రెండో టి-20లో ఓటమి.. ఆటగాళ్లపై గంభీర్ ఆగ్రహం..
ముల్లాన్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన రెండో టి-20 మ్యాచ్లో భారత్ 51 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా అర్ష్దీప్ సింగ్ భారీగా పరుగులు (4 ఓవర్లలో 54) సమర్పించుకున్నాడు. అందులో 9 వైడ్లు కాగా.. ఒకే ఓవర్లో ఏడు వైడ్లు వేశాడు. దీంతో కోచ్ గౌతమ్ తీవ్రస్థాయిలో అసహనానికి గురయ్యారు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తూ.. చాలా కోపంగా కనిపించారు. ముఖ్యంగా అర్షదీప్కి షేక్ హ్యాండ్ ఇస్తున్న క్రమంలో గంభీర్ ముఖంలో కోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
After today’s loss, Gautam Gambhir was looking angry during the handshake with Indian players like Jitesh Sharma and Arshdeep Singh.
Look at the attitude of this man; rather than boosting the confidence of players, he was looking at them angrily 💔 pic.twitter.com/0nJTTZ8qfQ
— Tejash (@Tejashyyyyy) December 11, 2025
ఇక నిన్నటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేధించడంలో భారత్ విఫలమైంది. 19.1 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో ఐదు టి-20ల సిరీస్ 1-1గా సమం అయింది.