Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

setrabet

jojobet

piabellacasino giriş

bets10

bets10

piabellacasino

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

mersin escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

casibom

casibom giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Giriş

casibom

Pusulabet

holiganbet

Pusulabet Giriş

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

holiganbet

aresbet

matbet

matbet giriş

bets10

kingroyal

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

marsbahis

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

jojobet

bettilt

interbahis

Holiganbet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

grandpashabet

galabet

casibom güncel giriş

pusulabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

süratbet

jojobet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

meritking

kingroyal

lunabet

meritking

పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి

అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పవన్ కాన్వాయ్ వెళ్తుండగా ఓ కారు హేమలత అనే మహిళ కాలు పైనుంచి వెళ్లిపోయింది. పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. వెంటనే సదరు మహిళను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తోపులాటలో పవన్ కారు టైర్ కిందపడి కాలు విరిగిందని బాధితురాలు హేమలత వాపోయారు.  

డిసెంబర్‌లో ఐపిఎల్ వేలం?

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2026 కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో వేలం పాటను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వచ్చే ఐపిఎల్ కోసం ఈ మెగా వేలం పాటను నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత రెండు సీజన్‌లలో ఐపిఎల్ వేలం పాటను విదేశాల్లో నిర్వహించారు. ఈసారి మాత్రం భారత్‌లోనే దీన్ని నిర్వహించేందుకు బిసిసిఐ సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఏ నగరంలో వేలంపాట నిర్వహిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. డిసెంబర్ 15న ఐపిఎల్ వేలం పాట జరిగే అవకాశాలున్నాయి.

నవంబర్ 15లోపు అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చుసుకునే ఆటగాళ్ల జాబితాను బిసిసిఐకి ఇవ్వాల్సి ఉంది. కొన్ని రోజుల వరకు ఈసారి కూడా వేలం పాటను గల్ఫ్ దేశాల్లోనే నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. ఆయా ఫ్రాంచైజీలకు బిసిసిస ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు కథనాలు కూడా వినవచ్చాయి. కానీ ప్రస్తుతంఅవన్నీ ఊహాగానాలేనని తేలింది. ఈసారి వేలం పాటను భారత్‌లోనే నిర్వహించేందుకు బిసిసిఐ చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఆటగాళ్ల రిటైన్ జాబితా వచ్చిన తర్వాతే బిసిసిఐ వేలం పాట గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఆడబిడ్డ రాజకీయాలు చేయొద్దన్నారు: ఎమ్మెల్సీ కవిత

అవమానకరంగా బిఆర్‌ఎస్ నుంచి బయటకు పంపారు

ప్రొటోకాల్ పేరుతో గత ప్రభుత్వం నన్ను కట్టడి చేసింది

ఆ సంకెళ్లను తెంచుకొని ప్రజల మధ్యకు వచ్చా

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

మన తెలంగాణ/హన్మకొండ: ఆడబిడ్డ రాజకీయాలు చేయొద్దని గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం తనను కట్టడి చేసిందని, అవమానకరంగా తనను పార్టీ నుంచి బయటకు పంపారని, ఆ సంకెళ్లను తెంచుకొని ప్రజల మధ్యకు వచ్చానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఉదయం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్‌లో తనను ప్రొటోకాల్ పేరుతో నిజామాబాద్‌కే కట్టడి చేశారన్నారు. టీచర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకునే పరిస్థితి లేకుండేనని అన్నారు. 20 ఏళ్లు బిఆర్‌ఎస్‌లో పనిచేస్తే తనను అవమానకరంగా బయటకు పంపించారని వ్యాఖ్యానించారు. కనీసం తనకు షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. నేను తెలంగాణ బిడ్డనే. ఆకలినైనా తట్టుకుంటానని, అవమానాన్ని మాత్రం తట్టుకోలేనని అన్నారు. పొలిటికల్‌గా బిఆర్‌ఎస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

విప్లవాత్మక మార్పు జరిగినప్పుడు కొంతమందికి నష్టం జరగవచ్చునని అన్నారు. తనను బిఆర్‌ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఇకపై పక్కా రాజకీయాలు చేసి చూపిస్తానని చెప్పారు. ఆడబిడ్డ రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అన్నారు. రా ష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ రెండూ ప్రజలకు మంచి చేయడంలో విఫలమయ్యాయని అన్నారు. వరంగల్ గడ్డ పౌరుషాల గడ్డ అని, ఇక్కడ నడయాడిన కవులు, మేధావులు సమ్మక్క సారల పౌరుషాన్ని నింపుకున్న నేల అన్నారు. అయినా తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌లో అభివృద్ధిలో లేదన్నా రు. ప్రస్తుత పాలకులు ఇక్కడి అభివృద్ధి సంక్షేమాన్ని మర్చిపోయారని గుర్తు చేయాడానికే వరంగల్ గడ్డను ఎంచుకొని పర్యటన చేస్తున్నానని అన్నారు. యాక్షన్ రిపోర్ట్ తయారుచేసి దాని ప్రకారంగా సమస్యలపై ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తానని అన్నారు.  

రాసి పెట్టుకోండి.. పదేళ్లు మేమే

2029లో జమిలి..2034వరకు అధికారంలో ఉంటాం

గత 10 సంవత్సరాలను కెసిఆర్, మోడీ జల్సాలకు వాడుకున్నారు

కాంగ్రెస్ సిఎంల నిర్ణయాల వల్లే హైదరాబాద్‌లో అభివృద్ధి

బిఆర్‌ఎస్ పాలనలో అన్ని రంగాలు అధోగతి

ధృతరాష్ర్టుడిలా కెసిఆర్ పరిస్థితి

సినిమాలో ఐటమ్ సాంగ్‌లా కెటిఆర్ వ్యవహారశైలి

ఆయన జీవితంలో అధికారమనే రేఖ లేదు

బావ బామ్మర్దులది పైశాచిక ఆనందం

గత ప్రభుత్వంలోని మంచి పథకాలు కొనసాగిస్తున్నాం

మాకు కేంద్రంతో కాదు కిషన్‌రెడ్డితోనే సమస్య

ఏ లాభం కోసం కెటిఆర్‌తో ఆయనకు సోపతి

కాళేశ్వరం, ఫార్ములా ఈపై చర్యలను అమిత్ షా, గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు

మహిళల ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్‌తో ఒప్పందం

‘మీట్ ది ప్రెస్’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః “2034 జూన్ వరకూ అధికారం మాదే&రాసిపెట్టుకోండి&జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి..” అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్‌లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి కొనసాగింపుగా గత బిఆర్‌ఎస్ పదేళ్ళ విధ్వంసాన్ని మరిపించే విధంగా రాబోయే వందేళ్ళ అభివృద్ధి లక్షంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్వర్యంలోని యుపిఎ-1, యూపిఎ-2 హయాంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆర్జించిన ఆదాయాన్ని గడచిన పదేళ్ళ కాలంలో కెసిఆర్, ప్రధాని నరేంద్ర మోడీ జల్సాలకు వాడుకున్నారని ధ్వజమెత్తారు. కుంటుపడిన పాలనను ఈ రెండేళ్ళ తమ పాలనలో చక్కదిద్దే ప్రయత్నం చేశామన్నారు. నాటి కాంగ్రెస్ అభివృద్ధితో నేడు దేశానికి వచ్చిన ఐదు వందల కంపెనీల్లో డ్బ్భై శాతం రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రపంచాన్ని శాసించే సంస్థలు హైదరాబాద్‌లో కొలువుదీరాయని, ఇది నాటి కాంగ్రెస్ పాలనకు నిదర్శమని అన్నారు.

గత పదేళ్ళలో అమర వీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, కమాండ్ కంట్రోలు అంచనాల కంటే మించి ఖర్చు చేసి నిర్మించారని, వీటితో ఎవరికి ఉపయోగం కలిగిందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ఈ సీజన్‌లో కాళేశ్వరం నీటిని ఉపయోగించకపోయినా కోటి పది లక్షల ఎకరాల సాగుతో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించింది అని ఆయన తెలిపారు.

ఒక్క పాఠశాల అయినా..

ఒక్క పాఠశాల అయినా నిర్మించారా?, ఐదు వేల పాఠశాలలు మూసి వేసి, మహిళా సంఘాల నిర్వీర్యం, రైతుల దగా, యువతను మోసం చేయడం ఇదీ కెసిఆర్ పదేళ్ళ పాలనలోని గొప్పతనం అని ఎద్దేవా చేశారు. ఉద్యమ ఆకాంక్షను, ఆత్మను చంపేసి అన్ని రంగాలనూ నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ రాజకీయ త్యాగం చేసిందని, పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ అరవై తొమ్మిది వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్‌కు అప్పగిస్తే, లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల లెక్కల్లో లేని అప్పులు, ఆరు లక్షల డ్బ్బై ఒక్క వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని పదేళ్ళలో ఎనిమిది లక్షల పదకొండ వేల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని ఆయన విమర్శించారు. తాను బాధ్యత స్వీకరించే నాటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తెలిపారు.

దృతరాష్ర్టుడిలా భరిస్తున్న కెసిఆర్

దృతరాష్ర్టుడిలా కెసిఆర్ పిల్లల దుర్మార్గాన్ని భరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దశ మారుతుందని సచివాలయం కడితే రాతలో దశ సక్కగా లేనోడి దిశ (వాస్తు) ఏ కట్టడాలు మారుస్తాయని ఆయన ప్రశ్నించారు. చెల్లికి బువ్వ పెట్టలేనోడు ప్రజలను ఏమి ఆదరిస్తారని ఆయన అన్నారు. కెసిఆర్ కళ్ళకు గంతలు కట్టుకుని కెటిఆర్ పాపాలు చూడలేక ఫాం హౌస్‌కు వెళ్ళి కుమిలిపోతున్నాడని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సినిమా ఐటం సాంగ్‌లా కెటిఆర్ వ్యవహార శైలి ఉందని, ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటూ, దుమ్మెత్తిపోసే వ్యక్తి రాష్ట్రానికి ఎలా నాయకునిగా ఉంటారని ఆయన నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్‌ను మందలించడం పట్ల కెసిఆర్‌కు మంచి బుద్ది వచ్చిందని అనుకుంటున్నానని ఆయన తెలిపారు. కెసిఆర్‌తోనే బిఆర్‌ఎస్ అంతమవుతుందని ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీలో బిఆర్‌ఎస్ ఓడిపోతుందన్న అవగాహన ఉన్నందుకే ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్రచారానికి రాలేదని, కనీసం బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేసిన దాఖలాలు కూడా లేవన్నారు. ఈ సంఘటనలతో ప్రస్తుతం కెసిఆర్‌ను సానుభూతితో చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

గల్లీలో గంజాయి..

గత బిఆర్‌ఎస్ పాలనలో గల్లీ, గల్లీలో గంజాయి దొరికేదని, ఇప్పుడు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వాటిపై ఉక్కు పాదం మోపి భవిష్యత్తు తరాలకు వారధిగా ఉన్న యువత విలువైన జీవితాలను కాపాడుతున్నామని అన్నారు. వారిది డ్రగ్స్ కల్చర్ అయితే మాది అగ్రికల్చర్ ఆయన చెప్పారు. పైశాచిక ఆనందం పొందడంలో బావ-బావమరదులు పట్టభద్రులయ్యారని, అసెంబ్లీలో చూసే విషపు చూపులకు సిఎం కుర్చీ కాలిపోయే విధంగా ఉందని ఆయన ఎద్దెవా చేశారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా పైశాచిక ఆనందం పొందుతూ, ఇంట్లో తలుపులు పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో మూడు సార్లు ఎంఎల్‌ఎగా బిఆర్‌ఎస్ గెలుపొందిందని, నాడు అభివృద్ధి చేయకుండా ఇప్పుడేమో అక్కడ చెత్తాచెదారంతో నిండిందని కెటిఆర్ విమర్శించడం హస్యాస్పదంగా ఉందన్నారు. మున్సిపల్ మంత్రిగా ఉండి కెటిఆర్ పట్టించుకోలేదని, ఒక్క రోజు చెత్త కుండీకి కట్టేస్తే పేదల బాధలు తెలుస్తాయని అన్నారు. నాడు కె. రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి తెచ్చిన గోదావరి జలాలను నెత్తిన చల్లుకుని మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు.

కేంద్రంతో కాదు, కిషన్ రెడ్డితోనే సమస్య

తమకు కేంద్ర ప్రభుత్వంతో సమస్యలేదని, జంట నగరాల అభివృద్ధిని పనిగట్టుకుని అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితోనే సమస్య అని ముఖ్యమంత్రి ఆరోపించారు. మూడు సార్లు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటే, లోక్‌సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమి చేశారని ఆయన నిలదీశారు.

జూబ్లీలో బిజెపి పిట్ట వాలలేదు..

కెటిఆర్‌తో సోపతి వెనుక ఉన్న పరమార్థం ప్రజలకు చెప్పాలని సిఎం డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికలకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రచారం చేయించిన బిజెపి నేతలు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్‌గా బిఆర్‌ఎస్‌పై విరుచుకుపడుతున్న ఎంపి అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్, అదే నియోజకవర్గంలో ఉన్న ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ప్రచారానికి ఆఖరి నిమిషయంలో పిలవడంలోని అంతర్యాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. బిజెపి-బిఆర్‌ఎస్ విలీన ప్రక్రియ ఎప్పుడో మొదలైందని, పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఆత్మహత్య చేసుకుని బిజెపిని గెలిపించిందని అన్నారు. సాక్షాత్తు కెసిఆర్, హరీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి గెలుపొందడం ఇందుకు నిదర్శనమని ఆయన ఉదహరించారు.

జూబ్లీ ఎంఎల్‌ఎ నవీన్ యాదవ్

జూబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుస్తున్నారని, ఆ తర్వాత స్థానిక సమస్యలన్నీ ఆయనే పరిష్కరిస్తారని సిఎం పేర్కొన్నారు. విద్యావంతుడైన నవీన్ యాదవ్‌ను రౌడీ అని సంభోదించడం బిఆర్‌ఎస్, బిజెపి నేతలకు భావ్యం కాదన్నారు. జూబ్లీలో బిఆర్‌ఎస్ ఓడిపోతుందని, బిజెపికి డిపాజిట్ కూడా రాదని ఆయన పునరుద్ఘాటించారు. జూబ్లీలో హిందువులంతా బిజెపితో ఉన్నారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం డిపాజిట్ తెచ్చుకుంటే గొప్ప అని అన్నారు. అయితే డిపాజిట్ రాకపోతే హిందువులు బిజెపితో లేనట్లేనని ఒప్పకుంటారా? అని ఆయన అడిగారు. డిపాజిట్ వస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో కూడా గెలిచినట్లేనని ఆయన వ్యంగాస్త్రం సంధించారు.

లీడర్ మైండ్‌సెట్ కాదు&క్యాడర్ మైండ్ సెట్

తాను మొదటగా కాంగ్రెస్ కార్యకర్తనని, ఆ తర్వాతే ముఖ్యమంత్రినని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నిక ఏదైనా కష్టపడి పని చేసే మనస్థత్వం తనదని ఆయన చెప్పారు. సర్వశక్తులతో పని చేసే కార్యకర్త మైండ్ సెటే తప్ప లీడర్ మైండ్ సెట్ తనది కాదన్నారు. నాగార్జున సాగర్, హుజురాబాద్, హుజుర్‌నగర్, మునుగోడు తదితర నియోజకవర్గాల ఎన్నికల్లో పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సర్వేల గురించి అడిగిన ప్రశ్నకు సిఎం స్పందిస్తూ తాను నిరంతరం క్షేత్ర స్థాయిలో పని చేసే వ్యక్తినని, ఈ క్రమంలో పార్టీ గెలుపు అంశంపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. దీనికి అనుగుణంగా గత సార్వత్రిక ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, తాను ఆ రోజే చెప్పానని ముఖ్యమంత్రి సదరు విలేకరినుద్దేశించి అన్నారు. కేంద్రంలోనూ రెండు వందల నలభై స్థానాల వద్ద బిజెపి ఆగిపోతుందని తాను చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరో ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ తాను ఎనభై వేల పుస్తకాలు చదవలేదని, క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై వారి జీవితాలను చదవానని తెలిపారు. గుంటూరు చదువుకోలేదని, భీమవరంలో వ్యాపారం చేయలేదని ఆయన అన్నారు. జర్నలిస్టుల పిల్లల చదవులకు ఫీజులో రాయితీల విషయమై అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి స్పందిస్తూ పోలీసు యంగ్ ఇండియా పాఠశాలలో ఐదు శాతం అడ్మిషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఎటిసికి అనుమతి ఇస్తున్నానని అన్నారు.

అమేజాన్‌తో ఒప్పందం..

రాష్ట్రంలో మహిళా సంఘాలు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు అమేజాన్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ లక్షమని ఆయన తెలిపారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో కొన్ని మంచి పథకాలను కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు. ఎవరిది పబ్ కల్చర్, ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్, ఎవరు సినీ కార్మికుల కోసం కష్టపడే కల్చర్, ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్ ఆలోచించాలని జూబ్లీ ఓటర్లను కోరారు. పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ప్రాధాన్యతవారీగా పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనపై ఉందని, జూబ్లీహిల్స్ గెలవాల్సిందే&అభివృద్ధి జరగాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ఢిల్లీలో ఇంట్లోకి రానిస్తున్నారు..

ఢిల్లీకి వెళితే చెప్పులు కూడా ఎత్తుకు పోతారు అనే పరిస్థితులు గుణాత్మకంగా మారాయా? అని ప్రశ్నించగా, చాలా మారాయని, వీరు మంచి వారే అని అభిప్రాయం వారికి కలిగిందని, ఇంట్లోకి కూడా రానిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఇంకా వేగంగా పరుగెత్తాల్సిన అవసరం ఉందన్నారు. కిషన్ రెడ్డి అడ్డుపడని ప్రతి విషయం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరంపై సిబిఐకి ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో అరెస్టు చేయిస్తామన్న కిషన్ రెడ్డి విషయం మూడు నెలలుగా సిబిఐ వద్ద ఉంటే ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. సబర్మతి, గంగా, యమున నదులకు రివర్స్‌ఫ్రంట్ ఉండవచ్చు కానీ హైదరాబాద్‌లో మూసీకి రివర్స్‌ఫ్రంట్ ఉండొద్దా? అని ఆయన కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలను ఏ మార్చి బిజెపి పాలిత ప్రాంతాలకు కిషన్ రెడ్డి పంపిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిజెపి పాలిత రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి కానీ ఇతర రాష్ట్రాలు అభివృద్ధి చెందకూడదా? అని ఆయన నిలదీశారు. గుజరాత్‌కు గులాంగిరి చేస్తూ రాష్ట్రానికి కిషన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల కోసం తన వద్దకు రావడం లేదని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ వస్తే కాంగ్రెస్‌లో చేరుతారేమోనన్న ప్రచారం జరుగుతుందేమోనన్న భయమా? అని ప్రశ్నించగా, ఎంఎల్‌ఏలపై యజమానికే నమ్మకం లేదని ఆయన కెసిఆర్‌నుద్ధేశించి అన్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు కూడా తన వద్దకు వచ్చారని ఆయన చెప్పారు.

అక్కడ అమిత్ షా&ఇక్కడ గవర్నర్ వద్ద పెండింగ్

కాళేశ్వరంపై నియమించిన పిసి ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత చర్యలు తీసుకోకుండా కేంద్రం అధీనంలో ఉన్న సిబిఐకి ఎందుకు అప్పగించారని ప్రశ్నించగా, ముఖ్యమంత్రి స్పందిస్తూ కాళేశ్వరం అంశం విస్తృతి చాలా పెద్దదని ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థల నివేదిక కూడా అవసరం ఉంటుందని, వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తే బాగుంటుందని అసెంబ్లీ తీర్మానంతో సిబిఐకి అప్పగించామన్నారు. అంతేకాకుండా ఈ-ఫార్ములా కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ముందుకెళుతుందని ఆయన తెలిపారు. ఇక అరెస్టుల విషయంలో 2018 లో సవరించిన చట్టం ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్టు చేసే ముందు తప్పని సరిగా గవర్నర్ ఆమోదం తీసుకోవాలని తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లోగడ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు సందర్భంలో ఈ నిబంధనను పాటించకుండా అరెస్టు చేయడం పట్ల కోర్టు తప్పు పట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, కేంద్ర హోం మంత్రి వద్ద (సిబిఐ) కాళేశ్వరం విచారణ, ఈ-ఫార్ములా కేసులో కెటిఆర్ అరెస్టుకు సంబంధించి గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.

సాదర స్వాగతం..

మీట్-ది-ప్రెస్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేష్ క్లబ్ ఇతర నాయకులు, జర్నలిస్టులు సాదర స్వాగతం పలికారు. ‘మన తెలంగాణ’ ఎడిటర్ దేవులపల్లి అమర్‌ను ఆయన అప్యాయంగా పలుకరించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కోసం ప్రతినిధులు ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు.

ప్రజల్లో నైరాశ్యం

మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసినవారికి, తెలంగాణ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వారికి నవంబర్ 14న మంచి సౌండ్ వినిపిస్తుందని అన్నారు. కడుపు మండిన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్‌కు బుద్ది చెప్పబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ సర్వే చూసినా కచ్చితంగా బిఆర్‌ఎస్ గెలుస్తుందనే చెబుతున్నాయని పేర్కొన్నారు. 2023లో జూబ్లీహిల్స్‌లో 16 వేల ఓట్ల మెజార్టీతో గెలిచామని, ఈసారి అంత కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు మేలు చేయకపోగా, తీవ్ర నష్టం చేసిందని, అది ఈ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పారు.

కడుపు మీద దెబ్బకొడితే కులం, మతం ప్రభావం ఏమీ ఉండదని అన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ప్రజల ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిందని, దాంతో సాధారణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిందని తెలిపారు. రెండేళ్ల తర్వాత ప్రజల్లో నైరాశ్యం, అసంతృప్తి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి చాలా రోజులు మోసపోయారు..మళ్లీ మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కెటిఆర్ ఆదివారం ‘మన తెలంగాణ’ ఇంటర్వూలో పలు అంశాలపై మాట్లాడారు.2023 సెప్టెంబర్‌లో కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిఎస్‌టి వసూళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా ఉంటే, 2025 సెప్టెంబర్‌లో జిఎస్‌టి వసూళ్లలో 28వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. –ప్రజల కొనుగోలు శక్తి, ఆదాయం తగ్గడంతో ప్రతికూల ఆర్థిక వృద్థి నమోదైందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, రెండేళ్లలో ఒక్కటీ అమలు చేయలేదని, దాంతో ప్రజల్లో నైరాశ్యం కనిపిస్తోందని అన్నారు.

ముస్లింలకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి

కాంగ్రెస్ లేకుంటే.. ముస్లింలు లేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణం అని,ముస్లింలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది..? ముస్లింలు ఎప్పుడు నుంచి ఉన్నారు..? అని నిలదీశారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి 80 ఏండ్లు అండగా నిలిచారని, వాళ్లను అవమానించే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ఓటేస్తేనే ముస్లింలు మంచివాళ్లు, మిగతా వాళ్లకు ఓటేస్తే మంచివాళ్లు కాదా..? అని అడిగారు. కడుపు మండినప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా ఏమీ ఉండదని ఈ ఎన్నిక నిరూపింస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలను దెబ్బకొట్టారని, ఈ ఎన్నికతో అందరి కళ్లు తెరుచుకుంటాయని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నిక రాష్ట్రంలో రెండే టీమ్‌లు ఉన్నాయని ఒకటి ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టిన టీమ్ అయితే రెండోది ఆరు గ్యారంటీల అమలుపై గల్లా పట్టి అడిగే టీమ్ అని పేర్కొన్నారు.

రెండేళ్లు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో సిఎం ఉన్నారు

రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేకనే ఇతర విషయాలు మాట్లాడుతున్నారని కెటిఆర్ ఆరోపించారు. 16 నెలల కింద కంటోన్మెంట్‌లో వేల ఇండ్లు ఇస్తామని చెప్పి, ఆరు ఇండ్లు మంజూరు చేయలేదని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచినా అభివృద్ధి ఏమీ జరగదని చెప్పారు.బిఆర్‌ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ.5,322 కోట్లతో చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా తాను చెప్పానని, దానిపై సిఎం అయినా, ఒక్క మంత్రి అయినా సమాధానం చెప్పారా..? అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో చేసిందేమీ లేక గత కాంగ్రెస్ పాలనలో చేసింది చూసి ఓటు వేయాలని అడిగారని పేర్కొనారు. 2004 -2014 కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూడాలని సిఎం అంటున్నారని, కానీ 1952 నుంచి కాంగ్రెస్ పార్టీనే పాలించి కదా..అప్పటి నుంచి జరిగిన అభివృద్ధి చూడాలని అన్నారు. తమకు 50 ఏళ్లు అవకాశం ఇస్తే అప్పుడు బిఆర్‌ఎస్ 50 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనను పోల్చుదామని చెప్పారు. రెండేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారో కూడా చెప్పుకోలేని అశక్తతో సిఎం ఉన్నారని విమర్శించారు. చేసిందేమీ లేకనే డైవర్ట్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేదని సిఎం అంటున్నారని, హైదరాబాద్ నగరానికి తాము ఏం చేయకపోతే రెండుసార్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు.

పేమెంట్ ఒక్కటే రేవంత్‌రెడ్డికి తెలిసిన విద్య

రేవంత్‌రెడ్డి ఢిల్లీకి డబ్బులు పంపుతూ పేమెంట్ కోటా ముఖ్యమంత్రి అయ్యారని కెటిఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. నెలనెలా డబ్బులు కడితే కానీ సిఎం సీటు నిలువదు అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి పేమెంట్ ఒక్కటే తెలిసిన విద్య అని, అందుకే తమను అనుకూలంగా వచ్చిన సర్వేలను కూడా పేమెంట్ సర్వేలని అంటున్నారని విమర్శించారు. బిఆర్‌ఎస్ గెలుస్తుందిన సర్వేలలో కనబడగానే సినీ కార్మికుల వరాలు, కుల సంఘాలకు వరాలు కురిపించారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లను ఎన్‌టిఆర్, పిజెఆర్ గుర్తుకువచ్చారని చెప్పారు. 8 రోజులు సిఎం, మంత్రులు ముమ్మర ప్రచారం చేస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిస్తే ఆరు గ్యారంటీలు అమలవుతాయని చెప్పారు. ఈ ఎన్నిక ప్రజల జీవితాలతో ముడిపడిన అంశం అని, ఆలోచించి ఓటేయాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రూ.250 కోట్లు డబ్బులు పంపించిందని, అయినే ప్రజలు బిఆర్‌ఎస్‌కే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ కంటే తెలివైన వారు అని, కడుపు మీద కొట్టిన కాంగ్రెస్‌కు ప్రజలు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు.

రియల్ ఎస్టేట్, ఐటి బాగుంటే ఎంతోమందికి ఉపాధి

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, ఐటి రంగం పడిపోవడంతో ఎంతోమంది ఉపాధి కోల్పోయారని కెటిఆర్ తెలిపారు. ఈ రెండు రంగాలు దెబ్బతినడం వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయారని, ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా పేరు మీద రేవంత్‌రెడ్డి చేసిన అరాచకం వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని అన్నారు. హైడ్రా శనివారం, ఆదివారం ఇండ్లు కూలగొడుతూ స్వైర విహారం చేస్తుంటే..సామాన్యులను చిదిమేస్తుంటే రియల్ ఎస్టేట్ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్వయంగా 20 ప్రాజెక్టుల పేర్లు చెప్పారని, అందులో హైడ్రా ఒక్కటైనా కూలగొట్టిందా..? అని అడిగారు. అందులో ఒక్క ప్రాజెక్ట్‌కైనా నోటీసులు ఇచ్చారా..? అని నిలదీశారు. హైడ్రా పెద్దలకు చుట్టం ఎట్లయితది..పేదలకు శాపం ఎట్టయిదని చెప్పాలని అడిగారు. ఐటి రంగం, రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలమందికి ఉపాధి లభిస్తుందని, చిరు వ్యాపారులు బాగుంటారని తెలిపారు.

ఈ ఎన్నికలో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాం

జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో తాము వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టామని కెటిఆర్ తెలిపారు. దేశ చరిత్రలో మొదటిసారి స్క్రీన్లపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చూపిస్తూ వివరించామని, ఈ రకమైన ప్రచారానికి ప్రజలను మంచి స్పందన వస్తుందని అన్నారు. తాము విడుదల చేసిన బాకీ కార్డు సూపర్ హిట్ అయిందని, ప్రజలు తమ బాకీ కార్డులు తమ ఇళ్లలో పెట్టుకుని హామీలను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. నిరుద్యోగులతో సహా మిగతా వర్గాలు కూడా బాకీ కార్డులు విడుదల చేస్తున్నారని తెలిపారు.

చంద్రబాబు అంబాసిడర్ కారు ఫొటో ఎందుకు పెట్టారో తెలియదు

చంద్రబాబు నాయుడు తన పాత అంబాసిడర్ కారు చూపిస్తూ చేసిన ట్వీట్‌ను తాను చూడలేదని కెటిఆర్ చెప్పారు. ఆయన ఎందుకు కారు చూపించారో, ఆ ఫొటో ఉద్దేశం ఏంటో తనకు తెలియదని అన్నారు. ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల ఆ ఫొటోపై దృష్టి సారించలేదని చెప్పారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఎవరికీ మద్దతు ప్రకటించలేదని చెప్పారు. మాగంటి గోపీనాథ్‌కు, ఎన్‌టిఆర్‌తో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని టిడిపి అభిమానులు ఆయన కుటుంబానికి ఓటేస్తారని తాము భావిస్తున్నామని తెలిపారు. గోపీనాథ్ ఎన్‌టిఆర్‌కు వీరాభిమాని అని, కాబట్టి గోపినాథ్ కుటుంబానికి ఎన్‌టిఆర్ అభిమానులు అండగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పోలింగ్ రోజు ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, లేదంటే వారి ఎవరైనా దొంగ ఓట్లు వేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పోలింగ్ రోజున మొదటి గంటలోనే ఓటర్లు తమ ఓటు వేయాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. 

జూబ్లీహిల్స్‌ ప్రచారానికి తెర

హోరెత్తిన ప్రచారపర్వానికి తెర

ఓటరు తుది తీర్పుకు సమయం ఆసన్నం

రేపు ఉ.7 నుంచి సా.6 వరకు పోలింగ్

58 మంది అభ్యర్థులు.. 407 పోలింగ్ కేంద్రాలు

మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వేడెక్కించిన ప్రచారపర్వం పరిసమాప్తమైంది. ఇప్పటివరకు మోగిన మైకులు మూగపోయాయి. పార్టీలు, నేతల వాగ్భాణాలు, విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిన ప్రచారపర్వానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తెర పడింది. ఇక అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. పార్టీలు, నేతలు చేసిన విన్యాసాలకు ముగింపు పలుకుతూ ఓటర్లు తమ తీర్పు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందరి దృష్టి ఆకర్షిస్తోన్న ఉపఎన్నిక పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు చేసింది. నవంబర్ 11(మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 407 కేంద్రాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది.

మొత్తం 4,01365 మంది ఓటర్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నోటా కలిపి ఒక్కో ఇవిఎంలో 59 గుర్తులు ఉంటాయి.ఈ ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్, డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. యాప్ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 4,01365 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2 లక్షల 85 వేల 61 మంది పురుషులు, లక్ష 92 వేల 779 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 25 మంది, సర్వీసు ఓటర్లు 18, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 123, వికలాంగులు 1,908 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు 6,859 మంది ఉండగా 80 ఏళ్లు పైబడిన వారు 6,053 మంది 85 ఏళ్లు పైబడిన వారు 2,134 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే వృద్ధులకు సంబంధించిన హోమ్ ఓటింగ్‌లో దరఖాస్తు చేసుకున్న 103 మంది తమ హక్కు వినియోగించుకున్నారు.

ఇంతమంది పోటీ చేయడం ఇదే తొలిసారి

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లో 58 మంది పోటీ చేయడం ఇదే తొలిసారి. 2023లో జరిగిన ఎన్నికల్లో 19మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది.

ఓటింగ్ శాతం పెంపునకు కృషి

గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 3 లక్షల 85 వేల 265 మంది ఓటర్లు ఉండగా, ఉపఎన్నికకు సంబంధించి ఓటరు తుది జాబితా ప్రకారం ఈసారి 2,383 ఓట్లు పెరిగాయి. పెరిగిన ఓట్లలో యువత, మహిళా ఓట్లే అధికంగా ఉండటంతో ఓటింగ్ శాతం పెంపుకోసం ఎన్నికల సంఘం మొదటి నుంచే ప్రచారం చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47.58 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా ఈసారి 50 శాతం దాటే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.

భారీ ఉగ్రదాడికి కుట్ర

హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు మొహియుద్దీన్ సహా ముగ్గురు అరెస్టు

గుజరాత్ ఎటిఎస్ ఆపరేషన్ విజయవంతం

మారణాయుధాలు, విషపూరిత రసాయనాలు స్వాధీనం

పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ మీదుగా సరఫరా

ప్రాణాంతక విషం తయారీలో డాక్టర్ కీలక పాత్ర?

అహ్మదాబాద్: భారీ ఉగ్రవాద దాడికి కుట్ర పన్నిన ముగ్గురిని గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) అరెస్టు చేసింది. ఈ ముగ్గురిలో ఒక వ్యక్తి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మొహియుద్దీన్ స య్యద్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. వీరిని అజాద్ సులేమాన్ షేక్, మెహమ్మద్ సుహైల్‌గా గుర్తించారు. ఈ ముగ్గురు భారీ స్థాయిలోనే టెర్రర్ దాడులతో సంచలనాలకు కుట్ర పన్నినట్లు సకాలంలో గుర్తించారు. గుజరాత్ ఎటిఎస్..సాగించిన ఆపరేషన్‌లో ఈ నెల 7వ తేదీన పట్టుబడ్డ వీరి నుంచి మారణాయుధాలు, కెమికల్స్ స్వాధీనపర్చుకున్నారు.

ఈ వ్యక్తులు గుజరాత్‌కు ఆయుధాలు ఇచ్చిపుచ్చుకునేందుకు వచ్చారు. వీరి వద్ద నుంచి అత్యంత ప్రమాదకరం ప్రాణాంతకమైన రిసిన్ విషం, కొన్ని రసాయనికాలను కూడా పట్టుకున్నామని గుజరాత్ ఎటిఎస్ డిఐజి సునీల్ జోషి ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ ముగ్గురు అరెస్టుతో గుజరాత్‌లోనే కాకుండా తెలంగాణలోనూ ప్రకంపనలు చెలరేగాయి. పాకిస్థాన్ సరిహద్దుల నుంచి తమకు డ్రోన్ల ద్వారా మారణాయుధాలు అందుతాయని వీరు తెలియచేసినట్లు డిఐజి చెప్పారు. తమకు అందిన కీలక సమాచారం ఆధారంగా వీరిని పట్టకున్నామని వీరి వద్ద రెండు గ్లాక్ పిస్టల్స్, బెరెటా పిస్టల్, 30 వరకూ తూటాలు, పలు రకాల రసాయనాలను , ఆయుదాన్ని స్వాధీనపర్చుకున్నారు. గాంధీనగర్‌లోని అదాలజ్ వద్ద వీరిని వలేసి పట్టుకున్నట్లు ఆయన వివరించారు.

కీలక విషయాలు తెలిపిన హైదరాబాదీ

ఉగ్రదాడులకు తాము ప్లాన్ చేసుకున్నామని హైదరాబాద్ డాక్టర్ ఇంటరాగేషన్ దశలో పోలీసులకు తెలిపారు. గాంధీనగర్ జిల్లాలో నిర్మానుష్య కలోల్ ప్రాంతం నుంచి తమకు ఆయుధాలు అందాయని హైదరాబాద్ డాక్టర్ చెప్పారు. రసాయనిక విషపూరిత పదార్థాలతో ఉగ్రదాడులకు వ్యూహం పన్నినట్లు ఈ సయీద్ తెలిపారు. ఇక ఆయన వెనుక నడిపిస్తున్న వ్యక్తి అఫ్ఘనిస్థాన్‌కు చెందిన అబూ ఖదాజా. ఇతను అక్కడి ఐఎస్‌కెపి సంస్థతో సంబంధాలున్న వ్యక్తి. ఉగ్రవాద వినూత్న చర్యలకు తాను ప్లాన్ చేశానని హైదరాబాదీ అంగీకరించాడు. ఇందుకు తాను చైనాకు వెళ్లి ఎంబిబిఎస్ డిగ్రీ చేసి వచ్చానని చెప్పారు. అత్యంత ప్రమాదకర విషం తయారీకి ఏర్పాట్లు జరిగాయని వివరించాడు. బాగా చదువుకున్న సయీద్ మత తీవ్రవాది అయ్యాడని , బారీగా నిధులు సేకరించుకోవడం, కుట్రల అమలుకు వ్యక్తులను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడని ఎటిఎస్ డిజిపి తెలిపారు. ఈ డాక్టర్ సెల్‌ఫోన్ ద్వారా సేకరించిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని ఇక్కడనే పట్టుకున్నారు. వీరు ఆయుధాలు సరఫరాలో దిట్ట అని తేలింది.

పాకిస్థాన్‌లో సూత్రధారులు

ఈ ముగ్గురు వ్యక్తులు పలువురు ఇతరుల ద్వారా రాజస్థాన్ ఇతర ప్రాంతా ల నుంచి ఆయుదాలు తెప్పించుకున్నారు. ఈ గ్యాంగ్ దాడులు జరిపేందుకు లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి పలు అత్యంత సునిశిత ప్రాంతాలలో పర్యటించి రెకీ నిర్వహించి వచ్చారు. పూర్తి స్థాయిలో వరుస దాడులకు దిగేందుకు సిద్ధం అవుతున్న దశలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు డిఐజి తెలిపారు. యుపికి చెందిన ఇద్దరికి రాజస్థాన్‌లోని హనుమాన్‌గధ్ నుంచి ఆయుధాలు దక్కాయి. వీటిని వీరు హైదరాబాదీ డాక్టర్‌కు అందించారు. తమకు పాకిస్థాన్ సరిహద్దుల ఆవలి నుంచి తమ అజ్ఞాత శక్తుల నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు చేరుతాయని ఈ ఇద్దరూ తెలియచేశారు. ఈ ముగ్గురిని చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (యుఎపిఎ) , భారతీయ న్యాయ సంహిత , ఆయుధాల చట్టం పరిధిలో అరెస్టు చేశారు. వీరిలో సయీద్‌ను ఈ నెల 17 వరకూ ఎటిఎస్ కస్టడీకి తరలించారు. మిగిలిన ఇద్దరిని ఆదివారం కోర్టు ముందు హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. 

సైబర్ సెక్యూరిటి భారీ ఆపరేషన్.. 81మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు టిజిసిఎస్‌బి(తెలంగాణ సైబర్ సెక్యూరిటి బ్యూరో) దృష్టి సారించింది. ఇందులో భాగంగా సుమారు 25 రోజుల పాటు నిర్వహించిన భారీ ప్రత్యేక ఆపరేషన్‌లో 81 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖా గోయెల్ శిఖా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరాల్లో గోలుసుకట్టు విధానంలో పాల్గొంటున్న బృందాన్ని విచ్చిన్నం చేసేందుకు టిజిసిఎస్‌బి గత నెలలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రధేశ్ రాష్ట్రాల సమన్వయంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామన్నారు.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 754 క్రైం లింకులు ఉన్నాయని, అందులో 128 రాష్ట్రంలో ఉండగా, సుమారు రూ. 95 కోట్ల మోసపూర్తి లావాదేవీలు జరిగినట్లు అంచనా వేశామన్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి టిజిసిఎస్‌బికి చెందిన ఏడు సైబర్‌క్రైం పోలీస్ స్టేషన్లలో నమోదయిన 41 కేసులకు అనుబంధంగా ఉన్నట్లు ఆమె వివరించారు. బ్యాంక్ ఖాతాలు, మొబైల్ నెంబర్లు, సిమ్ కార్డులు, ఆర్ధిక మార్గాలను అందించే వ్యక్తులు విదేశాల నుండి నడిచే ఫ్రాడ్ కాల్ సెంటర్ నెట్‌వర్క్‌లకు అవసరమయిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పనిచేసే వారిని లక్షంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆమె స్పష్టం చేశారు.

రాష్ట్రాల వారీగా అరెస్టయిన వారు

ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో టిజిసిఎస్‌బి 74 మంది పురుషులు, ఏడుగురు మహిళలను అరెస్ట్ చేసింది. వీరిలో కేరళ 21 మంది పురుషులు ఏడుగురు మహిళలు, 23 మంది మహారాష్ట్ర, పది మంది ఆంధ్రప్రధేశ్, ఏడుగురు తమిళనాడు, 13మంది కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి అరెస్ట్ చేసిన వారిలో ఉన్నట్లు తెలిపారు. వీరిలో 17 మంది ఏజెంట్లు, 11మంది నేరుగా నగదు ఉపసంహరణలో పాల్గొన్నవారు, 53 మంది మ్యూల్ ఖాతాదారులు (5 శాతం కమిషన్‌కు ఖాతాను ఇచ్చిన వారు) ఉన్నారన్నారు. దీంతో పాటు 84 సెల్‌ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంకు పాస్‌బుక్స్, చెక్కుబుక్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో వివిధ వృత్తులకు చెందిన వారు ఉన్నారని శిఖా గోయొల్ వెల్లడించారు.

ఫెడరల్ బ్యాంకు ఉద్యోగి, ఐడిఎఫ్‌సి బ్యాంక్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్(106 కేసుల లింక్), బంధన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, కంప్యూటర్ ఆపరేషన్స్ డిప్లామా హోల్డర్(96 కేసులు), చెన్నై కిల్‌పోక్ ఆడిట్ కార్యాలయంలో అకౌంటెంట్ (31కేసులు), బిబి గ్రాడ్యూయేట్(45కేసులు), ఒక ఎంఎన్‌సి ఉద్యోగి(తన కార్పొరేట్ ఖాతాను మోసపూరిత లావాదేవీలకు ఉపయోగించిన వ్యక్తి) ఉన్నట్లు ఆమె వివరించారు. ఆపరేషన్ ప్రాథమిక దర్యాప్తులో కొంత మంది విదేశాలలో ఉన్న నెట్‌వర్క్‌లతో సంబంధమున్నట్లు తెలిసిందని, సంబంధిత వ్యక్తులపై లుక్ అవుట్ ఉత్తర్వుల ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.

ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి

సైబర్ మోసాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖా గోయొల్ తెలిపారు. ఇన్వెస్ట్‌మెంట్, డిజిటల్ అరెస్ట్, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు పంచుకోవడం, అపరిచిత ఖాతాలకు డబ్బులు పంపడం లాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరం జరిగితే వెంటను 1930 కి కాల్ చేయాలని సూచించారు.

హైదరాబాద్‌ను బిఆర్‌ఎస్ గాలికొదిలేసింది

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే వేలాది కోట్లతో అభివృద్ధి పనులు

ఢిల్లీలోని నా నివాసంలో ఐటి సోదాలపై హరీశ్‌రావు బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

 జూబ్లీహిల్స్‌లో మంత్రులతో కలిసి ప్రచారం

మన తెలంగాణ/హైదరాబాద్ : పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సుమారు 100 కోట్లతో కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోనే అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన యూసుఫ్ గూడాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

నవీన్ యాదవ్ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను నమ్మి ఆచరించే వ్యక్తి అని తెలిపారు. నవీన్ యాదవ్ ను గెలిపించుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మంత్రులందరినీ సమన్వయం చేసుకుని వేలకోట్ల నిధులతో మురికి వాడలతో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న తపన, సత్తా, సంకల్పం ఉన్న యువ నాయకుడు నవీన్ యాదవ్ అని తెలిపారు. అటువంటి యువకుడిని గెలిపించుకోవడం ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతి, రేషన్ కార్డులు వంటి పనులు వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నందున నవీన్ యాదవ్ ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని డిప్యూటీ సీఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలను విజ్ఞప్తి చేశారు.

ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదు

అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడు ఎకరాలు వంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడతామని భ్రమలు కల్పించిన బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్లు పరిపాలించి ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. అధికారం కోల్పోయి ఇప్పుడు మతిభ్రమించి అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. పేద మధ్యతరగతి వర్గాలకు మేలు జరగకుండా బిఆర్‌ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు సీనియర్ నాయకుడు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారని, ఆర్థిక శాఖ కూడా నిర్వహించినా ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఢిల్లీలో తనకు ఇల్లు ఉందో, లేదో అందరికీ తెలుసని, ఐటీ రైడ్స్ అధికారికంగా జరుగుతాయని, అందరికీ తెలిసే జరుగుతాయన్న విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో పెద్ద సంఖ్యలో ఉన్న పేద బిడ్డలు ఇంటర్నేషనల్ స్టాండరడ్స్ తో ఉచితంగా చదువుకునేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడి వారి కాళ్లపై వాళ్లు నిలదొక్కుకునేలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం తిరిగి ప్రారంభించిందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని 15 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని వివరించారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని, రాష్ట్రంలో మొదటి దశలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి శరవేగంగా నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు.

గత టిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్షలను నిర్వహించలేకపోయిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లోపే విజయవంతంగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఎన్ని అడ్డంకులు కల్పించినా నియామక పత్రాలు కూడా అందచేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. రెండేళ్ల కాలంలోనే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు కూడా అందించామని చెప్పారు. 70 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ప్రైవేట్ రంగంలో లక్షలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించిందని భట్టి విక్రమార్క తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రవేశం హిందువులకే..

నాగ్‌పూర్: ఆర్‌ఎస్‌ఎస్ సార్వత్రిక సంస్థ. ఇందులోకి తీసుకునేది బ్రాహ్మణులు, ముస్లింలు, క్రిస్టియన్లను ఇతర వర్గాలను కాదని, హిందువులనే అని ప్రధాన సంచాలక్ మోహన్ భగవత్ తెలిపారు. హిందువు అంటే మతం కిందికి రాదు. భారతదేశంలో నివసించే వారంతా హిందువులే అవుతారని భగవత్ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల ప్రస్థానం ముందున్న ఆవిష్కరణల ప్రసంగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌లోకి రావాలనుకునే వారు ముందు తమ తమ వేర్పాటువాద గుర్తింపులను వదులుకుని రావల్సిందే. కేవలం హిందువుగానే ఇందులో చేరాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భారత మాత ముద్దుబిడ్డలమనే ఏకైక ప్రకటనతో వచ్చేవారే ఆర్‌ఎస్‌ఎస్ అంతర్భాగం అవుతారని తేల్చిచెప్పారు.