xmtradingxmtradingxmtradingxmtradingsonbahis girişsonbahissonbahis güncelsweet bonanza oynasweet bonanza oynaaresbetaresbet girişkulisbetkulisbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişcasinoroyalcasinoroyal girişenbetenbet girişhilbethilbet girişhiltonbethiltonbet girişyakabetyakabet girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişaresbetaresbet girişkulisbetkulisbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişcasinoroyalcasinoroyal girişenbetenbet girişhilbethilbet girişhiltonbethiltonbet girişyakabetyakabet girişmeritkingmeritking girişmeritking güncel girişmeritkingkulisbetcasibomcasibom girişcasibom güncel girişXMTradingkulisbetkulisbet girişaresbetaresbet girişhiltonbethiltonbet giriştrendbettrendbet girişhilbethilbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişefesbetefesbet girişefesbetaresbetaresbet girişkulisbetkulisbet girişhiltonbethiltonbet giriştrendbettrendbet girişhilbethilbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişaresbetaresbet girişkulisbetkulisbet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişkulisbetkulisbet girişaresbetaresbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişkulisbetkulisbet girişaresbetaresbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet girişheybetheybet girişgorabetgorabet girişmakrobetmakrobet girişnesinecasinonesinecasino girişhayalbahishayalbahis girişxslotxslot girişhiltonbet girişhiltonbethiltonbetmedusabahis girişmedusabahismedusabahisloyalbahis girişloyalbahisloyalbahisatlasbet girişatlasbetatlasbetenbet girişenbetenbetsüratbet girişsüratbetsüratbethayalbahis girişhayalbahishayalbahisxslot girişxslotxslotelexbet girişelexbetelexbetrestbet girişrestbetrestbetperabet girişperabetperabetenbet girişenbetenbetrestbet girişrestbetrestbetloyalbahisloyalbahis girişloyalbahisteosbet girişteosbetteosbetpusulabet girişpusulabetpusulabetpusulabetkulisbet girişkulisbetkulisbettrendbet giriştrendbettrendbetaresbet girişaresbetaresbetteosbet girişteosbetteosbetmedusabahis girişmedusabahismedusabahispusulabetaresbetaresbet girişteosbetteosbet girişkulisbetkulisbet girişpusulabetgalabetgalabetwinxbetwinxbetkulisbetkulisbetlordbahislordbahisbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetovisyakabetyakabetprizmabetprizmabetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetbetkolikbetkolikwinxbetwinxbetpusulabetpusulabet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis giriş

jojobet

betwoon resmi

holiganbet

teosbet giriş

vaycasino

mavibet

casibom

escort sakarya

Casibom

cratosroyalbet giriş

vaycasino

betgaranti giriş

ikimisli giriş

betpark 2026

casinolevant

casinolevant

piabellacasino

cratosroyalbet giriş

vaycasino

piabellacasino

vaycasino

cratosroyalbet giriş

trabzon escort

deneme bonusu

cratosroyalbet

xnxx

porn

hit botu

galabet

Holiganbet

Holiganbet Giriş

vaycasino

Streameast

jojobet

teosbet giriş

jojobet

matbet

holiganbet giriş

holiganbet güncel giriş

holiganbet

holiganbet

holiganbet giriş

holiganbet giriş

Matbet Güncel Giriş

holiganbet güncel giriş

Matbet

artemisbet

Matbet

casibom giriş

Jojobet giriş

holiganbet

betasus

ataköy escort

betnano

Matbet

holiganbet

artemisbet

holiganbet

Meritking

Pusulabet

Galabet Giriş

Matbet Giriş

casibom

grandpashabet

holiganbet

jojobet

holiganbet

kavbet

lunabet

betsmove

Matbet Giriş

matbet

Hacklink satın al

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

pusulabet

casibom

jojobet

Holiganbet giriş

Holiganbet

redwin

Galabet

Ultrabet

casibom güncel giriş

casibom

nakitbahis

nakitbahis giriş

nakitbahis

nakitbahis giriş

betnano

casibom

casibom

betwoon

grandpashabet

grandpashabet

pusulabet

pusulabet

matbet

betmoney

setrabet

holiganbet

matadorbet güncel link rehberi

trendbet

hiltonbet

kulisbet

aresbet

hilbet

atlasbet

teosbet

winxbet

süratbet

yakabet

interbahis

interbahis giriş

casinolevant

Cratosroyalbet Giriş

casibom

izmir escort

holiganbet giriş

padişahbet

betsmove

meritking

jojobet

lunabet

heybet

gorabet

makrobet

nesinecasino

hayalbahis

xslot

grandpashabet

bettilt

betebet

padişahbet

ultrabet

grandpashabet

restbet

hipbet

heybet

betvino

casibom giriş

grandpashabet

betpas

meritking

Jojobet

marsbahis

Jojobet

deneme bonusu veren siteler 2026

deneme bonusu veren yeni siteler

pusulabet

grandpashabet

casibom

sekabet

casibom

1xbet

marsbahis

venusbet

betpas

serdivan escort

polobet

dedebet

casibom

jojobet

portobet giriş

portobet

pulibet

teosbet

interbahis

interbahis giriş

aresbet

teosbet

kulisbet

tlcasino

marsbahis

interbahis

sweet bonanza giriş

hiltonbet

meritking

kingroyal

madridbet

holiganbet

jojobet güncel giriş

meritking

Marsbahis Giriş

Marsbahis

wbahis

Jojobet

ఎట్టకేలకు టాస్ గెలిచిన భారత్

విశాఖపట్నం: భారత్ -సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. వాషింగ్టన్ సుందర్ కు బదులుగా టీమ్ లోని తిలక్ వర్మను తీసుకున్నారు. 20 మ్యాచ్ లు తరువాత టీమిండియా టాస్ గెలిచింది. 

భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కెఎల్ రాహుల్ (కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ

సౌతాఫ్రికా జట్టు: ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రామ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్

టేకాఫ్ అవుతుండగా.. విమానంలో చెలరేగిన మంటలు..

బ్రెజిల్: గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. 180 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. లాటమ్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎయిర్‌బస్ ఎ320 విమానంలో క్యాబిన్‌లో టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది ప్రయాణికులను కిందకి దింపేశారు.

ఆ వెంటనే ఘటనాస్థిలికి చేరుకున్న అగ్నిపామక సిబ్బందిమ మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరకీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై లాటమ్ విమాన సంస్థ స్పందించింది . విమానంలో ఎలాంటి మంటలు చెలరేగలేదని.. లగేజీ ఎక్కించే లోడర్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపింది.

బ్లాక్ మార్కెట్‌లో ఇండియా – సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్లు

అమరావతి: విశాఖపట్నంలో భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే జరుగుతోంది. విరాట్ కోహ్లీ రెండు వన్డేలలో వరుసగా రెండు సెంచరీలు చేయడంతో టికెట్లు హాట్ కేకులా అమ్ముడుపోయాయి. తొలి వన్డేలో టీమిండియా గెలవగా రెండో  వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచి సమంగా ఉన్నారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. ఇండియా – సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. బ్లాక్ లో మ్యాచ్ టికెట్ల విక్రయాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రూ.3 వేల టికెట్ ను రూ.8 వేలకు అమ్ముకుంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్న పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని అభిమానులు వాపోతున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.  

చిరు మూవీ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ ప్రోమో వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. పండగకి వస్తున్నారు అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘మీసాల పిల్లా’ అనే పాట సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో పాట సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘శశిరేఖ’ అంటూ సాగే ఈ పాట ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరొలియో, మధుప్రియ కలిసి పాడారు. ప్రోమోలో చూపించిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. పూర్తి పాటని డిసెంబర్ 8వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించారు. ‘విక్టరీ’ వెంకటేష్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. క్యాథరీన్ త్రెసా, విటివి గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

‘అఖండ-2’ రిలీజ్ వాయిదా.. బుక్ మై షోలో షాకింగ్ అప్‌డేట్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ-2’. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిత్ర కొత్త రిలీజ్ డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్‌ మై షో పెట్టిన ఓ అప్‌డేట్ అభిమానులకు షాక్ ఇచ్చింది.

‘అఖండ-2’ కొత్త విడుదల తేదీపై సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోన్న వేళ.. బుక్‌ మై షో ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు యాప్‌లో అప్‌డేట్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందుకే యాప్‌లో అలా అప్‌డేట్ చేసి ఉంటారా.. అంటే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుందా? అని అభిమానులు అనుకుంటున్నారు. గతంలో ఎన్నోసార్లు బాలకృష్ణ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మరి ఈసారి కూడా ‘అఖండ-2’తో సంక్రాంతికి వచ్చి గ్రాండ్ సక్సెస్ అందుకుంటారో.? లేదో.? వేచి చూడాలి.

ఇండిగో విమానాలు రద్దు…. ప్రయాణికుల ఆగ్రహం.. వైరల్ వీడియో

హైదరాబాద్: ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరోజే వెయ్యి విమాన సర్వీసులు రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు పడుతున్నారు. ఇవాళ కూడా ఇండిగో ఫ్లైట్‌ సర్వీసుల రద్దుతో ఎయిర్‌పోర్ట్‌లలో పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 15లోగా సమస్య పరిష్కారం చేస్తామని ఇండిగో సిఇఒ సెలవిచ్చారు. సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకునే విమానాల్ని క్యాన్సిల్‌ చేశామని తెలిపారు. సిస్టమ్‌ రీబూట్‌ వల్ల విమానాలు రద్దు చేయాల్సి వస్తుందని చెప్పారు. ఇండిగో సంస్థ తమతో ఆటలాడుకుంటుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానాలు రద్దు చేసి ఇండిగో సంస్థ చేతులు దులుపుకోవడంపై మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వడం లేదంటూ ప్యాసింజర్లు దుయ్యబట్టారు. ఇండిగో సిబ్బంది ఎయిర్‌పోర్టుల్లో ఎక్కడ కనిపించిడం లేదు. ఎయిర్‌పోర్టుల్లో ప్యాసింజర్ల పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇండిగో విమానాల రద్దుతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 37 ప్రీమియం రైళ్లలో 116 కోచ్‌లను పెంచింది. దక్షిణ రైల్వే18 రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచింది. తూర్పు రైల్వే 3 కీలక రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లు, నార్తర్న్‌ రైల్వే 8 రైళ్లలో థర్డ్‌ ఎసి, చైర్‌కార్‌ కోచ్‌లు పెంచింది. పశ్చిమ రైల్వే థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ కోచ్‌లు, ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే సెకండ్‌ ఏసీ కోచ్‌లను అదనంగా వేసింది. 10 రూట్లలో నేటి నుంచి 10వ తేదీ వరకు ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్‌లు చేర్చింది. 

కాలపరీక్షకు నిల్చిన భారత్-రష్యా మైత్రి

భారత్ష్య్రా 23 వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ అరుదెంచడం యావత్ ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పైనే ఉంది. ఈ సదస్సు ప్రక్రియ 2000 సంవత్సరం లో ప్రారంభమైన తరువాత పుతిన్ పర్యటన నాలుగేళ్ల విరామం చేసుకోవడం ఇంతవరకు లేదు. అగ్రరాజ్యం అమెరికా సహా నాటో కూటమి లోని అన్ని దేశాలకు చుక్కలు చూపిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించడం అమెరికాతోపాటు పొరుగున ఉన్న పాకిస్థాన్ నిశితంగా గమనిస్తోంది. భారత దేశానికి చిరకాల మిత్ర దేశంగా ఉన్న రష్యా గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌కు రక్షణ, సాంకేతిక పరిజ్ఞాన, తదితర రంగాల్లో సహాయం అందిస్తోంది. పుతిన్ తాజా పర్యటనతో భారత్ రష్యా మధ్య ఏయే రంగాల్లో ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయన్నది ఆసక్తిగా మారింది.

ఇప్పుడు ఉభయ దేశాల ప్రభుత్వాల మధ్య వ్యూహాత్మక పరస్పర ప్రయోజన ఒప్పందాలు పది వరకు, అలాగే వాణిజ్య, వాణిజ్యేతర సంస్థల మధ్య 15 ఒప్పందాలు మొత్తం 25 ఒప్పందాలు కుదురుతాయని తెలుస్తోంది. ఇవి కాక ఈ సదస్సులో రెండు లక్షాలు తెరపైకి వస్తాయని చెబుతున్నారు. మొదటిది ద్వైపాక్షిక సంబంధాలను నడిపించే నాయకత్వం, రెండోది రష్యా ఉక్రెయిన్ యుద్ధ నివారణకు చేస్తున్న ప్రయత్నాలపై సమీక్ష. ద్వైపాక్షిక సంబంధాల విషయానికి వస్తే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు కాలపరీక్షకు నిలబడుతున్నాయి. సోవియెట్ యూనియన్ పతనమైనా, భారత్‌అమెరికా సంబంధాలు బలపడినా, 2020లో చైనా భారత్ సరిహద్దుల మధ్య సంఘర్షణలు చెలరేగినా, ఉక్రెయిన్ యుద్ధం, ఆపై అమెరికా, పశ్చిమదేశాల ఆంక్షలు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల భారం అత్యధికంగా పెంచినా సరే రష్యాతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు ఏమాత్రం చెక్కుచెదరలేదు. అగ్రదేశాల ద్విధ్రువత్వం, ఏకధ్రువత్వం, బహుళ ధ్రువత్వ ప్రచ్ఛన్న యుద్ధాల నుంచి ఈ ద్వైపాక్షిక బంధాలు ఎదురొడ్డి నిలిచాయి.

స్టాక్ మార్క్‌ట్ విషయంలో భారతీయ విదేశీ విధానానికి రష్యా ఒక ఆస్తి వంటిదే. ఎలాంటి మెరుపులు లేకపోయినా, నిదానమైన, స్థిరమైన, ఊహించదగిన రాబడులను రష్యా అందిస్తోంది. గత 15 సంవత్సరాలుగా భారత్ రష్యా సంబంధాలు రూపాంతరం చెందాయి. రక్షణ రంగ సహకార సాపేక్ష ప్రాముఖ్యం నిదానంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ, కొత్త రంగాల్లో సహకారం పెరుగుతోంది. చారిత్రకంగా భారత్ రష్యా మధ్య రాజకీయ, వ్యూహాత్మక సంబంధాలు వాటి వాణిజ్యం, ఆర్థిక భాగాలకంటే అతీతమైనవి. ఇతర ప్రధాన దేశాలకన్నా ఇవి భిన్నమైనవి. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు ఎంతో నిగూఢంగా ఉన్నాయి. ఉదాహరణకు రష్యాకు భారత్ నుంచి ఎగుమతులు బంగ్లాదేశ్ కన్నా తక్కువగానే ఉన్నాయి. ఇంధన రంగంలో ఉభయదేశాల పరస్పర పెట్టుబడులు అమితంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సదస్సులో భారత్ భావి ప్రగతికి అవసరమైన ఇంధనం, ముడి వనరులు, కీలకమైన ఖనిజాలు, ఎరువులు, ఫార్మాక్యూటికల్స్, వ్యవసాయం, సముద్రమార్గాల అనుసంధానం, తదితర ముఖ్యమైన అంశాలపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు. భారత్ నుంచి మానవ వనరులను రష్యాకు పంపించడం అత్యంత ప్రభావితం చేస్తోంది. పుతిన్ పర్యటన లోని రెండో ప్రధాన లక్షం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింప చేయడం. ఈ విషయంలో రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఈ మేరకు అమెరికా, రష్యా అధ్యక్షులతో భారత్ చర్చల పరంపర కొనసాగిస్తూనే ఉంది .

ఈ ప్రయత్నాలు ఫలించినా, విఫలమైనా ప్రపంచ దేశాల మధ్య సమతుల్యతకు భంగం కలగకూడదు. ఐరోపా దేశాల ఉద్రిక్తతలు భారత్‌కు తెలుసు. ఇందులో భారత్ ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. భారత్ ఎప్పుడూ ఉక్రెయిన్ విషయంలో శాంతి ఒప్పందం కుదరాలనే ఆకాంక్షిస్తోంది. అదే భారత్ విదేశాంగ విధానం. వాస్తవానికి ఉక్రెయిన్ చుట్టూ అత్యంత సంక్లిష్ట అంశాలు ముడిపడి ఉన్నాయి. రాజకీయ మార్గం ద్వారా శాంతి వైపు చర్చలు జరపడమే పరిష్కార సూత్రం. శాంతి ప్రక్రియవైపు పుతిన్‌ను ప్రోత్సహిస్తున్నప్పటికీ అమెరికాతో పుతిన్ చర్చించేటప్పుడు భారత్ వినడమే తప్ప మరేం చేయడానికి వీలుపడదు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందం కుదిరి అమెరికారష్యాల మధ్య సంబంధాలు తిరిగి బలపడితే అవి భారత్ విషయంలో భౌగోళిక రాజకీయ వేదికను మార్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు బెడిసికొడితే మనం పూర్తి స్థాయి రెండో ప్రచ్ఛన్న యుద్ధం వైపు చూడవలసి వస్తుంది.

మరోవైపు రష్యా ఎప్పుడూ భారత్‌ను కీలక భాగస్వామ్య దేశంగానే పరిగణిస్తోంది. తన స్వప్రయోజనాలను ఆసియా లోని చైనాకు బలిపెట్టడానికి ఇష్టపడడం లేదు. మాస్కో దృష్టిలో చైనా రష్యాకు సంఘీభావం తెలుపుతూనే ఐరోపా దేశాలతో సంబంధాలను తెంచుకోవడం లేదు. ఈ విధంగా చైనా లాభపడడం రష్యాకు నష్టదాయకంగానే ఉంటోంది. సుదీర్ఘకాలంలో చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్న ఆలోచనతో రష్యా ఉంటోంది. భారత్ మాదిరి అమెరికా చైనా మధ్య మైత్రీ బంధాలు ఎలా ఉంటున్నాయో రష్యా గమనిస్తోంది. చైనాతో ట్రంప్ జి2 వ్యూహం రూపొందించుకోవడానికి ఆలోచిస్తున్నారు. అంటే అమెరికా, చైనా రెండూ ఒకే బాట, మాటపై ఉంటే ఏదైనా సాధించవచ్చని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. అయినాసరే అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నా రష్యాతో సంప్రదించకుండా చైనా ఉండదు. ఏదెలాగున్నా మనం ఇప్పుడు పొత్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇప్పుడు భారత్ష్య్రా మధ్య సాగుతున్న చర్చలు గొప్ప వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి దారి చూపిస్తాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది. 

మరో రెండు ఉపద్రవాలు

ప్రపంచానికి గాజా, ఉక్రెయిన్ అనే రెండు సమస్యలు చాలవన్నట్లు వెనిజుయేలా, జపాన్ రూపంలో రెండు కొత్త సమస్యలు తయారవుతున్నాయి. ఈ నాలుగింటికి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలతో నిమిత్తం ఉండటం గమనించదగ్గది. సంవత్సరాలుగా సాగుతున్న గాజా, ఉక్రెయిన్ యుద్ధాల గురించి తెలిసిందే. ఇపుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లుండి దక్షిణ అమెరికాలోని వెనిజుయేలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో లేని పేచీలు మొదలుపెట్టారు. మరొకవైపు, అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన జపాన్ అధ్యక్షురాలు సనే తకాయిచీ అదే పద్ధతిలో చైనాతో అక్కరలేని తగవును లేవనెత్తారు. గాజా విషయం తెలిసిందే. ఆ ప్రాంతం పాలస్తీనాలో భాగం. పాలస్తీనాను 27 సంవత్సరాల క్రితం బలవంతంగా విభజించి ఇజ్రాయెల్‌ను సృష్టించిన పాశ్చాత్య కూటమి, ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడగలవని స్వయంగా ప్రకటించి కూడా, ఆ మేరకు ఐక్యరాజ్య సమితిలో తీర్మానించి కూడా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.

పాలస్తీనా ప్రజలు అందుకు ఆగ్రహించటం వల్ల ఆవిర్భవించిందే గాజా ప్రాంతంలో హమాస్ చేసిన తిరుగుబాటు. స్వతంత్ర పాలస్తీనాకు అనుకులంగా ప్రపంచమంతా గొంతెత్తినా లెక్కచేయని ఇజ్రాయెల్, అమెరికాలు, గాజా ప్రాంతాన్ని, వెస్ట్ బ్యాంక్‌ను కూడా ఆక్రమించి ఇక పాలస్తీనా దేశమున్నదే లేకుండా చేయాలని రకరకాల కుయుక్తులు పన్నుతున్నాయి. దీనంతటిలో అమెరికా అధ్యక్షుని ప్రత్యక్ష పాత్ర ఉంది. ఉక్రెయిన్ విషయానికి వస్తే, ఆ సమస్య పరిష్కారానికి ట్రంప్ పలు విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు పైకి తోస్తుంది. కాని వాస్తవంలో ఆ సమస్యకు మూలమే అమెరికా. అందులో వ్యక్తిగతంగా ట్రంప్ పాత్ర కూడా ఉంది. సోవియెట్ యూనియన్, దానితో పాటు వార్సా సైనిక కూటమి 1991 లో రద్దయిన వెనుక ఇక ప్రచ్ఛన్న యుద్ధమంటూ లేని స్థితిలో, పాశ్చాత్య దేశాల ‘నాటో’ సైనిక కూటమిని కూడా రద్దు చేయటానికి బదులు అమెరికా, యూరప్ కలిసి అదే విధంగా కొనసాగించాయి. నాటో రద్దు కాకపోయినా కనీసం మరింత విస్తరించబోమంటూ రష్యాకు ఇచ్చిన హామీని ఉల్లంఘించి, ఇంకొక 12 దేశాలను కొత్తగా చేర్చుకుని రష్యా సరిహద్దుల వైపు విస్తరించాయి.

అదే క్రమంలో ఉక్రెయిన్‌ను కూడా నాటోలో చేర్చుకుని రష్యాను ఇక పూర్తిగా చక్రబంధంలోకి తెచ్చే ప్రయత్నం సాగటం వల్ల మాత్రమే ఆ ప్రమాదాన్ని నిరోధించేందుకు ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైంది. ఉక్రెయిన్, యూరప్‌లను ట్రంప్ ఇపుడు తప్పు పడుతున్నారు గాని, వాస్తవానికి ఆయన గత పర్యాయం అధ్యక్షునిగా ఉన్నపుడు నాటో విస్తరణకు అనుకూలురే. దానినట్లుంచితే, ఈసారి అయినా ఉక్రెయిన్ యుద్ధ పరిసమాప్తికి ఆయన ప్రయత్నాలు దోబూచులాట వలెనే ఉన్నాయి తప్ప ఖచ్చితమైన విధానం కనిపించదు. చివరకు ఏమి జరిగేదీ, ఎప్పుడు జరిగేదీ తెలియకుండా కొనసాగుతున్నదా సమస్య. పాలస్తీనా వలెనే ఉక్రెయిన్ సమస్య కూడా అమెరికా నాయకత్వాన పాశ్చాత్య దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఉనికిలోకి వచ్చి కొనసాగుతున్నాయి.

అవి రెండు అట్లుండగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు వెనిజుయేలా పై దాదాపు యుద్ధ సన్నాహాలనదగ్గవి మొదలుపెట్టారు. ఆయన తన ఎన్నికల ప్రచార సమయంలో, ఎన్నికైన తర్వాత కూడా, తను యుద్ధాలకు వ్యతిరేకమని, జరుగుతున్న యుద్ధాలను ఆపగలనని ప్రకటించారు. కొన్ని యుద్ధాలను ఆపినట్లు కూడా చెప్పుకున్నారు. కాని ఇపుడు వెనిజుయేలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై కత్తిగట్టారు. అందుకు ఏకైక కారణం ఆయన సోషలిస్టు కావటం. మదురో కన్నా ముందు అధ్యక్షుడు అయిన హ్యూగో ఛావేజ్ కూడా సోషలిస్టే. ఆయన అమెరికాను బలంగా వ్యతిరేకించారు. లాటిన్ అమెరికా మొత్తాన్ని అమెరికా మొదటి నుంచి పూర్తిగా తన నియంత్రణలో ఉండవలసిన ప్రాంతంగా పరిగణిస్తూ వస్తున్నది. అటువంటి చోట తనను ఏ దేశం ఎంతమాత్రం ధిక్కరించినా, స్వతంత్రంగా వ్యవహరించినా అక్కడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో జోక్యం చేసుకుని ఆ ప్రభుత్వాలను పడగొట్టడం, తమకు అనుకూలురను అధికారంలోకి తేవటం ఒక సర్వసాధారణ క్రీడగా మారింది. ఆ విధంగా గత 200 సంవత్సరాలలో కనీసం 20 సార్లు జోక్యం చేసుకున్నారు. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో విషయంలో వైఫల్యం, చిలీలో అలెండీ ప్రభుత్వ పతనం కేసులు సుప్రసిద్ధమైనవి. ఈ చర్యలు అన్నింటికి అన్నీ అమెరికన్ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం చేసినవే.

ఆయా ప్రభుత్వాలు వామపక్ష సిద్ధాంతాలు గలవి. అయితే ఇక చెప్పనక్కర లేదు. వెనిజుయేలాకు సంబంధించి ఈ రెండు కారణాలు కలిసి వచ్చాయి. ఛావేజ్ సోషలిస్టు కాగా, ఆయన వారసుడు మదురో కూడా సోషలిస్టు. ఇక ఆ దేశంలో చమురు నిల్వలు మొత్తం ప్రపంచంలోనే సౌదీ అరేబియాను కూడా మించి అత్యధికం కాగా, అమెరికన్ కంపెనీల చేతిలో ఉండిన ఆ నిల్వలను ఛావేజ్ జాతీయం చేశారు. మదురో అదే విధానాన్ని కొనసాగించటంతో, ట్రంప్ తన మొదటి పాలనా కాలంలోనే ఆయన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. అవే ప్రయత్నాలు ఈ రెండవ విడత పాలనలో కొనసాగిస్తున్నారు. అయితే అందుకు ఒక సాకును ముందుకు తెచ్చారు. అది, వెనిజుయేలా నుంచి కొకైన్, ఫెంటానిల్ తదితర మాదకద్రవ్యాలు అమెరికాకు రవాణా అవుతున్నాయని, అటువంటి ఉత్పత్తి, రవాణా సంస్థకు స్వయంగా మదురో అధిపతి అన్నది ట్రంప్ ఆరోపణ. కాని అది ఎంత మాత్రం నిజం కాదని మదురో నిరాకరించటమే కాదు. అమెరికా సహా ఇతర పాశ్చాత్య స్వతంత్ర సంస్థలు, నిపుణులు కూడా కాదనటం గమనించదగ్గది. కాని ట్రంప్ వంటి ధోరణి గల నాయకులకు ఏ విషయంలోనూ నిజానిజాలతో నిమిత్తం లేదన్నది ఈసరికి ప్రపంచానికి అర్థమైపోయిన విషయం. అందుకు అనుగుణంగానే ఆయన మదురోపై నిరాధారమైన ఆరోపణలు, అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే హెచ్చరికలు చేయటం మొదలుపెట్టారు. వెనిజుయేలా సమీపానికి, కరిబ్బియన్ సముద్రంలోకి ఇప్పటికే యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు పంపారు. వెనిజుయేలాలో రహస్య కార్యకలాపాలు సాగించవలసిందిగా సిఐఎను ఆదేశించినట్లు బహిరంగంగానే ప్రకటించారు.

మదురోను పడగొడితే అయిదు కోట్ల డాలర్లు ఇవ్వగలమంటూ అక్కడి సైన్యాధికారులకు ఆశపెట్టారు. ఇక ఇటీవల అయితే, మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నాయని ఆరోపిస్తూ సుమారు 20 వెనిజులా పడవలపై వైమానిక దాడులు జరిపి, దాదాపు 80 మందిని చంపించారు. అవన్నీ మామూలు మత్సకారుల పడవలని మదురో ప్రకటించారు. ఆ పడవలలో మాదక ద్రవ్యాలున్నట్లు ఆధారాలేమిటని అమెరికన్ మీడియా ప్రశ్నించగా ట్రంప్ జవాబు ఇవ్వలేకపోవటం గమనించదగ్గది. దానితో ఆయనపై అమెరికాలోనే విమర్శలు మొదలయ్యాయి. తన చర్యలు అమెరికా చట్టాలకు, అంతర్జాతీయ చట్టాలకు కూడా విరుద్ధమని నిపుణులు ఎత్తిచూపారు. దీనికిదే సమస్య కాగా, కొద్ది రోజుల క్రితం ఒక పడవపై దాడిలో కొందరు మరణించిన తర్వాత ఇద్దరు ఇంకా జీవించి ఉండగా, మరొక విడత దాడి జరిపి వారిని కూడా చంపివేయటంతో రిపబ్లికన్ సహా అమెరికన్ సెనెటర్లు సైతం తీవ్ర విమర్శలు చేస్తూ, అందుకు రక్షణ మంత్రి పీట్ హెగ్ సెట్‌పై విచారణ జరపగలమని ప్రకటించారు. ఎవరూ మిగలకుండా దాడి చేయాలని సైన్యాన్ని ఆయన ఆదేశించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది.

అటువంటి రెండవ దాడిని తాను సమర్థించబోనని స్వయంగా ట్రంప్ వ్యాఖ్యానించటం విశేషం. ఈ వివరాలు ఎట్లున్నా, అసలు ఈ పరిణామాలన్నిటికి మూలం లాటిన్ అమెరికాకు వ్యతిరేకంగా ట్రంప్ సామ్రాజ్యవాదంలో ఉందన్నది తిరుగులేని వాస్తవం. మరొక వైపు, జపాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన తకాయి ఒకవేళ చైనా సైన్యం తైవాన్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే, తైవాన్‌కు మద్దతుగా, తమ ఆత్మరక్షణ కోసం, తమ సైన్యాన్ని పంపగలమని ప్రకటించి ఒక పెద్ద వివాదాన్ని సృష్టించారు. తైవాన్ చైనాలో భాగమనే ఒకే చైనా విధానాన్ని స్వయంగా జపాన్ కూడా పాటిస్తున్నప్పుడు ఇటువంటి ప్రకటన చేయటం చైనాకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

దానితో వెంటనే తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ, జపాన్‌కు ఆర్థికపరమైన నష్టాలు కలిగించే చర్యలు తీసుకోవటం ఆరంభించింది. ఒకవేళ జపాన్ సైనిక చర్యలకు పాల్పడినట్లయితే ఆ దేశాన్ని ధ్వంసం చేయగల సైనిక శక్తి తమకున్నదని చైనా సైన్యం వరుస హెచ్చరికలు జారీ చేస్తున్నది. ఈ ఆకస్మిక పరిణామాలు జపాన్‌లోనే గాక, ప్రపంచమంతటా పెద్ద కలకలం సృష్టించాయి. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో జపాన్ ప్రధాని ఇటువంటి ప్రకటనలు చేయటం పట్ల ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అమెరికా మద్దతు లేనిదే, మద్దతు ఉందన్న ధైర్యం లేనిదే, జపాన్ వంటి దేశం చైనా వంటి దేశంపై ఇటువంటి వైఖరి తీసుకోజాలదని వేరే చెప్పనక్కర లేదు. రెండు దేశాల మధ్య యుద్ధం జరగకపోవచ్చుగాక, కాని లోగడ చైనాను, తైవాన్‌ను కూడా ఆక్రమించిన చరిత్ర గల జపాన్ తిరిగి ఈ విధంగా వ్యవహరించటం ప్రమాదకర సంకేతాలను పంపుతున్నది.

టంకశాల అశోక్

దూరదృష్టి

దార్శనికుడు అంబేద్కర్

చాలా మంది మేధావులు, విద్యావేత్తలు సమాజాన్ని మార్చాలనుకుంటారు. అందుకోసం ఎన్నో అన్వేషణలు, విశ్లేషణలు చేస్తుంటారు. అందుకు గల కారణాలను, పరిష్కారాలను సూచించాలని భావిస్తారు. అందుకోసం సత్యాన్వేషణ చేస్తారు. కాని కొందరు మాత్రమే ఆ సత్యానికి సమీపంలోకి వస్తారు. ఆ సమాజం దశ దిశను మార్చడానికి ఒక తాత్వికతను అందిస్తారు. అటువంటి వాళ్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు. భారతదేశ సామాజిక నేపథ్యానికి సరిపోయే సిద్ధాంతాన్ని, ఆచరణను, చట్టపరమైన శక్తిని అందించారు.

భారత దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకు బాబా సాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఎందుకు సరియైన సమాధానాన్ని అందించారు? ఇది అందరికీ రావాల్సిన ప్రశ్న. దానికి బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం, అనుభవాలు ప్రేరణ.

కుటుంబం, ఉపాధ్యాయుల రోజువారీ దిన చర్యలు, అందించిన చైతన్యం దానికి ఒక ఉత్ప్రేరకం. అంతేకాకుండా ఆయన అమెరికాలో అభ్యసించిన చదువు ఆయనను ఒక తాత్వికుడుగా మలిచాయి. ఆ తాత్వికత దాదాపు నలభై సంవత్సరాల రాజకీయ, సామాజిక జీవితంలో ఎన్నో సవాళ్లను, సంకటాలను అధిగమించి రెండు వేల సంవత్సరాల కుల వ్యవస్థ విషపు కోరలను పీకగలిగే సమరశక్తిని అందించాయి. బాల్యంలో, విద్యార్థి దశలో ఆయన అనుభవించిన కుల వివక్ష, అమానుషమైన అంటరానితనం ఒక అనుభవాన్ని అందించింది. కుల వివక్ష, అంటరానితనం, పుట్టుపూర్వోత్తరాలను శోధించే ఆలోచనను కలిగించాయి. దానికి కుటుంబంలో నిత్యం బోధించే కబీర్ తత్వాలు ఒక పునాదిగా ఏర్పరిచాయి. అనుభవం, ఆలోచనల నుంచి కులం గురించి అధ్యయనం చేయాలనే కాంక్షను రగిలించాయి. దానికి అమెరికా చదువు ఉపయోగపడింది. అందులో ముఖ్యంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గురువు ప్రముఖ విద్యావేత్త, జాన్ డ్యూయి ప్రతిపాదించిన ప్రజాస్వామ్య తత్వశాస్త్రం సిద్ధాంత బలాన్ని కలిగించింది. ఆ తర్వాత బాబా సాహెబ్ అంబేద్కర్ భారత దేశానికి తిరిగి వచ్చి ఆచరణ రూపకమైన కార్యాచరణను రూపొందించుకున్నారు. అది భారత దేశ రూపురేఖలను మార్చివేసింది.

భారతదేశ సమాజం ఆనాడు కులవివక్ష, అంటరానితనం చాలా దుర్మార్గంగా సమాజాన్ని పట్టిపీడిస్తున్నది. అందుకే ఆయన మొదట సామాజిక అన్వేషణ కులం పుట్టుకపైన సాగించారు. 1916లోనే కులం పుట్టుక పైన ఒక సిద్ధాంత వ్యాసాన్ని పరిశోధన పత్రంగా సమర్పించారు. అందులో కులం పుట్టుకకు ప్రధానమైన కారణం సమాజంలో చదువు, జ్ఞానం కలిగిన ఒక వర్గం తమ స్వార్థం, ఆధిపత్యం కోసం తమను తాము వేరుపరుచుకొని, తామే ఉన్నతులమని ప్రకటించుకోవడం వల్ల కులానికి బీజాలు పడ్డాయని, అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ఆ వర్గమే పూజారి వర్గం, ఆ తర్వాత బ్రాహ్మణులుగా తమకు తాము గిరి గీసుకొని తమ చుట్టూ కంచే వేసుకున్నారని, ఇది మిగతా తెగలకు ఒక నమూనాగా మారిందని కూడా అంబేద్కర్ తేల్చి చెప్పారు. అయితే కుల వ్యవస్థ హిందూ మతం బోధనలు, మత గ్రంథాల మీద ఆధారపడి ఉన్నదని, అంటరానితనం కూడా అందులో భాగమేనని అంబేద్కర్ వివరించారు.

ఈ పరిశోధన అనంతరం మరొక ఇరవై సంవత్సరాల తర్వాత కుల నిర్మూలన జరగకుండా భారత సమాజంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే భావనలకు స్థానం లేదని కూడా అంబేద్కర్ స్పష్టం చేశారు. కుల నిర్మూలన అంబేద్కర్ ప్రాథమిక లక్షం.

అయితే అందరి లాగా కుల సమస్య కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదని, ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైన సమస్యల కలయికగా చూడాలని కూడా అంబేద్కర్ ప్రకటించారు. అంబేద్కర్ 40 సంవత్సరాల రాజకీయ, అధ్యయన, పోరాట జీవితంలో ఈ విషయం మీదనే అధ్యయనం, ఆచరణ సాగించారు.

కులంలో ఆర్థిక దోపిడీ, సామాజిక అణచివేత, రాజకీయ ఆధిపత్యం కలగలిపి ఉన్నాయి. కులం పుట్టుకకు కారణమైన బ్రాహ్మణ వర్గం ఈ మూడు అంశాలను తమ గుప్పిట్లో పెట్టుకొని చాతుర్వర్ణంలోని క్షత్రియ, వైశ్య వర్ణాలను తనతో భాగస్వామ్యం కల్పించింది. అందువల్ల కులాధిపత్యంలో ఒకరికి ముగ్గురు తోడయ్యారు. అందువల్ల కుల సమస్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలుగా విస్తరించింది. అందువల్ల బాబా సాహెబ్ అంబేద్కర్ మూడు సమస్యలకు మూడు పరిష్కారాలను చెప్పారు.

మొదటిగా సామాజిక సమస్యలైన విద్య, ఉపాధి, ఉద్యోగాలకు అంటరాని కులాలకు, ఇతర వెనుకబడిన కులాలకు, ఆదివాసులకు ప్రత్యేక ఏర్పాట్లు జరగాలని, దానికి ఆయా రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించారు. దీని వల్ల ఇప్పటి వరకు విద్య, విజ్ఞాన రంగాల్లో వేళ్లూనుకునిపోయిన వర్గాలతో సమానంగా ఎదగడానికి ఉపయోగపడుతుందని భావించారు.

అదే విధంగా రాజకీయంగా ప్రాతినిధ్యం వహించడానికి ఆధిపత్య కులాలతోపాటు ప్రభుత్వ విధి విధానాలలో పాల్గొనడానికి, విధిగా అణగారిన వర్గాలకు ఓటు హక్కుతో పాటు రాజకీయ పదవులను అందుకోవడానికి రాజకీయ రిజర్వేషన్లు డిమాండ్ చేశారు. వీటితోపాటు ఆర్థికంగా, స్వశక్తిగా ఎదగడానికి ఆర్థిక సహాయంతోపాటు, దేశంలోని భూమిని, పరిశ్రమలను, ఆర్థిక సంస్థలైన బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను జాతీయం చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ అంశాలు మాత్రం రాజ్యాంగంలోకి రాకుండా ఆనాటి జాతీయ నాయకులంతా అడ్డుకున్నారు.

కుల వివక్ష, అంటరానితనం తొలగించడానికి కొన్ని రక్షణ చట్టాలను ప్రతిపాదించారు. ఇవన్నీ రాజ్యాంగంలోకి వచ్చాయి. బాబా సాహెబ్ అంబేద్కర్ తన అధ్యయనంతో కూడిన ప్రతిపాదనలన్నింటిని సాధించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అందులో కొన్నింటిని రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయత్నించి సఫలీకృతమయ్యారు. మరి కొన్ని విషయాలను ఆయన రాజ్యాంగంలోకి తీసుకు రాలేకపోయారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ లక్షం కులరహిత సమాజం. దానికి పైన పేర్కొన్న చర్యలు సాధనాలు మాత్రమే. రాజ్యాంగ రచన కూడా అందులో భాగమే. కేవలం రాజ్యాంగం మాత్రమే అంబేద్కర్ లక్షం కాదు.

బాబా సాహెబ్ అంబేద్కర్ లక్షం కుల నిర్మూలన అనే విషయాన్ని మనం ఇప్పటికే చెప్పుకున్నాం. పైన పేర్కొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులతో పాటు కులానికి మూల కారణమైన హిందూమతం తనను తాను సంస్కరించుకోవాలని ప్రతిపాదించారు. కులం, అంటరానితనం మనుగడకు హిందూ ధర్మశాస్త్రాలే కారణమని ఆయన బలమైన విశ్వాసం. ధర్మ శాస్త్రాలన్నింటా కులం, బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం ఇమిడి ఉన్నాయని, వాటిని తిరగరాయాలని, వివక్ష, అణచివేత, వెలివేత లాంటి అంశాలను ప్రతిపాదించే విషయాలను అందులో నుంచి తొలగించి ఒక ప్రత్యేకమైన గ్రంథం రూపొందించాలని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాకుండా హిందూమతంలో పూజారి వ్యవస్థను సంస్కరించాలని హిందువులలో అందరికీ పూజారి అయ్యే అవకాశం ఉండాలని, దానికి ప్రభుత్వం ఒక బోర్డును స్థాపించి, ఎవరైతే హిందూమతం విధానాలకు అర్హులవుతారో వారిని ప్రభుత్వమే నియమించాలని కూడా తన కుల నిర్మూలన పుస్తకంలో పేర్కొన్నారు.

ఇటువంటి విధానాలు మాత్రమే కులాన్ని నిర్మూలిస్తాయని పేర్కొన్నారు. అందువల్లనే బాబా సాహెబ్ అంబేద్కర్ సంస్కర్తగా కాకుండా విప్లవకారుడుగా నిలిచారు. కుల వివక్షపైన మహాత్మాగాంధీతో పాటు ఎంతో మంది వ్యాఖ్యానాలు చేశారు. కాని ఎవ్వరూ ఇటువంటి విప్లవాత్మకమైన పరిష్కారాన్ని చూపలేకపోయారు. బాబా సాహెబ్ అంబేద్కర్ తాత్కాలిక ఉపశమనాలతో పాటు సంపూర్ణంగా మార్చివేయగలిగే విప్లవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందువల్ల బాబా సాహెబ్ అంబేద్కర్ చాలా మంది సంస్కర్తలకు భిన్నంగా భారతదేశ దశ దిశ నిర్దేశకుడుగా, సామాజిక విప్లవకారుడుగా చరిత్రలో నిలిచిపోయారు. చరిత్రలో ఒకడిగా కాకుండా తానే ఒక చరిత్రగా నిలిచిపోయాడు.

మల్లేపల్లి లక్ష్మయ్య

దర్పణం

ఎందుకింత అసహనం?

మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ హిందూ దేవతలను అవమానించారని బిజెపి, దాని అనుబంధ భావజాలం కలిగిన కొందరు నానారభస చేస్తున్నారు. ఈ మధ్య హిందూమతం మీద కానీ, దేవీదేవతల మీద కానీ ఎవరేం మాట్లాడినా వీళ్లు వెంటపడుతున్నారు. ఆ మాట్లాడిన దానితో సంబం ధం లేకుండానే వీళ్ల మనోభావాలు దెబ్బతినడం మనదేశంలో మాత్రమే కనిపించే ఎనిమిదవ వింత. మనోభావాలు అంటే ఏమిటో, అవి ఎలా ఉంటాయో వీళ్ళయినా పాపం ప్రజలకు ఏనాడూ చెప్పిన పాపాన పోలేదు. ప్రజలకెవరికీ లేని, రాని మనోభావాల గొడవ సదరు గుంపు వారికే కలగటం వారికి రాజకీయంగా సంక్రమించిన హక్కు కావొచ్చు. ముఖ్యమంత్రి మాటల దగ్గరకి వస్తే -ఆయన హిందూమతం లోని బహు దేవతారాధనను ప్రస్తావించారు. ఎవరికినచ్చిన దేవుణ్ణి వారు మొక్కుతారు అన్నట్టు మాట్లాడారు.

ఎవరి మనస్తత్వానికి దగ్గరగా వుండే దేవుడిని వారు మొక్కుతారని అన్నారు. ఇదంతా ఆయన కేవలం దైవసంబంధమైన చర్చలో భాగంగా మాట్లాడింది కాదు. ఆనాటి సభలో కాంగ్రెస్ పార్టీలో గల స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ, పార్టీలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారని చెప్పి, దానికి సమర్థనగా మాత్రమే ఈ ప్రస్తావన తెచ్చారు. ఆయన ఉద్దేశంలో తప్పు లేదు. ఆయన మాటల్లో కూడా తప్పులేదు. దేవతలను కించపరచటం అన్న సమస్యే అందులో లేదు. కానీ ఈ రభస చేస్తున్న వాళ్లకు మాత్రం అందులో తప్పు కనిపించింది. ఇదే గమ్మత్తు. మొన్న నాకు దేవుని మీద నమ్మకం లేదన్న పాపానికి దర్శకుడు రాజమౌళిని ఇలాగే ఇబ్బందిపెట్టారు. ముఖ్యమంత్రి దేవుళ్లను విశ్వసించని వ్యక్తి కూడా కాదు. ఆయన కూడా హిందువే కదా! ఫలానా పార్టీలో ఉన్న హిందువులు మాత్రమే నిజమైన హిందువులుగా, మిగిలిన వారు కానట్టుగా, వాళ్లకు మతం మీద కానీ, దేవుళ్ళ మీద కానీ మాట్లాడే హక్కు లేదన్నట్టుగా ఉంది వీళ్ల ప్రవర్తన. ఆలయాల్లోకి తోటి హిందువులైన దళితులను అనుమతించకుండా అవమానిస్తుంటే దాని మీద స్పందించకుండా మౌనవ్రతాన్ని పాటించే ఈ అపర భక్తశిఖామణులు ఇట్లాంటి అనవసర రాద్ధాంతాలు దేవుళ్ల పేరుతో చేయటంలోని ఆంతర్యం ఏమిటో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వీళ్లకు మతం మీద రాజకీయాలు చేయటం తప్ప ప్రజల కష్టనష్టాలు పట్టవు. సదరు వ్యక్తులు తమ రాజకీయ జీవితంలో ప్రజలకోసం కనీసం ఒక్క శాతమైనా సమయాన్ని కేటాయించారో లేదో తెలియదు.

కానీ తొంభై తొమ్మిది శాతం మాత్రం ఈ మత రాజకీయాలకే కేటాయిస్తారు. అయితే హిందూమతం మీద గుత్తాధిపత్యం ఉన్నట్లుగా మాట్లాడే వీళ్లకు ఆ మతం తాలూకు చరిత్ర, దాని లోతులు గానీ తెలియవు. తెలిసే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల కోసం వాడుకోవడం తప్ప మతాన్ని అధ్యయనం చేసి దాని సారాన్ని ప్రజలకు తెలియజేయాలనే సంకల్పం ఉన్నవాళ్లు కాదు. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామంచంద్రా’ అని ఆవేదనతో భక్త రామదాసు పలికిన మాటల్లో భక్తి లేదా? నిష్కల్మషమైన భక్తితో తిన్నడు శివునికి మాంసం నైవేద్యంగా సమర్పించటాన్ని ఎవరైనా దోషంగా చూడగలరా? ఇట్లాంటి ఉదంతాలు హిందూమతంలో కుప్పలుగా దొరుకుతాయి.

భక్తికి సంబంధించి ప్రాచీన కాలం నుంచి ఎవరి మార్గం వారికుంది. భాగవతంలో ప్రస్తావనకు వచ్చిన నవవిధ భక్తిమార్గాలకు తోడుగా అనేక మార్గాలు దేవుడనే భావనచుట్టూ రూపొందాయి. దేవుడికి, భక్తునికి మధ్య ఇలాంటివాళ్ల జోక్యం ఎందుకో మరి? మొన్నటికి మొన్న గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారక్కల్ని అవమానిస్తూ వాళ్ళసలు దేవుల్లే కాదన్నాడు చినజీయర్ స్వామి. ఇప్పుడు నానాయాగి చేస్తున్న ఈ గుంపులోని వారు ఒక్కరూ నోరెత్తలేదు. షిరిడి సాయిబాబా మీద ఒక వర్గం వారు కించపరుస్తూ మాట్లాడినప్పుడు వీళ్ల మనోభావాలు దెబ్బతినలదు. కోట్లాది హిందువులు అటు సమ్మక్క సారక్కలను, ఇటు సాయిని కొలుస్తున్న సంగతి వీళ్లకు తెలియదా? మతం మీద శ్రద్ధ వల్లనో, దేవుని పట్ల భక్తి చేతనో వీళ్ళు రోడ్లెక్కటం లేదు. కేవలం రాజకీయాలలో భాగంగానే మతాన్ని, దేవుళ్లను పావులుగా వాడుకుంటున్నారు. మతానికి మేమే రక్షకులం అన్నట్టు వీళ్లకు వీళ్ళే కితాబిచ్చుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో మతం కానీ, దేవుళ్ళు కానీ వారి స్వంత ఆస్తి. అందుకే దేవతల ప్రస్తావన ఎవరు తెచ్చినా అందులో ఉన్న సమాచారంతో సంబంధం లేకుండా వారి మీద అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి సాధారణ ప్రజల మద్దతు ఉన్నదనే భ్రమల్లో వాళ్ళున్నారు. పాపం వాళ్ళది భ్రమ అన్న సంగతి వాళ్లకు ఎప్పుడర్థమవుతుందో?

తోకల రాజేశం

96767 61415