Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Betasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Betasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

betmoney

jojobet

betasus resmi

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

piabellacasino

aresbet

cratosroyalbet

piabellacasino

piabellacasino

nitrobahis

canakkale escort

deneme bonusu

casibom

xnxx

porn

hit botu

Hiltonbet

jojobet

jojobet giriş

cratosroyalbet

Streameast

jojobet

realbahis

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

betoffice giriş

kocaeli escort

betoffice

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Hiltonbet

Betpuan

Yakabet

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

jojobet

jojobet

betsmove

holiganbet

betsmove

Holiganbet Giriş

jojobet giriş

izmir escort

restbet

bets10

Hacklink satın al

interbahis

betebet

teosbet

1xbet

meritking

grandpashabet

holiganbet

padişahbet

holiganbet

holiganbet

holiganbet

deneme bonusu veren siteler 2026

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

Holiganbet giriş

casibom

jojobet

holiganbet

betwoon

grandpashabet

betcio

grandpashabet

holiganbet

padişahbet

matbet

ultrabet

meritking

imajbet

sekabet

galabet

dinamobet giriş

jojobet

jojobet giriş

bets10

galabet

sekabet güncel giriş

kingroyal

padişahbet

casibom

casibom

bahisfair

betturkey

cratosroyalbet

cratosroyalbet

marsbahis

kingroyal

meritking

kingroyal

madridbet

meritking

meritking

madridbet

కడపలో యువతిపై ముగ్గురు వేర్వేరుగా అత్యాచారం

అమరావతి: మాయమాటలు చెప్పి యువతిపై ముగ్గురు వేర్వేరు ప్రదేశాలలో అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రిలోని ఓ గ్రామానికి చెందిన యువతి అనంతపురంలో డిప్లోమో సెకండ్ ఇయర్ చదువుతోంది. సొంత గ్రామం నుంచి అనంతపురం పోయే వచ్చేది. ఆటో డ్రైవర్ గురుమోహన్ పరిచయం కావడంతో మాయమాటలతో ఆమెను ప్రేమలోకి దించాడు. డిసెంబర్ 2న కాలేజీకి తీసుకెళ్తానని చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి తీసుకెళ్తానని చెప్పి యువతిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెపై అక్కడ బలవంతంగా అత్యాచారం చేసి మరుసటి రోజు సొంతూరుకు బస్సు ఎక్కించాడు.

తాడిపత్రి చేరుకున్న తరువాత బస్సులో తెలిసిన యువకుడు ప్రదీప్ పరిచయం కావడంతో భయంతో అతడి వద్దకు వెళ్లింది. దీనిని అసరాగా తీసుకొని కడపలోని తన ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను తిరుపతి బస్సు ఎక్కించాడు. కాలేజీలో పరిచయమైన బ్రహ్మనాయుడుకు ఫోన్ చేయడంతో ఆమెను ఓదార్చి తన ఇంటికి యువతిని తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై మూడు రోజులు అత్యాచారం చేశాడు. బాధితురాలు బ్రహ్మనాయుడు నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లింది. జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అప్పటికే తల్లిదండ్రులు తన కూతురు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఇప్పుడు టాస్ మాత్రమే వేశా… అసలు కథ ముందుంది: కవిత

హైదరాబాద్: ఛేంజ్ ఆఫ్ ల్యాండ్స్ జివోల మీద బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంతకం పెట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తనకు కూడా టైమ్ వస్తుందని తానును కూడా ఏదో రోజు సిఎం అవుతానని అన్నారు. బిఆర్ఎస్ నేతల అవినీతి చిట్టా విప్పడం ఇంకా మొదలు పెట్ట లేదని, బిఆర్ఎస్ నేలతపై మరోసారి ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపై అరెస్టులు ఉంటాయని చెప్పి.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని, హిల్ట్ పాలసీపై బిఆర్ఎస్ వాళ్లు ఇప్పుడు ఎలా మాట్లాడుతారు? అని ప్రశ్నించారు. అగ్నికి ఆజ్యం పోసింది బిఆర్ఎస్ అని కవిత విమర్శించారు. తన భర్త ఫొటో చూపిస్తూ..బిజెఎల్ పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారని, అప్పుడే ఎందుకంత భయపడుతున్నారని నిలదీశారు.

టాస్ మాత్రమే వేశానని, అసలు కథ ముందుందని, వారి బెదిరింపులకు భయపడనని అన్నారు. పదేళ్లలో తాను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదని, తాను సిఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని తెలియజేశారు. బిఆర్ఎస్ అవినీతి ప్రశ్నిస్తూ..సిఎం రేవంత్ రెడ్డి అధికారం లోకి వచ్చారని, బిఆర్ఎస్ హయాంలో పరిశ్రమల భూమిని.. నివాస భూమిగా మార్చారని మండిపడ్డారు. పోచం పల్లి ఫామ్ హౌస్ కేసును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని, మీరు చేసిన అక్రమాలను తనపై రుద్దొద్దని తనకు ఎవరితోనూ ఎలాంటి అండర్‌స్టాండింగ్ లేదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఎంతో మందిని బెదిరించి డబ్బులు తెచ్చుకున్నారని కవిత ధ్వజమెత్తారు.   

చలి చంపేస్తోంది…. మొయినాబాద్ లో 5.4°…. హెచ్ సియులో 6.3° సెంటీ గ్రేడ్

హైదరాబాద్: భాగ్యనగరంలో చలి వణికిస్తోంది, ఎముకలు కొరికేలా చలి తీవ్రత మారింది. హైదరాబాద్ లో సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. తెల్లవారుజామున బయటక రావాలంటే భయం వేస్తోంది. నీళ్లను ముట్టుకుంటే చాలు కరిచేస్తున్నాయి. జనం చలితో వణికిపోతున్నారు. శుక్రవారం ఉదయం జిహెచ్ఎంసి పరిధిలోని ప్రాంతాలలో 12 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ శివారులో శెరిలింగం పల్లి 6.3° సెంటీ గ్రేడ్, మొయినాబాద్ వంటి శివార్లలో 5.4° సెంటీ గ్రేడ్ ఇబ్రహీంపట్నంలో 6.3° సెంటీ గ్రేడ్ నమోదయ్యాయి.   సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి గాలులు, పొగమంచుతో రహదారులు కమ్ముకుంటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది.  పొగ మంచు, శీతల గాలుల కారణంగా రాత్రి పూట చలి ఎక్కువగా ఉంటుందని, రానున్న మూడు రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. రాత్రి కంటే ఉదయం 4 గంటల ప్రాంతంలో చలి ఎక్కువగా నమోదవుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తుందని, వాతావరణ శాఖ వెల్లడించింది. 

వివిధ ప్రాంతాలలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు: 

హెచ్ సియు శేరి లింగంపల్లి  6.3° సెంటీ గ్రేడ్ 🥶⚠️

మౌలాలీ 7.1°

రాజేంద్రనగర్ 7.7°

శివరాంపల్లె 8.8°

అల్వాల్ 9.0°

గచ్చిబౌలి 9.1°

మచ్చ బొల్లారం 9.3°

వెస్ట్ మారేడ్ పల్లి 10.1°

కుత్బుల్లాపూర్ 10.2°

బహదూర్‌పురా 10.9°

జీడిమెట్ల 11.0°

బేగంపేట్ 11.1°

భేల్  11.2°

నేరేడ్ మెట్ 11.2°

పటాన్ చెరు 11.4°

బోయిన్ పల్లి 11.6°

మెహదీపట్నం 11.6°

నాగోల్ 11.6°

ఆసిఫ్‌నగర్ 11.6°

చార్మినార్ 11.6°

కార్వాన్ 11.6°

ఎల్ బి స్టేడియం 11.6°

మల్కాజిగిరి 11.7°

షేక్‌పేట 11.7°

సికింద్రాబాద్ 12.1°

జూబ్లీ హిల్స్ 12.2°

హయత్‌నగర్ 12.6°

ముషీరాబాద్ 12.7°

అత్తాపూర్ 13°

మొయినాబాద్ 5.4°

ఇబ్రహీంపట్నం 6.3°

కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ ఇకలేరు

ముంబయి: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్(90) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. శివరాజ్ పాటిల్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. శివరాజ్ పాటిల్ మృతి తనను కలిచి వేసిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. లాతూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎంపి గెలిచి ప్రజలకు సేవలందించారు. 

పైరసీ.. ఎందరికో ప్రేయసి

ఇమంది రవి అలియాస్ ఐబొమ్మరవి అరెస్ట్ కన్నా చాలా ముందు నుంచే సినిమా పైరసీ గురించిన విస్తృత చర్చ జరుగుతోంది. పైరసీ సీడీల రోజులనుంచీ ఆన్ లైన్ పైరసీ రోజుల్లోకి ప్రవేశించాం. పైరసీ నా ప్రేయసీ అనే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. పైరసీకి కారణం కూడా సినిమా పరిశ్రమే. సీడీల పైరసీ రోజుల్లో సింగిల్ స్క్రీన్స్ విస్తృతంగా ఉన్నాయి. జనాలు పైరసీ సీడీల వైపు పెద్దగా చూసేవాళ్లు కాదు. కారణం సీడీ కొంటే అది చూడడానికి పరికరాలు కావాలి. అందుకని కొద్దిమంది మాత్రమే వాటివైపు చూసేవారు. ఈ గోల కన్నా హాయిగా సినిమా హాలుకు పోయి సినిమా చూడడమే బెటర్ అనుకునేవారు జనం. ఆన్‌లైన్ పైరసీ వచ్చిన తర్వాత జస్ట్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ ప్రశాంతంగా చూసుకోవచ్చు అనే అభిప్రాయం కలిగాక సీడీల కన్నా ఇది జనామోదం పొందింది. కోవిడ్ తర్వాత రోజుల్లో సింగిల్ స్క్రీన్స్ మూసివేత వేగంగా పెరిగింది. అదే సమయంలో ఓటీటీ అనే సినిమా ప్లాట్ ఫామ్ మన జీవితాల్లోకి ప్రవేశించింది. లాక్ డౌన్ పుణ్యమా అని బాగా దగ్గరయ్యింది. సినిమా హాళ్లకు టీవీ అనే ప్లాట్ ఫామ్ ఇబ్బందికరం అనుకున్నాం ఒకప్పుడు.. నిజానికి ప్రైవేటు ఛానల్స్ మొదలయ్యాక చాలా ఊళ్లల్లో సినిమా హాళ్లు ముఖ్యం సింగిల్ స్క్రీన్స్ కళ్యాణ మండపాలుగా మారాయి. దాన్ని మించిన స్థాయిలో ఓటీటీ వచ్చాక సినిమా హాలు నిలబడడం కష్టసాధ్యంగా మారిపోయింది.

ఒకప్పుడు సినిమా మీద ఇన్‌కమ్ అంటే బుకింగులో అమ్ముడయ్యే టిక్కెట్ల నుంచి మాత్రమే వచ్చేది. ఇప్పుడు అలా కాదు రకరకాలుగా డబ్బులు వస్తున్నాయి. ఒకటి డిజిటల్ అమ్మకం. అంటే సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ దగ్గర నుంచీ జరిగే అన్ని ప్రీరిలీజ్ ఈవెంట్స్ ప్రసార హక్కులూ డిజిటల్ గానూ, శాటిలైట్ గానూ, ఓటీటీగానూ కూడా అమ్మేసుకుంటున్నారు. అక్కడ నుంచీ వ్యాపారం మొదలు. ఫైనల్ గా సినిమా తయారయ్యాక థియేట్రికల్ రైట్స్ అమ్ముతారు. ఓటీటీ హక్కులు అమ్ముతారు. శాటిలైట్ హక్కులు అమ్ముతారు. యుట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్ లకు కూడా అమ్ముతారు. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ అనేది సినిమా వ్యాపారంలో ఓ భాగం మాత్రమే. పైరసీ వల్ల నష్టపోయేది ఈ థియేట్రికల్ హక్కుల కొనుగోలుదారులే. ఈ పైరసీ కంటెంట్ చూసేవాళ్లల్లో ప్రధాన వాటా ఎవరూ? అంటే సింగిల్ స్క్రీన్ ఆడియన్సే. నిజానికి ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ వాళ్ల వినోద కేంద్రాలైన సింగిల్ స్క్రీన్స్ మాయం అయిపోయాక ఎక్కడకిపోవాలి? వెళ్తే మల్టీప్లెక్సులకు పోవాలి.

లేకపోతే ఓటీటీలకు పోవాలి. వీళ్లు ఆర్థిక స్తోమత సహకరించక మల్టీ ప్లెక్సులకు పోవడం లేదు. కారణం సినిమా టిక్కెట్ల రేట్లు కాదు. అక్కడ అమ్మే స్నాక్స్ రేట్లు. అవి జనాన్ని భయపెట్టేస్తున్నాయి. అలా భయపడిన సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఓటీటీలకు పోకుండా మధ్యలో ఐబొమ్మ వైపు ప్రయాణం అవుతున్నారు. జనాలు థియేటర్లకు రావడం లేదూ అని గగ్గోలు పెడతారు. వచ్చిన ప్రేక్షకులనేమో స్నాక్స్ రూపంలో దోచుకుంటారు. పాప్ కారన్, కూల్ డ్రింకు కలిపి ట్రే తీసుకుంటే పదిహేడు వందల వరకూ వసూలు చేస్తున్న పరిస్థితి. బైట లీటర్ మంచినీళ్ల సీసా ఇరవై రూపాయలైతే మల్టీ ప్లెక్సుల్లో అరలీటర్ అరవై రూపాయలు. ఇక్కడ అమ్మే నీళ్లు మల్టీప్లెక్స్ వారి బ్రాండే. బైట బ్రాండులు అయితే అలా అమ్మడానికి అవకాశం ఉండదు కనుక వారే అమ్ముతారు. పిల్లలతో సినిమాకు వెళ్లాలంటే మధ్య తరగతివారు బ్యాంకు లోనుకు పోవాల్సిన పరిస్థితి. దీంతో వారు సినిమా చూడాలంటే కుదిరితే ఓటీటీలో చూస్తున్నారు. లేకపోతే ఐ బొమ్మ వైపు కదులుతున్నారు. యుఎఫ్ వో క్యూబ్ లాంటి సినిమా వాహకాల సర్వర్లు హ్యాక్ చేయడం ద్వారా క్వాలిటీ సినిమాలు పైరసీదారుల చేతుల్లోకి వస్తున్నాయనేది చాలా మంది అభిప్రాయం. సరే పైరసీ ఎలా జరిగినా క్వాలిటీ కంటెంట్ సినిమా విడుదలైన ఓ రెండు గంటల్లో ఈ పైరసీ వెబ్ సైట్లలో దర్శనం ఇస్తోందనేది వాస్తవం. మల్టీప్లెక్సులకు వెళ్లలేని, ఓటీటీలకు వెళ్లాల్సిన మధ్య తరగతి దిగువ మధ్య తరగతి అంతకన్నా కింద ఉన్న ఇతర తరగతులు ఇవన్నీ కూడా పైరసీ కాంపౌండ్ లో చేరి సినిమా చూసేస్తున్నాయి.

సినిమా అద్దిరిపోయింది థియేటర్లో చూస్తే తప్ప కిక్కు రాదు లాంటి టాక్ వస్తే మాత్రమే మల్టీ ప్లెక్సులకు వెళ్లడానికి ఉత్సాహపడుతున్నారు. నిర్మాతలు అమ్ముకున్న ప్లాట్ ఫామ్స్ మీదే జనం సినిమా చూస్తే ఆ కొనుక్కున్నవాడికి డబ్బులు వస్తాయి. అలా కాక జనం ఇంకెక్కడో సినిమా చూస్తే మరి నిర్మాత దగ్గర హక్కులు కొనుక్కున్న వాళ్లకు నష్టం వస్తుంది. దీంతో నిర్మాతలు డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని చేయాల్సినదేమిటి? ఒకటి మల్టీ ప్లెక్సులను కూడా ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చడం. అలా మార్చలేని పరిస్థితిలో కమ్యూనిటీ థియేటర్లను ప్రమోట్ చేయడం. అం బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వాలు కట్టి ఇస్తున్న గృహసముదాయాల్లో కమ్యూనిటీ థియేటర్ల నిర్మాణం చేయవచ్చు. అలాగే అపార్ట్ మెంట్స్ లోనూ గేటెడ్ కమ్యూనిటీల్లోనూ కూడా ఏర్పాటు చేయవచ్చు. వాంబే కాలనీల్లాంటి బడుగు బలహీన వర్గాల కాలనీల్లో క్ట కమ్యూనిటీ థిటయేర్లలో సినిమా టిక్కెట్టు ధర యాభై రూపాయలుగా నిర్ణయించి మీ ఇంట్లో వండుకున్న వస్తువులే తెచ్చి ఇక్కడ కూర్చుని తింటూ సినిమా చూడండి అని చెప్పొచ్చు.

అలాగే అపార్ట్ మెంట్లలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ థియేటర్లలో టిక్కెట్ల ధర వంద నూటయాభై చేయవచ్చు. అక్కడ కూడా వారి వారి తినుబండారాలు వారే తెచ్చుకుని వచ్చి కూర్చుని తింటూసినిమా చూసి పోతారు. గేటెడ్ కమ్యూనిటీ లాంటి రిచ్ ఏరియాల్లో రెండు వందల వరకూ టిక్కెట్ రేట్లు పెట్టి అక్కడ కూడా ఎవరి తిండి వారే తెచ్చుకుని తినండి అనొచ్చు. అలా కొత్తసినిమా నేరుగా క్యూబ్ యుఎఫ్ ఓ ల ద్వారా ఆ కమ్యూనిటీ హాళ్లకు పంపిణీ చేస్తాం. ఒక రోజు రెండు రోజుల్లో అక్కడి జనం అంతా సినిమా చూసేస్తారు. డబ్బులు వచ్చేస్తాయి. ఇంత చేసినా జనం పైరసీ అం మాత్రం అప్పుడు కొరడా పట్టుకోవడమే మార్గం. పైరసీ సినిమా చూసేవాళ్లపై కేసులు పెడతాం డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా అన్నారు మొన్న హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్. అలా కేసులు పెట్టుకోవచ్చు. ఈ ఏర్పాట్లు చేయకుండా అరెస్టులు చేస్తాం అం మాత్రం కుదరదు. టిక్కెట్ రేట్ లో కనీసం సగానికన్నా తక్కువే స్నాక్స్ రేట్లు ఉండాలి అనే నిబంధన తీసుకురాగలిగితే మంచిదే. ఏమి ఏమైనా థియేటర్లను ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చాలి. లేదా కమ్యూనిటీ థియేటర్ల నిర్మాణానికి కదలి ముందుకువెళ్లిపోవాలి. అది ఒక్క పైరసీని అడ్డుకునే మార్గం. 

– భరద్వాజ రంగావఝల

(సీనియర్ జర్నలిస్ట్)

ఐబొమ్మ రవిని ‘హీరో’ చేసిందెవరు?

ఐ బొమ్మ రవి. ఈ పేరుకు ఈ మధ్య కాలంలో మంచి ప్రాచుర్యం వచ్చింది. రవి చేసింది తప్పే. సినిమా ఇండస్ట్రీకి నష్టమే. చట్టం ప్రకారం శిక్షార్హమే. అయినా.. సామాన్యులు మాత్రం ఆయనను ‘రాబిన్ హుడ్’ లేదా ‘మధ్యతరగతి దేవుడు’ అని కొనియాడుతున్నారు. సినీ ప్రముఖులు రవిని తప్పు బడుతున్నారు. పోలీసులు రవి వెనుక ఉన్న కథ మొత్తం బయట పెడతామని చెప్పినా.. సామాన్యుల్లో మాత్రం రవికి మద్దతు తగ్గటం లేదు. పైరసీ తప్పే అని చెబుతూనే మధ్య తరగతి సినీ అభిమానులు రవికి అండగా నిలుస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రవిని అరెస్ట్ చేసిన పోలీసులు కాదు. ప్రధాన కారకులు సినీ ప్రముఖులు. రవిని ఇంతలా సాధారణ ప్రజలు అభిమానిస్తున్నారంటే సినీ ప్రముఖులు అలర్ట్ కావాల్సిందే. అసలు రవి సినిమాల వైపు మధ్య తరగతి ప్రజలు ఎందుకు ఆసక్తిగా ఉన్నారనే విషయం సినీ ప్రముఖులకు తెలియదా? తెలిసినా తెర మీద నటించినట్లుగానే బయట నటిస్తున్నారా? తమ రెమ్యునరేషన్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడని హీరోలు.. ఖర్చు విషయంలో ఆలోచన చేయని దర్శకులు.. అవసరానికి మించి ప్రతిష్ఠకు పోయి అప్పుతెచ్చి మరీ సినిమాలు తీసుకున్న నిర్మాతలు.. ప్రేక్షకులను తమ ధరలతో భయపెడుతున్న సినిమా హాళ్లు.. అందులోని రేట్లతో కొనకుండానే షాక్ కొట్టే క్యాంటీన్లు.. ఇలా ఎక్కడ చూసినా అంతు లేని దోపిడీ. బలి అవుతుందని సామాన్యుడే.

థియేటర్‌లలో అమ్మే పాప్‌కార్న్, సమోసాలు, కూల్‌డ్రింక్స్, అలాగే స్క్రీన్‌పై రన్ అయ్యే ప్రకటనలు ఈ మొత్తం ఆదాయానికి నిర్మాతకు ఎలాంటి సంబంధం లేదని, వాటిలోనుంచి ఒక్క రూపాయి కూడా నిర్మాత జేబులోకి రాదని ప్రముఖ నిర్మాత ఎస్.కే.ఎన్. (శ్రీనివాస కుమార్) తన ఎక్స్ ఖాతాలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒక సగటు కుటుంబం సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లినప్పుడు మొత్తం 2,178 రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ మొత్తం నుండి నిర్మాతకు కేవలం రూ. 372 మాత్రమే వస్తుందని ఆయన వివరించారు. మిగిలిన డబ్బు ఎక్కడికో ఎలా వెళ్తుందన్న వివరాలు ఇలా ఉన్నాయి: టికెట్ షేర్, మెయింటెనెన్స్ ఫీజు, థియేటర్‌లో అమ్మే F&B (Food & Beverages) ద్వారా మల్టీప్లెక్సులు మొత్తం రూ.1,545.33 వరకూ తీసుకుపోతాయి. ప్రభుత్వానికి జిఎస్‌టి రూపంలో రూ.182 వెళ్తుంది. ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన బిఎంఎస్ అయితే రూ. 78.67 వసూలు చేస్తుంది. మొత్తంగా చూస్తే నిర్మాతకు వచ్చే వాటా కేవలం 17% మాత్రమే అని ఆయన ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

అయితే, ఎస్.కే.ఎన్ చేసిన ఈ పోస్టుపై సినీ ప్రేక్షకులు ప్రశ్నల వర్షం కురిపించారు. థియేటర్లలో తినుబండారాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న విషయాన్ని చర్చకు తెచ్చిన అభిమానులు థియేటర్‌లో ఒక చిన్న పాప్‌కార్న్ కోసం మూడు వందలు, కూల్ డ్రింక్ రెండు వందలు, వాటర్ బాటిల్‌కే 150 వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ దోపిడీపై మీరు మాత్రం ఏమీ చెప్పడం లేదెందుకు? అని ప్రశ్నించారు. తినుబండారాల ధరలపై నియంత్రణ మీ చేతుల్లో లేకపోతే, ఆ ధరల వల్ల ఇబ్బందిపడుతున్న ప్రేక్షకుల తరఫున పరిశ్రమ పెద్దలు ముందుకు వచ్చి మాట్లాడటం, పరిష్కారం కోరడం మీ బాధ్యత కాదా? నిర్మాతకు ఆ ఆదాయంలో వాటా లేకపోతే, ప్రేక్షకులను రక్షించేందుకు కనీస ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదని అభిమానులు మండిపడ్డారు. ఇక్కడ ఒక్కటే స్పష్టంగా అర్థమవుతుంది, ఎవరి లాభాలు వారికి కావాలి. ఒకవైపు సినీ పరిశ్రమ సాధారణ ప్రేక్షకుడి శ్రమ దోచుకోవటానికి అలవాటుపడితే, మరోవైపు సామాన్యుడి బలహీనత సొమ్ము చేసుకునేందుకు ఐ రవి లాంటి వారు ఎంట్రీ ఇచ్చారు. అంతే, సామాన్యుడు కోరుకుందీ.. రవికి కావాల్సింది ఒక్కటే.

రవి పైరసీ చేయటం నేరమే. శిక్షకు అర్హుడే. మరి.. సినిమా అభిమానించే ప్రేక్షకులు ప్రీమియర్ షో.. బెనిఫిట్ షో.. ప్రత్యేక షోల పేరుతో వందల రూపాయాల టికెట్లు వసూలు చేయటం ఏమనాలి? సినిమా టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే, ప్రజలు పైరసీ వైపు వెళ్లే పరిస్థితి ఉండదు కదా అని వాదిస్తున్న వారు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకొని మొదటి రెండు వారాల పాటు టికెట్లు రేట్టు పెంచుకునేందుకు వీలుంటుంది. అలాగే పాప్‌కార్న్ రేట్ల విషయంలోనూ జిఎస్‌టిని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ 2023లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, పాప్‌కార్న్, బెవరేజస్ లూజ్ సేల్స్ పేరుతో రూ.150 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారు. రూ.30 ఉండే పాప్ కార్న్ రూ.700 వరకు అమ్ముతుంటే, సినిమాలు ఏ విధంగా చూడాలని నిలదీస్తున్నారు.

ఐ బొమ్మ సినిమాలు చూడటం కోసం వ్యక్తిగత సమాచారాన్ని లాగిన్ కోసం ఇచ్చి మరీ చూస్తున్నారంటే సినిమా కోసం టికెట్ల నుంచి ధియేటర్ల వరకు జరిగే దోపిడీ కంటే ఇది డేంజర్ కాదని ప్రేక్షకులు డిసైడ్ అయినట్లుగానే భావించాలేమో. సినీ పెద్దలు మాత్రం ఐ బొమ్మను తప్పు బడుతున్నారు. ప్రేక్షకుల ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వటం లేదు. సినీ పరిశ్రమ ఇలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తే దోచుకుంటున్నంత కాలం వారు ఐ బొమ్మ లేకుంటే ఓటీటీ… అదీ కాకుంటే టీవీల్లో వచ్చే వరకూ వేచి చూస్తారు. ఈ సినిమా పేరుతో జరిగే దోపిడీ భరించే సహనం ప్రేక్షకుడు కోల్పోయాడు. ఇప్పటికైనా నిర్మాత నుంచి థియేటర్ యజమాని వరకు తీరు మార్చుకోవాలి ఐ బొమ్మ రవి వ్యవహారం స్పష్టం చేస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఐ బొమ్మ రవిని ప్రేక్షకులు రియల్ హీరోగా చూడటం వెనుక వారి ఆవేదన ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. ఇది రీల్ హీరోలకు అర్దం అవుతుందా… లేదంటే మరో ఐ బొమ్మ పుట్టుకురావాల్సిందేనా.

– బాలకృష్ణ ఎం

(సీనియర్ జర్నలిస్ట్)

సినిమా పైరసీ ఇప్పట్లో ఆగేది కాదు

పైరసీ అనేది ప్రపంచవ్యాప్త దృగ్విషయం. ఇది ప్రపంచమంతటా ఉంది. దీనిని పూర్తిగా నిర్మూలించడం ఆచరణాత్మకంగా అసాధ్యం. భవిష్యత్తులో ఎలా ఉంటుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి ఈ రోజు ఐబొమ్మను పట్టుకున్నారు. ఇంతకు ముందు కూడా మరొకరిని పట్టుకున్నారు. వారిని పట్టుకున్నంతమాత్రాన పైరసీ ఆగిపోతుందా? ఐ బొమ్మ రవిని పట్టుకున్న తర్వాత కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. కాబట్టి ఐ బొమ్మతోనో లేదా మరొకరితోనో ఇది ఆగదు. పైరసీ వల్ల నష్టం ఎంత? ఎంత నష్టం జరుగుతుంది? నాకు తెలిసినంత వరకు, వీడియో సినిమా వచ్చినప్పుడు సినిమారంగంలో పైరసీ మొదలైంది. అంతకు ముందు వీడియో సినిమా 16ఎంఎంలో చేసేవారు. 35 ఎంఎం సినిమాను 16ఎంఎంలో చేసి రోడ్ల మీద, పండుగల సమయంలో రాత్రిపూట రోడ్డు మీద ప్రదర్శించేవారు. కాబట్టి అప్పట్లో అది ఒక రకమైన పైరసీ. తర్వాత వీడియోలు వచ్చిన తర్వాత, వీడియో పార్లర్లలో వీడియోలు వేసేవారు. నగరాల్లో ప్రదర్శించేవారు. వీడియో క్యాసెట్లను అద్దెకు తీసుకుని ఇంట్లో సినిమాలు చూసేవారు. తర్వాత సీడీలు, డీవీడీలు వచ్చాయి. ఈ విధంగా, పైరసీ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, అది ఆగదు. అది ఆగలేదు కూడా.

ఈ పైరసీ ఎక్కడి నుండి వస్తోంది? అన్నింటికంటే ముందు, ఇది ఎక్కడ పుడుతుందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేదు. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత కూడా పైరసీ పెరిగింది. పైరసీ నాణ్యత పెరిగింది. ఇంతకు ముందు, థియేటర్ ప్రింట్ ఉన్నప్పుడు, థియేటర్లో నేరుగా ప్రదర్శించేవారు. దానిని నేరుగా కాపీ చేయడం కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు దీనికి ప్రక్రియ ఏమిటో నాకు తెలియదు, కానీ ఇది చాలా సులభం అయిపోయింది. సెల్ ఫోన్లు వచ్చాక, ఇది మునుపటి కంటే సులభం అయింది. ఇది కాకుండా, మన సినిమా థియేటర్లన్నింటిలోనూ శాటిలైట్ల ద్వారా సినిమాలు పంపే కొత్త ప్రక్రియ ఉంది. కాబట్టి బహుశా సినిమా పరిశ్రమకు చెందిన కొందరు కూడా పైరసీ చేస్తూ వారికి సహాయం చేస్తున్నారేమో. వాళ్ళు హార్డ్ డిస్కులు ఇస్తున్నారు కదా? అక్కడి నుండి కూడా జరగవచ్చు. అయితే, థియేటర్ నుండి తీసేది మరో రకం. ఇలా మూడు నాలుగు రకాలు ఉన్నాయి. వారికి సినిమా ఎక్కడి నుండి వస్తోంది? ఎలా తీసుకువస్తున్నారు? ఎవరు తీసుకువస్తున్నారు? అసలు సమస్య ఏమిటంటే, దీని మూలం ఎక్కడి నుండి వస్తుందో అక్కడే ఉంది. దాన్ని తొలగించనంతవరకు, పైరసీ ఆగదు. పైరసీ బయటకు వచ్చింది. దొంగ అసలైన వాడు కాదు. చూసినవాడిని పట్టుకుంటామని అంటారు, లేదా అమ్మిన వాడిని పట్టుకుంటారు. ఇచ్చిన వాడిని పట్టుకుంటారు. కానీ అది ఎక్కడి నుండి వచ్చింది? ఐ బొమ్మకు ఎవరు సరఫరా చేశారు? సరఫరా చేసిన వాడు థియేటర్లో తీసిన వాడు కాదు. థియేటర్లో తీసిన వాడు వేరే.

కానీ అసలు ప్రింట్ వారికి ఎలా వచ్చింది? కాబట్టి, ఇప్పుడు మనం థియేటర్లకు కంటెంట్ ఇస్తున్నాం కదా? కంటెంట్ ప్రొవైడర్లు ఉంటారు కదా? వారి నుండి వెళ్ళాలి. లేకపోతే, మన ఎడిటింగ్ రూమ్ల నుండి వెళ్ళాలి. అది మరో పద్ధతి. కాబట్టి పైరసీ ఎక్కడ జరుగుతోందో స్పష్టత లేదు. బహుశా ఆ స్పష్టత ఇప్పట్లో రాకపోవచ్చు. ఇప్పటివరకు చాలా సినిమాలు బయటకు వచ్చాయి. వాటిలో కొన్ని ఎడిటింగ్ రూమ్ నుండి వెళ్ళాయని చెప్పారు. ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ అలా జరిగిందని చెప్పారు. ‘టాక్సీవాలా’ సినిమా కూడా అంతే. ఆ మొత్తం సినిమా బయటకు వచ్చింది. నిజానికి, ‘అత్తారింటికి దారేది’ సినిమా 3/4వ భాగం బయటకు వచ్చింది. ఇవే కాకుండా, ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమాలన్నీ ఇలానే బయటకు వస్తున్నాయి. ఇది ఎలా జరుగుతోంది? నేను అది కూడా చెప్పాలి. దీనివల్ల వేల కోట్ల నష్టం జరిగింది. నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం, పైరసీ వల్ల ఆదాయం 30% నుండి 40% పడిపోయిందని చెబుతున్నారు. నేను వ్యక్తిగతంగా దాన్ని నమ్మను. ఎందుకంటే సినిమా అనేది ఒక థియేట్రికల్ అనుభవం. అది ఒక విభిన్నమైన అనుభవం. దానిని సెల్ ఫోన్లో చూసినా లేదా టీవీలో చూసినా, అది సరైన ప్రింట్ కాదు. సినిమాకు మంచి ప్రింట్ వస్తే, అది టీవీలో కూడా మంచి నాణ్యతతో ఉంటుంది.

కానీ సెల్ ఫోన్లో చూసే చిన్న బొమ్మ సాధ్యం కాదు. సినిమా బాగుంటే, వారు ఖచ్చితంగా మళ్లీ థియేటర్కు వెళ్తారు. ఈ సినిమాలను ఫోన్లో లేదా టీవీలో చూసే వ్యక్తులు, వారిలో 80% మంది సినిమాకు వస్తారు. ఇది ఉచితంగా వచ్చే బ్యాచ్. వీరు టిక్కెట్లు కొనే బ్యాచ్ కాదు. ప్రేక్షకులలో 20% నుండి 30% మంది తగ్గిపోవడంవల్ల, మా ఆదాయం నష్టపోతున్నాం. దీనికి అదనంగా థియేటర్ ఖర్చు.. అంటే టికెట్ ధర, ముఖ్యంగా ఆహార పదార్థాల ధర, అది పాప్కార్న్ అయినా, సమోసాలైనా సరే. గతంలో మనకు ఒకటిన్నర రూపాయల టికెట్ ఉంటే, టీ లేదా చిప్స్, సమోసాలు దొరికేవి. వాటిని బండి మీద అమ్ముతుంటే గేటు దగ్గరకు వెళ్లి కొనేవాళ్ళం. ఆ తర్వాత థియేటర్లలో మనకు ఏసీ వచ్చింది. రూ.500కు పాప్కార్న్, రూ. 200నుంచి 300వరకూ ఖర్చు చేస్తే సమోసాలు దొరుకుతున్నాయి. అదే సమోసా బయట 5 నుంచి10 రూపాయలు మాత్రమే ఉంటుంది. నేను ప్రతిరోజూ కనీసం రెండు సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు నెలకు ఒక సినిమా చూడటం కూడా కష్టంగా ఉంది. నేను థియేటర్కు వెళ్తే, రోజూ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. నెలకు ఒక్కసారి వెళ్లినా కూడా నాకు 700 రూపాయలు ఖర్చు అవుతుంది. థియేటర్లలో ధరలు తగ్గించాలి. ఇది మాత్రమే కాదు, వాళ్ళు విడుదలయ్యే సినిమాలకు ధరలు పెంచుతున్నారు. టికెట్ల ధర వేలల్లో ఉంటోంది. అది అన్యాయం. ఇదంతా పైరసీకి లాభదాయకంగా మారుతోంది. అందుకే, అయూబ్ అమ్మూ ఒక హీరో అయ్యాడు. రాబిన్ హుడ్ లాగా, అతనికి ఒక ఫాలోయింగ్ వచ్చింది. కాబట్టి, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలి.

– తమ్మారెడ్డి భరద్వాజ

(సినీ నిర్మాత, దర్శకుడు)

ధరలు దిగి రావాలి!

టూరింగ్ టాకీస్ గురించి ఈ తరంవారు ఎంతమంది విన్నారో తెలియదు. ఇవి సినిమాలు ఆడించడం కోసం తాత్కాలికంగా వేసే టెంట్లు. సర్కస్ టెంట్ల లాంటివి. వీటిని ప్రజలు సినిమాలు చూడటానికి వీలుగా వివిధ పట్టణాలు, గ్రామాలలో ఏర్పాటు చేసేవారు. క్రమేణా థియేటర్లు అంతటా పుట్టుకొచ్చాయి. వాటిని మార్నింగ్, మ్యాట్నీ, ఫస్ట్, సెకండ్ షోలు అని పిలిచే ప్రదర్శనలకు నిర్ణీత సమయాలు ఉండేవి. ఇవికాక ప్రత్యేక ప్రదర్శనలు అరుదుగా వేస్తుండేవారు. థియేటర్లలో ఎయిర్ కూల్డ్, ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం ఉంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. మొదటి 70ఎంఎం స్క్రీన్, డీలక్స్ (ఆర్‌సిసి రూఫ్) థియేటర్ మనకిప్పటికీ గుర్తున్నాయి. వాటిగురించి అపురూపంగా చెప్పుకునే వాళ్ళం. థియేటర్లలో నేల, బెంచ్, బాల్కనీ తరగతులు ఉండేవి. ఇప్పుడు తరగతి భేదాలు పోయాయి. కనీసం థియేటర్ల విషయంలో అయినా వర్గరహిత సమాజం సాధించామని దేశం గర్వపడవచ్చునేమో. అప్పట్లో సినిమా టికెట్ల ధరలు 25 పైసల నుండి 2 రూపాయల వరకు ఉండేవి. ద్రవ్యోల్బణం వల్లా లేదా ఆర్ధిక స్థోమత పెరిగే కొద్దీ ధరలు నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి.

కానీ ఇప్పుడు సాధారణ థియేటర్లలో ధరలు కనీసం రూ. 150 నుండి మల్టీప్లెక్స్‌లలో రూ. 350 వరకు ఉన్నాయి. చాలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక పిక్నిక్ లాంటి అనుభవం. ఇక్కడ మొత్తం కుటుంబం వెళ్లి సినిమా చూసేది. ఆ అనుభవంలో పాప్‌కార్న్, చిప్స్ లేదా సమోసా ఉన్నాయి. అప్పుడప్పుడు బోనస్‌గా సాఫ్ట్ డ్రింక్ ఉంటుంది. ప్రజలు ఈ కొద్దిపాటి డబ్బును ఏ మాత్రం బాధపడకుండా ఇష్టపూర్వకంగా ఖర్చు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. నలుగురు సభ్యుల కుటుంబం వేలల్లో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటేనే ఈ అనుభవాన్ని పొందగలదు. థియేటర్లలో అమ్మే వస్తువుల ధరలను విక్రయదారులు ఏకపక్షంగా నిర్ణయించేస్తారు. ఎన్ని కేసులు పెట్టినా, ప్రభుత్వ శాఖలు థియేటర్లలో తినుబండారాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని ఆదేశాలు జారీ అయినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవు. ఇటువంటి ఉల్లంఘనల మీద అధికారులు చర్యలు తీసుకోవడం ఎప్పుడయినా చూసామా?

కలర్ టీవీలు, వీసీఆర్లతో సాంకేతికత ప్రజలకు చేరువైనప్పుడు వీడియో లైబ్రరీలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. అవి కనుమరుగైపోయిన దశలో పైరసీ అనేది వచ్చింది. థియేటర్లలో దొంగచాటుగా కెమెరాలతో సినిమాలను రికార్డు చేసి బయట అమ్ముకోవడం మొదలయింది. ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేని లేదా ఇష్టపడని వ్యక్తులు సినిమాలు చూడటానికి ఈ మార్గాన్ని ఉపయోగించారు. సిడీ ప్లేయర్లు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్‌లు చివరికి స్మార్ట్‌ఫోన్‌ల దాకా ఈ టెక్నిక్ మరింత అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీతోపాటు పైరసీ కూడా అభివృద్ధి చెందింది. ఇటీవలి ఐ బొమ్మ కేసు సినీ ప్రియులను మాత్రమే కాకుండా మొత్తం సమాజం దృష్టినే ఆకర్షించింది. సమాజం, ముఖ్యంగా సోషల్ మీడియా రవికి మద్దతుగా, వ్యతిరేకంగా రెండుగా చీలిపోయింది. టీవీ, ఓటీటీలు, ప్రత్యేక ప్రదర్శనలు, ప్రీమియర్ ఈవెంట్లు, పాటల విడుదల మొదలైనవాటి ద్వారా ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్న సినిమా పరిశ్రమ మళ్ళీ పాత రోజుల్లో మాదిరిగా కుటుంబం ఆటవిడుపుగా థియేటర్లకు వెళ్ళగలిగే పరిస్థితిని తీసుకురావాలి.

అలా మార్చడం ద్వారా పాత సినిమా అనుభవాన్ని పునరుద్ధరించడానికి కలిసిరావాలి. అందరూ ఆర్థ్ధిక ప్రయోజనం పొందే సహేతుకమైన ఆదాయ భాగస్వామ్య నమూనాను గురించి ఆలోచించాలి. ఒక చిన్న బడ్జెట్ సినిమా బ్లాక్‌బస్టర్‌గా మారుతుందంటే, అన్ని వినోద అంశాలతో కూడిన సినిమాలను వీక్షకులు ఎల్లప్పుడూ అభినందిస్తారనే కదా అర్ధం. కాబట్టి మంచి సినిమా నిర్మించే సృజనాత్మకతతోబాటు దాన్ని జనబాహుళ్యంలోకి ఈ పద్ధతుల్లో తీసుకుపోయే ఐ బొమ్మ వంటి చాతుర్యాలు రెండూ ఉన్నాయి మన సమాజంలో. సినిమాను వినోద మాధ్యమంగా మాత్రమే కాకుండా దాని సందేశం ద్వారా సమాజానికి సేవ చేయడానికి కూడా ఉమ్మడి కృషి జరగాలి.

– గోపిరెడ్డి మధుసూదన్ రెడ్డి

(ఇండిపెండెంట్ జర్నలిస్ట్)

సామాజికంగానూ ఎదుర్కోవాలి

తెలుగు సినిమా పరిశ్రమను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య పైరసీ. సాంకేతికత పెరిగేకొద్దీ పైరసీ స్వరూపం కూడా మారుతూ వస్తోంది. సీడీలు, డీవీడీల నుంచి టొరెంట్లు, టెలిగ్రామ్ గ్రూపుల వరకు ఎన్నో రూపాల్లో పైరసీ తన ప్రతాపాన్ని చూపించింది. కానీ, గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ప్రియులకు, అదే సమయంలో నిర్మాతలకు గుదిబండగా, ఒకరకంగా చెప్పాలంటే వెన్నుపోటులా మారిన పేరు ‘ఐబొమ్మ’. కొత్త సినిమా విడుదలైందో లేదో, కొన్ని గంటల్లోనే హెచ్‌డీ క్వాలిటీతో జనం ముందుకు రావడం ఐబొమ్మ ప్రత్యేకత. ఈ పైరసీ సామ్రాజ్యానికి సూత్రధారిగా భావిస్తున్న గడ్డం రవి శంకర్ అలియాస్ ‘ఐబొమ్మ రవి’ అరెస్టు, అతని నేర సామ్రాజ్యం గురించిన వాస్తవాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఐబొమ్మ కేవలం ఒక పైరసీ వెబ్‌సైట్ మాత్రమే కాదు, అది ఒక పక్కా ప్రణాళికతో నిర్మించిన వ్యవస్థ. దీని పనితీరు చాలా పకడ్బందీగా ఉండేది.

1. కంటెంట్ సేకరణ: సినిమా విడుదలైన వెంటనే, లేదా కొన్నిసార్లు విడుదల కాకముందే, విదేశాల నుంచి డిజిటల్ ప్రింట్లను సంపాదించేవాడు. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లోని థియేటర్ల నుంచి లేదా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి హై-క్వాలిటీ ప్రింట్లను దొంగిలించేవాడు. సొంత సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను అభివృద్ధి చేసిన రవి, వీడియోల క్వాలిటీని ఓటీటీ స్థాయిలో ఉండేలా తయారు చేసేవాడు. ఇదే ఆ సైట్‌కు ప్రాచుర్యం రావడానికి ప్రధాన కారణం. 2.సర్వర్‌ల నిర్వహణ: భారతీయ చట్టాల నుంచి, సైబర్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రవి తన వెబ్‌సైట్ సర్వర్‌లను ఉక్రెయిన్, అమెరికా వంటి దేశాల్లో ఏర్పాటు చేశాడు. దీనివల్ల అతన్ని కనిపెట్టడం పోలీసులకు చాలా కష్టతరంగా మారింది. వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, డొమైన్ పేర్లను మారుస్తూ, సైబర్ నిపుణులకు కూడా సవాలు విసిరాడు. 3. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్: ఐబొమ్మ వేగంగా ప్రాచుర్యం పొందడానికి ముఖ్య కారణం దాని యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్. ఎలాంటి అనవసరమైన యాడ్స్ లేకుండా, సులభంగా సినిమాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా, కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కన్నా మెరుగైన అనుభూతిని యూజర్లకు అందించాడు. ఇది సాధారణ ప్రేక్షకులను సైతం ఐబొమ్మ వైపు ఆకర్షించింది.

ఈ పైరసీ వ్యాపారాన్ని రవి కేవలం వినోదం కోసం చేయలేదు. దీని వెనుక భారీ ఆర్థిక ప్రణాళిక ఉంది. ప్రధానంగా మూడు మార్గాల ద్వారా రవి ఆదాయం సంపాదించినట్లు తెలుస్తోంది. 1. విరాళాలు: వెబ్‌సైట్ నిర్వహణ ఖర్చుల కోసం అంటూ వినియోగదారుల నుంచి విరాళాలు సేకరించేవాడు. చాలామంది స్వచ్ఛందంగానే డబ్బు పంపేవారు. 2. ప్రకటనలు: కొన్నిసార్లు బెట్టింగ్ యాప్‌లు, ఇతర వెబ్‌సైట్ల ప్రకటనల ద్వారా కూడా భారీ మొత్తంలో డబ్బు సంపాదించాడు. పైరసీ వెబ్‌సైట్ల ద్వారా నెలకు రూ. 50 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు సంపాదిస్తే, అడల్ట్ అడ్స్, బెట్టింగ్/ క్యాసినో ప్రమోషన్లు, వీపీఎన్ అఫిలియేట్ డీల్స్ ద్వారా సంవత్సరానికి కోటి రూపాయల స్థాయి లోనే ఆదాయం సంపాదించినట్టు దర్యాప్తులో బయటపడింది. 3. క్రిప్టోకరెన్సీ: తన అడ్రస్ దొరక్కుండా ఉండేందుకు, రవి చాలా లావాదేవీలను క్రిప్టోకరెన్సీ రూపంలో నిర్వహించాడని కూడా పోలీసుల అనుమానం. ఈ డబ్బుతో అతను విలాసవంతమైన జీవితం గడుపుతూ, రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది.

ఈ కేసు మనకు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతోంది. సాంకేతికత మారితే పైరసీ కూడా రూపం మార్చుకుంటుంది. కానీ న్యాయవ్యవస్థ, అవగాహన, ప్రజల సహకారం కలిస్తే ఈ నెట్‌వర్కులను కూల్చడం అసాధ్యమేం కాదు. అందుకే పైరసీని కేవలం చట్టపరంగానే కాకుండా, సామాజికంగా కూడా ఎదుర్కోవాలి. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెరగాలి. ఉచితంగా సినిమా చూస్తున్నామనే ఆనందం వెనుక వేలాదిమంది కష్టం, వందల కోట్ల పెట్టుబడి నష్టపోతున్నాయనే వాస్తవాన్ని ప్రేక్షకులు గ్రహించాలి. చట్టపరమైన మార్గాల్లో, థియేటర్లలో లేదా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమా చూడటమే నిజమైన సినీ అభిమాని చేయాల్సిన పని. అప్పుడే పరిశ్రమ బాగుంటుంది. మరిన్ని మంచి చిత్రాలను మనం ఆశించగలుగుతాం. మరీ ముఖ్యంగా సినిమా టిక్కెట్ల ధరలు అందుబాటులో ఉంటే ఎవరైనా ఈ పైరసీ వీడియోల కోసం ఎందుకు ఎగబడతారు? 

— జీడిగుంట నాగేశ్వర్ రావు

(సీనియర్ జర్నలిస్ట్) 

దువ్వాడ శ్రీనివాస్ మాధురి బర్త్ డే వేడుకలపై పోలీసుల దాడులు.. భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత

 హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం  ది పెండెంట్ ఫామ్ హౌస్ పై రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా దువ్వాడ శ్రీనివాస్ మాధురి బర్త్ డే వేడుకలు  నిర్వహిస్తుండడంతో పోలీసులు దాడులు చేసి వారిని పట్టుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  అనుమతి లేకుండా దువ్వాడ శ్రీనివాస్ భార్య మాధురి బర్త్ డే పార్టీ నిర్వహించారు. మాధురి పుట్టిన రోజు వేడుకలను వైసిపి నాయకులతో పార్టీ నిర్వహించినట్టు సమాచారం.  ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ శాసన మండలి సభ్యుడిగా సేవలందిస్తున్నారు. ఆయన వైఎస్ఆర్ పార్టీకి చెందినవారు. రెండు సంవత్సరాల క్రితం మాధురిని శ్రీనివాస్ వివాహం చేసుకున్నాడు, 2024లో తన కుటుంబాన్ని విడిచిపెట్టి దువ్వాడ మాధురితో కలిసి ఉంటున్నాడు. డిసెంబర్ 12వ తేదీన మాధురి బర్త్  వేడుకలను మద్యంతో ఘనంగా నిర్వహించడంతో పోలీసులకు దొరికారు.