 100 శాతం స్టాంప్ డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతులు, ఎన్వోసీలను మినహాయించారు. సోలార్ ప్లాంట్లకు నీటి ఛార్జీలను రియింబర్స్ చేస్తారు. సోలార్, పవన విద్యుత్తును వినియోగించే ఎంఎస్‌ఎంఈ సంస్థలకు 8 ఏండ్ల పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మాఫీ వర్తిస్తుంది. మూల ధన పెట్టుబడిలోనూ రాష్ట్ర జీఎస్టీ వాటాను తిరిగి చెల్లిస్తారు. పునరుత్పాదక విద్యుత్తులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, వినూత్న ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌కో, డిస్కంల ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది.

బీహార్‌లో తొలివిడత ప్రశాంతం

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ 64.66 శాతం పోలింగ్ నమోదైంది. 2020 నాటి ఎన్నికలతో పోల్చితే 2.84శాతం పోలింగ్ అధికంగా నమోదైంది. గురువారంనాడు జరిగిన తొలిదశ పోలింగ్‌లో పలు కీలక, వివాదాస్పద స్థానాలు ఉన్నాయి. మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రానికి 64.66 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తన కారుపై దుండుగులు దాడికి ది గారని ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ కలుగచేసుకుని విచారణ కు ఆదేశించి నిందితులపై చర్యలకు ఆదేశించింది. తొలి దశ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా పలువురు మంత్రులు కూడా బరిలో ఉన్నారు.

తేజస్వీయాదవ్ తన కుటుంబానికి గట్టి పట్టున్న రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ నమోదైన శాతాన్ని బట్టి మెరుగైనదిగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందనే విషయంపై ప్రధాన ప్రత్యర్థులు ఎన్‌డిఎ, ఇండియా కూటములు వి శ్లేషణలకు దిగుతున్నాయి. ఈ దఫా మొత్తం 18జిల్లాల్లో విస్తరించుకుని ఓటింగ్ జరిగింది. ఇందులో బెగూసరాయ్ జిల్లాలో అత్యధికంగా సాయంత్రానికి 67.32శాతం పోలింగ్ నమోదైం ది. తరువాత స్థానంలో సమస్తిపూర్‌లో 66శాతం, మాధేపురాలో 65 శాతం ఓటింగ్ రికార్డు అయింది. లఖిసరాయ్‌లో నాలుగోసారి పోటికి దిగిన ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా తన కాన్వాయ్‌ను ఆర్జేడీ మద్దతుదార్లు నిలిపివేశారని, దాడికి దిగారని ఆరోపించారు. అక్కడి బిసి ఓటర్లను బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌జెడి ఎంఎల్‌సి ఆజయ్ కుమార్‌కు, డిప్యూటీ సిఎంకు నడుమ మాటల యుద్ధం సాగింది. తాగుబో తు, క్రిమినల్ అంటూ పరస్పరం తిట్టుకున్నారు.

మాకు బలమున్న చోట ఓటింగ్ తగ్గించే కుట్ర: ఆర్‌జెడి

ఇండియా కూటమి బలమున్న చోట్లలో పోలింగ్ శాతం తగ్గేందుకు అధికారులు యత్నించారని ఆర్జేడీ సామాజిక మాధ్యమాలలో ఆరోపించింది. ఈ వాదనను ఎన్నికల సంఘం అధికారులు తోసిపుచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ప్రశాంతంగా, సజావుగా పోలింగ్ జరిగేలా చూశారని వివరణ ఇచ్చుకున్నారు. పాట్నా నియాజకవర్గంలో సాయంత్రం వరకూ అత్యల్పంగానే ఓటింగ్‌రికార్డు అయింది. ఇక్కడ బనిక్‌పూర్ అర్బ న్ నియోజకవర్గంలో 34శాతం, కుమాహ్రారర్‌లో 37 శాతానికి పైగా జనం ఓటేశారు. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో, నగరాల్లో ఓటింగ్ పట్ల ఓటర్లు ఉత్సాహం ప్రదర్శించకుండా ఉంటున్న వైనం ఈ పరిస్థితికి కారణం అని అధికారులు విశ్లేషించారు. 

వందేమాతరానికి 150 ఏళ్లు

మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని విద్యాసంస్థల్లో శుక్రవారం(నవంబర్ 7) ఉదయం 10 గంటలకు వందేమాతర గీతం సామూహికంగా ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రచయిత బంకింఛంద్ర చట్టర్జీ వందేమాతరం గీతం రచించి 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పాఠశాలలతో పాటు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వందేమాతరం పాడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

నేడు ఢిల్లీలో ప్రారంభించనున్న మోడీ

స్వాతంత్య్ర పోరాటానికి దేశభక్తిని ప్రేరేపించిన ‘వందేమాతరం’జాతీయ గీతాన్ని రచయిత బకించంద్రఛటర్జీ రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడుగునా స్మారక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా స్మారక తపాలా స్టాంప్, నాణేన్ని కూడా విడుదల చేస్తారు. ఈ ఏడవ తేదీ నుంచి వచ్చే ఏడాది నవంబర్ 7 వరకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అనుసంధానంగా అనేక చోట్ల బహిరంగ ప్రదేశాల్లో సామూహిక గీతాలాపన నిర్వహిస్తారు.  

శుక్రవారం రాశి ఫలాలు (07-11-2025)

మేషం: ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవసేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

వృషభం:  కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టిసారించడం మంచిది.

మిధునం: దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి.

కర్కాటకం: రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయట పడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీపనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

సింహం: ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవసేవా కార్యక్రమాలకు ధనసహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

కన్య: వృత్తి వ్యాపారాలలో పనిఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాటఇవ్వటం మంచిది కాదు. విద్యార్థులు పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. దైవసేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.

తుల: నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీమాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృశ్చికం:  ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవకార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి.

ధనస్సు: కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధనసహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు.

మకరం: వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరోబాధను కలిగిస్తాయి. ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడివలన నూతనరుణాలు చేయవలసివస్తుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది.

కుంభం: వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులనుండి ఆశించిన ధనసహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థానచలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీచేసుకుంటారు.

మీనం

వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.