StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortbahiscasinobahiscasino girişmasterbettingmasterbetting girişwinxbetwinxbet girişkalebetkalebet giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

jojobet

Streameast

onwin

ataköy escort

ultrabet

ultrabet

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

polobet

casibom giriş

Betoffice

Holiganbet

polobet

polobet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

polobet

rokubet

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

grup porno

iptv satın al

jojobet

jojobet giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

artemisbet

rokubet

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

meritking güncel giriş

rokubet

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

sonbahis

bahix

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

hilarionbet

online diyetisyen

Betoffice

polobet

kralbet

palacebet

deneme bonusu

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

primebahis

Meritking Giriş

Kavbet

Galabet

jojobet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom giriş

ultrabet

Marsbahis

betboo

slotbar

betpark

maltcasino

maltcasino

safirbet

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

ronabet giriş

milosbet

wbahis

padişahbet giriş

vaycasino

pusulabet

pusulabet giriş

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

nitrobahis

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

betsmove

betsmove giriş

Meritking Giriş

yakabet resmi adres

Betoffice

Casibom

Betoffice

Betoffice

Agb99

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

sekabet

pusulabet

vdcasino

imajbet

marsbahis

imajbet

Betoffice

grandpashabet

vevobahis

pusulabet

grandpashabet giriş

casibom güncel giriş

meritking

vaycasino

jojobet giriş

betsmove

Slot Mahjong

meritking güncel

jojobet

Betpas

holiganbet

holiganbet giriş

sweet bonanza oyna

1xbet

fatih escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking

piabellacasino

starzbet

piabellacasino

mislibet

bahisvebaihs

nitrobahis

milosbet

parmabet

piabellacasino

odeonbet

odeonbet

coinbar

coinbar

odeonbet giriş

coinbar giriş

royalbet

royalbet giriş

polobet

polobet giriş

marsbahis

casibom

bahiscasino

vdcasino

sekabet güncel giriş

casibom giriş

casibom

izmir escort

vdcasino

padişahbet

vdcasino

casibom giriş

betovis

betasus

berlinbet

casinowon

suratbet

süratbet

betcio

parmabet

sekabet

casinolevant

kingroyal giriş

casinolevant

kingroyal

kingroyal giriş

roketbet

betticket

rinabet

casinolevant

marsbahis

marsbahis

marsbahis

casinowon

grandpashabet

marsbahis

kingroyal

kingroyal giriş

kingroyal güncel giriş

dinamobet

betturkey giriş

kingroyal

kingroyal giriş

Google Maps Yorum Satın Al

polobet

casivera

enbet

sonbahis

padişahbet

kralbet

betoffice

padişahbet

padişahbet giriş

betpas

kralbet

asyabahis

holiganbet

betebet

ultrabet

betturkey

imajbet

matbet

sekabet

casibom

casibom giriş

casibom güncel giriş

vdcasino

tarafbet

pusulabet

onwin

sahabet

meritking

matadorbet

casinolevant

galabet

hiltonbet

royalbet

yakabet

pusulabet

padişahbet

casinolevant

casinolevant

vdcasino

betcio

jojobet

Sugar Rush 1000

bahiscasino

bahiscasino giriş

masterbetting

masterbetting giriş

winxbet

winxbet giriş

Sugar Rush 1000 Oyna

Sugar Rush

cratosroyalbet

Hiltonbet giriş

kalebet

kalebet giriş

spinco

kralbet

ఇది ప్రొఫెషనలిజం కాదు.. ఇంగ్లీస్‌పై ఐపిఎల్ టీం కో-ఓనర్ ఫైర్

కొన్ని రోజుల క్రితమే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 కోసం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లకి కాసుల వర్షం కురువగా.. మరికొందరికి నిరాశే మిగిలింది. అలా బంపర్ బోనాంజా దక్కిన ఆటగాళ్లలో ఒకడు ఆస్ట్రేలియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్. ఐపిఎల్-2026 మినీ వేలంలో ఇంగ్లీస్‌ను ఏకంగా రూ.8.6 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు దక్కించుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంగ్లిస్ తన పెళ్లి, హనీమూన్ కారణంగా ఐపిఎల్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని ముందే ప్రకటించాడు.

ఇంగ్లిస్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోనున్నాడు. దీంతో అతడు మూడు లేదా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని తెలిపాడు. దీంతో అతన్ని పంజాబ్ కింగ్స్ జట్టు రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. ఈ విషయంపై పంజాబ్ కింగ్స్ జట్టు కో-ఓవర్ వాడిగా స్పందించారు. ఇంగ్లిస్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి ప్రొఫెషనలిజం లేదని మండిపడ్డారు. ఇంగ్లిస్‌ని తొలుత రిటైన్ చేసుకుందామని భావించామని.. కానీ, అతడు రిటెన్షన్ గడువు ముగిసే కేవలం 45 నిమిషాలకు ముందు తన వ్యక్తిగత కారణాలు చెప్పాడని అన్నారు. పెళ్లి, హనీమూన్ కారణంగా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని అతడు చెప్పాడని, అందుకే అతడిని వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఇలా చెప్తూనే ఇంగ్లిస్‌కి వాడియా శుభాకాంక్షలు తెలిపారు. అతడు మంచి ఆటగాడని ప్రశంసించారు. ఆస్ట్రేలియా తరఫున కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని.. మరి ఇప్పుడు ఐపిఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడుతాడో లేదో చూడాలని అన్నారు. అయితే లక్నో జట్టు భారీ ధర వెచ్చించి ఇంగ్లిస్‌ని కొనుగోలు చేయడంతో అతడు తన హనీమూన్ ప్లాన్‌ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న అతడి వివాహం జరిగిన వెంటనే అతడు లక్నో క్యాంప్‌కి వస్తాడని సమాచారం. అయినప్పటికీ.. ఐపిఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు అతడు దూరం అయ్యే అవకాశం ఉంది.

పది రూపాయలు కోసం ప్రాణం తీసిన బాలుడు

అమరావతి: మద్యం తాగడానికి పది రూపాయాలు ఇవ్వలేదని ఓ వ్యక్తిని బాలుడు చంపాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని కొత్తపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తాతాజీ(48) అనే వ్యక్తిని మద్యం తాగడానికి పది రూపాయాలు ఇవ్వాలని ఓ బాలుడు (17) అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని తాతాజీని బాలుడు పొడిచాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

ప్రతి భారతీయుడి గుండె చప్పుడు

వందేమాతరం కోట్లాది గొంతుకల జాతీయ చైతన్యం. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒక మంత్రంలా మారి, కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసిన మహోన్నత గీతం ‘వందేమాతరం’. బంకించంద్ర ఛటర్జీ కలం నుండి జాలువారిన ఈ గీతం నేటికి 150 వసంతాలను పూర్తి చేసుకుంది.

చారిత్రక నేపథ్యం, సాహిత్య సౌరభం

1870వ దశకంలో బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘ఆనందమఠం’ నవలలో భాగంగా ఈ గీతం పుట్టింది. సంస్కృత, బెంగాలీ భాషల కలయికతో సాగే ఈ గీతం కేవలం ఒక పాట మాత్రమే కాదు.. మాతృభూమి పట్ల భక్తిని చాటే ఒక అద్భుత గీతం. ప్రకృతిని, దేశ సంపదను వర్ణిస్తూ సాగే ఈ సాహిత్యం భరత భూమిని సాక్షాత్తూ ఒక తల్లిగా అభివర్ణించింది. 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని మొదటిసారిగా ఆలపించడంతో ఇది జాతీయ ఉద్యమ ఊపిరిగా మారింది.

దేశ సమగ్రతకు ప్రతీక

వందేమాతరం అంటే ‘తల్లీ నీకు వందనం’ అని అర్థం. ఒక దేశాన్ని భౌగోళిక సరిహద్దులుగా కాకుండా, ఒక జీవమున్న తల్లిగా చూడటం భారతీయ సంస్కృతిలోని విశిష్టత. బ్రిటిష్ వారు ‘డివైడ్ అండ్ రూల్’ (విభజించి పాలించు) పద్ధతితో భారతీయుల మధ్య చిచ్చు పెట్టాలని చూసినప్పుడు బెంగాల్ విభజన సమయంలో ప్రజలను ఏకం చేసింది ఈ నినాదమే. నేటి కాలంలో ప్రాంతీయతత్వం, కుల ప్రాతిపదికన విచ్ఛిన్నకర శక్తులు తలెత్తుతున్న తరుణంలో ‘వందనం’ అన్న భావన మనల్ని ఒకే తాటిపైకి తెస్తుంది. దేశ సమగ్రతను కాపాడటంలో ఈ గీతం అందించే స్ఫూర్తి అజరామరం.

నేటి అవసరం

మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో యువత తన మూలాలను మరచిపోతున్న తరుణంలో వందేమాతరం అవసరం మరింతగా ఉంది. దేశభక్తి కేవలం యుద్ధ సమయాల్లోనే కాదు, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడంలో కూడా ఉంటుంది.

ఐక్యత: భాషలు, ఆచారాలు వేరైనా మనమంతా భారతీయులమనే భావనను ఇది పెంపొందిస్తుంది.

ప్రకృతి ఆరాధన: ఈ గీతంలో నదులు, చెట్లు, పచ్చని పొలాల వర్ణన ఉంది. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతను ఇది పరోక్షంగా గుర్తుచేస్తుంది.

నైతిక బలం: కష్టకాలంలో దేశం కోసం నిలబడే ధైర్యాన్ని ఈ గీతం ఇస్తుంది.

సాహిత్య చర్చ, వివాదాలు

వందేమాతరం చుట్టూ కొన్ని మతపరమైన వివాదాలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. అయితే లోతుగా పరిశీలిస్తే ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు. దేశాన్ని తల్లిగా గౌరవించడం ఒక సంస్కృతి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ఈ గీతాన్ని ఒక రాజకీయ కోణంలో కాకుండా జాతీయ గౌరవంగా చూడాలి. వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానం ఒక అద్భుతం. ఇది గతం గురించి మాత్రమే కాదు, భవిష్యత్ భారతం గురించి కూడా మాట్లాడుతుంది. ఒక సగటు భారతీయుడికి తన దేశం పట్ల ఉండాల్సిన బాధ్యతను, ప్రేమను గుర్తు చేసే నిత్య నూతన గీతమిది. స్వార్థ రాజకీయాలకు అతీతంగా, ప్రతి భారతీయుడు ఈ గీతంలోని అంతరార్థాన్ని గ్రహించి, దేశాభివృద్ధికి కంకణబద్ధులు కావడమే మనం ఈ గీతానికి ఇచ్చే నిజమైన నివాళి. వందేమాతరం కేవలం ఒక నినాదం కాదు, అది ప్రతి భారతీయుడి గుండె చప్పుడు. 

పమిడికాల్వ మధుసూదన్

(సీనియర్ జర్నలిస్ట్)

ఇల్లు తాకట్టు పెట్టి… సరస్వతి పుత్రికకు సహాయం చేసిన హరీష్ రావు

పేద విద్యార్థిని పీజీ వైద్యవిద్య రుణం కోసం బ్యాంకులో తన స్వగృహన్ని మార్టిగేజ్ చేసిన మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు

మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు వచ్చినా ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ.7.50లక్షలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం

బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామనే బ్యాంకర్స్…

ఈనెల 18వ తేదీన ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటును తిరస్కరించే పరిస్థితి

ఇదే విషయాన్ని హరీశ్ రావు గారి దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థిని మమత, ఆమె తండ్రి కొంక రామచంద్రం

క్షణం ఆలస్యం చేయకుండా సిద్దిపేటలోని తన స్వగృహన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ. 20 లక్షల ఎడ్యూ కేషన్ లోన్ మంజూరు చేయించిన హరీశ్ రావు గారు.

హాస్టల్ ఫీజు లక్ష రూపాయలు ఇచ్చిన హరీష్ రావు

నాడు ఆటో కార్మికుల కోసం… నేడు నిరుపేద విద్యార్థిని చదువు కోసం హరీష్ రావు గారి ఆపన్నహస్తం

మరో గొప్ప మానవతా… ఔదార్యాన్ని చాటి చెప్పిన హరీష్ రావు…

సిద్దిపేట: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గారు మరోసారి తన మానవతా ఔదార్యాన్ని చాటిచెప్పారు. ఆపదలో ఉన్నారంటే ఆగమేఘాల మీద స్పందించే హరీశ్ రావు గారు తాజాగా ఓ నిరుపేద వైద్యవిద్యార్థిని భవిష్యత్తుకు చేయూత అందించారు. ఆ విద్యార్థినికి బ్యాంకు రుణం దక్కడానికి ఏకంగా తన సొంత ఇంటినే తనఖా పెట్టి పెద్దమనసు చాటుకున్నారు. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన పెద్ద కుమార్తె మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసింది. పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహబూబ్నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ విభాగంలో పీజీ సీటు వచ్చింది. ప్రభుత్వ కన్వీనర్ కోటా లోనే సీటు వచ్చినప్పటికీ మూడేళ్ల పాటు ప్రతి సంవత్సరం రూ. 7.50 లక్షల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఈనెల 18వ తేదీ చివరి గడువు ఉంది. ఆర్థిక స్తోమత లేని రామచంద్రం అంత డబ్బు చెల్లించలేక మనోవేదనకు గురయ్యాడు.

బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ కోసం ప్రయత్నించగా ఏవైనా ఆస్తులు మార్టిగేజ్ చేస్తేనే లోన్ ఇస్తామని బ్యాంకు అధికారులు సమాధానం ఇచ్చారు. తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని చెప్పడంతో ఆ దారి కూడా మూసుకపోయింది. దీంతో గతంలో తన కూతుళ్లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఆర్థిక సహాయం చేసిన విషయం గుర్తుకొచ్చి.. మళ్లీ ఆయనే ఆదుకుంటారని భావించి ఈ విషయాన్ని చేరవేశారు. విషయం తెలవగానే వెంటనే హరీష్ రావు గారు స్పందించి సిద్దిపేటలోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి మూడేళ్లకు సరిపడా దాదాపు రూ. 20 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బులను కళాశాలలో చెల్లించి సీటు దక్కించుకున్నారు.

– అప్పు చేయొద్దు… హాస్టల్ ఫీజు కూడా ఇచ్చిన హరీష్ రావు..

మొదటి సంవత్సరం హాస్టల్ కు లక్ష రూపాయలు అవుతుందని హరీష్ రావు గారి దృష్టికి రాగ మళ్ళీ హాస్టల్ ఫిజు కు ఎలాంటి అప్పు చేయొద్దని అ లక్ష రూపాయలు కూడా నేనే చెల్లెస్తా అని హరీష్ రావు గారు ఇచ్చారు…

నాడు ఆటో కార్మికులకు అండగా..

నేడు పేద విద్యార్థిని చదువుకు చేయూతగా..

సిద్దిపేట నియోజకవర్గంలోని ఆటో కార్మికుల సంక్షేమం కోసం మూడేళ్ల క్రితం తన ఇంటిని మార్టిగేజ్ చేసి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించారు. ఆ ఫలితంగానే సిద్దిపేట ఆటో క్రెడిట్ కో – ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు కావడమే గాకుండా వందలాది మంది ఆటో కార్మికులకు కొండంత భరోసాగా నిలిచింది. నేడు రుణం పొందిన ఆటో కార్మికులు ప్రతీ నెల పొదుపు చేస్తూ రుణం డబ్బులను వాయిదాలు లేకుండా చెల్లిస్తున్నారు. ఆపత్కాలంలో తమకు సొసైటీ ఉందని గట్టి ధీమాను హరీష్ రావు గారు వారికి కల్పించారు. ఆయన చేసిన సహాయం వందలాదిమంది ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి దోహద పడింది. నేడు నిరుపేద విద్యార్థిని మమత కు వైద్యవిద్యకు సంబంధించి పీజీ ఎంట్రన్స్ లో సీటు దక్కినా కనీసం ట్యూషన్ ఫీజు లేక.. ఆ సీటు నే కోల్పోయే పరిస్థితి తలెత్తింది. విషయం తన దృష్టికి రావడంతో ఆ అమ్మాయికి బ్యాంకు రుణం అందడానికి తన స్వగృహాన్ని మరోసారి మార్టిగేజ్ చేయడానికి కూడా వెనుకాడలేదు. ఈ ప్రక్రియ శరవేగంగా జరిగేలా యూనియన్ బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ.. సబ్ రిజిస్టర్ ద్వారా ఇంటి పత్రాలను మార్టిగేజ్ చేసి సరైన సమయానికి మమత కు ఎడ్యుకేషన్ లోన్ మంజూరు కావడంలోనూ చొరవ చూపారు.

తల్లితో చనువుగా ఉన్నాడని వ్యక్తిని చంపి… పోలీసులకు దృశ్యం సినిమా చూపించిన కుమారుడు

బెంగళూరు: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమె ప్రియుడిని కుమారుడు హత్య చేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం విజయపుర ప్రాంతంలో జరిగింది. సింధగి తాలూకాలోని ఓ గ్రామంలో సిద్ధనగౌడ, మల్లమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు అప్పుగౌడ అనే కుమారుడు ఉన్నాడు. మల్లమ్మతో భూస్వామి మహదేవప్ప చనువు ఉండేవాడు. దీంతో మహదేవప్పను హత్య చేయాలని అప్పుగౌడ నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రితో కలిసి మహదేవప్పను హత్య చేసి గ్రామ శివారులో పొలంలోని కంపలో పడేశారు. హత్య చేసిన అనంతరం ఒకే మాట మీద ఉండడంతో విచారణలో జవాబులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హత్య చేసే సమయంలో ఎక్కడా కూడా మొబైల్ ఫోన్లను ఉపయోగించలేదు. పోలీసులు కేసు నమోదు విచారణ ప్రారంభించారు. గ్రామస్థుల సమాచారం మేరకు మల్లమ్మ, సిద్ధనగౌడ, అప్పుగౌడను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దృశ్యం సినిమాలో మాదిరిగా ఒకే రకమైన సమాధానాలు చెప్పడంతో పోలీసులు విచారణ జాప్యమైంది. న్యాయస్థానం అనుమతి తీసుకొని వారి బ్రెయిన్ మ్యాపింగ్ పాలిగ్రఫి పరీక్షలు నిర్వహించారు. వీరి నేరం బయటపడడంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

2047లో 1947 పునరావృతం అవుతుందా?

మూడు నాలుగేళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు ముస్లిం మహిళా విలేఖరి ఆర్ఫా ఖానమ్ షేర్వానీకి తన కవిత వినిపించి, అభిప్రాయం చెప్పమన్నాడు. ఆ కవిత పాఠం ఉర్దూలో ఇలా ఉంది.

తస్లీమాత్ మా తస్లీమాత్

తూ భరీ హై మీఠీ పానీ సే

ఫల్ ఫూలోంకి షదాబీ సే

దఖ్కిన్ కీ ఠండీ హవావోంసే

ఫసలోంకి సుహాని ఫిజావోంసే

తస్లీమాత్ మా తస్లీమాత్

తేరీ రాతే రోషన్ చాంద్ సే

తేరి రౌనక్ సబ్జె ఫామ్ సే

తేరీ ప్యార్ భరీ ముస్కాన్ హై

తేరి మీఠా బహుత్ జుబాన్ హై

తెరి బాహోం మే మేరీ రాహత్ హై

తేరే కద్మోం మే మేరీ జన్నత్ హై

తస్లీమాత్ మా తస్లీమాత్

ఈ కవిత వినిపించి దానిపై ఆ నాయకుడు మహిళా విలేఖరి అభిప్రాయాన్ని అడిగాడు. ఆమె ఈ పాటలోని మాతృత్వం పట్ల వ్యక్తమైన ఉదాత్త భావాలను చాలా ప్రశంసించింది. దీన్ని దేశభక్తి గేయంగా పెడితే ఎలా ఉంటుంది అని అడిగితే ఆమె చాలా బాగుంటుంది అన్న జవాబిచ్చింది.

అప్పుడు ఆ రాజకీయ నాయకుడు ఈ రచన జాతీయ గీతమైన వందేమాతరం కి ఉర్దూ అనువాదం. సుజలాం, సుఫలాం, మలయజ శీతలం, సస్యశ్యామలాం, శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీ, ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం, సుహాసినీం, సుమధుర భాషిణీం అన్న భావాలనే ఈ రచన వ్యక్తీకరిస్తోంది అని చెప్పాడు. మరి మీరు వందేమాతరం గీతాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని నిలదీశాడు. మహిళా విలేఖరి ఆర్ఫా ఖానమ్ షేర్వానీ నోట మాట పెగల్లేదు. వందేమాతర గీతం పట్ల కొన్ని వర్గాల్లో వ్యక్తమౌతున్న వ్యతిరేకతలోని డొల్లతనాన్ని బరిబాతలగా బట్టబయలు చేసిన ఆ రాజకీయ నాయకుడు ప్రస్తుతం బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.

కత్తి మెడమీద పెట్టినా భారత్ మాతాకీ జైయ్ అనేది లేదనే అసదుద్దీన్ ఒవైసీ, ఈ దేశాన్ని తల్లిగా భావించడం మా మతం ఒప్పదు కాక ఒప్పదనే మతోన్మాదులకీ తెలియని విషయం ఒకటుంది.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ జాతీయగీతం ‘అమార్ శోనార్ బాంగ్లా లో ఓ మా (నా తల్లీ) అన్న పదం నాలుగు సార్లు వస్తుంది. దాన్ని పాడేందుకు మతాంధ జమాతె ఇస్లామీ బంగ్లాదేశ్ కి, మహ్మద్ యూనస్ కి, మరే ఇతర మత సంస్థకీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. దక్షిణాన ఉన్న శ్రీలంక తూర్పు భాగమంతా ముస్లింలే ఉంటారు. వారెవరికీ శ్రీలంక జాతీయగీతం

శ్రీలంకా మాతా.. అప శ్రీలంకా

నమోనమోనమో నమో మాతా

సుందర సిరిబరిని

సురేంది అతి శోభమనా లంకా

ధాన్య ధనయనేకా

మాయి పలతురు పిరిజయ భూమియల రమ్య జీవనయే మాతా

పాడటంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. మతం అడ్డు రాలేదు. ఈ జాతీయ గీతంలో దేశాన్ని తల్లిగా భావించడం జరిగింది. శ్రీలంక ముస్లిములెవరూ అభ్యంతర పెట్టడం లేదు.

ప్రపంచంలోని అతిపెద్ద ముస్లిం దేశాల్లో ఒకటైన ఇండోనేసియా జాతీయగీతంలో ఒక చరణం ఇండొనీసియా పవిత్ర భూమి, నా పవిత్ర మాతృ భూమి కోసం నేను నిలుచుంటాను అని స్పష్టంగా చెబుతుంది. ఇండోనేసియా ముస్లిం తన దేశాన్ని మాతృభూమిగా భావిస్తాడు. వందేమాతరం అన్న భావాన్నే నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా పాడతాడు.

బంగ్లా ముస్లింలకు, శ్రీలంక ముస్లింలకు, ఇండోనేసియా ముస్లింలకు దేశాన్ని తల్లిగా సంబోధించడంలో ఇబ్బంది లేదు. తల్లికి వందనం అనడంలో మతం అడ్డు రాదు. కానీ మన దేశంలోని ముస్లింలకే అభ్యంతరం ఎందుకు? ఈ దేశాలకు దేశాన్ని అమ్మ అనడంతో, అమ్మకు వందనం అనడంలో అడ్డం రాని మతం భారతదేశంలోని కొందరు ముస్లింలకే ఎందుకు వస్తుంది?

వందేమాతరం మొత్తం గీతంలో దేశాన్ని దుర్గగా, లక్ష్మిగా, సరస్వతిగా అభివర్ణించడం మా మతానికి విరుద్ధం అనే వారు బ్రిటన్ కి ఆవురావురుమని వెళ్లి అక్కడి పౌరసత్వం కోసం ఎగబడి, కలబడి అక్కడి నేషనల్ యాంథమ్ గాడ్ సేవ్ ది కింగ్ ని పాడతారే తప్ప గాడ్ అనడం కుదరదు అల్లాయో, ఖుదాయో అంటామని ఎప్పుడైనా, ఎక్కడైనా వాదించారా? లేదా వారు గాడ్, అల్లాహ్ ఒకటేనని అంగీకరిస్తారా? పైగా బ్రిటన్‌లోని ముస్లింలలో ఎక్కువమంది పాకిస్తానీలు (ముఖ్యంగా ఆక్రమిత జమ్మూకశ్మీర్‌కి చెందిన మీర్ పురీలు), బంగ్లాదేశీలు, భారతీయులు.

వీరంతా స్వాతంత్య్రానికి ముందు వందేమాతరంను వ్యతిరేకించిన వారే. భారతీయ ముస్లింలలో చాలా మంది ఇప్పుడూ వ్యతిరేకిస్తున్నారు. కానీ అక్కడ అల్లాహ్‌ని కాక గాడ్‌ని ప్రార్థించడానికి వారికి ఎలాంటి ఇబ్బందీ లేదన్నదే ముఖ్యం.

దుర్గ, లక్ష్మి, సరస్వతి వంటి పేర్లను పలకవలసిన అవసరం లేకుండా కేవలం తొలి చరణాన్నే భారతదేశం స్వీకరించింది. దానిని రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులైన ముస్లింలు అందరూ ఆమోదించారు. అలాంటి దాన్ని పలకడానికీ కూడా ఎందుకు అభ్యంతరం? ఈ గీతం ఆలపిస్తే లేచి నిలబడటానికి ఏమిటి ఇబ్బంది? దీనికి జవాబు అడగాల్సిన సందర్భం వచ్చింది.

పూర్తి వందేమాతర గీతాన్ని 1923వరకూ కాంగ్రెస్ పార్టీ పాడుతూ వచ్చింది. కాకినాడ కాంగ్రెస్ మహాసభల్లో మౌలానా మహ్మదలీ అభ్యంతరపెట్టడంతో వివాదం మొదలైంది. అంతకు ముందు హిందువులు, ముస్లింలు కలిసి ఈ గీతాన్ని పాడారు. పైగా కాకినాడ మహాసభలకు మహ్మదలీని మేళతాళాలతో ఊరేగించారు. ఆయనకు సంగీత వాయిద్యాలు ఇస్లాం మత విరుద్ధమని గుర్తుకు రాలేదు. మతవాద రాజకీయాల ముందు మోకరిల్లిన నాటి కాంగ్రెస్ నేతలైన గాంధీ, నెహ్రూలు అక్టోబర్ 1937 లో రెండు ముక్కలనే తూతూమంత్రంగా పాడి, తంతును నిర్వహించి సరిపుచ్చాలని నిర్ణయించారు. అంత చేసినా సరిగ్గా పదేళ్లకి 1947 లో దేశం రెండు ముక్కలైంది.

ముందు వందేమాతరం ముక్కలైంది. తరువాత దేశం ముక్కలైంది. అవునా కాదా?

ఈ ప్రశ్నలను వందేమాతర గీత రచనకు 150 సంవత్సరాలైన సందర్భంలో మనల్ని మనం వేసుకోవాలి. స్వాతంత్య్ర స్వర్ణోత్సవ వేడుకల సమయంలో, వందేమాతర గీత రచనకు 150 ఏళ్లవుతున్న సందర్భంలో 2047 లో 1947 పునరావృతం కాకూడదని కోరుకుందాం. పూర్తి వందేమాతర గీతాన్ని సగర్వంగా పాడదాం.

కస్తూరి రాకా సుధాకర్ రావు

(జర్నలిస్ట్)

సిరీస్‌పై భారత్ గురి

సౌతాఫ్రికాకు చావోరేవో

నేడు చివరి టి20

అహ్మదాబాద్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా చివరి టి20 మ్యాచ్ జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 21 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. లక్నోలో బుధవారం జరగాల్సిన నాలుగో టి20 మ్యాచ్ పొగమంచు కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. ఇలాంటి స్థితిలో సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి సఫారీ టీమ్‌ను నెలకొంది. ఇక భారత్ ఈ మ్యాచ్‌లో ఓడినా పెద్దగా నష్టం ఉండదు. 22తో సిరీస్ సమంగా ముగుస్తోంది. ఒకవేళ సౌతాఫ్రికా పరాజయం పాలైతే సిరీస్‌ను కోల్పోక తప్పదు. దీంతో తీవ్ర ఒత్తిడిలో కూరుకు పోయింది. ధర్మశాలలో ఘన విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులో కూడా గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలనే లక్షంతో ఉంది. అయితే స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ చివరి టి20లో ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఒకవేళ గిల్ దూరమైతే సంజు శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శివమ్ దూబె, జితేశ్ శర్మ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అంతేగాక హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, హార్దిక్, అర్ష్‌దీప్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సౌతాఫ్రికాలో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. క్వింటన్ డికాక్, మార్‌క్రమ్, రిజా హెండ్రిక్స్, స్టబ్స్, బ్రెవిస్, జాన్సన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు.దీంతో భారత్‌కు గట్టి పోటీ ఎదురైనా ఆశ్చర్యం లేదు. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌కు కూడా పొగమంచు ప్రమాదం పొంచి ఉంది. సాయంత్ర వేళ మంచు కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈ మ్యాచ్ కూడా సాగుతుందా లేదా అనేది సందేహంగా మారింది.

దేశ సమైక్యతకు ప్రతీక

భావోద్వేగాలను రెచ్చగొడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ సున్నితమైన అంశాలతో రాజకీయాలు చేస్తోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని చరిత్రను వక్రీకరించడంలో దిట్ట అయిన బీజేపీకి భారత స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం లేదనేది వాస్తవం. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహా నేతల మధ్య విభేదాలున్నట్టు అసత్య ప్రచారం చేసిన బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ వేదికగా ‘వందేమాతరం’ గీ తాన్ని వక్రీకరించింది. వందేమాతరం 150 ఉత్సవాల సందర్భంగా అవాస్తవాలతో అధికార బీజేపీ దేశ భావితరాలను తప్పుదోవ పట్టించేలా, చరిత్రను తప్పుగా చిత్రీకరించేందుకు చేసిన కుట్రలను బాధ్యతగల పార్టీగా కాంగ్రెస్ వాస్తవాలతో ఎండగట్టింది. వందేమాతరం కేవలం ఒక నినాదం కాదు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలను ఏకంచేసిన ఒక భావజాలం, ఒక మంత్రశక్తి. దేశం కోసం త్యాగానికి సిద్ధపడిన కోట్లాది భారతీయుల హృదయ స్పందన.

భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రాణం పోసిన గీతం. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రను వక్రీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం పవిత్రమైన ‘వందేమాతరం’ గీతాన్ని కూడా భావోద్వేగాలకు వినియోగించుకునే దురుద్దేశంతో మతపరంగా ప్రజలను రెచ్చగొట్టాలని చూడడం దురదృష్టకరం. వందేమాతరం భావనను భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే స్వీకరించింది. బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతం నియంతృత్వ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో జాతీయతకు సంకేతంగా నిలిచింది. వందేమాతరంతో భారత స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఉద్యమకారులను ప్రోత్సాహించిన కాంగ్రెస్ పార్టీ ఎంతో బాధ్యతాయుతంగా మెలిగి ఆ గీతాన్ని సంకుచిత దృష్టితో దుర్వినియోగం చేయలేదు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాం గ నిర్మాతలు దేశభక్తిని ప్రజాస్వామ్య విలువలతో ముడిపెట్టారు. వందేమాతరం జాతీయ గీతం కాకపోయినా, దానికి అంతే సముచిత గౌరవం, స్థానం కల్పించారు. ఇది దేశంలోని విభిన్న మతాలు, కులాలు, వర్గాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రాంతాలను గౌరవించే రాజ్యాంగాత్మక సమతుల్యానికి నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ఈ సమతుల్యాన్ని ఎప్పటికీ కాపాడుతూనే వచ్చింది. అయితే పవిత్రమైన వందేమాతరం గీతాన్ని కూడా మత కోణంలోనే చూస్తున్న బీజేపీ తమ సిద్ధాంతాలతో విభేదించే వారిని దేశద్రోహులుగా ముద్రవేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. దేశాన్ని ప్రేమించడంతో పాటు ఎవరు ఏమి చేయాలో, ఎలా వ్యవహరించాలో, ఏమి తినాలో, ఏ గీతం పాడాలో అంశాలను కూడా తామే నిర్ణయిస్తామన్నట్టు వ్యవహరిస్తున్న బీజేపీ పోకడలను కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ సహించదు. వారి నుండి విద్వేష పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలో దేశం లేదనే సత్యాన్ని ఆ పార్టీ గ్రహించాలి.

జవహర్ లాల్ నెహ్రూ ఒత్తిడికి తలొగ్గి వందేమాతరం గీతాన్ని కుదించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ లో బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించి అవాస్తవాలు చెప్పారు. ఎవరికీ అభ్యంతరాలు లేకుండా, అందరికీ ఆమోదయోగ్యం ఉండేలా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆర్‌ఎస్‌ఎస్ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సమక్షంలోనే వందేమాతరం గీతంలో చరణాలకు రాజ్యాంగ పరిషత్తు ఆమోదం తెలిపింది. ఈ సవరణలపై జాతీయగీతం రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవ చరిత్ర ఇది అయితే బీజేపీ నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగా నెహ్రూను లక్ష్యంగా చేసుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఒక వేళ నరేంద్ర మోదీ చెప్పినట్టే నెహ్రూ కావాలనే గీతాన్ని కుదిస్తే రాజ్యాంగ పరిషత్తులో ఇతర సభ్యులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదన్న ప్రశ్నకు సమాధానం బీజేపీ నేతలవద్ద లేదు. వందేమాతరం గీతం చరణాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న సమయంలో పార్టీ సభ్యులుగా మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, ఠాగూర్ కూడా ఉన్నారనే వాస్తవాలను తొక్కిపెట్టి కేవలం నెహ్రూ లక్ష్యంగా పవిత్రమైన పార్లమెంట్ వేదికగా బీజేపీ అసత్యాలను చెప్పింది.

దేశ స్వాతంత్య్ర సమరంలో ఏ పాత్రా పోషించని బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు వందేమాతరంపై తమకే పేటంట్ హక్కులున్నట్టు వ్యవహరిస్తున్నా రు. 1875లో బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతాన్ని 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటి సారిగా కాంగ్రెస్ సమావేశంలోనే ఆలపించారు. కాంగ్రెస్ ఈ గీతాన్ని ఆలపించదని ఆరోపిస్తున్న బీజేపీ వారు ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు..? అంతేకాదు నెహ్రూపై నిరాధార ఆరోపణలు చేస్తున్న బీజేపీ దేశం స్వాతంత్య్రం కోసం నెహ్రూ 12 ఏండ్లు జైలు జీవితం గడిపారనేది వాస్తవం కాదా చెప్పాలి. సంఘ్ పరివార్ సభ్యులు, బీజేపీ నేతలెవరైనా స్వాతంత్య్రం కోసం జైళ్లకి వెళ్లారా? వాస్తవాలు ఇలా ఉంటే కేవలం వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ వందేమాతరం గీతంపై రాజకీయాలు చేస్తోంది.

పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం నల్ల చట్టాలను రూపొందిస్తోంది. వీరి పాలనలో నిరుద్యోగం రికార్డు స్థాయికి పెరిగిపోయింది. మహిళలకు భద్రత, సమానత్వం కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యింది. దళితులు, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు. మైనార్టీలు మోదీ పాలనలో అభద్రతా భావంతో జీవిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఆహార భద్రత, ఉపాధి హామీ, విద్యా హక్కు వంటి ప్రజా సంక్షేమ పథకాలు బీజేపీ పాలనలో నీరుగారిపోతున్నాయి. నిత్యావసర ధరలు ఆకాశనంటడంతో సామాన్య ప్రజల జీవితాలు దుర్భరం అవుతున్నాయి.

సామాన్యుడి చేతిలో అస్త్రం అయిన సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశారు. విదేశీ వ్యవహారాల్లో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. స్వయం ప్రతిపత్తి గల ఈడీ, ఐటీ, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రత్యర్థులపై రాజకీయ కక్ష కోసం వాడుకుంటూ దుర్వినియోగం చేస్తోంది. బీజేపీ ప్రభుత్వంపై దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన దశలో దాన్ని పక్కదారి పట్టిస్తూ వందేమాతరం గీతంపై బీజేపీ ప్రభుత్వం వివాదాన్ని సృష్టిస్తోంది.

వందేమాతరం మతాల మధ్య విభేదాల కోసం కాదు.ఈ గీతం దేశంలోని గంగా జమున సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. స్వాతంత్య్ర సమరంలో ప్రజలు దేశభక్తితో మతాలకు అతీతంగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తే ఇప్పుడు బీజేపీ దీనికి మతం రంగం పులుముతోంది. వందేమాతరం గీతం దేశ భక్తి, మత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, భావ ప్రకటనకు ప్రతీకగా నిలిచింది. అయితే వీటిలో ఏ ఒక్కటినీ ఆచరించని బీజేపీ ఇప్పుడు వందేమాతరం గీతంపై రాజకీయాలు చేయడం హాస్యాస్పదం. వందేమాతరం అనేది దేశ ప్రజలందరికీ చెందిన భావన. ఈ గీతాన్ని దేశ విభజన కోసం కాదు. దేశ ప్రజల ఐక్యతకు స్ఫూర్తిగా తీసుకోవాలి. వందేమాతరాన్ని ద్వేషాల కోసం కాకుండా ప్రేమానురాగాలు పంచేందుకు వినియోగించుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తితో, ప్రజాస్వామ్య విలువలతో, సమానత్వభావనతో కలిసికట్టుగా సాగినప్పుడే ‘వందేమాతరం’ అర్థం సార్థకమవుతుంది.

బి.మహేశ్ కుమార్ గౌడ్

(ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు)

ధరూర్ లో భార్యను చంపిన భర్త

మన తెలంగాణ ప్రతినిధి, గద్వాల: భార్యను భర్త హత్య చేసిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని నెట్టెంపాడు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన గోవిందు(32), జమ్మలమ్మలు(28) భార్యాభర్తలు. గురువారం రాత్రి భోజనాలు చేశాక ఇంట్లో నిద్రించారు. చిన్న విషయానికి గొడవపడ్డారు. పెద్దకొడుకు మల్లికార్జున్ అడ్డు వచ్చాడు దీంతో కట్టేతో తలపై కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో భార్య కేకలు వేయడంతో బయట ఉన్నవారు వచ్చి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత భార్యను వెంటాడి కట్టేతో తలపై బలంగా పలుమార్లు కొట్టి చంపేశాడు. తెల్లవారుజామున పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా నిందితుడు గోవిందు సైకోగా వ్యవహరించేవాడని, గతంలో కూడా తండ్రిని చంపినట్లు ఆరోపణలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. గతంలో ఆయనకు మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కూడా అందించారని అందువల్లే చంపి ఉంటాడని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శీను, ధరూర్ ఎస్సై పరిశీలించారు. 

‘వందేమాతరం’పై నేతల వరస మారుతోంది!

‘వందేమాతరం’ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 8న మన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జరిగిన సుదీర్ఘ చర్చ రాజకీయ రగడగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. బెంగాల్ చరిత్ర, సాంస్కృతిక మూలాలలో ‘వందేమాతరం’ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందనేది జగమెరిగిన సత్యం. 1875లో ప్రముఖ బెంగాలీకవి బంకించంద్ర ఛటర్జీ కలం నుండి ఊపిరిపోసుకున్నఈ గేయానికి సంగీతకారుడు జోదునాథ్ భట్టాచార్య బాణీ కట్టారు. 1896లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గళం నుండి ఈ గేయం గీతమై జాలువారింది. ఆ తరువాత, స్వాతంత్య్రోద్యమంలో అత్యంత ప్రజాదరణ పొందిన నిరసన గీతాలలో ఒకటిగా నిలిచింది. 1937లో మన జాతీయ గేయంగా ఎన్నికైంది. ఇందుకు 1950లో రాజ్యాంగ సభ ఆమోదం కూడా పొందింది. అయితే, ముహమ్మద్ అలీ జిన్నా ఒత్తిడికి తలొగ్గి, నెహ్రూ ‘వందేమాతరం’ని రెండు చరణాలకే కుదించారని, తద్వారా దేశ ప్రజలను విడగొట్టారని పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ చర్చ రానున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలే లక్ష్యంగా, ‘జాతీయవాదం’ ముసుగులో అక్కడి ప్రజల్లో మతవిద్వేషాలు రేకెత్తించడానికి ఎన్డీయే ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న సంక్షోభాలనుండి ప్రజల దృష్టిని మళ్ళించే చర్యగా దీనిని అభివర్ణించాయి.

దిల్లీ వాయు కాలుష్యం మొదలుకొని, ఇండిగో సంక్షోభం, రూపాయి పతనం, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులకు మద్దతు ధర లేకపోవడం, మైనారిటీలపై దాడులు, అలాగే లింగ ఆధారిత వివక్ష/ హింస వరకు.. ఇలా దేశంలో ఉన్న ఎన్నో ప్రధాన సమస్యలపై చర్చించకపోవడం ప్రజలపట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రతిబింబిస్తోందన్న ప్రతిపక్షాల అభిప్రాయంతో మన నవతరం కూడా ఏకీభవిస్తోంది.

ప్రతీకవాదం వేరు, వాస్తవాలు వేరు

ఎన్జీఓ రంగంలో విద్యావేత్తగా పనిచేస్తున్న 27 ఏళ్ళ నిఖితా రీనా, ‘వందేమాతరం’ చర్చని పశ్చిమ బెంగాల్ ఎన్నికల నుండి వేరు చేసి చూడలేమన్నారు. ఎందుకంటే, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాలు ఆ గేయంలోని సాంస్కృతిక విలువల గురించి తక్కువ, ఒక నిర్దిష్ట నియోజక వర్గానికి జాతీయవాదాన్ని ఆపాదించే దిశలో ఎక్కువగా దృష్టి పెట్టాయన్నారు. జాతీయ ప్రాధాన్యతలను గుర్తించడం, భవిష్యత్తును చర్చించడం, ప్రగతిశీల, ఇన్‌క్లూజివ్, పౌరులకు సహాయపడే చట్టాలను ఆమోదించడం పార్లమెంటు ప్రాథమిక లక్ష్యాలు. ఒకపక్క, మన దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలుపడింది. నిరుద్యోగం ప్రబలంగా ఉంది. జీవన వ్యయం పెరిగింది. ఇంకోపక్క, ప్రజారోగ్యం, పర్యావరణం, సామాజిక భద్రతా వ్యవస్థలు తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో, చారిత్రక ప్రాముఖ్యం ఉందన్న కారణంతో, ఒక గేయం కోసం పది గంటల సమయాన్ని కేటాయించడం ఓటు రాజకీయం కాక ఇంకేంటి?

ఎన్జీఓ రంగంలో నిఖితా రీనా అనుభవాలు, పరిశీలనలు ఆమె అభిప్రాయాన్ని మరింత బలపరుస్తున్నాయి. స్థానభ్రంశం, కాలుష్యం, పోషకాహార లోపం, అస్థిర జీవనోపాధిని ఎదుర్కొంటున్న సముదాయాలకు ప్రభుత్వ విధానాలు, చొరవలు, జవాబుదారీతనం, సకాలంలో జోక్యం చేసుకోవడం, ఇంకా అధికారుల ప్రతిస్పందన ముఖ్యమని వివరించారు.

దేశీ మార్కెట్

ఆహార భద్రత, మైనారిటీలకు సమాన అవకాశాలు, మధ్యతరగతి గృహనిర్మాణం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, విద్యాహక్కు, బేటీ బచావో -బేటీ పడావో, మహిళలు -గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, విద్య-పరిశోధన నాణ్యత పెంచడం, నైపుణ్యాల గుర్తింపు, ఉపాధి, ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడం, బ్యాంకింగ్ సంస్కరణలు- ఇలా రాజకీయ పార్టీలు తమ ఎలక్షన్ మేనిఫెస్టోలలో ప్రకటించింది ఒకటైతే, వాస్తవాలు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. పెరుగుతున్న లేఆఫ్‌లు, కార్పొరేట్ విధానాలు, టాక్సిక్ వర్క్ కల్చర్, అధిక పని వేళలు, జెండర్ గ్యాప్ లాంటి అంశాలలో సంస్థాగత చర్యలు లేకపోవడం చాలా నిరాశాజనకంగా ఉంది. దాంతో, మా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కూడా దెబ్బతింటోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్’ ప్రవేశపెట్టడం నిజంగా హర్షణీయం. కానీ ఇవేవీ పట్టనట్టు, ఎప్పుడో రాసిన వందేమాతరం గురించి చర్చించి, కేంద్ర ప్రభుత్వం ఏం నిరూపించింది? ఐటీ రంగంలో అవకాశాలు లేకపోవడంతో, గత 8-9 నెలలుగా ఫ్రీలాన్స్ వర్క్‌కే పరిమితమైన శ్రీలత గండికోట ప్రశ్నించారు.

మహిళా సాధికారత, రక్షణ ఒక మిథ్య

మహిళలకు ఇంట్లో, బయటా స్వేచ్ఛ, గౌరవం కరువైన ఈ సమాజంలో, సాధికారత/ సమాన అవకాశాలు కేవలం ఒక అపోహ. ఎందుకంటే, ఆర్థిక మాంద్యం రాగానే, మొదట ఉద్యోగాలు కోల్పోతోంది మహిళలే. ఇది చాలదన్నట్లు, ఈ ఏడాది జూన్‌లో, తమ దేశ మహిళలు భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించ వద్దని అమెరికా విదేశాంగ శాఖ సిఫార్సు చేసింది. ‘భారతదేశంలో విపరీతంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటి,’ అని లెవెల్-2 హెచ్చరికను కూడా జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ళలో మౌలిక సదుపాయాలు, అమ్మాయిలకు భద్రత, బడ్జెట్ కేటాయింపులు లేవు. పోక్సో కేసులు నమోదు చేసే యంత్రాంగం లేదు అంటూ తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఒక హక్కుల ఆధారిత సంస్థలోని యువ వాలంటీర్ వాపోయారు.

విదేశీ అవకాశాలు

అక్టోబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023 మధ్య, అమెరికా జారీ చేసిన హెచ్1బీ వీసాల లబ్ధిదారులలో 72.3 శాతం భారతీయ పౌరులే. దీని బట్టి, మనవాళ్ళు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎంఎస్‌సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ తరువాత, హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ళ నాగార్జున్, అమెరికాలో పీహెచ్డీ అవకాశాల కోసం గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ, హెచ్1బీ అప్లికేషన్‌ల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో, అతని ఆశ అడియాస అయ్యింది. ఇప్పటికే ఆర్థికంగా సతమవుతున్న మధ్యతరగతికి ఇక అమెరికా అందని ద్రాక్షే! సోషల్ మీడియా వెట్టింగ్ లాంటి కొత్త నియమాల వల్ల వీసా రావడం కష్టమవుతుంది. అందుకే, నేను యూరప్‌కి వెళ్దామనుకుంటున్నాను. ఇక్కడేమో కానీ, ఇమిగ్రంట్స్‌కి అక్కడ మంచి డిమాండ్ ఉంది. ఒక్క 2024లోనే, 2.06 లక్షల మంది భారతీయులు ఇక్కడి పౌరసత్వం వదులుకొని, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ దేశాల పౌరసత్వం పొందారు. అంటే, ‘పర్మనెంట్ సెటిల్‌మెంట్’ కి మన యువత ఎంత ప్రాధాన్యతనిస్తోందో అర్థమవుతోంది.

మన దేశంలో ఇంకా ఏం మిగిలుంది? ఉద్యోగాలు లేవు. భూమీ, నీళ్ళూ, గాలీ కలుషితమయ్యాయి. పేరుకే మనది ప్రజాస్వామ్యం. కానీ, ఓట్లు కూడా చోరీ అవుతున్నాయి. జనం ఎప్పుడో కులం, మతం, జాతి, అంతస్తు పేరుతో చీలిపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, స్కూల్స్ సైతం ప్రైవేటైజ్ అవుతున్నాయి. ఈ లెక్కన, త్వరలో రిజర్వేషన్ వ్యవస్థకు మనం స్వస్తి చెప్పొచ్చు. అయినా, ఎన్నికలొచ్చినప్పుడు, బిజెపి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎత్తుగడ వేస్తూ వస్తోంది. బెంగాల్ ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు ఇది, అంటూ, యూకే వీసా కోసం ఎదురుచూస్తున్న రుక్షియా బేగం నిట్టూర్చారు.

ఇదేనా ‘వందేమాతరం’ స్ఫూర్తి?

మన యువతలో ఆత్మహత్యల రేటు ఆందోళనకరమైన స్థాయిలో ఉంది. ఎన్‌సిఆర్‌బి 2022 నివేదిక ప్రకారం, భారతదేశంలో, ప్రతి సంవత్సరం సుమారు 13,000 మంది యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రేమ వ్యవహారాలు, పెళ్ళి, కుటుంబ అంచనాలు, డ్రగ్స్, ఒత్తిడి, నిరుద్యోగం, వేధింపులు ఇవన్నీ ఈ బలవన్మరణాలకు ప్రధాన కారణాలు. ఇదొక జాతీయ విపత్తు. కానీ, దీనిపై పార్లమెంటులో చర్చ జరగదు. ‘వందేమాతరం’ స్ఫూర్తిని మన పార్లమెంటు గౌరవిస్తోందన్నది నిజమే అయితే, ఆ గేయం కాంక్షించిన సమాజాన్ని సృష్టించడానికి, మన రాజకీయ నాయకులు పారదర్శకత, జవాబుదారీతనంపై ఎందుకు దృష్టి పెట్టరు? తెలుగు రాష్ట్రాలలో గే హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్త విష్ణు తేజ ప్రశ్నించారు. ఏదేమైనా, ‘వందేమాతరం’ చర్చ సాంస్కృతిక, సైద్ధాంతిక ప్రతీక వాదంగా మారింది. మొదటి నుండీ, బెంగాల్ రాజకీయాలు సంస్కృతి, చారిత్రాత్మక, మేధోపరమైన చర్చ, ప్రాంతీయ ఆత్మగౌరవానికే పెద్ద పీట వేస్తూ వచ్చాయి. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం వేసిన ఈ ఎత్తుగడ అక్కడి ఓటర్ల విశ్వాసాన్ని గెలుస్తుందా లేదా అన్నది సమయమే నిర్ధారిస్తుంది.

వై. కృష్ణజ్యోతి

(ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)