elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcratosroyalbetcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahisatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

efesbet

jojobet

jojobet 1120

kingroyal

parobet

betplay

Kadıköy Escort

cratosroyalbet

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

casinowon

betcio

padişahbet

deneme bonusu

galabet

ultrabet

grandpashabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

vaycasino

hit botu

kingroyal

ultrabet

madridbet

meritking

grandpashabet

kingroyal

meritking

kingroyal

madridbet

teosbet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

casibom

izmir escort

betlike

pusulabet

Sweet Bonanza

Casibom giriş

తల్లితో చనువుగా ఉన్నాడని వ్యక్తిని చంపి… పోలీసులకు దృశ్యం సినిమా చూపించిన కుమారుడు

బెంగళూరు: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమె ప్రియుడిని కుమారుడు హత్య చేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం విజయపుర ప్రాంతంలో జరిగింది. సింధగి తాలూకాలోని ఓ గ్రామంలో సిద్ధనగౌడ, మల్లమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు అప్పుగౌడ అనే కుమారుడు ఉన్నాడు. మల్లమ్మతో భూస్వామి మహదేవప్ప చనువు ఉండేవాడు. దీంతో మహదేవప్పను హత్య చేయాలని అప్పుగౌడ నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రితో కలిసి మహదేవప్పను హత్య చేసి గ్రామ శివారులో పొలంలోని కంపలో పడేశారు. హత్య చేసిన అనంతరం ఒకే మాట మీద ఉండడంతో విచారణలో జవాబులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హత్య చేసే సమయంలో ఎక్కడా కూడా మొబైల్ ఫోన్లను ఉపయోగించలేదు. పోలీసులు కేసు నమోదు విచారణ ప్రారంభించారు. గ్రామస్థుల సమాచారం మేరకు మల్లమ్మ, సిద్ధనగౌడ, అప్పుగౌడను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దృశ్యం సినిమాలో మాదిరిగా ఒకే రకమైన సమాధానాలు చెప్పడంతో పోలీసులు విచారణ జాప్యమైంది. న్యాయస్థానం అనుమతి తీసుకొని వారి బ్రెయిన్ మ్యాపింగ్ పాలిగ్రఫి పరీక్షలు నిర్వహించారు. వీరి నేరం బయటపడడంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

2047లో 1947 పునరావృతం అవుతుందా?

మూడు నాలుగేళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు ముస్లిం మహిళా విలేఖరి ఆర్ఫా ఖానమ్ షేర్వానీకి తన కవిత వినిపించి, అభిప్రాయం చెప్పమన్నాడు. ఆ కవిత పాఠం ఉర్దూలో ఇలా ఉంది.

తస్లీమాత్ మా తస్లీమాత్

తూ భరీ హై మీఠీ పానీ సే

ఫల్ ఫూలోంకి షదాబీ సే

దఖ్కిన్ కీ ఠండీ హవావోంసే

ఫసలోంకి సుహాని ఫిజావోంసే

తస్లీమాత్ మా తస్లీమాత్

తేరీ రాతే రోషన్ చాంద్ సే

తేరి రౌనక్ సబ్జె ఫామ్ సే

తేరీ ప్యార్ భరీ ముస్కాన్ హై

తేరి మీఠా బహుత్ జుబాన్ హై

తెరి బాహోం మే మేరీ రాహత్ హై

తేరే కద్మోం మే మేరీ జన్నత్ హై

తస్లీమాత్ మా తస్లీమాత్

ఈ కవిత వినిపించి దానిపై ఆ నాయకుడు మహిళా విలేఖరి అభిప్రాయాన్ని అడిగాడు. ఆమె ఈ పాటలోని మాతృత్వం పట్ల వ్యక్తమైన ఉదాత్త భావాలను చాలా ప్రశంసించింది. దీన్ని దేశభక్తి గేయంగా పెడితే ఎలా ఉంటుంది అని అడిగితే ఆమె చాలా బాగుంటుంది అన్న జవాబిచ్చింది.

అప్పుడు ఆ రాజకీయ నాయకుడు ఈ రచన జాతీయ గీతమైన వందేమాతరం కి ఉర్దూ అనువాదం. సుజలాం, సుఫలాం, మలయజ శీతలం, సస్యశ్యామలాం, శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీ, ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం, సుహాసినీం, సుమధుర భాషిణీం అన్న భావాలనే ఈ రచన వ్యక్తీకరిస్తోంది అని చెప్పాడు. మరి మీరు వందేమాతరం గీతాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని నిలదీశాడు. మహిళా విలేఖరి ఆర్ఫా ఖానమ్ షేర్వానీ నోట మాట పెగల్లేదు. వందేమాతర గీతం పట్ల కొన్ని వర్గాల్లో వ్యక్తమౌతున్న వ్యతిరేకతలోని డొల్లతనాన్ని బరిబాతలగా బట్టబయలు చేసిన ఆ రాజకీయ నాయకుడు ప్రస్తుతం బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.

కత్తి మెడమీద పెట్టినా భారత్ మాతాకీ జైయ్ అనేది లేదనే అసదుద్దీన్ ఒవైసీ, ఈ దేశాన్ని తల్లిగా భావించడం మా మతం ఒప్పదు కాక ఒప్పదనే మతోన్మాదులకీ తెలియని విషయం ఒకటుంది.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ జాతీయగీతం ‘అమార్ శోనార్ బాంగ్లా లో ఓ మా (నా తల్లీ) అన్న పదం నాలుగు సార్లు వస్తుంది. దాన్ని పాడేందుకు మతాంధ జమాతె ఇస్లామీ బంగ్లాదేశ్ కి, మహ్మద్ యూనస్ కి, మరే ఇతర మత సంస్థకీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. దక్షిణాన ఉన్న శ్రీలంక తూర్పు భాగమంతా ముస్లింలే ఉంటారు. వారెవరికీ శ్రీలంక జాతీయగీతం

శ్రీలంకా మాతా.. అప శ్రీలంకా

నమోనమోనమో నమో మాతా

సుందర సిరిబరిని

సురేంది అతి శోభమనా లంకా

ధాన్య ధనయనేకా

మాయి పలతురు పిరిజయ భూమియల రమ్య జీవనయే మాతా

పాడటంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. మతం అడ్డు రాలేదు. ఈ జాతీయ గీతంలో దేశాన్ని తల్లిగా భావించడం జరిగింది. శ్రీలంక ముస్లిములెవరూ అభ్యంతర పెట్టడం లేదు.

ప్రపంచంలోని అతిపెద్ద ముస్లిం దేశాల్లో ఒకటైన ఇండోనేసియా జాతీయగీతంలో ఒక చరణం ఇండొనీసియా పవిత్ర భూమి, నా పవిత్ర మాతృ భూమి కోసం నేను నిలుచుంటాను అని స్పష్టంగా చెబుతుంది. ఇండోనేసియా ముస్లిం తన దేశాన్ని మాతృభూమిగా భావిస్తాడు. వందేమాతరం అన్న భావాన్నే నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా పాడతాడు.

బంగ్లా ముస్లింలకు, శ్రీలంక ముస్లింలకు, ఇండోనేసియా ముస్లింలకు దేశాన్ని తల్లిగా సంబోధించడంలో ఇబ్బంది లేదు. తల్లికి వందనం అనడంలో మతం అడ్డు రాదు. కానీ మన దేశంలోని ముస్లింలకే అభ్యంతరం ఎందుకు? ఈ దేశాలకు దేశాన్ని అమ్మ అనడంతో, అమ్మకు వందనం అనడంలో అడ్డం రాని మతం భారతదేశంలోని కొందరు ముస్లింలకే ఎందుకు వస్తుంది?

వందేమాతరం మొత్తం గీతంలో దేశాన్ని దుర్గగా, లక్ష్మిగా, సరస్వతిగా అభివర్ణించడం మా మతానికి విరుద్ధం అనే వారు బ్రిటన్ కి ఆవురావురుమని వెళ్లి అక్కడి పౌరసత్వం కోసం ఎగబడి, కలబడి అక్కడి నేషనల్ యాంథమ్ గాడ్ సేవ్ ది కింగ్ ని పాడతారే తప్ప గాడ్ అనడం కుదరదు అల్లాయో, ఖుదాయో అంటామని ఎప్పుడైనా, ఎక్కడైనా వాదించారా? లేదా వారు గాడ్, అల్లాహ్ ఒకటేనని అంగీకరిస్తారా? పైగా బ్రిటన్‌లోని ముస్లింలలో ఎక్కువమంది పాకిస్తానీలు (ముఖ్యంగా ఆక్రమిత జమ్మూకశ్మీర్‌కి చెందిన మీర్ పురీలు), బంగ్లాదేశీలు, భారతీయులు.

వీరంతా స్వాతంత్య్రానికి ముందు వందేమాతరంను వ్యతిరేకించిన వారే. భారతీయ ముస్లింలలో చాలా మంది ఇప్పుడూ వ్యతిరేకిస్తున్నారు. కానీ అక్కడ అల్లాహ్‌ని కాక గాడ్‌ని ప్రార్థించడానికి వారికి ఎలాంటి ఇబ్బందీ లేదన్నదే ముఖ్యం.

దుర్గ, లక్ష్మి, సరస్వతి వంటి పేర్లను పలకవలసిన అవసరం లేకుండా కేవలం తొలి చరణాన్నే భారతదేశం స్వీకరించింది. దానిని రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులైన ముస్లింలు అందరూ ఆమోదించారు. అలాంటి దాన్ని పలకడానికీ కూడా ఎందుకు అభ్యంతరం? ఈ గీతం ఆలపిస్తే లేచి నిలబడటానికి ఏమిటి ఇబ్బంది? దీనికి జవాబు అడగాల్సిన సందర్భం వచ్చింది.

పూర్తి వందేమాతర గీతాన్ని 1923వరకూ కాంగ్రెస్ పార్టీ పాడుతూ వచ్చింది. కాకినాడ కాంగ్రెస్ మహాసభల్లో మౌలానా మహ్మదలీ అభ్యంతరపెట్టడంతో వివాదం మొదలైంది. అంతకు ముందు హిందువులు, ముస్లింలు కలిసి ఈ గీతాన్ని పాడారు. పైగా కాకినాడ మహాసభలకు మహ్మదలీని మేళతాళాలతో ఊరేగించారు. ఆయనకు సంగీత వాయిద్యాలు ఇస్లాం మత విరుద్ధమని గుర్తుకు రాలేదు. మతవాద రాజకీయాల ముందు మోకరిల్లిన నాటి కాంగ్రెస్ నేతలైన గాంధీ, నెహ్రూలు అక్టోబర్ 1937 లో రెండు ముక్కలనే తూతూమంత్రంగా పాడి, తంతును నిర్వహించి సరిపుచ్చాలని నిర్ణయించారు. అంత చేసినా సరిగ్గా పదేళ్లకి 1947 లో దేశం రెండు ముక్కలైంది.

ముందు వందేమాతరం ముక్కలైంది. తరువాత దేశం ముక్కలైంది. అవునా కాదా?

ఈ ప్రశ్నలను వందేమాతర గీత రచనకు 150 సంవత్సరాలైన సందర్భంలో మనల్ని మనం వేసుకోవాలి. స్వాతంత్య్ర స్వర్ణోత్సవ వేడుకల సమయంలో, వందేమాతర గీత రచనకు 150 ఏళ్లవుతున్న సందర్భంలో 2047 లో 1947 పునరావృతం కాకూడదని కోరుకుందాం. పూర్తి వందేమాతర గీతాన్ని సగర్వంగా పాడదాం.

కస్తూరి రాకా సుధాకర్ రావు

(జర్నలిస్ట్)

సిరీస్‌పై భారత్ గురి

సౌతాఫ్రికాకు చావోరేవో

నేడు చివరి టి20

అహ్మదాబాద్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా చివరి టి20 మ్యాచ్ జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 21 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. లక్నోలో బుధవారం జరగాల్సిన నాలుగో టి20 మ్యాచ్ పొగమంచు కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. ఇలాంటి స్థితిలో సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి సఫారీ టీమ్‌ను నెలకొంది. ఇక భారత్ ఈ మ్యాచ్‌లో ఓడినా పెద్దగా నష్టం ఉండదు. 22తో సిరీస్ సమంగా ముగుస్తోంది. ఒకవేళ సౌతాఫ్రికా పరాజయం పాలైతే సిరీస్‌ను కోల్పోక తప్పదు. దీంతో తీవ్ర ఒత్తిడిలో కూరుకు పోయింది. ధర్మశాలలో ఘన విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులో కూడా గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలనే లక్షంతో ఉంది. అయితే స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ చివరి టి20లో ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఒకవేళ గిల్ దూరమైతే సంజు శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శివమ్ దూబె, జితేశ్ శర్మ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అంతేగాక హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, హార్దిక్, అర్ష్‌దీప్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సౌతాఫ్రికాలో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. క్వింటన్ డికాక్, మార్‌క్రమ్, రిజా హెండ్రిక్స్, స్టబ్స్, బ్రెవిస్, జాన్సన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు.దీంతో భారత్‌కు గట్టి పోటీ ఎదురైనా ఆశ్చర్యం లేదు. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌కు కూడా పొగమంచు ప్రమాదం పొంచి ఉంది. సాయంత్ర వేళ మంచు కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈ మ్యాచ్ కూడా సాగుతుందా లేదా అనేది సందేహంగా మారింది.

దేశ సమైక్యతకు ప్రతీక

భావోద్వేగాలను రెచ్చగొడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ సున్నితమైన అంశాలతో రాజకీయాలు చేస్తోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని చరిత్రను వక్రీకరించడంలో దిట్ట అయిన బీజేపీకి భారత స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం లేదనేది వాస్తవం. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహా నేతల మధ్య విభేదాలున్నట్టు అసత్య ప్రచారం చేసిన బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ వేదికగా ‘వందేమాతరం’ గీ తాన్ని వక్రీకరించింది. వందేమాతరం 150 ఉత్సవాల సందర్భంగా అవాస్తవాలతో అధికార బీజేపీ దేశ భావితరాలను తప్పుదోవ పట్టించేలా, చరిత్రను తప్పుగా చిత్రీకరించేందుకు చేసిన కుట్రలను బాధ్యతగల పార్టీగా కాంగ్రెస్ వాస్తవాలతో ఎండగట్టింది. వందేమాతరం కేవలం ఒక నినాదం కాదు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలను ఏకంచేసిన ఒక భావజాలం, ఒక మంత్రశక్తి. దేశం కోసం త్యాగానికి సిద్ధపడిన కోట్లాది భారతీయుల హృదయ స్పందన.

భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రాణం పోసిన గీతం. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రను వక్రీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం పవిత్రమైన ‘వందేమాతరం’ గీతాన్ని కూడా భావోద్వేగాలకు వినియోగించుకునే దురుద్దేశంతో మతపరంగా ప్రజలను రెచ్చగొట్టాలని చూడడం దురదృష్టకరం. వందేమాతరం భావనను భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే స్వీకరించింది. బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతం నియంతృత్వ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో జాతీయతకు సంకేతంగా నిలిచింది. వందేమాతరంతో భారత స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఉద్యమకారులను ప్రోత్సాహించిన కాంగ్రెస్ పార్టీ ఎంతో బాధ్యతాయుతంగా మెలిగి ఆ గీతాన్ని సంకుచిత దృష్టితో దుర్వినియోగం చేయలేదు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాం గ నిర్మాతలు దేశభక్తిని ప్రజాస్వామ్య విలువలతో ముడిపెట్టారు. వందేమాతరం జాతీయ గీతం కాకపోయినా, దానికి అంతే సముచిత గౌరవం, స్థానం కల్పించారు. ఇది దేశంలోని విభిన్న మతాలు, కులాలు, వర్గాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రాంతాలను గౌరవించే రాజ్యాంగాత్మక సమతుల్యానికి నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ఈ సమతుల్యాన్ని ఎప్పటికీ కాపాడుతూనే వచ్చింది. అయితే పవిత్రమైన వందేమాతరం గీతాన్ని కూడా మత కోణంలోనే చూస్తున్న బీజేపీ తమ సిద్ధాంతాలతో విభేదించే వారిని దేశద్రోహులుగా ముద్రవేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. దేశాన్ని ప్రేమించడంతో పాటు ఎవరు ఏమి చేయాలో, ఎలా వ్యవహరించాలో, ఏమి తినాలో, ఏ గీతం పాడాలో అంశాలను కూడా తామే నిర్ణయిస్తామన్నట్టు వ్యవహరిస్తున్న బీజేపీ పోకడలను కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ సహించదు. వారి నుండి విద్వేష పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలో దేశం లేదనే సత్యాన్ని ఆ పార్టీ గ్రహించాలి.

జవహర్ లాల్ నెహ్రూ ఒత్తిడికి తలొగ్గి వందేమాతరం గీతాన్ని కుదించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ లో బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించి అవాస్తవాలు చెప్పారు. ఎవరికీ అభ్యంతరాలు లేకుండా, అందరికీ ఆమోదయోగ్యం ఉండేలా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆర్‌ఎస్‌ఎస్ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సమక్షంలోనే వందేమాతరం గీతంలో చరణాలకు రాజ్యాంగ పరిషత్తు ఆమోదం తెలిపింది. ఈ సవరణలపై జాతీయగీతం రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవ చరిత్ర ఇది అయితే బీజేపీ నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగా నెహ్రూను లక్ష్యంగా చేసుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఒక వేళ నరేంద్ర మోదీ చెప్పినట్టే నెహ్రూ కావాలనే గీతాన్ని కుదిస్తే రాజ్యాంగ పరిషత్తులో ఇతర సభ్యులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదన్న ప్రశ్నకు సమాధానం బీజేపీ నేతలవద్ద లేదు. వందేమాతరం గీతం చరణాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న సమయంలో పార్టీ సభ్యులుగా మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, ఠాగూర్ కూడా ఉన్నారనే వాస్తవాలను తొక్కిపెట్టి కేవలం నెహ్రూ లక్ష్యంగా పవిత్రమైన పార్లమెంట్ వేదికగా బీజేపీ అసత్యాలను చెప్పింది.

దేశ స్వాతంత్య్ర సమరంలో ఏ పాత్రా పోషించని బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు వందేమాతరంపై తమకే పేటంట్ హక్కులున్నట్టు వ్యవహరిస్తున్నా రు. 1875లో బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతాన్ని 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటి సారిగా కాంగ్రెస్ సమావేశంలోనే ఆలపించారు. కాంగ్రెస్ ఈ గీతాన్ని ఆలపించదని ఆరోపిస్తున్న బీజేపీ వారు ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు..? అంతేకాదు నెహ్రూపై నిరాధార ఆరోపణలు చేస్తున్న బీజేపీ దేశం స్వాతంత్య్రం కోసం నెహ్రూ 12 ఏండ్లు జైలు జీవితం గడిపారనేది వాస్తవం కాదా చెప్పాలి. సంఘ్ పరివార్ సభ్యులు, బీజేపీ నేతలెవరైనా స్వాతంత్య్రం కోసం జైళ్లకి వెళ్లారా? వాస్తవాలు ఇలా ఉంటే కేవలం వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ వందేమాతరం గీతంపై రాజకీయాలు చేస్తోంది.

పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం నల్ల చట్టాలను రూపొందిస్తోంది. వీరి పాలనలో నిరుద్యోగం రికార్డు స్థాయికి పెరిగిపోయింది. మహిళలకు భద్రత, సమానత్వం కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యింది. దళితులు, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు. మైనార్టీలు మోదీ పాలనలో అభద్రతా భావంతో జీవిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఆహార భద్రత, ఉపాధి హామీ, విద్యా హక్కు వంటి ప్రజా సంక్షేమ పథకాలు బీజేపీ పాలనలో నీరుగారిపోతున్నాయి. నిత్యావసర ధరలు ఆకాశనంటడంతో సామాన్య ప్రజల జీవితాలు దుర్భరం అవుతున్నాయి.

సామాన్యుడి చేతిలో అస్త్రం అయిన సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశారు. విదేశీ వ్యవహారాల్లో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. స్వయం ప్రతిపత్తి గల ఈడీ, ఐటీ, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రత్యర్థులపై రాజకీయ కక్ష కోసం వాడుకుంటూ దుర్వినియోగం చేస్తోంది. బీజేపీ ప్రభుత్వంపై దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన దశలో దాన్ని పక్కదారి పట్టిస్తూ వందేమాతరం గీతంపై బీజేపీ ప్రభుత్వం వివాదాన్ని సృష్టిస్తోంది.

వందేమాతరం మతాల మధ్య విభేదాల కోసం కాదు.ఈ గీతం దేశంలోని గంగా జమున సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. స్వాతంత్య్ర సమరంలో ప్రజలు దేశభక్తితో మతాలకు అతీతంగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తే ఇప్పుడు బీజేపీ దీనికి మతం రంగం పులుముతోంది. వందేమాతరం గీతం దేశ భక్తి, మత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, భావ ప్రకటనకు ప్రతీకగా నిలిచింది. అయితే వీటిలో ఏ ఒక్కటినీ ఆచరించని బీజేపీ ఇప్పుడు వందేమాతరం గీతంపై రాజకీయాలు చేయడం హాస్యాస్పదం. వందేమాతరం అనేది దేశ ప్రజలందరికీ చెందిన భావన. ఈ గీతాన్ని దేశ విభజన కోసం కాదు. దేశ ప్రజల ఐక్యతకు స్ఫూర్తిగా తీసుకోవాలి. వందేమాతరాన్ని ద్వేషాల కోసం కాకుండా ప్రేమానురాగాలు పంచేందుకు వినియోగించుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తితో, ప్రజాస్వామ్య విలువలతో, సమానత్వభావనతో కలిసికట్టుగా సాగినప్పుడే ‘వందేమాతరం’ అర్థం సార్థకమవుతుంది.

బి.మహేశ్ కుమార్ గౌడ్

(ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు)

ధరూర్ లో భార్యను చంపిన భర్త

మన తెలంగాణ ప్రతినిధి, గద్వాల: భార్యను భర్త హత్య చేసిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని నెట్టెంపాడు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన గోవిందు(32), జమ్మలమ్మలు(28) భార్యాభర్తలు. గురువారం రాత్రి భోజనాలు చేశాక ఇంట్లో నిద్రించారు. చిన్న విషయానికి గొడవపడ్డారు. పెద్దకొడుకు మల్లికార్జున్ అడ్డు వచ్చాడు దీంతో కట్టేతో తలపై కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో భార్య కేకలు వేయడంతో బయట ఉన్నవారు వచ్చి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత భార్యను వెంటాడి కట్టేతో తలపై బలంగా పలుమార్లు కొట్టి చంపేశాడు. తెల్లవారుజామున పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా నిందితుడు గోవిందు సైకోగా వ్యవహరించేవాడని, గతంలో కూడా తండ్రిని చంపినట్లు ఆరోపణలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. గతంలో ఆయనకు మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కూడా అందించారని అందువల్లే చంపి ఉంటాడని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శీను, ధరూర్ ఎస్సై పరిశీలించారు. 

‘వందేమాతరం’పై నేతల వరస మారుతోంది!

‘వందేమాతరం’ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 8న మన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జరిగిన సుదీర్ఘ చర్చ రాజకీయ రగడగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. బెంగాల్ చరిత్ర, సాంస్కృతిక మూలాలలో ‘వందేమాతరం’ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందనేది జగమెరిగిన సత్యం. 1875లో ప్రముఖ బెంగాలీకవి బంకించంద్ర ఛటర్జీ కలం నుండి ఊపిరిపోసుకున్నఈ గేయానికి సంగీతకారుడు జోదునాథ్ భట్టాచార్య బాణీ కట్టారు. 1896లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గళం నుండి ఈ గేయం గీతమై జాలువారింది. ఆ తరువాత, స్వాతంత్య్రోద్యమంలో అత్యంత ప్రజాదరణ పొందిన నిరసన గీతాలలో ఒకటిగా నిలిచింది. 1937లో మన జాతీయ గేయంగా ఎన్నికైంది. ఇందుకు 1950లో రాజ్యాంగ సభ ఆమోదం కూడా పొందింది. అయితే, ముహమ్మద్ అలీ జిన్నా ఒత్తిడికి తలొగ్గి, నెహ్రూ ‘వందేమాతరం’ని రెండు చరణాలకే కుదించారని, తద్వారా దేశ ప్రజలను విడగొట్టారని పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ చర్చ రానున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలే లక్ష్యంగా, ‘జాతీయవాదం’ ముసుగులో అక్కడి ప్రజల్లో మతవిద్వేషాలు రేకెత్తించడానికి ఎన్డీయే ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న సంక్షోభాలనుండి ప్రజల దృష్టిని మళ్ళించే చర్యగా దీనిని అభివర్ణించాయి.

దిల్లీ వాయు కాలుష్యం మొదలుకొని, ఇండిగో సంక్షోభం, రూపాయి పతనం, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులకు మద్దతు ధర లేకపోవడం, మైనారిటీలపై దాడులు, అలాగే లింగ ఆధారిత వివక్ష/ హింస వరకు.. ఇలా దేశంలో ఉన్న ఎన్నో ప్రధాన సమస్యలపై చర్చించకపోవడం ప్రజలపట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రతిబింబిస్తోందన్న ప్రతిపక్షాల అభిప్రాయంతో మన నవతరం కూడా ఏకీభవిస్తోంది.

ప్రతీకవాదం వేరు, వాస్తవాలు వేరు

ఎన్జీఓ రంగంలో విద్యావేత్తగా పనిచేస్తున్న 27 ఏళ్ళ నిఖితా రీనా, ‘వందేమాతరం’ చర్చని పశ్చిమ బెంగాల్ ఎన్నికల నుండి వేరు చేసి చూడలేమన్నారు. ఎందుకంటే, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాలు ఆ గేయంలోని సాంస్కృతిక విలువల గురించి తక్కువ, ఒక నిర్దిష్ట నియోజక వర్గానికి జాతీయవాదాన్ని ఆపాదించే దిశలో ఎక్కువగా దృష్టి పెట్టాయన్నారు. జాతీయ ప్రాధాన్యతలను గుర్తించడం, భవిష్యత్తును చర్చించడం, ప్రగతిశీల, ఇన్‌క్లూజివ్, పౌరులకు సహాయపడే చట్టాలను ఆమోదించడం పార్లమెంటు ప్రాథమిక లక్ష్యాలు. ఒకపక్క, మన దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలుపడింది. నిరుద్యోగం ప్రబలంగా ఉంది. జీవన వ్యయం పెరిగింది. ఇంకోపక్క, ప్రజారోగ్యం, పర్యావరణం, సామాజిక భద్రతా వ్యవస్థలు తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో, చారిత్రక ప్రాముఖ్యం ఉందన్న కారణంతో, ఒక గేయం కోసం పది గంటల సమయాన్ని కేటాయించడం ఓటు రాజకీయం కాక ఇంకేంటి?

ఎన్జీఓ రంగంలో నిఖితా రీనా అనుభవాలు, పరిశీలనలు ఆమె అభిప్రాయాన్ని మరింత బలపరుస్తున్నాయి. స్థానభ్రంశం, కాలుష్యం, పోషకాహార లోపం, అస్థిర జీవనోపాధిని ఎదుర్కొంటున్న సముదాయాలకు ప్రభుత్వ విధానాలు, చొరవలు, జవాబుదారీతనం, సకాలంలో జోక్యం చేసుకోవడం, ఇంకా అధికారుల ప్రతిస్పందన ముఖ్యమని వివరించారు.

దేశీ మార్కెట్

ఆహార భద్రత, మైనారిటీలకు సమాన అవకాశాలు, మధ్యతరగతి గృహనిర్మాణం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, విద్యాహక్కు, బేటీ బచావో -బేటీ పడావో, మహిళలు -గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, విద్య-పరిశోధన నాణ్యత పెంచడం, నైపుణ్యాల గుర్తింపు, ఉపాధి, ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడం, బ్యాంకింగ్ సంస్కరణలు- ఇలా రాజకీయ పార్టీలు తమ ఎలక్షన్ మేనిఫెస్టోలలో ప్రకటించింది ఒకటైతే, వాస్తవాలు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. పెరుగుతున్న లేఆఫ్‌లు, కార్పొరేట్ విధానాలు, టాక్సిక్ వర్క్ కల్చర్, అధిక పని వేళలు, జెండర్ గ్యాప్ లాంటి అంశాలలో సంస్థాగత చర్యలు లేకపోవడం చాలా నిరాశాజనకంగా ఉంది. దాంతో, మా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కూడా దెబ్బతింటోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్’ ప్రవేశపెట్టడం నిజంగా హర్షణీయం. కానీ ఇవేవీ పట్టనట్టు, ఎప్పుడో రాసిన వందేమాతరం గురించి చర్చించి, కేంద్ర ప్రభుత్వం ఏం నిరూపించింది? ఐటీ రంగంలో అవకాశాలు లేకపోవడంతో, గత 8-9 నెలలుగా ఫ్రీలాన్స్ వర్క్‌కే పరిమితమైన శ్రీలత గండికోట ప్రశ్నించారు.

మహిళా సాధికారత, రక్షణ ఒక మిథ్య

మహిళలకు ఇంట్లో, బయటా స్వేచ్ఛ, గౌరవం కరువైన ఈ సమాజంలో, సాధికారత/ సమాన అవకాశాలు కేవలం ఒక అపోహ. ఎందుకంటే, ఆర్థిక మాంద్యం రాగానే, మొదట ఉద్యోగాలు కోల్పోతోంది మహిళలే. ఇది చాలదన్నట్లు, ఈ ఏడాది జూన్‌లో, తమ దేశ మహిళలు భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించ వద్దని అమెరికా విదేశాంగ శాఖ సిఫార్సు చేసింది. ‘భారతదేశంలో విపరీతంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటి,’ అని లెవెల్-2 హెచ్చరికను కూడా జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ళలో మౌలిక సదుపాయాలు, అమ్మాయిలకు భద్రత, బడ్జెట్ కేటాయింపులు లేవు. పోక్సో కేసులు నమోదు చేసే యంత్రాంగం లేదు అంటూ తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఒక హక్కుల ఆధారిత సంస్థలోని యువ వాలంటీర్ వాపోయారు.

విదేశీ అవకాశాలు

అక్టోబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023 మధ్య, అమెరికా జారీ చేసిన హెచ్1బీ వీసాల లబ్ధిదారులలో 72.3 శాతం భారతీయ పౌరులే. దీని బట్టి, మనవాళ్ళు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎంఎస్‌సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ తరువాత, హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ళ నాగార్జున్, అమెరికాలో పీహెచ్డీ అవకాశాల కోసం గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ, హెచ్1బీ అప్లికేషన్‌ల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో, అతని ఆశ అడియాస అయ్యింది. ఇప్పటికే ఆర్థికంగా సతమవుతున్న మధ్యతరగతికి ఇక అమెరికా అందని ద్రాక్షే! సోషల్ మీడియా వెట్టింగ్ లాంటి కొత్త నియమాల వల్ల వీసా రావడం కష్టమవుతుంది. అందుకే, నేను యూరప్‌కి వెళ్దామనుకుంటున్నాను. ఇక్కడేమో కానీ, ఇమిగ్రంట్స్‌కి అక్కడ మంచి డిమాండ్ ఉంది. ఒక్క 2024లోనే, 2.06 లక్షల మంది భారతీయులు ఇక్కడి పౌరసత్వం వదులుకొని, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ దేశాల పౌరసత్వం పొందారు. అంటే, ‘పర్మనెంట్ సెటిల్‌మెంట్’ కి మన యువత ఎంత ప్రాధాన్యతనిస్తోందో అర్థమవుతోంది.

మన దేశంలో ఇంకా ఏం మిగిలుంది? ఉద్యోగాలు లేవు. భూమీ, నీళ్ళూ, గాలీ కలుషితమయ్యాయి. పేరుకే మనది ప్రజాస్వామ్యం. కానీ, ఓట్లు కూడా చోరీ అవుతున్నాయి. జనం ఎప్పుడో కులం, మతం, జాతి, అంతస్తు పేరుతో చీలిపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, స్కూల్స్ సైతం ప్రైవేటైజ్ అవుతున్నాయి. ఈ లెక్కన, త్వరలో రిజర్వేషన్ వ్యవస్థకు మనం స్వస్తి చెప్పొచ్చు. అయినా, ఎన్నికలొచ్చినప్పుడు, బిజెపి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎత్తుగడ వేస్తూ వస్తోంది. బెంగాల్ ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు ఇది, అంటూ, యూకే వీసా కోసం ఎదురుచూస్తున్న రుక్షియా బేగం నిట్టూర్చారు.

ఇదేనా ‘వందేమాతరం’ స్ఫూర్తి?

మన యువతలో ఆత్మహత్యల రేటు ఆందోళనకరమైన స్థాయిలో ఉంది. ఎన్‌సిఆర్‌బి 2022 నివేదిక ప్రకారం, భారతదేశంలో, ప్రతి సంవత్సరం సుమారు 13,000 మంది యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రేమ వ్యవహారాలు, పెళ్ళి, కుటుంబ అంచనాలు, డ్రగ్స్, ఒత్తిడి, నిరుద్యోగం, వేధింపులు ఇవన్నీ ఈ బలవన్మరణాలకు ప్రధాన కారణాలు. ఇదొక జాతీయ విపత్తు. కానీ, దీనిపై పార్లమెంటులో చర్చ జరగదు. ‘వందేమాతరం’ స్ఫూర్తిని మన పార్లమెంటు గౌరవిస్తోందన్నది నిజమే అయితే, ఆ గేయం కాంక్షించిన సమాజాన్ని సృష్టించడానికి, మన రాజకీయ నాయకులు పారదర్శకత, జవాబుదారీతనంపై ఎందుకు దృష్టి పెట్టరు? తెలుగు రాష్ట్రాలలో గే హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్త విష్ణు తేజ ప్రశ్నించారు. ఏదేమైనా, ‘వందేమాతరం’ చర్చ సాంస్కృతిక, సైద్ధాంతిక ప్రతీక వాదంగా మారింది. మొదటి నుండీ, బెంగాల్ రాజకీయాలు సంస్కృతి, చారిత్రాత్మక, మేధోపరమైన చర్చ, ప్రాంతీయ ఆత్మగౌరవానికే పెద్ద పీట వేస్తూ వచ్చాయి. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం వేసిన ఈ ఎత్తుగడ అక్కడి ఓటర్ల విశ్వాసాన్ని గెలుస్తుందా లేదా అన్నది సమయమే నిర్ధారిస్తుంది.

వై. కృష్ణజ్యోతి

(ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)

గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థుల దాడి… 9వ తరగతి విద్యార్థి పరిస్థితి విషమం

వరంగల్: గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఒక విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగింది. నర్సంపేట గిరిజన బాలుర గురుకులంలో 9వ తరగతి విద్యార్థులను ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చితకబాదారు. 9వ తరగతి చదువుతున్న దీపక్ అనే విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. హుటాహుటిన వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు విద్యార్థులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీపక్ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఘర్షణ సమయంలో వార్డెన్, అధ్యాపకులు అందుబాటులో లేరు. విద్యార్థులు గొడవపడుతుంటే ఆధ్యాపకులు, ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  

ఓటు వేయలేదని వడ్లను తడిపారు…

భద్రాద్రి కొత్తగూడెం: సర్పంచ్ ఎన్నికలలో ఓటు వేయలేదని రైతుపై ఓడిపోయిన అభ్యర్థి, నాయకులు దాష్టికానికి పాల్పడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగింది. గంగారం తండాలో తమ అభ్యర్థికి ఓటు వేయలేదన్న కక్షతో ఓ రైతుకు చెందిన 60 బస్తాల వడ్లను ఓడిపోయిన అభ్యర్థి, అనుచరులు తడిపినట్టు రైతులు ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థికి మద్దతు ఇచ్చారనే కోపంతో వడ్లను తడిపారు. దీంతో బాధితులు రోడ్డెక్కారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తాం కానీ బలవంతంగా ఎలా వేస్తారని రైతులు వాపోతున్నారు. 

నార్త్ కరోలినాలో కూలిన విమానం: ఏడుగురు మృతి

న్యూయార్క్: అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. షార్లెట్‌కు ఉత్తరాన 45 మైళ్ల దూరంలో స్టేట్స్ విల్లే రీజనల్ విమానాశ్రయంలో సి550 జెట్ విమానం ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశామని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు కొద్దిపాటి వర్షం కురిసినట్టు సమాచారం. మృతులలో మాజీ ఎన్ఎఎస్ సిఎఆర్ స్టార్ గ్రెగ్ బిఫిల్ కూడా ఉన్నారు. విమానం మొదట టేకాఫ్ అయిన తర్వాత వెనక్కి తిప్పడంతో అది కూలిపోయిందని నార్త్ కరోలినా హైవే పెట్రోల్ అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపంతో విమానం టేకాఫ్ కాగానే ల్యాండింగ్ చేశారని తెలిసింది. 

క‌డ‌ప జిల్లాలో 8వ తరగతి బాలిక ప్రసవం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వచ్చింది. పులివెందులలో మైనర్ బాలిక ప్రసవించింది. వేంపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో మైనర్ బాలిక 8వ తరగతి చదువుతుంది. బాలిక గర్భం దాల్చిన విషయాన్ని కుటుంబ సభ్యులు  గోప్యంగా ఉంచారు. గురువారం మైనర్ బాలికకు పురిటి నొప్పులు రావడంతో వేంపల్లిలోని ఇంటి వద్ద ప్రసవం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పరిస్థితి విషమించడంతో పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మైనర్ బాలిక ఆడపిల్లకు జన్మనిచ్చింది.  పోలీసులు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.