Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Ganobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Ganobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis

jojobet

betasus resmi

bets10

milosbet

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakır escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

jojobet

jojobet giriş

milosbet

Streameast

jojobet

milosbet

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Hiltonbet

Betpuan

Betnano

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

betasus

jojobet

bets10

jojobet

kingbetting

casibom güncel giriş

betsmove

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

betsmove

Holiganbet Giriş

jojobet

izmir escort

jojobet

Big Bass Bonanza

Big Bass

sekabet

grandpashabet

bets10

enbet

ultrabet

betcio

padişahbet

Hacklink satın al

interbahis

betebet

sekabet

kralbet

jojobet giriş

betoffice

padişahbet

restbet

perabet

elexbet

marsbahis

teosbet

kingroyal

1xbet

madridbet

madridbet giriş

cratosroyalbet

Pusulabet Giriş

meritking

dinamobet

marsbahis

lunabet

marsbahis

టిటిడికి ద్విచక్ర వాహనం విరాళం… స్థానికులకు ఈ–డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు

తిరుమల: హీరో మోటో కార్ప్ సంస్థ హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం టిటిడికి విరాళంగా అందించింది. ఆ సంస్థ ప్రతినిధులు విజయ్ కన్నన్, గణేష్ కుమార్ లు శ్రీవారి ఆలయం వద్ద వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను ఆలయ పేష్కార్ రామ కృష్ణకు అందజేశారు.

తిరుపతిలో స్థానికులకు ఈ–డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు

డిసెంబర్ 25 నుండి 27 వరకు ఈ–డిప్ నమోదుకు అవకాశం

29వ తేదిన టోకెన్లు కేటాయింపు 

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6, 7, 8వ తేదిల్లో రోజుకు 5వేల టోకెన్ల చొప్పున తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టిటిడి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25వ తేది ఉదయం 10 నుండి 27 వ తేది సాయంత్రం 5 గంటల వరకు ఈ- డిప్ నమోదుకు టిటిడి అవకాశం కల్పించనుంది.

తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికులు పైన పేర్కొన్న తేదీల్లో 1+3 విధానంలో ఈ-డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించడం జరుగుతుంది. ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించనున్నారు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం ఈ-డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేయడమైనది.

సయ్యద్ ముస్తాక్ అలీ టి20.. హైదరాబాద్ ఘన విజయం

పుణె: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్ సూపర్ లీగ్ గ్రూప్‌బి మ్యాచ్‌లో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. శుక్రవారం పుణెలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 18.5 ఓవర్లలో కేవలం 131 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (29), వికెట్ కీపర్ హార్దిక్ తమోర్ (29), సూర్యాన్ష్ షెడ్గె (28) తప్ప మిగతా వారు విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు.

అద్భుతంగా రాణించిన సిరాజ్ 3.5 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను పడగొట్టాడు. కెప్టెన్ చామ మిలింద్, తనయ్ త్యాగరాజన్ రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 11.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు అమన్ రావు, తన్మయ్ అగర్వాల్ జట్టుకు విధ్వంసక ఆరంభాన్ని అందించారు. చెలరేగి ఆడిన తన్మయ్ 40 బంతుల్లోనే ఏడు ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. అమన్ రావు 29 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఐదు బౌండరీలతో 52 పరుగులు సాధించాడు. దీంతో హైదరాబాద్ అలవోక విజయాన్ని అందుకుంది.

శివరాజ్ పాటిల్ కన్నుమూత

స్పీకర్, కేంద్ర మంత్రిగా విశేషానుభవం

ఏడుసార్లు ఎంపి అయిన మరాఠా నేత

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో కీలకం

లాతూరు ః కాంగ్రెస్ దిగ్గజ నేత శివరాజ్ పాటిల్ శుక్రవారం మృతి చెందారు. 90 సంవత్సరాల పాటిల్ లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. మహారాష్ట్రలోని లాతూరులో ఆయన స్వగృహం దేవ్‌ఘర్‌లో ఉదయం ఆయన కన్నుమూసినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. స్వల్ప అస్వస్థత తరువాత ఆయన తనువు చాలించారు. శనివారం (నేడు) అంత్యక్రియలు స్థానికంగానే జరుగుతాయని సన్నిహితులు తెలిపారు. సౌమ్యుడుగా పేరొందిన శివరాజ్ పాటిల్ ముంబై 26/11 ఉగ్రదాడుల దశలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ దశలో ఆయన నిర్లక్షం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు కుమారుడు శైలేష్ పాటిల్, కోడలు అర్చన, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అర్చన బిజెపి టికెట్‌పై పోటీ చేశారు. కాంగ్రెస్ నేత అమిత్ దేశ్‌ముఖ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

శివరాజ్ పాటిల్ జీవితాంతం కాంగ్రెస్‌లోనే కొనసాగారు. నెహ్రూ గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడుగా నిలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పలు కీలక మంత్రిత్వశాఖలను నిర్వహించారు. ఆయన ప్రజా జీవితం ఐదు దశాబ్దాల పాటు సాగింది. ముంబై ఉగ్రదాడుల దశలో 2008 సంవత్సరంలో ఆయన నవంబర్ 26 నాడు రాత్రి మూడు సార్లు దుస్తులు మార్చి కనబడటం వివాదాస్పదం అయింది. ఓవైపు భయానక ఉగ్రదాడులు జరిగితే హోం మంత్రికి తన వస్త్రధారణే ముఖ్యమైందా? అనే విమర్శలు తలెత్తాయి. అయితే ప్రతిపక్షాలు పాలసీ ఆధారంగా విమర్శలకు దిగాలి తప్పితే , దుస్తులను బట్టి కాదని ఆయన సమర్థించుకున్నారు. కానీ తరువాతి పరిణామాలలో ఈ వ్యవహారం రాద్ధాంతానికి దారితీసింది. రెండు మూడు రోజుల్లోనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పాటిల్ మృతి పట్ల ప్రముఖులు అనేకులు సంతాపం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్, ఎన్‌సిపి నేత, పాటిల్ సమకాలీనులు శరద్ పవార్ , మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇతర నేతలు పాటిల్‌కు నివాళలు తెలిపారు. 1935 అక్టోబర్ 12న జన్మించిన శివరాజ్ రాజకీయ యాత్ర లాతూరు మున్సిపాల్టీ ఛైర్మన్‌గా 1966లో ఆరంభం అయింది. తరువాత రెండుసార్లు అక్కడి నుంచే ఎమ్మెల్యే అయ్యారు. లాతూరు లోక్‌సభ స్థానం ఆయనకు పెట్టని కోట అయింది. ఏకంగా ఏడుసార్లు గెలిచారు. 1991 నుంచి 96 వరకూ లోక్‌సభ స్పీకర్‌గా అందరి మన్నన్నలు పొందారు. కేంద్రంలో ఆయన రక్షణ, హోం, వాణిజ్య, శాస్త్ర సాంకేతిక వంటి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పంజాబ్ గవర్నర్‌గా కూడా వ్యవహరించారు. ఈ ఏడాది మార్చిలోనే పాటిల్ సకుటుంబంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడిని కలుసుకున్నారు. ఇది లాంఛనప్రాయపు భేటీ అని చెప్పారు. అయితే కాంగ్రెస్‌లో దీనిపై అనేక విమర్శలు తలెత్తాయి. బహుభాషాకోవిదుడు అయిన పాటిల్ మరాఠా నేతలు ఎందరికో మార్గదర్శి, గురువు, రాజకీయ సలహాదారుడు అయ్యారు.

జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌.. రాధేకు రజతం

మన తెలంగాణ/ హైదరాబాద్: జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన రాధే లోయ రజత పకతం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న జాతీయ స్థాయి పోటీల్లో రాధే లోయ అసాధారణ ప్రతిభతో రజతం దక్కించుకుంది. బాలికల రోలర్ ఫ్రీస్టయిల్ ఈవెంట్3 విభాగంలో రాధే రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుది. జాతీయ స్థాయి పోటీల్లో ఆమెకు ఇది మూడో పతకం కావడం విశేషం. లోయ హైదరాబాద్‌లోని ఎకె హోమ్స్‌లో శిక్షణ తీసుకొంటోంది. ప్రముఖ టిటి క్రీడాకారిణి నైనా జైస్వాల్ తండ్రి అశ్వని కుమార్ పర్యవేక్షణలో లోయ సాధన కొనసాగుతోంది. కాగా బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన మోక్షిత్ రామ్ రెడ్డి ఓ స్వర్ణం, మరో రజతం గెలుచుకున్నాడు.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. భారత్ రికార్డు విజయం

దుబాయి: ఆసియా అండర్19 వన్డే కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో జరిగిన మ్యాచ్‌లో భారత యువ జట్టు 234 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 433 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన యుఎఇ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 199 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవి చూసింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో యుఎఇ ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితంచేశారు. యుఎఇ టీమ్‌లో ఉద్దిశ్ సురి అజేయంగా 78 పరుగులు చేశాడు. పృథ్వీ మధు (50) పరుగులు చేశాడు. మిగతా వారు విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో దీపేశ్ రెండు వికెట్లను పడగొట్టాడు.

సూర్య వీర విహారం..

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా తిగిన కెప్టెన్ అయుష్ మాత్రే (4) ప్రారంభంలోనే పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన అరోన్ జార్జ్‌తో కలిసి మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ స్కోరును పరిగెత్తించాడు. అరోన్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా సూర్యవంశీ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. యుఎఇ బౌలర్లను హడలెత్తించిన వైభవ్ వరుస ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్ 55 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. ఇదే సమయంలో అరోన్ జార్జ్‌తో కలిసి రెండో వికెట్‌కు 146 బంతుల్లోనే 212 పరుగులు జోడించాడు. జార్జ్ (69) పరుగులు చేశాడు. ఇక చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ 95 బంతుల్లోనే 14 సిక్సర్లు, 9 ఫోర్లతో171 పరుగులు సాధించాడు. ఇక విహాన్ మల్హోత్ర (69), వేదాంత్ త్రివేది (38), అభిజ్ఞాన్ 32 (నాటౌట్) కనిష్క్ (28) పరుగులు చేశారు. దీంతో భారత్ 433 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. ఈ క్రమంలో తన పేరిటే ఉన్న 425 పరుగుల అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టింది.

చర్చలా! విద్వేష రచ్చలా!

పార్లమెంట్ అన్నది ప్రజాసమస్యలపై విస్తృతంగా చర్చించవలసిన వేదిక. అంతేకాదు ఆ మేరకు పాలనా విధానాలపై మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యతాపరమైన చక్కని అవకాశం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి జాతీయ గేయం వందేమాతరం, ఎన్నికల సంస్కరణలు అనే రెండు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తున్నాయి. వాడిగా, వేడిగా సాగిన ఈ చర్చలు ఎంతవరకు నిజంగా ఫలప్రదమవుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. ఉదాహరణకు జాతీయ గేయం వందేమాతరంపై చర్చలో కొంతవరకు చారిత్రక, చట్టబద్ధమైన ప్రస్తావనలు తెరపైకి తీసుకువచ్చి తమ వాదన వినిపించడంలో విపక్షం విజయం సాధించిందనే చెప్పవచ్చు. కానీ పాలక పక్షం అడ్డగోలు వాదనలతో పూర్వ జాతీయ కాంగ్రెస్ నాయకులపై బద్ధ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోంది. వారికి నెహ్రూ ఫోబియా వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఎన్నికల సంస్కరణలపై చర్చ విషయానికి వస్తే ఇదివరకటి ఆరోపణల డ్రామాగానే దారితీసింది. ప్రజాతీర్పును హైజాక్ చేయడానికి ఎన్నికల కమిషన్ స్వతంత్రతను ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం బలహీనపర్చి దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈ విమర్శలను పాలక వర్గం కొట్టి పారేస్తూ అక్రమ చొరబాటుదార్లను, అనర్హులైన ఓటర్లను ఏరివేయడానికే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) దేశమంతా నిర్వహిస్తున్నట్టు సమాధానం ఇచ్చింది.

అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాల్లోంచి తొలగిస్తే ఎన్నికల్లో తమకు నష్టం వస్తుందన్న భయంతో విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ చట్టబద్ధమైన ప్రక్రియకు లేనిపోని అభ్యంతరాలు తెలుపుతోందని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై సందేహాలు వ్యక్తం చేస్తుంటారని, గెలిచినప్పుడు ఈ ప్రస్తావనే తీసుకురాకపోవడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని చాటుతుందని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించలేకపోయింది. ఏదెలాగున్నా అక్రమ వలసదారులను భారత ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి బయటకు పంపడమే ఎస్‌ఐఆర్ లక్షమని అమిత్ షా వాదించారు. ఎన్‌డిఎ ప్రభుత్వం అక్రమ వలసదారుల విషయంలో తన నిఘా (డిటెక్ట్), తొలగింపు (డిలీట్), బహిష్కరణ (డిపోర్టు) విధానాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగ పరమైన వివాదానికి దారితీస్తోంది. వాస్తవానికి ఓటర్ల జాబితాను క్రమబద్ధీకరించడమే ఎస్‌ఐఆర్ విధి. చనిపోయిన ఓటర్లను జాబితానుంచి తొలగించడం, డూప్లికేట్ ఐడికార్డులను తొలగించడం, వలసదారులైన ఓటర్ల సమస్యను పరిష్కరించడం మాత్రమే చేయాలని ఎస్‌ఐర్‌పై పిటిషన్ల విచారణలో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతేతప్ప ఓటరు పౌరసత్వం నిర్ణయించే హక్కు ఎన్నికల కమిషన్‌కు లేదు. కానీ అమిత్ షా ఓటరు జాబితాలో ఎవరి పేర్లు ఉండవో వారు బహిష్కృతులవుతారని తన సహజ ధోరిణిలో చెప్పడం వివాదాస్పదమవుతోంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ప్రక్రియను ఎస్‌ఐఆర్‌లో చొప్పించడమేమిటని విపక్షాలు నిలదీస్తున్నాయి. అంతేకాదు ఎస్‌ఐఆర్ పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి. ఇక చీఫ్ ఎలెక్షన్ కమిషనర్‌ను ఎంపిక చేసే ప్యానెల్ నుంచి చీఫ్ జస్టిస్‌ను ఎందుకు తొలగించారన్న ప్రశ్న విపక్షాల నుంచి రాగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎవరినీ సంప్రదించకుండా ఈ ఎంపిక ప్రత్యేకంగా జరిగిందని అమిత్ షా ఉదాహరణ చూపించారు. ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రి, విపక్ష నాయకుడుతో ఉన్న ప్రస్తుత ప్యానెల్ ఎంపికలో తేడా ఏమొచ్చిందని కూడా ప్రశ్నించారు. కొత్త చట్టంలో సిఇసి, ఇసిల మధ్య సమానత్వాన్ని తీసివేసి, ఇసిలను తొలగించే అధికారం సిఇసికి ఎలా కల్పించారు? అన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. ఇలా చేయడం నిజంగా ఎన్నికల నిర్వహణ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీయడమే అవుతుంది.

విపక్ష నాయకుడు ఓటు చోరీ జరిగిందని అంటూ కొన్ని అవకతవకలు బయటపెట్టారు. వీటికి ఎన్నికల కమిషన్ కానీ, పార్లమెంట్ చర్చల్లో ప్రభుత్వం కానీ వివరణ ఇవ్వకుండా మొఖం చాటేయడమే జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై అధికార పక్షం వేలెత్తి చూపించినప్పుడు సరైన నిర్మాణాత్మక వాస్తవాలు కనిపించాలి తప్ప ‘గతంలో మీరేం చేశారు?’ అని ఎదురు ప్రశ్న సరైన విధానం కాదు. అలాగే అధికార, ప్రతిపక్షవర్గాలు ఇంతవరకు ఉభయత్రా జరిగిన పొరపాట్లను గుర్తించి అవి మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకునే మార్గాలేమిటో అన్వేషించాలి. ఎన్నికల నిర్వహణ యంత్రాంగాన్ని జవాబుదారీగా, పారదర్శకంగా బలోపేతం చేయాలి. కానీ ఈ విషయంలో పాలకవర్గాలకు సరైన శ్రద్ధ ఉన్నట్టు తోచడం లేదు. విపక్షాల వాదనలను చిత్తు చేయడానికే పార్లమెంట్ సమావేశాలను వినియోగించుకుంటున్నారు. ద్వేష ప్రసంగాలతో కత్తులు దూసుకుంటున్నారు. స్వాతంత్య్ర పోరా టం కులమత వర్గాలకు అతీతంగా సమైక్య స్ఫూర్తితో ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. బ్రిటిష్ ప్రభుత్వ విభజించు పాలించు పన్నాగాలను చీల్చిచెండాడేలా కులమతవర్గాలకు అతీతంగా సమైక్య స్ఫూరితో స్వాతంత్య్ర పోరాటం ఎలా సాగిందో ఎవరికీ తెలియనిది కాదు. కానీ నేడు చారిత్రక వాస్తవాలను పక్కదారి పట్టించి విభజించు పాలించు విధానంతోనే ఓట్ల బ్యాంకు కొల్లగొట్టడానికి బూటకపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తుండడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తీరని కళంకం. పార్లమెంట్ కార్యకలాపాలకు నిమిషానికి రూ. 2.5 లక్షల వరకు ఖర్చవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కానీ మన ప్రజా ప్రతినిధులు వ్యర్థ ప్రసంగాలతోనే కాలం గడిపితే ఎంత దుర్వినియోగం అవుతుందో ఆత్మపరీక్ష చేసుకోవడం మంచిది.

ఉప్పల్‌లో నేడే గోల్‌గోల..

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రము ఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో స్టేడి యం ఆవరణలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుం ది. మెస్సీ పాల్గొనే మ్యాచ్‌లో భద్రతాపరమైన లోపాలకు అవకాశం లేకుండా ని ర్వహించాలని ఇప్పటికే తెలంగాణ బం దోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాల ని ఇప్పటికే సూచించారు. మరో వైపు మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ నేపథ్యంలో ఉ ప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను డీ జీపీ కూడా స్వయంగా పర్యవేక్షించా రు. శనివారం సాయంత్రం 4 గంటల కు మెస్సీ హైదరాబాద్ నగరానికి వస్తా రు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు.

మెస్సీతో పాటు రోడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), లూయిస్ సువారెజ్ (ఉరుగ్వే) స్టేడియంలో సందడి చేస్తారని, ఇందులో భాగంగా సింగరేణి ఆర్‌ఆర్- 9 తో, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్టు 20 నిమిషాల పాటు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుంది. 15 మంది చిన్నారులు మ్యాచ్‌లో పాల్గొంటారు. అందులో ఐదుగురు ట్రైనింగ్ పొందిన వారు కాగా మిగతా 10 మంది ప్రతిభ ఉండి ట్రైనింగ్‌కు దూరమైన (అండర్ ప్రివిలేజ్డ్) పిల్లలు. చివరి ఐదు నిమిషాలు సీఎం రేవంత్‌రెడ్డి మ్యాచ్‌లో బరిలో దిగుతారు. అనంతరం ఫుట్‌బాల్ క్లినిక్ ఉంటుందని, ఇందులో భాగంగా యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ మెస్సీ చిన్నారులకు ఫుట్‌బాల్ ఎలా నేర్చుకోవాలి? ఎలా ఆడాలి? ఏమేం చేయాలి? అనే చిట్కాలు చెబుతారు. మెస్సీ సమక్షంలో పెనాల్టీ షూటౌట్ నిర్వహిస్తారు. తరువాత విజేతలకు మెస్సీ బహుమతులు అందచేసిన అనంతరం జరిగే పరేడ్‌లో రేవంత్ రెడ్డి మెస్సీని సన్మానిస్తారు. దాదాపు గంట పాటు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఉండి రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేసి ఆదివారం ఉదయం ముంబయికి వెళతారు.

నాలుగు సెక్టార్లుగా ఉప్పల్ స్టేడియం

‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో మెస్సీ, సీఎం రేవంత్‌రెడ్డి, అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారులు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. మెస్సీ పర్యటన, ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటారు. ఒక్క ఉప్పల్ స్టేడియంలోనే రాచకొండ పోలీసులు సుమారు 2 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి అదనంగా స్టేడియం లోపల 1000 మంది వాలంటీర్లు విధుల్లో ఉండనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్, ఉప్పల్ స్టేడియం వరకు ప్రయాణించే మార్గాలు ఇప్పటికే ఖరారయ్యాయి. శనివారం రాత్రి కూడా ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనే మెస్సీ బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్యాలెస్ పరిసరాలను పోలీసులు పరిశీలించారు. ప్యాలెస్‌కు రాకపోకలు సాగించే మార్గాలు, అక్రమంగా వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉండడంతో సుమారు 300 మంది ట్రాఫిక్ పోలీసులను నియమించారు. 1500 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఎస్బీ, సీసీస్, ఎస్‌ఓటీ, ఆక్టోపస్ బలగాలను మోహరించనున్నారు.

100 మందికి ఫొటోలు తీసుకునే అవకాశం

ఈ నెల 13న సాయంత్రం లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌లో అడుగుపెడతారని నిర్వాహకురాలు పార్వతి రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే ’మెస్సీతో మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయనతో ఫొటోలు దిగవచ్చని అన్నారు. ఒక్కో ఫొటోకు రూ.9.95 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుందని, డిస్ట్రిక్ట్ యాప్‌లో ఆ టికెట్లు అందుబాటులో ఉన్నాయని, కేవలం వంద మందికి మాత్రమే ఫొటోలు తీసుకునే అవకాశం ఉంటుందని ‘ద గోట్ టూర్’ నిర్వాహక కమిటీ (హైదరాబాద్) సలహాదారు పార్వతి రెడ్డి ప్రకటించారు. డిస్ట్రిక్ట్ యాప్‌లో అన్ని రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని, క్రికెటర్లను ఈవెంట్‌కు ఆహ్వానించలేదని, స్టేడియంలో 3 గంటల పాటు ఈవెంట్ ఉంటుందని, కార్యక్రమంలో భాగంగా మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేశామని పార్వతి రెడ్డి వెల్లడించారు.

మెస్సీ పెనాల్టీ స్ట్రోక్

మెస్సీ స్టేడియంలోకి వచ్చే ముందు 2 గంటల పాటు సంగీత విభావరి జరుగుతందని పార్వతి తెలిపారు. హైదరాబాద్ కల్చర్‌ను ఇంటర్నేషనల్ స్థాయిలో పెట్టాలని నగరానికి చెందిన ఒక యంగ్ ర్యాపర్‌తో స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మరో ముగ్గురు సింగర్లు ఉంటారని అన్నారు. మెస్సీ ఉద్దేశం ఫుట్‌బాల్‌ను ప్రచారం చేయడమని దాని ద్వారా పిల్లల ఆరోగ్యం, ఫిట్‌నెస్, గ్రోత్ అనేది ఉంటుందని తెలిపారు. మెస్సీ పరేడ్ చేయడంతో పాటు పెనాల్టీ స్ట్రోక్ కూడా ప్రదర్శిస్తారని తెలిపారు. చివరగా మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు గోట్ కప్‌ను మెస్సీ అందజేస్తారని, అందులో ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఉంటారని పార్వతి రెడ్డి పేర్కొన్నారు.

చట్టసభల్లో చర్చలు పెడదారి

వందేమాతరం ఒక పదం. అది ఒక అక్షర సముదాయం మాత్రమే కాదు. అది ఒక నాటి తరాన్ని నిరంతరం నిద్రలేపి ఉద్యమాలలోకి ఉరికించిన అక్షర నినాదం. భారత స్వాతంత్య్ర సమరంలో వందేమాతరం అనే అక్షరాలు కోట్లాది భారతీయులను ఉత్తేజపరిచిన ఆయుధాలు. ఆ అక్షరాల అంకురార్పణకు సరిగ్గా 150 ఏళ్లు నిండాయి. ఇది భాతీయులందరికీ ఒక అద్భుతమైన సందర్భం. అప్పటి ఉద్యమాల జ్ఞాపకాలను నెమరువేసుకొని భవిష్యత్ తరాలకు దాని స్ఫూర్తిని అందించే కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి.

అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లో వందేమాతరంపై చర్చసాగింది. సందర్భం సరైనదే కాని పార్లమెంటుకు ప్రత్యేకించి లోక్‌సభ నాయకుడుగా భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఉద్దేశం మాత్రం దారితప్పింది. వందేమాతరం సంపూర్ణ సారాంశాన్ని కాకుండా కొందరి ప్రయోజనాలకోసం అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంక్తులను కుదించారని, ఇది దేశ ద్రోహమని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలను గుప్పించారు. ఇది ప్రతి విమర్శలకు, చర్చోపచర్చలకు దారితీసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సభ్యులు ఎదురు దాడి చేశారు. భారత స్వాతంత్య్ర సమరానికి నాయకత్వం వహించింది, వందేమాతరం గీతాన్ని సమర నినాదంగా మార్చింది కాంగ్రెస్ మాత్రమేనని జవాబు విసిరారు. ఇప్పటి భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ భారతీయ జనసంఘ్, దాని పితృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేశారని, స్వాతంత్య్ర సమరంలో ఆ శక్తులు ఎప్పుడూ భాగస్వాములు కాలేదని, కాంగ్రెస్ బిజెపిపై ధ్వజమెత్తింది. అయితే ఈ చర్చ పార్లమెంటుకు మాత్రమే పరిమితం కాలేదు. బయటి కూడా దాని ప్రతిస్పందనలు వినవస్తున్నాయి. కొంత కాలం వేరే విషయాలమీద చర్చ ఉండదు. కేవలం ఈ విషయం మీదనే చర్చ సాగుతుంది. ఇది ఏదో యథాలాపంగా నరేంద్ర మోడీ లేవనెత్తలేదు. దీని వల్ల నరేంద్ర మోడీ కొన్ని ప్రయోజనాలను ఆశిస్తున్నారు.

ఇప్పటి తరంలో నెహ్రూను దేశద్రోహిగా నిలబెట్టాలనేది, దీని వల్ల కాంగ్రెస్‌ను కూడా దోషిగా చూపించాలనే ఉద్దేశం. రెండోది పార్లమెంటు జరుగుతున్న సందర్భంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించాలి. అవి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. అందువల్ల ఈ వివాదాన్ని ముందుకు తెస్తే, ఈ సమావేశాలు మొత్తం దీని మీదనే నడిపించొచ్చు. అవసరమైన బిల్లులను గుట్టుచప్పడు కాకుండా ఆమోదింప జేసుకోవచ్చు. ఇది పాలకవర్గాలలో ఉండే లక్షణం. దీనినే నరేంద్ర మోడీ తన ఎత్తుగడగా భావించారు. దీనిని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని వ్యవహరించాలి. వందేమాతరం మీద చర్చను పక్కనపెట్టి ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించాలి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు ప్రియాంకా గాంధీ సరిగ్గానే వ్యక్తపరిచారు. వందేమాతరం మీద చర్చను పక్క పెట్టి ప్రజల అత్యవసర సమస్యలైన అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం లాంటి సమస్యలపై చర్చించాలని సభలో ప్రస్తావించారు.

ఇక్కడే పౌరసమాజం కూడా స్పందించాలి. పార్లమెంటు సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు, దాని ప్రభుత్వ సమాధానాలు, పరిష్కారాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడాలి. అయితే గత కొంత కాలంగా ఏదో ఒక వివాదాన్ని లేవనెత్తడం, దాని గురించి చాలా తీవ్రంగా మాట్లాడుకోవడం, వాకౌట్‌లు, సస్పెండ్‌లు, సమావేశాలు ముగియడం. ఇది రివాజు. ప్రభుత్వం తన ధోరణిలో తాను పని చేసుకుంటూ వెళ్లడం జరుగుతుందే కాని నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన ఉండడంలేదు. ఇది చాలా శోచనీయం. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు.

ప్రస్తుతం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నట్లు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఇందులో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరూ దీనికి అతీతులు కాదు. ముఖ్యంగా కేంద్రం సంపూర్ణంగా ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను విస్మరించింది.

ముఖ్యంగా దేశంలోని నూటికి 80 శాతం మందికి పైగా ప్రజలు సామాజిక, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందులో అందరినీ పట్టిపీడించేది అధిక ధరలు. గత పదేళ్లలో ధరలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పడానికి వీలు లేదు. నేను పేర్కొంటున్న ధరలు జాతీయ స్థాయి గణాంకాల నుంచి తీసుకున్నవి. ఇందులో మన రాష్ట్రానికి కొద్దిగా అటుఇటుగా తేడాలు ఉండవచ్చు. కాని పెరుగుదల మాత్రం సత్యం. నిత్యావసర వస్తువులు అందులో ముఖ్యంగా ఆహార వస్తువుల ధరలను పరిశీలిస్తే ఎంత తీవ్రంగా పెరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు. 2014 సంవత్సరంలో కంది పప్పు 70 రూపాయలు ఉంటే 2025 వచ్చేసరికి 150 రూపాయలకు పెరిగింది. మినపపప్పు 64 నుంచి 123 రూపాయలు కూడా దాటింది. శెనగ పప్పు 47 రూపాయల నుంచి 88 రూపాయలు చేరుకున్నది. అట్లాగే ఉల్లిగడ్డ, టమాట, బంగాళా దుంపలు 50 శాతం నుంచి 60 శాతం వరకు పెరిగాయి. వంట నూనెల ధరలు 3 రెట్లు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయో ప్రత్యక్షంగా మనం రోజూ చూస్తూనే ఉన్నాం.

ఇది ప్రతి భారతీయుడిపై పడుతున్న భారం. అయితే ఇదే స్థాయిలో కార్మికుల, ఉద్యోగుల వేతనాలు పెరగలేదు. ఒక సాధారణ ఉద్యోగి ప్రైవేటు రంగంలో 2014 రూ. 20 వేలు జీతం పొందితే, నేడు ఆ ఉద్యోగి రూ. 30 వేలు మాత్రమే అందుకుంటున్నాడు. అంటే 50 శాతం మాత్రమే పెరుగుదల కనిపిస్తున్నది.ఇది ఉద్యోగ భద్రత కలిగిన కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇందులో 30 నుంచి 40 శాతం ఇంటి అద్దెలకే పోతాయి. ఇద్దరు పిల్లలుంటే ప్రతి నెల మరో 30 శాతం వాళ్ల చదువులకు చెల్లించాలి. మిగిలిన 40 శాతం డబ్బులో తన రోజువారీ ప్రయాణ ఖర్చులు, ఇంట్లో అవసరమైన వైద్యం, మందుల ఖర్చులు. ఇవన్నీ పోను ఇంటి నిత్యావసర వస్తువులను ఎట్లా కొనుగోలు చేస్తాడనేది పెద్ద ప్రశ్న. అందుకే నూటికి 60 నుంచి 70 శాతం మంది ప్రతి రోజు ఒక నరకంలో జీవిస్తున్నారు. డిగ్రీలు, పిజిలు చదివి ప్రైవేటు విద్యాలయాల్లో, కంపెనీల్లో పని చేస్తున్న వందలాది మంది ప్రతి నెల అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నారు. కొంత మంది రెగ్యులర్ ఉద్యోగంతో పాటు, ఇతర చిన్నచితక ఉపాధిని వెతుకుంటున్నారు. స్విగ్గి, జొమాటో లాంటి సర్వీసులలో కూడా చేస్తున్నారు. రాపిడో ద్వారా బైకులు నడుపుకుంటున్నారు.

ఇవి కదా పార్లమెంటులో చర్చిచాల్సింది. దానికి కదా తమ సమయాన్ని వెచ్చించి పరిష్కారాలను ఆలోచించాల్సింది. దీనితో పాటు మరొక ముఖ్యమైన సమస్య నిరుద్యోగం. ఈ సమస్యకు పరిష్కారం చాలా అత్యవసరం. దేశంలోని కోట్లాది మంది నిరుద్యోగంతో సతమతమవుతున్నారు. మన హేతు విరుద్ధమైన చదువుల వల్ల ఇందులో చాలా మందికి వృత్తి నైపుణ్యం లేదు. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక, యాంత్రిక పెరుగుదల వల్ల మనిషి పని నుంచి వేరు పడిపోతున్నాడు. దానితో కొద్ది మంది మాత్రమే వృత్తిలోకి అడుగు పెట్టగలుగుతున్నారు. ఇందులో ఇప్పటికే భూములు, వ్యాపారాలు, ఇతర వనరులు ఉన్న వర్గాలు, కులాలు చాలా సులువుగా ఆర్థికంగా నిలుదొక్కగలుగుతున్నారు.ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా తేడా ఉంది. గ్రామాల్లో మరింత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగింది. చిన్న, సన్నకారు రైతులు దివాలా తీస్తున్నారు. ఈ భూములన్నింటిని కంపెనీలు, కార్పొరేట్లు కొనుగోలు చేస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ భూములన్నీ కార్పొరేట్ వ్యవసాయానికి మారబోతున్నాయి. దీని వల్ల ఇప్పటికే నూటికి 60 శాతం మంది యువతీ యువకులు గ్రామాలను వదిలి పట్టణాలకు, నగరాలకు చేరుతున్నారు. దాని ఫలితంగా భారత దేశంలో పట్టణీకరణ, నగరీకరణ వేగం పుంజుకుంటున్నది.

పెరుగుతున్న నిరుద్యోగం మరిన్ని సమస్యలకు కారణమవుతున్నది. ముఖ్యంగా మత్తు పదార్థాలకు, గంజాయికి యువలోకం బానిసగా మారిపోతున్నది. గతంలో లాగా తమ శ్రమతో సంపాదించుకొని కలో గంజో తాగి ఆత్మగౌరవంతో బతికే తరం పోతున్నది. పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో పరాన్న జీవులుగా మారిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది.

ఇట్లా చాలా సమస్యలున్నాయి. మహిళలు, బాలికల మీద పెరుగుతున్న లైంగిక దాడులు గతంలో కన్న పెచ్చుమీరిపోయాయి. పట్టణాల్లో, నగరాల్లో ఇది అంతు అదుపు లేకుండా పోతున్నది. 75 సంవత్సరాలు రాజ్యాంగం అమలు తర్వాత ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఒక చెత్త కాగితం లాగా చూస్తున్నయి. తమ వాదనకు పనికి వచ్చే ఆర్టికల్స్‌ను, తమ ప్రయోజనాలను కాపాడే అంశాలను అమలు చేస్తూ ప్రజల్లో మత, ప్రాంత కుల పరమైన విభజనలు తీసుకొచ్చి ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నారు. పేదల్లో అణగారిన వర్గాల్లో చీలికలను సృష్టించి, ప్రతిఘటన ఆలోచనలను, ఉద్యమాలను బలహీన పరుస్తున్నాయి.

ఇటీవల దళితుల, ఆదివాసుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలను పట్టించుకొని వాటిని నిరోధించడానికి చర్యలు లేవు. రిజర్వేషన్ల అంశాన్ని ఆధిపత్య కులాలను రెచ్చగొట్టడానికి వాడుకుంటున్నారు. అదే విధంగా ప్రతి అంశంలో ఒక కేంద్రీకృత వ్యవస్థలను తయారు చేస్తున్నారు. వ్యాపారాలను, వాణిజ్య అవకాశాలను తమ ప్రయోజనాలను కాపాడే వాళ్లకు ధారాదత్తం చేస్తున్నారు. దాని ఫలితంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. జరిగే అవకాశాలు పెరిగాయి. ఇటీవల ఇండిగో విమాన కంపెనీ నిర్వాకం మనకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఏ రంగమైనా, ఏ వ్యాపారమైనా గుత్తాధిపత్యంలోకి వెళితే అది ప్రజల ప్రయోజనాలను మింగేస్తుందని తేలిపోయింది. అదే విధంగా మతం, కులం, ప్రాంతం అన్ని కూడా అదే ఫలితాలను అందిస్తాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 38 ప్రకారం, దేశంలోని వనరులు, సంపద అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు, ప్రజలకు సమ న్యాయం అందాలని సూచిస్తున్నది. కాని దీనికి భిన్నంగా ఈ రోజు దేశంలో సంపద ఒక దగ్గర కేంద్రీకృతమవుతున్నది. పేదలు లేరు, పేదరికం లేదు అని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. కాని గ్రామాలు, బస్తీలు పరిశీలన జరిపితే ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో మనకు అర్థం కాదు. అన్ని విషయాలను ఇక్కడ ఏకరువు పెట్టడం సాధ్యం కాదు. అన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావించడం కూడా నా ఉద్దేశం కాదు. కాని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార బాధ్యత ప్రభుత్వాలదే. దానికి వేదిక పార్లమెంటు. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వాలు, శాసన సభలను, పార్లమెంటు వేదికను పరస్పర దూషణలకు, విమర్శలకు, ప్రతి విమర్శలకు కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం వెచ్చిస్తే మంచిది. 

మల్లేపల్లి లక్ష్మయ్య

ఇకపై ఎవరి భద్రత వారిదే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన సరికొత్త ‘జాతీయ భద్రతా వ్యూహం’ డాక్యుమెంట్‌పై ప్రపంచమంతటా చాలా ఆసక్తిని రేకెత్తించింది. ప్రత్యేకంగా యూరప్‌తో పాటు, అమెరికాకు సంప్రదాయికంగా సన్నిహితమైన ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా వంటి సుదూర దేశాలలోనైతే పెద్ద కలకలాన్ని సృష్టించింది. అమెరికా మద్దతుపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న తైవాన్‌ను భయపెట్టింది. ఈ ప్రభావాలను గమనించి కూడా ట్రంప్ తన డాక్యుమెంట్‌లో చెప్పిన వైఖరిని మార్చుకోకపోగా, ఇతర దేశాల పరిస్థితి, భవిష్యత్తు ఏ విధంగా ఉన్నప్పటికీ, తమ భవిష్యత్తు కోసం ఈ కొత్త వైఖరి తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు.

ఇంతకూ ఆ డాక్యుమెంట్‌లో ఏమున్నది? దాని ప్రభావాలు ఈ విధంగా ఎందుకున్నాయి? అనే ప్రశ్నలను చర్చించే ముందు కొన్ని మౌలికమైన విషయాలను చెప్పుకోవాలి. అమెరికా, యూరప్, ఇతర దేశాలతో కూడిన పాశ్చాత్య కూటమి, నాటో సైనిక కూటమి పరిస్థితి ఒకప్పటి వలే లేదు. అవి ఆర్థికంగా, సైనికంగా, రాజకీయంగా సుమారు 2010 వరకు మొత్తం ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని సాగించాయి. ముఖ్యంగా 1991లో సోవియెట్ యూనియన్, దానితోపాటు వార్సా సైనిక కూటమి పతనంతో వారికి ఎదురు లేకుండా పోయింది. అది, అంతకు ముందటి ద్విధ్రువ (అమెరికా, సోవియెట్ యూనియన్ రెండు ధ్రువాలుగా) ప్రపంచానికి బదులు కేవలం అమెరికా నాయకత్వాన ఏక ధ్రువ ప్రపంచంగా పరిణమించిన కాలం. కాని సుమారు 2010 వచ్చే సరికి ఆ దశ మారటం మొదలైంది. వ్లాదిమిర్ పుతిన్ బలమైన నాయకత్వంతో రష్యా తిరిగి పుంజుకోవటం మొదలైంది. మరొక వైపు చైనా కొత్త శక్తిగా ఆవిర్భవించింది. ఆ విధంగా మరొక దశాబ్దం గడిచే నాటికి, రష్యా, చైనాలు ఆర్థికంగా, సైనికంగా కూడా అమెరికా కూటమికి సవాలుగా మారసాగాయి. అమెరికాకు గల బలాలలో శాస్త్ర సాంకేతిక రంగం కూడా ముఖ్యమైనది కాగా, రష్యా కాకపోయినా చైనా అత్యాధునికమైన పరిశోధనలు, ఆవిష్కరణలతో అమెరికాకు సాటిగా ఎదగటమే గాక, కొన్ని రంగాలలో అంతకుమించి పోయింది.

ఒకవైపు ఇది జరుగుతుండగా, మరొక వైపు ప్రపంచ వ్యాప్తంగా మరొక విధమైన పరిణామాలు చోటు చేసుకోసాగాయి. అవి బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు. ఇండియా, ఆసియాన్ కూటమి, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, నైజీరియా, కొన్ని అరబ్ దేశాల వంటివి స్వయంగా బలపడుతూ, ఏ కూటమితో నిమిత్తం లేకుండా, స్వతంత్రంగా నిలబడి తమ ప్రయోజనాల కోసం ప్రయత్నిచటం మొదలు పెట్టాయి. అమెరికా కూటమికి ప్రత్యామ్నాయంగా రష్యా, చైనాలు తమకు చేయూత అందిస్తుండటంతో వారి ధైర్యం మరింత పెరగసాగింది. దానితో, అమెరికా ఆదేశాలను గతంలో వలే శిరసావహించే దశ తప్పిపో సాగింది. ఇటువంటి కొత్త పరిస్థితుల మధ్య బహుళ ధ్రువ ప్రపంచం అనే మాట విస్తరించసాగింది. ఈ మార్పుల ఫలితమే బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటివి. అదే పద్ధతిలో ఐక్యరాజ్య సమితిని, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలను అమెరికా నియంత్రణ నుంచి విముక్తం చేసి ఇతర దేశాలకు సమాన భాగస్వామ్యం, హక్కులు కల్పించాలనే వాదనలు పెరుగుతుండటం.

ఈ నేపథ్యాన్ని అంతా ఇంతగా వివరించటం ఎందుకంటే, ఈ పరిణామాలు సృష్టించుతున్న ఒత్తిడుల ప్రభావం వల్లనే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు తమ జాతీయ భద్రతా వ్యూహాన్ని మార్చుకోక తప్పటం లేదు. అది ఇపుడీ డాక్యుమెంట్ రూపంలో ముందుకు వచ్చినా, వాస్తవానికి ఇంతకు ముందే అందుకు ఆరంభం ట్రంప్ ఇచ్చిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాద రూపంలో కనిపించింది. అందుకు ఈ డాక్యుమెంట్ కొనసాగింపని స్వయంగా ట్రంప్ బృందం చెప్తున్నదే. వారు బహిరంగంగా ఒప్పుకోని విషయం, పైన పేర్కొన్న పరిణామాల ఒత్తిడి. అసలు ఆ నినాదమే చెప్తున్నదేమిటి? అమెరికా ఒకప్పుడు ‘గొప్పగా ఉండేది. ఆ గొప్పతనాన్ని ఇపుడు కోల్పోయింది. ఆ స్థితిని ‘తిరిగి’ సాధించాలని. ఆ ‘గొప్పతనం’ అంటే ఏమిటి? దానిని కోల్పోవటం ఎందువల్ల జరిగింది? తిరిగి సాధించటం ఏ విధంగా? ఈ విషయాలను మాత్రం వారు దాపరికం లేకుండా వివరించరు. అమెరికా గొప్పతనం పోవటం ట్రంప్ ‘మాగా’ నినాదం ఇచ్చిన 2017 నాటికే మొదలైంది. అందుకు కారణాలు పైన పేర్కొన్నవే. ఆ కారణాలు 2017 కన్న ఇప్పటికి గత ఏడేళ్లలో మరింత తీవ్రమయ్యాయి. వర్తమాన పరిస్థితులను బట్టి చూడగా మునుముందు ఇట్లానే తీవ్రమవుతూ పోగలవని చెప్పటం కష్టం కాదు. ఈ అంచనాలు ఆందోళన కలిగించటం వల్లనే ట్రంప్ బృందం పై డాక్యుమెంట్‌ను రూపొందించిందనాలి.

మరి గొప్పతనాన్ని తిరిగి సాధించటం ఎట్లాగన్నది చివరి ప్రశ్న. ఆ వ్యూహాన్ని అమలు పరచటం ఈ డాక్యుమెంట్‌తో నిమిత్తం లేకుండానే ట్రంప్ ఈ రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అమలు పరుస్తున్నారు కూడా. ఇక యుద్ధాలు చేయకపోవటం, ఇతరుల యుద్ధాలు కూడా మాన్పించటం, బయటి వారిని పంపివేయటం, కొత్తవారిని రానివ్వకపోవటం, బయటి దేశాల పెట్టుబడులను, కంపెనీలను ఆకర్షించటం, బయటకు పోయిన అమెరికన్ కంపెనీలను తిరిగి రప్పించటం, పేద దేశాలకే గాక అమెరికన్ కూటమి దేశాలకు సైతం ఉచిత సహాయాలు ఆపటం, అక్కర లేదనుకునే ఉద్యోగాల రద్దు, అన్ని దేశాలపై విపరీతంగా సుంకాల పెంపు, తమ ఉత్పత్తులు కొని తీరాలని ఇతరులపై ఒత్తిడి వంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఇటువంటి చర్యల వల్ల ట్రంప్ లక్షాలు నిజంగా నెరవేరుతాయా అనే దానిపై అమెరికన్ నిపుణులలోనే సందేహాలున్నాయి.

కనుక, చివరకు ఫలితాలు ఏ విధంగా ఉండవచ్చునో ఇంకా స్పష్టత లేకపోయినా, అదే ‘మాగా’ లో భాగంగా ఇప్పుడు ప్రకటించిన కొత్త డాక్యుమెంట్ నిజానికి స్వభావ రీత్యా కొత్తదేమీ కాదు. కాని అందులోని తీవ్రతలు, స్పష్టతలు కొత్తవి. ఇటువంటి తీవ్రతలే అమెరికా మిత్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదాహరణకు ఆ డాక్యుమెంట్‌లోని కొన్ని అంశాలను చూద్దాం. ఉక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికాకు ఆర్థిక, సైనిక భారాలే తప్ప ప్రయోజనం లేదనుకున్న ట్రంప్ దానిని ఆపే ప్రయత్నాలు మొదటి నుంచి చూస్తూ రాగా, అందుకు కలిసి రాని ఉక్రెయిన్, యూరప్‌లపై ఇప్పుడు తుది హెచ్చరికలనదగ్గవి జారీ చేస్తున్నారు. ముఖ్యంగా యూరప్ గురించి అయితే, అసలు వారి విధానాల కారణంగా యూరోపియన్ సంస్కృతి, వ్యక్తిత్వం, శక్తి ప్రపత్తులు, స్వాతంత్య్రం అన్నవే క్రమంగా అంతర్ధానమయ్యే పరిస్థితులున్నాయని హెచ్చరిస్తున్నారు. అవి నిలిచి ఉండడం కోసమంటూ అక్కడి తమ తరహా మితవాద పార్టీలను బాహాటంగా సమర్థిస్తున్నారు. అనగా తమ వలెనే అందరూ తక్కిన ప్రపంచంతో సంబంధాలను తగ్గించుకుని ఎవరికి వారుగా వ్యవహరించటమన్న మాట. ఇంత కాలం వలె మొత్తం యూరోపియన్ దేశాలన్నీ ఒక యూనియన్‌గా కొనసాగటం కూడా వృథా అన్నది ఈ డాక్యుమెంటు సూచన. దీనితో అక్కడి మితవాద పార్టీలలోనూ కొన్ని ఏకీభవించటం లేదన్నది, యూరప్‌కు సహజ సంప్రదాయమనుకునే ఉదారవాద ప్రజాస్వామిక విలువలను వదులుకోవటం వారికి ఇష్టం లేదన్నది వేరే విషయం. అయినా ఈ ప్రతిపాదనలు చేస్తున్న ట్రంప్ బృందం, ఇందుకు కొనసాగింపుగా, ఇకపై ఆయా దేశాల భద్రతను అవే చూసుకోవాలి తప్ప ఇంత కాలం వలే అమెరికాకు సంబంధం ఉండదని చెప్పటం వారిని తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటి వరకు సూచనప్రాయంగా చెప్తూ వచ్చిన ఈ మాట ఇప్పుడు డాక్యుమెంట్ రూపంలోకి వచ్చింది. ఆ మేరకు ఇంకా విధానాలనైతే రూపొందించలేదు గాని త్వరలో ఆ పని కూడా జరగవచ్చునన్నది అంచనా.

సరిగా ఇదే వైఖరి ఉక్రెయిన్ విషయంలోనూ కనిపిస్తున్నది. అందుకే పలు ప్రతిపాదనలతో ట్రంప్ ఇటీవల ఉక్రెయిన్‌తోపాటు యూరప్‌పైనా ఒత్తిడిని తీవ్రంగా పెంచారు. ఉక్రెయిన్ తన భూభాగాలను రష్యాకు వదులుకోవటంతోపాటు ఇతరత్రానూ రష్యా షరతులకు తలఒగ్గేట్లు చేయబూనుతున్నారాయన. ఇప్పటికే స్వయంగా ఆర్థికంగా, సైనికంగా బలహీనపడిన యూరప్‌కు దీనితో పాలుపోని పరిస్థితి ఎదురవుతున్నది. అదే సమయంలో మరొక స్థాయిలో ఆలోచించినప్పుడు, అమెరికాకు సంబంధించి గాని, యూరప్‌కు సంబంధించి గాని, కొంత కాలం నుంచి ఎదురవుతున్న ఈ పరిస్థితులన్నీ మౌలికంగా వారి ఉమ్మడి సామ్రాజ్యవాదం క్రమంగా బలహీనపడటం వల్ల ఎదురయ్యే ఒత్తిడుల ఫలితమే.

టంకశాల అశోక్

ఓట్లు కొనే అభ్యర్థులు వద్దే వద్దు

ఇటీవల కాలంలో ఎన్నికల్లో వస్తున్న మార్పులను పరిశీలిస్తే… నోటుతో ఓటు పొందడం నిలబడ్డ అభ్యర్థుల సంస్కృతిగా మారితే.. ఓటుతో నోటు పొందడం సామాన్య ప్రజల హక్కుగా మారిపోతుంది. దీంతో అభ్యర్థులు గెలిచిన తరువాత అధికారంతో అవినీతికి వైపు వెళ్తే, ఓటర్లు ప్రలోభాలకు గురై అంధకారంలోకి వెళ్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చివరికి అభివృద్ధి కూడా శూన్యం అవుతుంది. నిజమైన ప్రజా సేవ చేసే నాయకులు ఎన్నికలకు దూరమవుతున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు, మద్యం ప్రవాహంతో గొప్పగా వర్ధిల్లుతున్న పల్లె సంస్కృతి విధ్వంసం అవుతుంది. స్వార్థ రాజకీ యాలతో ఈర్షా, ద్వేషం, పగ, ప్రతీకారాలు పెచ్చరిల్లుతున్నాయి. నేటికి గ్రామీణ ప్రజల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలకు తీరలేదు. దీనికి ప్రధాన కారణం ఓటర్లు నీతి, నిజాయితీలతో ఓటు వేయకపోవడమే. మరోవైపు ప్రలోభ పెట్టే రాజకీయ నాయకులను తిరస్కరించకపోవడం కూడా. 

స్వాతంత్య్ర అనంతరం భారత దేశంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా స్థానిక స్వపరిపాలన కోసం మూడంచెల ‘పంచాయతీ రాజ్ వ్యవస్థ’ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయి. మన దేశంలో గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ భారత ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికనుగుణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండవసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. సార్వత్రిక వయోజన ఓటు హక్కును భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడికి కల్పించబడింది. ఇది కుల, జాతి, మత,లింగ, భాష వంటి భేదం లేకుండా కల్పించిన సార్వత్రిక సమానత్వ హక్కు. ‘ఒక ఓటు ఒక విలువ’ అనే సూత్రం ద్వారా ప్రజానిధులను ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం సామాన్యులకే ఇచ్చింది. ఓటనే ఆయుధంతో ప్రజాస్వామ్య విప్లవానికి పునాది వేసిన వ్యక్తి అంబేద్కర్. అణచివేయబడిన వర్గాల గొంతుకకు ప్రాణం పోసి కుల, మత గోడలను బద్దలుగొట్టే ప్రయత్నం చేశారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఓటు హక్కు కోసం పోరాటాలు జరిగాయి. భారతదేశంలో మాత్రం అంబేద్కర్ ఒక్కరే పోరాటం చేశాడు. ముఖ్యంగా ఈ దేశంలో మనుషులుగానే గుర్తించని బిసి, ఎస్‌సి, ఎస్‌టి సమాజాన్ని ఓటుతో విలువ లభించింది. నేడు ఆ ఓటు ఒక సరుకుగా, ఎన్నికల వ్యవస్థ ఒక మార్కెట్ గా మారి ఒక ధనస్వామ్య వ్యవస్థకు దారితీయడం జరుగుతుంది. తద్వారా అభివృద్ధి, సంక్షేమం ముసుగులో దోపిడీ రాజ్యమేలుతుంది. అంబేద్కర్ ‘నేను నా దేశ ప్రజలకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చాను. అది కత్తి కంటే పదునైంది. దాని సాయంతోనే పోరాడి రాజవుతారో… అమ్ముకుని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే’ చెప్పారు. ప్రజలంతా భవిష్యత్ పునర్నిర్మాణానికి నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సందర్భం ఇది.

ప్రలోభ పెట్టే నాయకుల్ని తిరస్కరిద్దాం

తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు రెండవ, మూడవ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలబడిన అభ్యర్థులు ఓటర్లను విపరీతంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. సామాన్యుల నుంచి బాగా చదువుకున్న విద్యావంతుల సైతం ప్రలోభాలకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. వివిధ కులాల దళారి నాయకులు తమ కులం ఓట్లు మీకేనని అభ్యర్థులకు చెబుతూ డబ్బులు వసూలు చేస్తూ కులాన్ని తాకట్టు పెడుతున్నారు. మరోవైపు దళారుల సహకారంతో అభ్యర్థులు నిత్యం మందు పార్టీలతో ఓటర్లను మత్తులో ముంచుతున్నారు. ఓటుకు వెయ్యి నుంచి ఐదు, పది వేలు పెట్టి ఓట్లు కొంటున్నారు. ఓటు ఒక వేలం పాటగా మారిపోయింది. అమాయక దళిత, బహుజనుల్ని ఓటు మార్కెట్‌లో బలి చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నికల్లో వస్తున్న మార్పులను పరిశీలిస్తే… నోటుతో ఓటు పొందడం నిలబడ్డ అభ్యర్థుల సంస్కృతిగా మారితే.. ఓటుతో నోటు పొందడం సామాన్య ప్రజల హక్కుగా మారిపోతుంది. దీంతో అభ్యర్థులు గెలిచిన తరువాత అధికారంతో అవినీతికి వైపు వెళ్తే, ఓటర్లు ప్రలోభాలకు గురై అంధకారంలోకి వెళ్తున్నారు.

ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చివరికి అభివృద్ధి కూడా శూన్యం అవుతుంది. నిజమైన ప్రజా సేవ చేసే నాయకులు ఎన్నికలకు దూరమవుతున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు, మద్యం ప్రవాహంతో గొప్పగా వర్ధిల్లుతున్న పల్లె సంస్కృతి విధ్వంసం అవుతుంది. స్వార్థ రాజకీయాలతో ఈర్షా, ద్వేషం, పగ, ప్రతీకారాలు పెచ్చరిల్లుతున్నాయి. నేటికి గ్రామీణ ప్రజల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలకు తీరలేదు. దీనికి ప్రధాన కారణం ఓటర్లు నీతి, నిజాయితీలతో ఓటు వేయకపోవడమే. మరోవైపు ప్రలోభ పెట్టే రాజకీయ నాయకులను తిరస్కరించకపోవడం కూడా. ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజలు ప్రతి వస్తువుపై కట్టే పన్నుల డబ్బుల ద్వారా జరుగుతుంది. ఇది ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకులు సొమ్ము కాదు. దీన్ని ఓటర్లు గుర్తెరగాలి. ఎన్నికలు ప్రతీ ఐదేళ్లకోసారి వస్తుంటాయి. ఈ ఐదు సంవత్సరాల కాలానికి అభ్యర్థులిచ్చే డబ్బు, మందు రోజుకు ఒక రూపాయి విలువ కూడా కాదు. కావున ఓటర్లు యాచకులుగా మారవద్దు. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దు. అసలు ప్రలోభ పెట్టే నాయకుడు ఎప్పటికీ ప్రజానేత కాదు. కావున మందు, డబ్బుతో ప్రలోభాలకు గురిచేసే నాయకులను తిరస్కరిద్దాం. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగమై నిజాయితీగా ఓటేసి గ్రామాభివృద్ధికి పాటుపడదాం.

సంపతి రమేష్ మహారాజ్

79895 79428