xmtradingxmtradingxmtradingxmtradingsonbahis girişsonbahissonbahis güncelsweet bonanza oynasweet bonanza oynaaresbetaresbet girişkulisbetkulisbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişcasinoroyalcasinoroyal girişenbetenbet girişhilbethilbet girişhiltonbethiltonbet girişyakabetyakabet girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişaresbetaresbet girişkulisbetkulisbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişcasinoroyalcasinoroyal girişenbetenbet girişhilbethilbet girişhiltonbethiltonbet girişyakabetyakabet girişmeritkingmeritking girişmeritking güncel girişmeritkingkulisbetcasibomcasibom girişcasibom güncel girişXMTradingkulisbetkulisbet girişaresbetaresbet girişhiltonbethiltonbet giriştrendbettrendbet girişhilbethilbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişmedusabahismedusabahis girişmedusabahisbetboxbetbox girişbetboxroketbetroketbet girişroketbetefesbetefesbet girişefesbetbetparibubetparibu girişbetparibuikimisliikimisli girişikimislinesinecasinonesinecasino girişnesinecasinoaresbetaresbet girişkulisbetkulisbet girişhiltonbethiltonbet giriştrendbettrendbet girişhilbethilbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişaresbetaresbet girişkulisbetkulisbet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet girişmedusabahismedusabahis girişteosbetteosbet girişmedusabahismedusabahis girişteosbetteosbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişikimisliikimisli girişikimisliikimisli girişaresbetaresbet girişaresbetaresbet girişhiltonbet girişhiltonbethiltonbetteosbet girişteosbetteosbetcasinoroyal girişcasinoroyalcasinoroyalmedusabahis girişmedusabahismedusabahisloyalbahis girişloyalbahisloyalbahisatlasbet girişatlasbetatlasbetenbet girişenbetenbetsüratbet girişsüratbetsüratbethayalbahis girişhayalbahishayalbahistrendbettrendbet girişhiltonbethiltonbet girişkulisbetkulisbet girişaresbetaresbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet girişgalabetmasterbettingbetkolikrinabetyakabetyakabetrinabetroyalbetprizmabetyakabetmasterbettingkulisbetkulisbetmasterbettingyakabetprizmabetroyalbetrinabetyakabetyakabetrinabetbetkolikmasterbettinggalabetcasino sitelericasino siteleri

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

bets10

jojobet

marsbahis güncel

betpipo

casinolevant

cratosroyalbet

mavibet

betasus

escort sakarya

Casibom

cratosroyalbet giriş

cratosroyalbet

betgaranti giriş

bahis ve casino siteleri

betpark 2026

casinolevant

casinolevant

piabellacasino

cratosroyalbet giriş

piabellacasino

piabellacasino

cratosroyalbet giriş

cratosroyalbet giriş

trabzon escort

deneme bonusu

cratosroyalbet

xnxx

porn

hit botu

Hiltonbet

pusulabet

pusulabet giriş

piabellacasino

Streameast

jojobet

casinolevant

jojobet giriş

matbet

casibom giriş

holiganbet

holiganbet

holiganbet

holiganbet giriş

holiganbet giriş

Pusulabet Güncel Giriş

holiganbet

Jojobet

artemisbet

Jojobet

casibom giriş

Jojobet giriş

holiganbet

bettilt

gaziosmanpaşa escort

bettilt

Pusulabet

holiganbet

artemisbet

holiganbet

Meritking

Pusulabet

Galabet Giriş

Matbet Giriş

casibom

jojobet

casibom

jojobet

holiganbet

kavbet

holiganbet

betsmove

Casibom Giriş

jojobet giriş

Hacklink satın al

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

padişahbet

casibom

matbet

Holiganbet giriş

Holiganbet

restbet

betebet

casinowon

wbahis

Galabet

Ultrabet

setrabet

aresbet

kulisbet

trendbet

hiltonbet

hilbet

atlasbet

teosbet

winxbet

suratbet

yakabet

medusabahis

Pusulabet

Pusulabet Giriş

casibom

jojobet

padişahbet

Pusulabet

Pusulabet Giriş

kavbet

padişahbet

vegabet

ultrabet

grandpashabet

casibom güncel giriş

casibom

galabet

meritking

sekabet

grandpashabet

grandpashabet

holiganbet

meritking giriş

maksibet

deneme bonusu veren siteler 2026

deneme bonusu veren yeni siteler

anadoluslot

nakitbahis

nakitbahis giriş

nakitbahis

nakitbahis giriş

casibom

marsbahis

betpas

sekabet giriş

kingroyal

dinamobet giriş

interbahis

jojobet 1124

betsat güncel giriş

bahsegel

meritking

1xbet

süratbet

jojobet

izmir escort

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది: రేవంత్

హైదరాబాద్: అన్ని జిల్లా కలెక్టరేటర్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగడం ఆనందంగా ఉందని అన్నారు. రూ.5.8 కోట్లతో 33 కలెక్టరేటర్లలో ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి వర్చువల్ గా రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రారంభించారు. మొత్తం 18 అడుగుల ఎత్తుతో తెలంగాణ తల్లి విగ్రహాల నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణ తల్లిని తలచుకుని పనులు మొదలుపెట్టేందుకే విగ్రహాల ఆవిష్కరణ చేశామని, 2009 లో ఇదే రోజు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని తెలియజేశారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని, ఎన్నో అడ్డంకులు అధిగమించి మరీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని అన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది: రేవంత్

హైదరాబాద్: అన్ని జిల్లా కలెక్టరేటర్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగడం ఆనందంగా ఉందని అన్నారు. రూ.5.8 కోట్లతో 33 కలెక్టరేటర్లలో ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి వర్చువల్ గా రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రారంభించారు. మొత్తం 18 అడుగుల ఎత్తుతో తెలంగాణ తల్లి విగ్రహాల నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణ తల్లిని తలచుకుని పనులు మొదలుపెట్టేందుకే విగ్రహాల ఆవిష్కరణ చేశామని, 2009 లో ఇదే రోజు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని తెలియజేశారు. ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని, ఎన్నో అడ్డంకులు అధిగమించి మరీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని అన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు: కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి డిసెంబర్ 9న తొలి అడుగుపడిందని బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ పేర్కొన్నారు. మాజీ సిఎం కెసిఆర్ రాష్ట్ర ఏర్పాటు కోసం కెసిఆర్ 2009, నవంబర్ 29న నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆ రోజున బిఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివస్‌ను జరుపుకుంటున్నారు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారం తెలిపి.. కెసిఆర్ దీక్ష విరమించింది.. 2009, డిసెంబర్ 9వ తేదీన. ఈ రోజున విజయ్ దివస్‌ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

‘‘తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్). సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కెసిఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29 (దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9 (విజయ్ దివస్) లేదు… డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. జై తెలంగాణ’’ అంటూ ఎక్స్‌లో కెటిఆర్ పేర్కొన్నారు.

విజయ్ బహిరంగ సభ.. తుపాకీతో చొరబాటుకు యత్నించిన వ్యక్తి

చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీల ఎన్నికల్లో తన పార్టీ తమిళగ వెట్రి కళగం పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా విజయ్ నిర్వహించిన ఓ బహిరంగ సభలోకి ఓ వ్యక్తి తుపాకీతో వచ్చేందుకు యత్నించాడు. పుదుచ్చేరిలో నిర్వహించిన టివికె సదస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. తుపాకీతో సదరు వ్యక్తి వేదిక వైపునకు దూసుకొచ్చాడు. ఇది గమనించిన భద్రతా అయితే సిబ్బంది అతడిని నిలువరించి.. అదుపులోకి తీసుకున్నారు. గతంలో కరూర్‌లో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 40 మందికిపైగా మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత విజయ్ చాలాకాలం తర్వాత విజయ్ మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు. 

నిర్లక్షం నిప్పు.. ఎవరిది తప్పు?

గోవా క్లబ్‌లో ఆదివారం (7.12.2025) అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వరకు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు ఎలా జరిగాయో బట్టబయలు చేసింది. ఈ ప్రమాదానికి దారితీసిన భద్రతా వైఫల్యాల్లో బాధ్యులైన వారందరూ “తిలాపాపం తలా పిడికెడు” అన్న చందంగా వ్యవహరించారు. బూడిద కుప్పల సాక్షంగా పాతిక ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మృతుల్లో 20 మంది నైట్‌క్లబ్ సిబ్బందే. వీరంతా వలస కార్మికులు, వీరిలో నలుగురు నేపాల్, ఐదుగురు ఉత్తరాఖండ్ నుంచి, జార్ఖండ్, అసోం నుంచి ముగ్గురేసి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరేసి, పశ్చిమబెంగాల్ నుంచి ఒకరు వచ్చారు. వీరితోపాటు ఐదుగురు టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. టూరిస్టుల్లో ఢిల్లీకి చెందిన ఒకే కుటుంబం లోని ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షలు వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం ఆనవాయితీగా జరిగింది. అంతటితో ఈ ప్రమాదాలకు ముగింపు పలికినట్టు కాదు.

ఇది దేశం మొత్తం మీద భద్రతా ప్రమాణాలపై నేరపూరిత నిర్లక్షం మళ్లీ వెలుగు లోకి తెచ్చింది. ఈ ప్రమాదానికి దారి తీసిన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు మీవల్ల కాదు మీవల్లనే అంటూ గ్రామ పంచాయితీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అధికారుల పరస్పర నిందారోపణలు స్వైర విహారం చేస్తున్నాయి. గోవా అర్పోరా వద్ద బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్ ఏర్పాటైన స్థలమే పర్యావరణ పరిరక్షణ జోన్‌లో ఉంది. గోవా చట్టం ప్రకారం ఈ స్థలాన్ని వ్యవసాయేతర సంస్థలకు వినియోగించరాదు. ఈ స్థలాన్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రమాణాలను పట్టించుకోకుండా బగానది నుంచి వెలువడిన నిల్వనీటిపై అంటే నీటికయ్యపై ఈ క్లబ్‌ను నిర్మించారు. సాధారణంగా ఈ ఉప్పునీటి కయ్యల్లో రొయ్యలు సాగు చేస్తుంటారు. ఈ క్లబ్ నుంచి మెయిన్ రోడ్డుకు అనుసంధానంగా సన్నని ఇరుకు రోడ్డు నిర్మించారు. ఈ క్లబ్ చిన్న నీటి కొలనుకు విభజనగా నిర్మాణమైంది. ఒకవైపు చిన్న నీటి కొలను ఉండగా, మరోపక్క బగానది ఆనుకుని ఉంది.

భవన భద్రతా నిబంధనలకు విరుద్ధంగా ఈ క్లబ్‌ను నిర్మించారని పంచాయతీ అధికారులు భవనం కూలగొట్టడానికి సిద్ధం కాగా, రాష్ట్ర పంచాయతీ రాజ్ అధికారులు అడ్డుకున్నారని అర్పోరా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రోషన్ రేడ్కర్ ఆరోపించారు. అయితే ఎంఎల్‌ఎ మైకేల్ లోబో పంచాయతీ అబద్ధాలు చెబుతోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెస్టారెంట్ నడపడానికే అనుమతి ఇవ్వగా, గ్రామ పంచాయతీ రెస్టారెంట్‌కు, నైట్‌క్లబ్‌కు కూడా అనుమతించిందని ఆరోపించారు. నైట్‌క్లబ్‌కు అనుమతి ఇవ్వాల్సింది ఎక్సైజ్ డిపార్టుమెంటే తప్ప పంచాయతీ బాధ్యత కాదని వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల నాటి ఈ క్లబ్‌కు తాజాగా 2023లో గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చింది. గత ఇరవై ఏళ్లలో ఈ క్లబ్ యాజమాన్యం అనేక చేతులు మారింది. ఆదివారం రాత్రి క్లబ్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోకుండా పైరోగన్‌లు, బాణాసంచా కాల్పుల ప్రదర్శన నిర్వహించారు. దీనికి తోడు కొబ్బరి ఆకులతో తాత్కాలిక షెడ్ నిర్మించడం, మండే వస్తువులు ప్లాస్టిక్, ఫైబర్, ఫోమ్ ప్యాకేజింగ్ వంటి అలంకరణలు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి.

క్లబ్ ప్రవేశమార్గం చాలా సన్నగా, ఇరుగ్గా ఉండడంతో అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లడానికి వీలు కలగక, 400 మీటర్ల దూరంలోనే అవి ఉండిపోవలసి వచ్చింది. క్లబ్‌కు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు లేవు. ప్రమాద సమయంలో ఫస్ట్‌ఫ్లోర్‌లో డాన్స్ ఏరియాలో 100 మంది వరకు ఉన్నారు.కమ్ముకున్న పొగ వల్ల చాలామంది ఊపిరాడక పోవడం వల్లనే చనిపోయారని తేలింది.2023లో ఈ క్లబ్ నిర్వహణకు వీలు కల్పించిన బాధ్యులైన ముగ్గురు అధికారులను ఆదివారం రాత్రి సస్పెండ్ చేశారు. క్లబ్ యజమానులు ఇంకా పట్టుబడలేదు. ప్రమాదంపై దర్యాప్తునకు సిఎం ప్రమోద్ సావంత్ ముగ్గురు అధికారులలతో కమిటీ వేశారు. ఈ కమిటీ వారం లోగా దర్యాప్తు నివేదిక సమర్పించవలసి ఉంది. ఈ ప్రమాదం మళ్లీ దేశం మొత్తం మీద అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారో సమగ్రంగా సమీక్ష జరగవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

గత ఏడాది రాజ్‌కోట గేమింగ్ జోన్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంనుంచి ఇటీవల అక్టోబర్‌లో జైపూర్ సవాయి మాన్‌సింగ్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం వరకు సమీక్షించవలసిన అవసరం కనిపిస్తోంది. భద్రతా ప్రమాణాలపై నిర్లక్షం నిప్పు ఈ ప్రమాదాలకు దారితీస్తోందని సర్వసాధారణంగా తెలిసిన విషయమే. నోయిడా అధికార యంత్రాంగం గత ఏడాది 131 సొసైటీలు సరైన అగ్ని ప్రమాద భద్రతా ప్రమాణాల లోపంతో ఉన్నాయని గుర్తించింది. మంటలను ఆర్పే సామర్ధం, సాంకేతిక సౌకర్యాలు దేశం లోని ఫైర్ స్టేషన్లలో 96 శాతం లోపించాయని ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించడం గమనార్హం. కొన్ని ఫైర్ స్టేషన్లు కాలం చెల్లిన పరికరాలతో అల్లాడుతున్నాయి. వీటి నిర్వహణలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అగ్నిమాపక శకటాల్లో చాలా వాటికి ఇంధనం నింపేందుకు తగిన ఆర్థిక వనరులు కూడా లేకపోవడం పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తుంది. భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన వారెంతవారైనా సరే కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవడం ప్రారంభమైతేనే కొంతవరకైనా ప్రమాదాలను నివారించిన వారవుతారు. ఈ విషయంలో ప్రభుత్వాలు మేల్కోడానికి మరెన్ని విషాద సంఘటనలు చోటు చేసుకోవాలి ? 

అక్రమ బహిష్కరణలు ఆగేదెన్నడు?

బంగ్లాదేశ్‌లో ఆరు నెలల నిర్బంధం తర్వాత 25 ఏళ్ల సునాలి ఖాతుర్ మాల్టాలోకి అడుగుపెట్టింది. ఇది కొంత ఉపశమనం కలిగించినా, సామూహిక అవమానంగా భావించి ఉండాలి. ఆమె అక్రమ వలసదారు కాదు, చొరబాటుదారు కాదు. వీసా గడువు ముగిసినా మన దేశంలో ఉంటున్న విదేశీ పౌరురాలు కాదు. అమె పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్త్రీ, గర్భిణి. చిన్న కొడుకుతో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి న్యాయపరమైన అనుమతి లేకుండా భారతీయ అధికారులు బలవంతంగా అంతర్జాతీయ సరిహద్దులను దాటించారు. న్యాయవాదులు, వలసహక్కు సంఘాల జోక్యం, ఆమె కేసు కోర్టు ముందుకు తెచ్చేందుకు చేసిన యత్నాల పుణ్యమా అని ఆమె తిరిగి రావడం సాధ్యమైంది. దీనిపై ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టాల గురించి అస్పష్ట సూచనలు తప్ప ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆ సూచనలు కూడా సరైన ప్రక్రియ లేకుండా భారతీయ పౌరులను మరో దేశానికి నెట్టివేయడాన్ని ఏమాత్రం సమర్థించవు. సునాలీకి ఎదురైన కఠిన పరీక్ష చిత్రం ఏమీ కాదు. అసోం, చుట్టుపక్కల జిల్లాలనుంచి వచ్చిన పేద బెంగాలే మాట్లాడే ముస్లింలను అనుమానిత అక్రమ వలసదారులుగా ముద్రవేసి, చట్టబద్ధమైన బహిష్కరణలకు బదులుగా రహస్యంగా బహిష్కరణ మాదిరిగా సరిహద్దుల నుంచి నెట్టివేయబడుతున్న ఎన్నో కేసులలో ఇది ఒకటి. కేసు తర్వాత.. బంగ్లాదేశ్ ఈ వ్యక్తులను తమ పౌరులుగా అంగీకరించేందుకు నిరాకరించడం, వారు బంగ్లాదేశ్ జాతీయులు కాదని నొక్కి చెప్పి భారతదేశానికి తిరిగి పంపడం మామూలయింది.

పదేపదే ఇలా పలువురు తిరిగి రావడం పలు ప్రశ్నలకు దారితీస్తున్నది. బంగ్లాదేశ్ వారిని కోరుకోకపోతే, భారతదేశం వారిని గుర్తించడానికి నిరాకరిస్తే, వారి చట్టబద్ధమైన, మానవ పరమైన హోదా ఏమిటి? ఏ ప్రభుత్వం తమ సొంత పౌరులను భౌతికంగా తొలగించి, వదిలి వేయాల్సినంతగా భారంగా భావిస్తుంది. 2025 మే లో అసోంకు చెందిన ఇద్దరు మహిళలు -సోనా భాను, రహిమా బేగం- ను వారి ఇళ్లనుంచి తీసుకెళ్లి మిలిటరీ జోన్ మీదుగా తరలించి, భారతదేశం బంగ్లాదేశ్ మధ్య ఉన్న నో మ్యాన్ లాండ్ -నిర్జన ప్రదేశంలో వదిలి వేశారు. వారికి తిండిలేదు. నిలువ నీడలేకుండా కొన్నిరోజుల తరబడి బయటపడ్డారు. బంగ్లాదేశ్ అధికారులను వారిని తిరిగి తీసుకువచ్చి సరిహద్దు గార్డులకు అప్పగిస్తే, వారి నుంచి వేధింపులు భరించాల్సి వచ్చింది. అదే సమయంలో మాజీ పాఠశాల టీచర్ బైరుల్ ఇస్లాంను సుప్రీం కోర్టులో అప్పీలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌కు బలవంతంగా తరలించారు. చాలా కాలం క్రితం డి- ఓటరుగా గుర్తించబడిన హజేరా ఖాతున్ అనే వృద్ధ మహిళను ఇదే విధంగా బహిష్కరించారు. బంగ్లాదేశ్ ఆమెను తమ దేశంలో చేర్చుకోవడానికి నిరాకరించే వరకూ ఆమె తనను తాను రక్షించుకుంటూ బతకాల్సివచ్చింది.

ఇవి చట్టపరమైన బహిష్కరణలు కావు. అవి భారత చట్టం ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లు, విచారమలు, పర్యవేక్షణ లేకుండా చేసిన బహిష్కరణ చర్యలు. వారు తగిన సాక్ష్యాలు లేకుండా సామాజిక పరమైన కమ్యూనిటీలపై కేవలం అనుమానంతో ఈ చర్యలకు దిగారు. అసోం సంక్లిష్ట వలస చరిత్ర చాలా కాలంగా రాజకీయ పరంగా రూపుదిద్దుకున్నది. ఈ మధ్య కొద్ది కాలంగా అక్రమ వలసపై పాలనాపరమైన ధ్రువీకరణ మరింత దూకుడుగా, నిర్ణయాత్మకంగా మారుతున్నట్లు కన్పిస్తోంది. చట్టపరమైన ప్రక్రియను కానీ, పేదల వాస్తవిక జీవితాలను కానీ అంతగా పట్టించుకోవడం లేదు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం, వలసదారుల (అసోం నుంచి బహిష్కరణ) చట్టం 1950 కింద వందలాది మంది సరైన పత్రాలులేని వ్యక్తులను వెనక్కి నేట్టివేసిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకుంటోంది. ఇలాంటి ప్రకటనలు రాజకీయంగా నియోజకవర్గాల్లో బాగా పనిచేస్తాయి. కానీ, ఏకపక్ష బహిష్కరణలు చట్టబద్ధంగా అసాధ్యం అన్న అంశాన్ని మరుగుపరుస్తాయి.

భారతదేశం – బంగ్లాదేశ్ మధ్య పరస్పరం వ్యక్తులను స్వదేశాలకు పంపించే ఒప్పందం లేదు. బహిష్కణకు స్పష్టమైన డాక్యుమెంట్‌లు, రుజువులు, వారిని స్వీకరించే దేశం అంగీకారం చాలా అవసరం. ఇవి లేకుండా నెట్టివేతలు నాటకాల వంటివే. దీనివల్ల తలెత్తే పరిణామాలు ప్రభుత్వాలకన్నా, ఆ పౌరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జీవితాలే తల్లకిందులైపోతాయి. నెట్టివేతకు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులు.. పేదవారై ఉంటారు. వారి చదువు అంతంత మాత్రమే. ఎక్కువ నిరక్షరాస్యులై ఉంటారు. అక్రమ వలస విషయంలో ఎలాంటి చిక్కులు ఎదురైనా, తమను తాము రక్షించుకునే సామర్థ్యం కూడా వారికి తక్కువే ఉంటుంది. రాజకీయపరంగా వాయిస్ లేని వారి వలసలకు, భాషా, -మతపరమైన మైనారిటీలకు మధ్య ఉండే తేడా తక్కువ. బెంగాలీ మాట్లాడే వారిని ఇప్పటికీ అనుమానితులు గానే చూస్తారు. ఒకప్పుడు రాజ్యాంగ పరమైన హామీగా ఉన్న పౌరసత్వం, కొన్ని కమ్యూనిటీల విషయంలో తాత్కాలిక హోదా మాదిరిగా ఉంది. ఇది డాక్యుమెంటేషన్ పై కాకుండా రాజకీయాలపై ఆధారపడి ఉంటోంది.

సునాలీ కేసు ఈ లోపాలను స్పష్టం చేస్తోంది. ఆమె కుటుంబానికి ఓటర్ల కార్డులు, రికార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయి. కుటుంబానికి పశ్చిమబెంగాల్, అసోం రెండు రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయి. ఇంతవరకూ ఆమెకు అనుకూలంగా తీర్పురాలేదు. అయినా, ఆమెను, ఆమె భర్త, ఇద్దరు పిల్లలనుంచి వేరు చేసి తీసుకెళ్లారు. గర్భిణి అయి కడుపులో బిడ్డను మోస్తున్న సమయంలో ఆమెను సరిహద్దులు దాటించి పంపివేశారు. ఆమె, చిన్నకొడుకు అర్థం చేసుకోలేని కష్టాల చిక్కుకుని, అతని కుటుంబం చట్టపరమైన సహాయం కోసం ఇబ్బంది పడుతుండగా, నెలల పాటు విదేశీ గడ్డపై బతకాల్సి వచ్చింది. ఆమె వివరాలు పరిశీలించిన తర్వాత, బంగ్లాదేశ్ అధికారులు ఆమె బంగ్లా జాతీయురాలు కాదని నిర్ధారించి. ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. సునాలీ విషయంలో ఆమె పౌరసత్వం ఉన్న దేశం కంటే నెట్టివేయబడిన పొరుగు దేశం ఆమెకు తగిన ప్రక్రియకు కట్టుబడి ఉండడం విశేషం.

తీవ్ర ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అధికారుల ఓవర్ యాక్షన్ మాత్రమే కాదు, దేశం లో చట్టాలను గౌరవించకపోవడం. ప్రభుత్వ అధికారులు న్యాయవ్యవస్థను అతిక్రమించడం, రాజ్యాంగం కల్పించిన రక్షణలను ఇబ్బందికరంగా పరిగణించిన పక్షం అసలు పౌరసత్వం వ్యవస్థే దుర్బలంగా తయారవుతుంది. అనేక సందర్భాల్లో, కోర్టులు జోక్యం చేసుకుని సంజాయిషీ కోరడంతోపాటు, బహిష్కరణలను ఆపాయి. తప్పిపోయిన వ్యక్తులుగా ప్రకటించిన వారిని వెతికి పట్టుకుని హాజరుపరచాలని ప్రభుత్వాలను ఆదేశించాయి. న్యాయవ్యవస్థ జోక్యం, ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుంది. ఈలోగా బాధితులు నెలల తరబడి వేదన అనుభవిస్తారు. ప్రజాస్వామ్య గణతంత్రం లో ఏ పౌరుడూ ఎదుర్కోకూడని పరిస్థితులు అనుభవిస్తాడు. ఆ తర్వాత అందే న్యాయం వల్ల ఏం లాభం. మనదేశంలో కోర్టులు, లాయర్ల ఫీజులు ఖరీదైనవి, చాలా కుటుంబాలకు కేసులు ఏళ్ల తరబడి కొనసాగించే అవకాశాలు లేవు, అలాంటి వారు తక్కువే. రాజకీయ పరమైన చిక్కులు చాలా విస్తృతంగా ఉంటాయి మతం, భాష, సామాజిక ఆర్థిక స్థితి ఆధారంగా పౌరసత్వాన్ని తలగించడం చేస్తే, అది గందరగోళానికి దారితీస్తుంది. కొందరు పౌరుల విషయంలో వివక్షకు దారితీస్తుంది.

అది సాంకేతిక పరమైన, లేదా పాలనా పరమైన సమస్య కాదు, గణతంత్ర దృక్పథంలోనే మార్పునకు దారితీస్తుంది. స్వాతంత్య్రం అంతరం భారత రాజ్యాంగం విలువలపై ఆధారపడిన సమ్మిళిత వర్గంగా పౌరసత్వాన్ని పరిగణించాలని ఆకాంక్షించింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, పౌరసత్వాన్ని అప్పుడప్పుడు చట్టవిరుద్ధ బలవంతం ద్వారా బహిష్కరణలకు సాధనంగా మార్చే ప్రమాదం ఉంది. ముందుకు సాగాలంటే, చట్టవిరుద్ధమైన బహిష్కరణలు వెంటనే నిలిపివేయాలి. ప్రభుత్వం ఎంతమంది ఇలాంటి ఇబ్బందులకు గురయ్యారో బహిర్గతం చేయాలి. ప్రతి కేసుకు చట్టపరమైన ఆధారం అందించాలి. విదేశీయుల ట్రిబ్యునళ్లకు నిర్మణాత్మక సంస్కరణలు, న్యాయపరమైన పర్యవేక్షణ అవసరం. పేదలకు పౌరహక్కు కోల్పోకుండా చట్టపరమైన సహాయాన్ని విస్తృతం చేయాలి. అన్నిటికంటే ముఖ్యం ఒక వర్గం పౌరులను శాశ్వత అనుమానితులుగా భావిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది. మత పరమైన అంతరాలను తీవ్రతరం చేస్తుందని రాజకీయ నాయకులు గుర్తించాలి. సునాలి ఖాతున్, ఇతరుల పునరాగమన ఉదంతం కోర్టులు, పౌర సమాజం, సాధారణ పౌరులు అన్యాయాన్ని తిప్పికొట్టగలరని రుజువు చేసింది. సరిహద్దులను దాటడం భౌగోళికం మాత్రమే కాదు ఓ హెచ్చరిక కూడా. గణతంత్ర రాజ్యం ఈ హద్దును మరచిపోకూడదు.  

– గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్)

(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయాల అంశాల విశ్లేషకుడు)

నెలసరి సమస్యలపై గురిపెట్టి..!

వైద్య విద్యార్థినిగా ఉన్నప్పుడే కుటుంబం నిర్వహిస్తున్న “కడియం ఫౌండేషన్‌” ద్వారా పాఠశాల విద్య మానేసే బాలికల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గమనించారు. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యురాలిగా పనిచేసేటప్పుడు, మహిళలు తమ నెలసరి చక్రం సమయంలో శుభ్రత పాటించే విధానంపై అవగాహన పెంచారు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు నెలసరి సమయంలో అవసరమైన ప్యాడ్లను ఉచితంగా అందించే పథకానికి పునాది వేసారు. అదే ధోరణి కొనసాగిస్తూ, ప్రస్తుత లోక్‌సభ సభ్యురాలిగా మహిళలు, ముఖ్యంగా ఉద్యోగిణులు పనిచేసే స్థలాల్లో అవసరమైన సౌకర్యాలపై చట్టసభను కదిలించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య. 2025 డిసెంబర్ 5న, వరంగల్ నుంచి కాంగ్రెస్ ఎంపిగా ఉన్న డాక్టర్ కడియం కావ్య ఒకే సమావేశంలో రెండు ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టిన తొలి తెలంగాణ మహిళగా నిలిచారు. వీటిలో ఒకటైన మెన్‌స్ట్రువల్ బెనిఫిట్స్ బిల్ -2024, మహిళల నెలసరి ఆరోగ్యం పట్ల చట్టబద్ధత కల్పించడానికి చేసిన ధైర్యవంతమైన అడుగు. ఈ బిల్లులో ప్రభుత్వం, ప్రైవేటు రంగాలతోపాటు అన్ని కార్యాలయాల్లో సురక్షిత, శుభ్రమైన టాయిలెట్స్ తగిన ఆరోగ్య వసూలు కల్పించే విధంగా, ఉచిత/ రాయితీ ధరల ద్వారా శానిటరీ నాప్కిన్స్‌ను అందించాలని, అలాగే నెలకు రెండు రోజుల చెల్లింపులతో కూడిన విశ్రాంతి ఇవ్వాలని ఎంపి డా. కడియం కావ్య ప్రతిపాదించారు.

మహిళల్లో తీవ్రమైన నెలసరి నొప్పి హార్ట్ అటాక్ నొప్పికీ సమానమనే యూనివర్శిటీ కాలేజ్ లండన్ పరిశోధనను ఎంపి డాక్టర్ కావ్య ఆధారంగా చూపించారు. ఇది ఒక సాధారణ బిల్లు కాదు; మహిళల నెలసరి గురించి భారతీయ సమాజంలో శతాబ్దాలుగా నెలకొన్న నిశ్శబ్దం, అపహాస్యం, నిర్లక్ష్యానికి ఇది ధైర్యమైన సవాలు. భారతదేశంలో పరిస్థితి ఎంత తీవ్రమో గణాంకాలు చెబుతున్నాయి. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 ప్రకారం, 15 -24 ఏళ్ల యువతుల్లో కేవలం 58% మంది మాత్రమే పరిశుభ్రమైన శానిటరీ నాప్కిన్స్‌ను ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాతం మరింత తగ్గుతుంది -అక్కడ 60% కంటే ఎక్కువ మంది ఇప్పటికీ పాత బట్టలపై ఆధారపడుతున్నారు. ఇవి సరైన రీతిలో శుభ్రం చేయకపోవడంతో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. పలువురు బాలికలు నెలలో నాలుగు- ఐదు రోజుల పాటు పాఠశాలకు దూరమవుతారు. నొప్పి, అవసరమైన శానిటరీ నాప్కిన్స్ లభ్యత లేకపోవడం, మరుగుదొడ్లు లేని దుస్థితి ఇవన్నీ కారణాలు ఉన్నాయి. వీటి కారణంగా విద్యార్థుల పాఠశాలకు గైర్హాజరు కావడంతో పిల్లల విద్యలో లింగ వ్యత్యాసం మరింత పెరుగుతోంది. ఆర్థిక భారం కూడా చిన్నది కాదు. ఒక సానిటరీ ప్యాక్ ధరే రూ. 30 -నుంచి రూ. 50 ఉండటం వల్ల లక్షల కుటుంబాలకు ఇది నెలనెలా వారికి భారం అవుతుంది. కొవిడ్ సమయాల్లో సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో అనేక మంది మహిళలు చిరిగిన బట్టలతో గడపాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. నెలసరి సమయంలో రక్తనష్టం, పోషకాహార లోపంతో మహిళల్లో రక్తహీనత మరింత తీవ్రమైంది.

ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అరబిలియన్ మహిళలు పిరియడ్ పావర్టీతో బాధపడుతున్నారు. అమెరికాలో ప్రతి నాలుగురు టీనేజ్ అమ్మాయిల్లో ఒకరు ఈ సమస్య వల్ల పాఠశాలకు వెళ్లలేరు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ప్రపంచ పార్లమెంట్లు చర్యలు చేపడుతున్నాయి. స్కాట్లాండ్ 2020లో అందరికీ ఉచిత శుభ్రతా ఉత్పత్తులు అందించే చట్టం చేసింది. స్పెయిన్ 2023 నుండి నెలసరి విశ్రాంతిని అమలు చేస్తోంది. జపాన్ 1947 నుంచే ఈ విధానాన్ని అమల్లో ఉంచింది. అమెరికాలో అనేక రాష్ట్రాలు ‘ట్యాంపాన్ ట్యాక్స్’ ను రద్దు చేశాయి. భారతదేశం కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. ఎఎస్సేఎ వర్కర్ల ద్వారా రాయితీ ధరల పంపిణీ, పాఠశాలల్లో వెండింగ్ మెషిన్లు, ఇన్సినిరేటర్లు ఏర్పాటు, శుభ్రతా ఉత్పత్తుల వినియోగం 42% నుంచి 58% కి పెరగడం వంటి పురోగతి ఉంది. కానీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కవరేజ్ ఇంకా చాలా తక్కువగా ఉంది. ఈ నెలసరికి సంబంధించిన సౌకర్యాలు, విశ్రాంతి హక్కుగా ఇచ్చే కేంద్ర చట్టం ఇప్పటికీ లేదు.

ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టే ప్రయత్నమే డాక్టర్ కావ్య బిల్లు. ఫ్యాక్టరీ కార్మికులు నుంచి వైద్యులు, ఉపాధ్యాయుల నుంచి గృహ సహాయకులు వరకు- అన్ని రంగాల మహిళలకు రక్షణ కల్పించేలా ఇది రూపుదిద్దుకుంది. మహిళల నెలసరి అనేది వ్యక్తిగత సిగ్గు విషయం కాదని, ఇది ప్రజారోగ్యానికి, లింగ న్యాయానికి సంబంధించిన అంశమని స్పష్టం చేస్తుంది. వ్యతిరేకాలు, వ్యయభారం వంటి అభ్యంతరాలు వచ్చినా, ఇతర దేశాల అనుభవాలు ఈ సౌకర్యాలు ఉత్పాదకతను పెంచుతాయని చూపాయి. పాఠశాల్లో ప్యాడ్లు అందిస్తే బాలికల హాజరు పెరిగిందన్న ఉదాహరణలు స్పష్టంగా ఉన్నాయి. వరంగల్ వంటి ప్రాంతాలనుంచి వచ్చిన ఈ చట్టప్రయత్నం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అంచున ఉన్న వర్గాల వాయిస్ కూడా జాతీయ విధానాలను మార్చగలవని ఇది నిరూపిస్తోంది. ఈ నెలసరి ప్రక్రియను గౌరవంతో చూడడం, దానికి అవసరమైన సౌకర్యాలను హక్కుగా ఇవ్వడం -ఇవి విలాసం కాదు; ప్రాథమిక మానవ హక్కులు. డాక్టర్ కడియం కావ్య వేసిన ఈ చిన్న దీపకాంతిని ఇప్పుడు ప్రభుత్వం, పార్లమెంట్, సమాజం కలిసి పిరియడ్ షేమ్ ని శాశ్వతంగా ముగించే జ్వాలగా మార్చాల్సిన సమయం ఇది.

– కేశిరెడ్డి మాధవి

ఇండిగో సంక్షోభం.. ఇదిగో పరిష్కారం

ఇండిగో సంక్షోభం కారణంగా ఇప్పుడు దేశం మొత్తం పబ్లిక్ రంగం ప్రాధాన్యతపై చర్చ మొదలైంది. వేలాదిమంది సోషల్ మీడియాలో పబ్లిక్ రంగం పాత్ర ఈ దేశ విమానయాన రంగంలో షోషించిన నిర్మాణాత్మక పాత్రపై అనేక చర్చలు జరుగుతున్నాయి. పబ్లిక్ రంగం పాత్రను చరిత్రలోనే మనం తొంగిచూస్తే అనేక విజయాలు మనకు కనిపిస్తాయి. భారత దేశంలో పబ్లిక్ రంగం అనేది సాధారణ ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యపు సామాజిక, ఆర్థిక బలాన్ని నిలబెట్టే స్తంభం. స్వాతంత్య్రం తర్వాత ఈ దేశం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ప్రజల అవసరాలను కేంద్రంగా పెట్టుకున్న ఆర్థిక నిర్మాణం అవసరమైంది. అదే బాధ్యతను పబ్లిక్ రంగం నెరవేర్చింది. బ్యాంకింగ్ నుంచి రైల్వేలు, విమానయానం, కోల్ ఇండియా నుంచి స్టీల్ అథారిటీ వరకు, కోట్లాది ప్రజల ప్రయాణాలు, పొదుపులు, ఉపాధి, జీవన ప్రమాణాలు పబ్లిక్ రంగాలపై ఆధారపడి ఉన్న వాస్తవం. లాభాలను కంటే ప్రజల అవసరాలను ముందుకు పెట్టడం, దూరప్రాంతాలకు సేవలు చేర్చడం, సామాజిక సమానత్వాన్ని చూపించడం ఇవన్నీ పబ్లిక్ రంగం నుంచే సాధ్యమయ్యాయి.

కానీ నేడు ఈ రంగం దాడులు పెరుగుతున్నాయి. ప్రైవేటీకరణను అభివృద్ధి అని అమ్మే ప్రభుత్వాలు పబ్లిక్‌రంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నాయి. లాభాల్లో ఉన్న సంస్థలకూ ‘స్ట్రాటజిక్ డిస్‌ఇన్వెస్ట్‌మెంట్’ పేరుతో వేలం వేయడం సాధారణమైంది. ప్రజల సొమ్ముతో నిర్మించిన సంస్థలను కొంతమంది కార్పొరేట్ వర్గాలకు అప్పగించడం ద్వారా ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థను క్రిమినలైజ్ చేస్తున్నాయి. బ్యాంకులను విలీనాలు, మూసివేతల దిశగా నెట్టడం, బొగ్గు బ్లాకులను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం, రైల్వే, ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను విడదీసి ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం ఇవన్నీ ప్రజలపై భారాలు మోపే నిర్ణయాలే. ప్రైవేటు రంగం లాభాలను మాత్రమే చూసే క్రమంలో సామాజిక బాధ్యతలు, ధర నియంత్రణ, గ్రామీణ సేవలు అన్నీ అరుదైపోయే ప్రమాదం ఉంది. భారతదేశం లాంటి అసమానతలున్న దేశంలో పబ్లిక్‌రంగం కేవలం వ్యాపారం కాదు. అది సామాజిక సమీకరణ యంత్రాంగం.లాభాలు లేకున్నా సేవలను విరమించకుండా కొనసాగించగల రంగం ఇదొక్కటే.

ప్రైవేటీకరణ పేరుతో పబ్లిక్ రంగాన్ని ముసుగులో హరించడం నేరం. ఒక తరానికి చెందిన సొమ్ము, శ్రమ, కలలతో నిర్మించిన ఈ ఆస్తులు దేశ భవిష్యత్తుకు కేవలం పెట్టుబడులు కాదు, రక్షణ. ప్రస్తుత అసమానతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ రంగం బలోపేతం అత్యవసరం. ఉపాధి తగ్గిపోతున్న సమయంలో పబ్లిక్ రంగ విస్తరణ తప్ప మరే ప్రత్యామ్నాయం లేదు. చిన్న, పెద్ద, మధ్యతరగతి ప్రజలందరూ ఆధారపడే భద్రతా వల ఈ రంగమే. కాబట్టి పబ్లిక్ రంగాన్ని రక్షించడం అనేది కేవలం గతాన్ని కాపాడడం కాదు, భవిష్యత్తును కాపాడడం. కానీ పాలకులు ప్రజలకంటే, దేశం అవసరాల కంటే పెట్టుబడి దారుల అవసరాలే మిన్నగా ఉంటున్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఇండిగో సంక్షోభం అన్నది వాస్తవం. ఇండిగోలో ఇటీవలే బయటపడిన యాజమాన్య, వాటాదారుల మధ్య అధికార పోరు దేశ విమానయాన రంగం ఎంత అస్థిరంగా మారిందో ప్రత్యక్షంగా చూపిస్తున్న సంఘటన. మార్కెట్‌లో 60 శాతానికి పైగా వాటా ఉన్న సంస్థ ఒక్కరోజు అంతర్గత ఒడిదుడుకులకు లోనైతే దేశవ్యాప్తంగా వేలాది ఫ్లైట్లు రద్దయ్యే ప్రమాదం, ప్రయాణికులు ఇరుక్కుపోయే పరిస్థితి, షేర్ మార్కెట్‌లో కోట్లు ఆవిరయ్యే అనిశ్చితి, ఇవి అన్నీ ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఇది కేవలం ఒక కంపెనీ గొడవ కాదు; ఇది విమానయాన రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించిన ప్రభుత్వ విధానాల ఘోర వైఫల్యం.

ఆ వైఫల్యాన్ని ప్రశ్నించే ఆలోచనే పాలకవర్గానికిలేదు. ఎయిర్ ఇండియాను భారాలు అవుతున్న పబ్లిక్ రంగం అని తక్కువ చేసి, నష్టాలను ఉద్దేశపూర్వకంగా పెంచిన తరువాత అతి తక్కువ ధరకు ప్రైవేటు చేతుల్లో వదిలేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇండిగో సంక్షోభం గురించి పెదవి విప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. ఒక పబ్లిక్‌రంగ విమానయాన సంస్థ పనిచేసేది కేవలం లాభాల కోసం కాదు; అది జాతీయ అవసరాలను తీర్చే బాధ్యతను కూడా మోసేది. దూరప్రాంతాలకూ, లాభం రానివాటికీ సేవలందించేది. అత్యవసర సమయాల్లో విదేశాల్లో ఇరుక్కున్న భారతీయులను కొలువరించేది. విపత్తుల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొనేది. ఇవన్నీ ప్రైవేట్ రంగం చేయగలదా? వారి బోర్డు సమావేశాల్లో వాటాదారుల ఒత్తిడి ఒక మూలను ఇరుకోబెడితే, ఆ రాత్రే ధరలు ఎగసిపడతాయి;సేవలు నిలిచిపోతాయి.

ఇండిగో సంక్షోభం తర్వాత మార్కెట్ ఎలా స్పందించిందో చూస్తే భారత గగనయాన రంగం అనిశ్చితి ఎంత తీవ్రమో అర్థమవుతుంది.షేర్ ధర పతనంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందినా, సాధారణ ప్రజల సమస్య మాత్రం మరింత సూటిగా మెదులుతుంది. ప్రయాణ ఖర్చులు పెరగటం, టికెట్లు అకస్మాత్తుగా దొరక్కపోవటం, సేవా నాణ్యత పడిపోవడం, మార్గాల ఎంపిక పూర్తిగా సంస్థల ఖజాన, లాభాల లెక్కల ఆధారంగా నిర్ణయించబడటం. విమానయాన రంగంలాంటి కీలక రంగాన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం ఒక దేశ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పే. విమాన రూట్ల కేటాయింపు, అత్యవసర ఎయిర్‌లిఫ్ట్‌లు, అభివృద్ధి చెందని ప్రాంతాలకు కనెక్టివిటీ వంటి సేవలను ప్రైవేట్ కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్‌లను చూసుకుని మాత్రమే నిర్వహిస్తాయి.

అలా లాభం రాకపోతే, ఆ సేవలు నిలిచిపోతాయి. పబ్లిక్ రంగం ఉన్నప్పుడు మాత్రం లాభ-నష్టాలతో సంబంధం లేకుండా ప్రజా ప్రయోజనాలే కేంద్రంగా నిలిచేవి. ఇది పబ్లిక్ రంగం ప్రాధాన్యతను సాక్ష్యాలతో రుజువు చేసే ముఖ్యమైన ఉదాహరణ. ఇండిగోలో జరిగిన మేనేజ్‌మెంట్ విభేదాలు, వాటాదారుల మధ్య అధికార యుద్ధాలు, అంతర్గత చెత్త పాలన దేశ విమానయాన రంగంలో ఒకే సంస్థ ఆధీనత ఎలా ప్రమాదకారకమో చూపుతున్నాయి. ప్రైవేట్ సంస్థల అప్రతిహత అధికారం, ప్రభుత్వ మౌన సమ్మతి రెండూ కలిపి ప్రజలకే భారమయ్యాయి. ఒక సంస్థ గందరగోళం కారణంగా దేశవ్యాప్తంగా వందల ఫ్లైట్లు ఆలస్యం కావటం అంటే, కొద్దిమంది పెట్టుబడిదారుల మీద దేశం మొత్తం ఆధారపడి ఉన్నదని అర్థం. ఇది అస్వాభావికమైన ఆర్థిక నిర్మాణం. ఇండిగో సంక్షోభం ఒక సంఘటన కాదు, అది ఒక సందేశం. దేశ విమానయాన రంగాన్ని పూర్తిగా ప్రైవేటు ఆధీనానికి అప్పగించినప్పుడు ఏమి జరుగుతుందో ఇది స్పష్టంగా చెబుతోంది. పబ్లిక్ రంగం మరింత బలపడాల్సిన అవసరం ఉంది. విమానయానాన్ని ప్రజా సేవగా తిరిగి నిర్వచించాల్సిన సమయం వచ్చింది. అప్పుడే ప్రజల ప్రయాణం సురక్షితం, అందుబాటు, సమానత్వం కలిగినదిగా ఉంటుంది. లేకపోతే ఇండిగో నేటి సంక్షోభం రేపటి మరింత పెద్ద దుర్ఘటనలకు పునాది మాత్రమే అవుతుంది.

– టి.నాగరాజు

9490098292

సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా నుంచి ’పైసా డుమ్ డుమ్’ సాంగ్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ “డార్క్ కామెడీ జానర్ లోనే కొత్తగా ప్రయత్నించాం. ఫుల్ ఫన్ ఉండే మా మూవీ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తుంది”అని అన్నారు. హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ “పైసా డుమ్ డుమ్’ సాంగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఫరియా అబ్దుల్లా కూడా మా మూవీలో ఒక పాట పాడింది. ఆ పాటను త్వరలో వింటారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, జయకాంత్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్ పాల్గొన్నారు.

చాయ్ షాట్స్’ ప్రారంభం

తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్న చాయ్ బిస్కెట్… దేశంలోని తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్ లో 2 నిమిషాలకు లోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయి. ‘చాయ్ షాట్స్’ ఏంజెల్ ఇన్వెస్టర్లుగా రానా దగ్గుబాటి (నటుడు, నిర్మాత), శ్రీ హర్ష మజేటి, నందన్ రెడ్డి (స్విగ్గీ వ్యవస్థాపకులు), ఫణీంద్ర సమా (రెడ్‌బస్ స్థాపకుడు), అలఖ్ పాండే, ప్రత్యీక్ మహేశ్వరి (ఫిజిక్స్‌వాలా వ్యవస్థాపకులు), అరవింద్ సాంకా, పవన్ గుంటుపల్లి, రిషికేశ్ (రాపిడో స్థాపకులు), రోహిత్ చెన్నమనేని (డార్విన్‌బాక్స్ సహ వ్యవస్థాపకుడు), అమర్ నగరం (విర్జియో వ్యవస్థాపకుడు) ఉన్నారు.

’చాయ్ షాట్స్’ యాప్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి మాట్లాడుతూ “చాయ్ షాట్స్.. కంటెంట్ క్రియేటర్స్ చేతిలో ఒక అడ్భుతమైన పవర్. శరత్, అనురాగ్ ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి. వాళ్ళు తెలుగు యంగ్ ఆడియన్స్‌ని అద్భుతంగా అర్థం చేసుకున్నారు. వాళ్ల జర్నీలో నేను ఒక చిన్న పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది”అని అన్నారు. చాయ్ బిస్కెట్ శరత్ మాట్లాడుతూ “’చాయ్ షాట్స్’ను ప్రస్తుతం తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నాం. త్వరలోనే అన్ని భాషల్లో లాంచ్ చేస్తాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్, చాయ్ బిస్కెట్ అనురాగ్, సీటీవో కృష్ణ, రాపిడో సహ వ్యవస్థాపకుడు రిషికేశ్, రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర, డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని, రాహుల్ హుమాయున్ పాల్గొన్నారు.