elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

betturkey

kingroyal

marsbahis

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

kavbet

piabellacasino giriş

kralbet

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

efesbet

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

istanbul escort

vaycasino

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

kralbet

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

vegabet

ఒటిటిలోకి రామ్ లేటెస్ట్ చిత్రం.. పండగ కానుకగా..

హైదరాబాద్: టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని.. విభిన్నమైన పాత్రలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అతడు నటించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. దీంతో స్క్రిప్ట్ సెలక్షన్‌లో రామ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్‌గా అతడు నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోకి వీరాభిమాని పాత్రలో ఆకట్టుకున్నాడు రామ్. గత నెల 27న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది….

భాగ్వశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ క్రిస్మస్ కానుకగా.. ప్రముఖ ఒటిటి ‘నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇక కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించగా.. వివేక్ మెర్విన్‌ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. మరి థియేటర్‌లలో ఫర్వాలేదని అనిపించిన ఈ చిత్రం ఒటిటిలో 

రంగారెడ్డి జిల్లాలో మూడు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పివి ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 253 వద్ద ఒకదానికొకటి మూడు కార్లు ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పర్ పల్లి నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కావడంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.  

కర్టాటక జిల్లాలోఆర్టిసి బస్సు-కారు ఢీకొని డ్రైవర్ మృతి

అమరావతి:  కర్టాటక జిల్లాలో పావుగడ పట్టణం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ నుంచి పావుగడ వెళ్తున్న ఎపి ఆర్టిసి బస్సు-కారు ఎదురెదురుగా ఢీకొని డ్రైవర్ మృతి చెందాడు. బస్సులో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

పాము కాటుతో తండ్రిని చంపించి… రూ.3 కోట్లు బీమా సొమ్ము తీసుకుంటుండగా దొరికిన కుమారులు

చెన్నై: తండ్రి పేరిట మూడు కోట్లు బీమా చేయించి ఇద్దరు కుమారులు కలిసి ఆయనను పాము కాటుతో చంపించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గణేశన్(56) అనే వ్యక్తి ఓ పాఠశాలలో ప్రయోగశాల సహాయకుడి పని చేస్తున్నాడు. తండ్రి పేరిట కుమారుడు దాదాపుగా రూ.3 కోట్ల రూపాయల బీమా చేయించారు. గణేశన్ పాము కాటుతో చనిపోయాడు. బీమా క్లెయిమ్‌ల కోసం ఇద్దరు కుమారులు బీమా సంస్థను కలిశారు. తండ్రి పేరిట మూడు కోట్ల రూపాయల బీమా క్లెయిమ్ ఉండడంతో పాటు బీమా సంస్థ ఉద్యోగులకు అనుమానం వచ్చింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. గణేశన్ మృతి చెందిన వారానికి ఆయనను పాము కరవడంతో ఆస్పత్రికి తరలించారు. విషపూరితమైన పాము కాకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో కుమారులు ఇద్దరు తండ్రిని నిద్ర పోతుండగా అతడి మెడ వద్ద పామును వదిలారు. పాము కరించిందని తండ్రి కేకలు వేయడంతో వెంటనే పామును చంపేశారు. అనంతరం తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు తండ్రి మృతి చెందాడు. పాము కాటుతోనే తండ్రి చనిపోయాడని అందరినీ నమ్మించారు. బీమా సొమ్ము కోసం క్లెయిమ్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

సర్వం కేంద్ర ప్రభుత్వ ఇష్టారాజ్యం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరు తో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే కాక, మందబలంతో ఏకచ్ఛత్రాధిపత్యం వహించింది. విపక్షాలు లేవదీసిన అభ్యంతరాలకు సరైన సమాధానాలు చెప్పడం లేదు సరికదా, చర్చకు కూడా అవకాశం లేకుండా బుల్‌డోజర్ సంస్కృతి అవలంబించింది. ఉన్నత విద్యారంగాన్ని తన గుప్పెటలో పెట్టుకోవడానికి శ్రీకారం చుట్టింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ఇతర దేశాలపై ఆధారపడే దుస్థితినుంచి బయటపడాలంటూ పదేపదే ప్రబోధించే మోడీ ప్రభుత్వం బీమా, అణువిద్యుత్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు స్వాగతం పలకడం, ముఖ్యమైన వ్యవస్థలను విదేశాలకు తాకట్టుపెట్టడం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకత. ఇది కాక యుపిఎ ప్రభుత్వ చిహ్నాలను, మహాత్మాగాంధీ పేరును పూర్తిగా చెరిపేసేందుకు చరిత్రాత్మక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది. ఈ పథకాన్ని తన అధీనం లోకే తెచ్చుకుని తన పెత్తనంతోనే పనులు సాగేలా మార్చుకుంది.ఈ పథకంలో 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచి ఉద్ధరిస్తున్నట్టు నమ్మిస్తున్నా దాని అసలు స్వరూపం వేరేగా ఉంటోంది. ఏ రాష్ట్రంలో, ఎక్కడ, ఏ పనులు చేపట్టాలో కేంద్రమే నిర్ణయిస్తుంది.

ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తుందో ఆ మేరకే పనులు చేపట్టాలి. అదీ కూడా అవసరం బట్టే పని కల్పన ఉంటుంది. అంటే రాష్ట్రాలకు ఇందులో ఎలాంటి స్వేచ్ఛ లేనట్టే. ఇక నిధుల వ్యయంలో ఇంతవరకు శ్రామికుల వేతనాలు పూర్తిగా, సామగ్రి వ్యయంలో 75% నైపుణ్యం, పాక్షిక నైపుణ్య కార్మికుల వేతనాల్లో 75 శాతం కేంద్రమే చెల్లించేది. కానీ ఇకనుంచి మొత్తం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వమే 40 శాతం వరకు భరించక తప్పదు. 90ః 10 గా ఉన్న వ్యయం ఇకనుంచి 60ః40 గా ఉంటుంది. ఇంత భారీ వ్యయాన్ని రాష్ట్రాలు ఎంతవరకు భరించగలవో ఆలోచించాలి. ఈ వివాదాస్పద నిర్ణయంపై కాంగ్రెస్‌తో సహా విపక్షాలన్నీ భగ్గుమంటున్నాయి. జాతీయ స్థాయిలో వ్యతిరేక ఉద్యమానికి సన్నద్ధమవుతున్నాయి. కేంద్రం మితిమీరిన పెత్తనానికి మరో తార్కాణం ఉన్నత విద్యారంగం. ఉన్నత విద్య క్రమబద్ధీకరణ చట్టాన్ని పూర్తిగా ఏకీకృతం చేస్తూ వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (వి బిఎస్‌ఎ) బిల్లును తీసుకొచ్చింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిటిఇ) పర్యవేక్షణ అధికారాలన్నీ ఒకే రెగ్యులేటర్ కిందకు తెస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తోంది.

అన్ని కేంద్ర యూనివర్శిటీలు, వాటి కిందగల కాలేజీలు, విద్యామంత్రిత్వశాఖ పరిపాలన కింద గల జాతీయ ప్రాముఖ్యత గల సంస్థలన్నీ ఈ కమిషన్ కిందకే వస్తాయి. ప్రస్తుతం యుజిసి కింద లేని ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్‌ఐటిలు, ఐఐఎస్‌సిలు, ఐఐఎన్‌ఇఆర్‌లు, ట్రిపుల్ ఐటిలు కూడా ఈ కమిషన్ కిందకే వస్తాయి. ఈ విబిఎస్‌ఎ కమిషన్‌లో తనకు అనుకూలమైన తొమ్మిది మందిని కేంద్రమే నియమిస్తుంది. ఈ బిల్లుపై రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు కూడా కేంద్ర అధిష్టానం ఆదేశాలకే లోబడాల్సి వస్తుంది. ఇక బీమా రంగంలో విదేశీ సంస్థలు పూర్తిస్థాయిలో ప్రవేశించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీమా రంగంలో ప్రస్తుతం 74% వరకు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతం పెంచడానికి వీలుగా బిల్లును రూపొందించింది. జిడిపిలో 3 శాతం వాటాకు పరిమితమైన బీమారంగం ఇక నుంచి విదేశాల్లో మాదిరిగా ఆరున్నర శాతానికి చేరుతుందని ప్రభుత్వం నమ్మబలుకుతోంది.

నూరు శాతం ఎఫ్‌డిఐలతో విదేశీ కంపెనీలు తక్కువ మూలధనంతో ఇకపై ఇక్కడ వ్యాపారాలు పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు 65 శాతం వాటాతో అత్యంత బలంగా ఉన్న ప్రభుత్వ రంగ ఎల్‌ఐసికి ఇప్పుడు అగ్నిపరీక్షే ఎదురవుతుంది. బీమా రంగంలో వంద శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అణుశక్తి బిల్లు రూపంలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అణుశక్తిని స్థిరంగా వినియోగించుకుంటూ అభివృద్ధి పథం వైపు దేశాన్ని తీసుకెళ్లడమే లక్షంగా ‘శాంతి బిల్లు’ ను ప్రవేశపెట్టినట్టు మోడీ ప్రభుత్వం ప్రకటిస్తోంది. అణు విద్యుత్ సంస్థాపిత సామర్థం ప్రస్తుత 8.8 గిగావాట్లు నుంచి 2047 నాటికి 100 గిగావాట్లకు పైగా పెంపు చేయడమే లక్షంగా 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అమెరికాతో సివిల్ అణుశక్తి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే రియాక్టర్లలో ఏదైన ప్రమాదం సంభవిస్తే మానవ ప్రాణ, పర్యావరణ నష్టానికి ఆ రియాక్టర్ల సరఫరాదారు పరిహారం చెల్లించాలని సివిల్ లయబిలిటీ బిల్లు తీసుకు రాగా, అమెరికా కంపెనీలు వ్యతిరేకించడంతో బిల్లు అమలు కాలేదు.

ఈ పరిహారం విషయంలో సడలింపు కల్పించి దాన్ని మోడీ ప్రభుత్వం అమలులోకి తీసుకు వస్తోంది. 1962 అణుశక్తి చట్టం, 2010 పౌర అణు నష్టపరిహార చట్టాన్ని రద్దు చేయాలనే బిల్లు లోని నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు రియాక్టర్ల సరఫరాదారుల నష్టపరిహార చెల్లింపు బాధ్యత కేవలం 300 మిలియన్ డాలర్లకే పరిమితం చేయడం ప్రజలభద్రతను నిర్లక్షం చేయడమే. జపాన్‌లో పుకుషిమా, రష్యాలో చెర్నోబిల్ అణుప్రమాదాలు నేర్పిన గుణపాఠాలు ఇప్పుడు విస్మరించడం ఎవరికీ క్షేమం కాదు. నియంత్రణలన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని చెబుతున్నప్పటికీ బహుళజాతి కంపెనీలు ఎంత శక్తిమంతమైనవో భోపాల్ యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ ప్రమాదం సంఘటనే ప్రత్యక్ష సాక్షం. ఈ బిల్లు ద్వారా అమెరికా, ఫ్రాన్స్ వంటి విదేశీ కంపెనీలకే తప్ప భారత కంపెనీలకు ప్రయోజనం శూన్యం అన్న విమర్శలు వస్తున్నాయి. 

‘ఉపాధి హామీ’ ఉసురు తీస్తున్నారు!

జి రామ్ జి బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. ఇది చట్టం కాబోతున్నది. అయితే సరికొత్త చట్టం కాదు. ఇప్పటికే ఇది అమలులో ఉన్నది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 గా నిన్నటి వరకు అమలులో ఉన్నది. రాష్ట్రపతి ఆమోదంతో కొత్త పేరు అమలులోకి వస్తుంది. అందులో ఏ అంశాలున్నాయనే విషయం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. గ్రామాలలో ఉన్న పేదలకు ప్రత్యేకించి వ్యవసాయ కూలీలకు ఈ చట్టం ఉపాధిని కల్పిస్తున్నది. దాని మీద చర్చలు ఎన్నో జరిగాయి. విమర్శలు, ప్రతి విమర్శలు మరెన్నో వచ్చాయి. అయితే నిరుపేదలకు ఈ చట్టం ఎంతో మేలు చేస్తుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ చట్టంలో గతంలో ఉన్న ముఖ్యమైన అంశం మారిపోతున్నది. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా విషయం. గతంలో ఈ పథకం బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. కానీ కొత్త చట్టం ద్వారా ఖర్చులో రాష్ట్రాలపై భారం మోపనున్నది. బడ్జెట్‌లో 60 శాతం కేంద్రం నుంచి, 40 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంది. ఇంకా కూలీల శ్రమ యంత్రాల వాడకం పైన కూడా కొన్ని నిర్ణయాలు చేశారు. అంతేకాకుండా అత్యంత ముఖ్యమైనది, కూలీల డిమాండ్‌ను బట్టి కాక, ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి పనులను కల్పిస్తారు. గతంలో కనీసం వంద రోజుల పని దినాలను కల్పించాల్సి ఉంది. కాని దానిని 125 రోజులకు పెంచారు. ఇది కేవలం కంటితుడుపు మాత్రమే.

రాష్ట్రాల మీద గతంలో దీని భారం ఉండేది కాదు. కానీ ఈ రోజు రాష్ట్రాలు ఇందులో ఆర్థికంగా తమ బడ్జెట్‌లను వెచ్చించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వాటాను కల్పించకపోతే, ఆ పథకం అమలు సాధ్యం కాదు. ఇప్పటికే చాలా పథకాల్లో ఇటువంటి షరతులు విధించి, పథకాలనే నిలిపివేసిన ఘటనలున్నాయి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ పథకం అందులో భాగమే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలను వెచ్చించకపోవడం వల్ల కేంద్రం నిధులను విడుదల చేయడం ఆపేసింది. పంజాబ్ రాష్ట్రంలో ఈ స్కాలర్ షిప్స్ సమస్య ప్రభుత్వాన్నే మార్చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను రేపు కూలీల ముందు దోషులుగా నిలబడే పరిస్థితి రాబోతున్నది. అంటే జి రామ్ జి పథకం రేపు రాష్ట్ర ప్రభుత్వాల నిస్సహాయతను బజారులో నిలబట్టే పరిస్థితి రాబోతున్నది. దానితో పథకమే ప్రశ్నార్థకం కాబోతున్నది. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నది కూడా అదే. క్రమంగా ఈ పథకాన్ని ఆచరణలో రద్దు చేయాలన్నదే ఉద్దేశం. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు తమ బడ్జెట్‌ల ద్వారా అమలులో ఉన్న పథకాలనే కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లను సరైన సమయంలో చెల్లించలేని దీనస్థితిలో ఉన్నాయి.

వాటికితోడు ఎన్నికల్లో గెలవడానికి ఆర్థిక పరిస్థితిని దృష్టింలో ఉంచుకోకుండా చేసిన వాగ్దానాలు రాష్ట్ర ప్రభుత్వాలకు గుదిబండలుగా మారిపోయాయి. వీటన్నింటిని నిర్వహించడానికి బ్యాంకులనుంచి అప్పులు తీసుకోవడానికి రిజర్వు బ్యాంకు అనుమతి కోసం విరామం లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం తమ అప్పుల పరిమితులను దాటిపోయాయి. దీనితో చాలా రాష్ట్రాలు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నాయి. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. సరిగ్గా ఈ పరిస్థితిలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తమ బడ్జెట్ నుంచి నిధులను కేటాయించడమంటే అది వాస్తవ విరుద్ధమే అవుతుంది. ఇది మరింత సంక్షోభానికి దారి తీసే అవకాశముంది. అంతిమంగా ఈ పథకమే ఆగిపోయే పరిస్థితులున్నాయి. ఈ పథకాన్ని మొదటి నుంచి బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వ్యతిరేకత దృష్టితోనే చూస్తున్నది.

నిధుల కేటాయింపులు కానీ, ఖర్చు గానీ ఏనాడు డిమాండ్‌కు తగ్గట్టుగా లేవు. దానికి తోడు కార్డులను తొలగించడం అనేది ఒక నిత్య కార్యక్రమంగా పెట్టుకున్నారు. గత రెండేళ్లలో దాదాపు 50 లక్షల కార్డులను దేశవ్యాప్తంగా తొలగించారు. అంతేకాకుండా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి చేయాల్సినంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ చట్టం అంతిమ సమాధి. దీనికి బిజెపి సామాజిక నేపథ్యమే కారణం. ఈ పథకాన్ని గ్రామాల్లోని ధనిక, మధ్య తరగతి రైతులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చిన తర్వాత కూలీలలో వేతనం డిమాండ్ పెరిగిందని, తమ పొలాల్లో పని చేయడానికి ముందుకు రావడం లేదని వాళ్లు వాదిస్తున్నారు. అంతేకాకుండా కూలీలలో పెరిగిన ఈ స్వేచ్ఛ గ్రామాల్లో వ్యవసాయ కూలీ పెరుగుదల అనివార్యమైందని, దానితో వ్యవసాయ ఖర్చులు పెరిగాయని రైతులు తమ వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో ఈ వర్గమే బలమైనది. ఓట్లు గాని, ఇతర ఏ రాజకీయ ప్రయోజనాలకు గానీ ఈ వర్గమే ఆధారం. ఇది వర్గం, కులాల రీత్యా ఆధిపత్యం కలిగి ఉంది. అందువల్ల ఈ పథకానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టడమంటే ఆధిపత్య కులాలకు, వర్గాలకు అండగా నిలబడడమే. దీని వల్ల బిజెపి ఆధిపత్య కులాల్లో బలాన్ని స్థిరం చేసుకోవడానికి వీలవుతుంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఈ చట్టానికి తక్షణ లక్షం. బెంగాల్‌లో ధనిక, మధ్య తరగతి వర్గం ప్రస్తుతం మెల్లగా బిజెపి వైపునకు నడుస్తున్నది. దీని వల్ల వాళ్లు మరింతగా బిజెపిని బలపరిచే అవకాశముంది. బెంగాల్‌లో నూటికి 50శాతం మంది ఎస్‌సిలు, ఎస్‌టిలు, ముస్లింలు ఉన్నారు. వీళ్లంతా భూమిలేని నిరుపేదలే. దాని వల్ల ఈ వర్గాలకు వ్యతిరేకింగా మధ్య తరగతి వర్గం కూలీలను సమీకరించే పనిలో పడ్డారు. అందుకే ఈ చట్టం ద్వారా మరో ప్రయోజనం పొందాలని పథకం వేశారు. అదే పేరు మార్పు. అందులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించి, రామ్ పేరును చేర్చడం రెండో ప్రయోజనం. ఎందుకంటే ఇక్కడ పరోక్షంగా ముస్లింల మీద వ్యతిరేకత రెచ్చగొట్టడం. మహాత్మా గాంధీ పేరును తొలగించడం వల్ల జరిగే చర్చలో పరోక్షంగా ముస్లింల విషయాన్ని చేర్చి తమకు అనుకూలంగా దీనిని మలుచుకోవడంలో సఫలీకృతం కావాలని ఆలోచన చేస్తున్నారు. మహాత్మాగాంధీ పైన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలకు మొదటి నుంచి సదాభిప్రాయం లేదు. అది మహాత్మా గాంధీ హత్యతోనే బయట పడింది.

మహాత్మా గాంధీని హత్య చేసిన నాథ్‌రామ్ గాడ్సే హిందూ మహాసభ నాయకుడు. ఆర్‌ఎస్‌ఎస్‌లో కూడా పనిచేశాడని చరిత్రలో ఉన్న విషయం. అదే విధంగా మహాత్మా గాంధీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు మిఠాయిలు పంచుకున్నాయని అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గోల్వాల్కర్‌కు రాసిన ఉత్తరంలో పేర్కొన్నారు. అంతేకాకుండా 2014లో అప్పటి బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ నాథ్‌రామ్ గాడ్సే జాతీయ వీరుడు అని ప్రకటించారు. అదే విధంగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన నాయకుడు రాజ్‌భయ్యా నాథ్ గాడ్సేను సమర్థిస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా నాథ్‌రామ్ గాడ్సేకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లలో సావర్కర్ ప్రధానమైన వ్యక్తి. ఆయన అనేక సార్లు గాంధీని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అయితే గత కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ వీర్ సావర్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, తమ అనుబంధాన్ని చాటుకున్నారు.

అయితే బిజెపి మహాత్మా గాంధీని ప్రత్యక్షంగా విమర్శించిన సందర్భాలు తక్కువ. అదే విషయాన్ని గత రెండు రోజుల క్రితం పార్లమెంట్‌లో ఆ పార్టీ ప్రకటించింది. మహాత్మా గాంధీ జయంతిని స్వచ్ఛ అభియాన్‌గా జరుపుకుంటున్న విషయాన్ని కూడా ప్రకటించారు. అది నిజమే. ఇక్కడ గమనించాల్సింది మహాత్మా గాంధీ మీద కోపం ఆయన మీద కాదు. ఆయన ఏ విధానాలను అవలంబించి ముస్లింలను సోదరులుగా చూడాలని ప్రకటించారో ఆ అంశం వాళ్లకు నచ్చదు. ఇప్పుడే ఈ విషయాన్ని లేవనెత్తి, పేరు మార్చడానికి రాబోయే బెంగాల్ ఎన్నికలే కారణం. అక్కడ ముస్లింల మీద వ్యతిరేకతను రెచ్చగొట్టి మిగతా సమాజాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఈ చర్చ వాళ్లకు అవసరం. ఈ రోజు భారత దేశంలో ముస్లింలు ఉండి హిందూ సమాజాన్ని అవహేళన, దాడులు చేస్తున్నారంటే మహాత్మా గాంధీ విధానాలే కారణమని బిజెపి చెప్పదలచుకున్నది.

రాబోయేరోజుల్లో మహాత్మా గాంధీ సెక్యులరిజం, సర్వమత సమానత్వం అనే అంశాలమీద వాళ్లు కాకుండా, వివిధ వ్యక్తులతో మాట్లాడించి, ముస్లిం వ్యతిరేకతను తాము ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. జి రామ్ జి పేరును బాగా ప్రచారం చేయడం ద్వారా మరో ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం మీద విమర్శలు రాముని మీదికి మళ్లించి, వీళ్లంతా రాముని వ్యతిరేకులు, హిందూత్వ వ్యతిరేకులు అని చెప్పడం ద్వారా హిందూ భక్తులను కూడా ఇందులో భాగస్వాములను చేసి, దానిని సంఘటితం చేయాలనుకుంటున్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా వారి హిందూత్వ ఎజెండా ఉచ్ఛస్థాయికి చేరింది. ఇక వాళ్లు దేనిని సహించే స్థితిలో లేరు. అంతిమంగా హిందూత్వ భావాలను తమ ఎన్నికల ప్రయోజనాలకు వినియోగించుకొని ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. నూటికి ఇరవై మందిగా ఉన్న ఉన్నత ఆదాయ వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల ప్రభుత్వాలను తారుమారు చేసే పథకాన్ని అమలు చేస్తున్నారు.  

– మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)

‘కోర్-5’ భ్రమ మాత్రమే

అమెరికా నుంచి వెలువడే ‘పొలిటికో’ అనే రాజకీయ పత్రికలో వెలువడే కథనాలకు ప్రపంచమంతటా మంచి విలువే ఉంది. అవి ఒకోసారి సంచలనాత్మకంగా తోచవచ్చు. కాని వాటిలో చివరకు అసత్యాలుగా తేలేవి చాలా తక్కువ. పైగా ‘స్కూప్ స్టోరీస్’ అని ఇంగ్లీషులో వ్యవహరించే, ‘మరెవరికీ తెలియని, రాయని కథనాలను’ వెలికి తీయటం తమ పని అని ఆ పత్రిక సగర్వంగా ప్రకటిస్తుంటుంది. అటువంటి పేరున్నది గనుకనే ‘పొలిటికో’కు అనేక అవార్డులతో పాటు ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ బహుమతి కూడా లభించింది. ఈ కారణాల వల్లనే ఆ పత్రిక ఇటీవల ప్రచురించిన ‘కోర్5’ రాజకీయ కథనం ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అందులోని సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికా తన నాయకత్వాన కొన్ని దశాబ్దాలుగా ఉన్న నాటో, జి7, జి20 వగైరా కూటములు అన్నింటిని వదలివేసి, కొత్తగా జి 5 అనదగ్గ ‘కోర్5’ కూటమి ఏర్పాటు కోసం ఆలోచిస్తున్నది. ఈ కొత్త కూటమిలో అమెరికాతో పాటు రష్యా, చైనా, జపాన్, ఇండియాలు ఉండవచ్చునట. ఈ కథనాన్ని అమెరికా అధ్యక్షుని వైట్ హౌస్ నిజం కాదంటూ కొట్టి వేసింది. అయినప్పటికీ, “అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే” అన్న పాట వలె, ట్రంప్ మాటలకు అర్థాలు ఏవైనా కావచ్చునని అనుభవంలోకి వచ్చినందున, ఈ విషయమై చర్యలు జరుగుతూ ఉన్నాయి. అదట్లుంచినా మరొకటి గమనించాలి.

ఎప్పుడైనా సరే ఇటువంటి ముఖ్యమైన ఆలోచనలు జరిగినపుడు, వాటికి ఒక స్వరూపం, తర్వాత పరస్పర అంగీకారం స్థూలంగానైనా వచ్చే వరకు విషయం తెర వెనుకనే ఉంటుంది. ఇది ఎక్కడైనా సర్వసాధారణం. ఇట్లా అంటున్నామంటే ‘కోర్5’ ఆలోచన నిజమైనదే అని చెప్పటం కాదు. కావచ్చు, కాకపోవచ్చు కూడా. అదెట్లున్నా దీని గురించి, తాత్కాలికంగానైనా కొంత సమాలోచన అవసరం. ఒకవేళ ట్రంప్ ఆలోచన నిజమే అయితే తను ఈ ఆలోచన ఎందుకు చేస్తుండవచ్చు? అటువంటి కూటమి ఏర్పాటు సాధ్యమా? సాధ్యమైతే ఆ కూటమి వ్యవహరణ ఏ విధంగా ఉండవచ్చు? అనేవి మూడు ప్రధానమైన ప్రశ్నలు. ఈ ఆలోచనలు చేసే ముందు ఒక మాట చెప్పుకోవాటి. ‘కోర్5’ ఆలోచన నిజం కాదని వైట్ హౌస్ ఖండించగా, తక్కిన నాలుగు దేశాల నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందనా లేదు. అందులో ఆశ్చర్యమూ లేదు. ఏ దేశమైనా, ముఖ్యంగా ఇటువంటి సీరియస్ విషయాలలో, కేవలం పత్రికా కథనాలపై స్పందించదు. అవి తమపై ఆరోపణల వంటివి అయితే తప్ప. ఒకవేళ అమెరికా ఇటువంటి ప్రతిపాదన అధికారికంగా చేసినట్లయితే అపుడు ఏదో స్పందన ఉండవచ్చు. ‘కోర్5’ ఆలోచన లేదని వైట్ హౌస్ అంటున్నందున, ఆ ప్రతిపాదన ఇంత వరకు ఎవరికీ చేయలేదని భావించవలసి ఉంటుంది. మొత్తం అయిదు దేశాలూ రహస్యాన్ని పాటించదలిస్తే తప్ప.

అయితే, ఎటు నుంచి ఏ ధ్రువీకరణ లేకున్నా, ఇటువంటి కూటమితో భారత దేశానికి లాభమేమిటనే ఊహాగానాలు మాత్రం దేశంలో మొదలైపోయాయి. దాని గురించి ఇక్కడ మాట్లాడేది ఏమీ లేదు. ఇవన్నీ వదలివేసి, పైన పేర్కొన్న మూడు ప్రశ్నల గురించి ఆలోచిద్దాము. కోర్5 ఆలోచన నిజమే అనుకుంటే, అమెరికా అధ్యక్షునికి ఆ తరహా ఆలోచన ఎందుకు కలిగి ఉండవచ్చునన్నది మొదటి ప్రశ్న. అమెరికా 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి గత 80 సంవత్సరాలుగా అగ్రరాజ్యంగా ఉంటూ వస్తున్నది. 1991 వరకు అప్పటి సోవియెట్ నాయకత్వాన అమెరికాకు పోటీగా రెండవ ధ్రువం ఉండినప్పటికీ అగ్రరాజ్యం మాత్రం అమెరికాయే. అణ్వస్త్ర బలిమిని మినహాయిస్తే ఇతరత్రా సైనికంగా, ఆర్థికంగా, శాస్త్ర సాంకేతికాభివృద్ధిపరంగా పరిస్థితి అదే. 1991లో సోవియేట్ పతనం తర్వాత ఇక చెప్పనక్కర లేదు. అట్లా సుమారు 20 సంవత్సరాల పాటు ఎదురులేని ఏకధ్రువ ప్రపంచాధిపత్యం తర్వాత రష్యా తిరిగి పుంజకోవటం, చైనా కొత్త శక్తిగా ఆవిర్భవించటం, బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు బలపడుతుండటం వల్ల అమెరికా బలిమి గతం కన్న బలహీన పడుతుండటం నిజమే అయినా, అమెరికా అగ్రస్థానం మాత్రం స్థూలంగా కొనసాగుతూనే ఉన్నది.

వారు యథేచ్ఛగా తమకు అవసరమైన చోటనల్లా సైనిక చర్యలకు పాల్పడుతుండటం, ప్రపంచ వాణిజ్యాన్ని ఒకప్పటి స్థాయిలో కాకున్న ఇంకా చాలా మేరకు నియంత్రించ గలగటం, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఐక్యరాజ్య సమితి నుంచి మొదలుకొన్ని ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ మొదలైన ప్రపంచ వ్యవస్థలపై ఆధిపత్యం వంటివి ఇందుకు తార్కాణాలు. అదే సమయంలో తక్షణ స్థితిగతులు, సమీప భవిష్యత్తుకు పరిమితం కాక మధ్యకాలిక, దీర్ఘకాలిక భవిష్యత్తు గురించి తెలివైన నాయకత్వం ఆలోచించవలసి ఉంటుంది గనుక, ఆ విధంగా చూసినపుడు మాత్రం తమ అగ్రనాయకత్వం దీర్ఘకాలం పాటు కొనసాగగలదనే భరోసా అమెరికా నాయకత్వానికి కలిగే అవకాశం లేదు. అటువంటపుడు తమ వ్యూహాలపై పునరాలోచన తప్పనిసరి అవుతుంది. దాని ఫలితమే ‘కోర్5’ ఆలోచన అయి ఉండాలి. ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఇంతకాలం కలసి వచ్చిన స్వీయ ఆధారాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. ఆ క్రమాన్ని నిలువరించగల అవకాశాలు కన్పించటం లేదు. మరొక వైపు, ఇంతకాలం వెంట నిలిచిన యూరప్, ఇతర నాటో రాజ్యాలు కూడా నెమ్మదిగానైనా బలహీనపడుతున్నాయి.

చిరకాలంగా తమకు లోబడి ఉండిన అనేకానేక ఇతర దేశాలు స్వతంత్ర మార్గాలను అన్వేషిస్తున్నాయి. కొత్తగా తమ ఛత్రచ్ఛాయలోకి రాగోరేవారు కన్పించటం లేదు. బలప్రయోగంతోనో, ఆర్థికపరమైన వత్తిళ్లతోనే ఆ పని చేయబోతున్నా పరిస్థితి ఒక పరిమితిలో తప్ప ఆశాజనకంగా లేదు. అటువంటి స్థితిలో, కోర్5’ వంటి కొత్త తరహా వ్యూహ రచన అవసరమవుతుంది. అది ముసాయిదా వ్యూహం మాత్రమే. నిజంగా రూపు తీసుకునేదీ లేనిదీ తెలియదు. కోరుకున్న ఫలితం సాధించేదీ లేనిదీ తెలియదు. ప్రయత్నమైతే జరగాలి. అంతకన్న మార్గాంతరం లేదు. రెండవ ప్రశ్నకు వస్తే, ‘కోర్5’ ఏర్పాటు సాధ్యమా? ఇది అసలు సిసలైన సవాలు. అది సాధ్యం కానిదన్నదే వెంటనే కలిగే అభిప్రాయం. ఎందువల్లనంటే అందులో అనేక ప్రశ్నలున్నాయి. అన్నీ చిక్కులమారివే. అసలు అటువంటి కూటమిలో చేరేందుకు జపాన్, ఇండియాల మాట ఎట్లున్నా రష్యా, చైనాలు ఎందుకు అంగీకరించాలి? వారిద్దరికీ అమెరికా సైద్ధాంతిక శత్రువు. అనేక దశాబ్దాలుగా ప్రత్యర్థి. రాగల కాలంలోనూ సైద్ధాంతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సైనికంగా, వ్యూహాత్మకంగా శాశ్వత ప్రత్యర్థివంటిది.

అమెరికా ఆధిపత్యాన్ని క్రమంగా బలహీనపరచి, దానితో సమాన స్థాయి సాధించి, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ, డీడాలరైజేషన్, బెల్డ్ అండ్ రోడ్ పాలసీ వగైరాల ద్వారా బహుళ ధ్రువ ప్రపంచ ఆవిష్కరణ ఆ రెండింటి దీర్ఘకాలిక లక్షం. ఆ విధంగా అమెరికాతో పాటు పాశ్చాత్య సామ్రాజ్యవాదం, ప్రపంచాధిపత్యం ముగిసిపోవాలన్నది వారి పట్టుదల. ఇవన్నీ సానుకూలమవుతున్న సూచనలు కూడా ఉన్నప్పుడు, ‘కోర్5’ పేరిట అమెరికా కూటమిలో చేరవలసిన అవసరం వాటికి ఏమున్నది? అందుకు పొడిగింపుగా ఇతర సమస్యలున్నాయి. అమెరికా తన ఇండో పసిఫిక్ ఆధిపత్య వ్యూహంతో చైనా, రష్యాలకు సమస్యలు సృష్టిస్తున్నది. ఆ ప్రాంతపు మిత్రదేశాలలో సైనిక స్థావరాలను నిర్వహిస్తున్నది. తైవాన్ సమస్యను అనువుగా చేసుకుని చైనాను, హోక్కైరో దీవుల సమస్యతో రష్యాను ఇబ్బందిపెడుతున్నది. అందుకు జపాన్‌ను ఉపయోగించుకుంటున్నది.

ఇండియా, చైనా సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. మరొక వైపు చైనాతో పాటు ఇండియాతో టారిఫ్‌లు, వాణిజ్య ఒప్పంద యుద్ధాలు, రష్యాకు సంబంధించి ఉక్రెయిన్ యుద్ధం వంటి సమస్యలు అనేకం కనిపిస్తున్నావే. అటువంటపుడు, పరస్పర సాధారణ సంబంధాలు వేరు. కాని ఇండియా చైనా, జపాన్‌చైనా, జపాన్ రష్యా ఒక కూటమిగా పని చేయగలగటం అసాధ్యం. ఆయా సమస్యలు పరిష్కారం కూడా సమీప భవిష్యతులో కనిపించదు. చివరి ప్రశ్న ‘కోర్5’ వ్యవహరణ. అసలు ఆ కూటమి లక్షాలు ఏమిటి? రాజకీయంగా ఏం చేస్తుంది? ఆ కూటమి వల్ల ఆయా దేశాలకు గాని, ప్రపంచానికి గాని ఉపయోగం ఏమిటి? కూటమికి ముఖ్యంగా యూరపియన్ యూనియన్ లోబడి ఉంటుందా? అన్నింటికిమించి ఈ కొత్త రూపంలో తన అగ్రస్థానాన్ని నిలుపుకొనేందుకు, సామ్రాజ్యవాద ప్రయోజనాలు కాపాడుకునేందు అమెరికా చేయగల ప్రయత్నాలను మిగిలిన వారు అంగీకరిస్తారా? అందువల్ల, ఆచరణాత్మకంగా చూసినపుడు, ‘కోర్5’ ఆలోచన ఒక భ్రమగానే కనిపిస్తుంది. 

– టంకశాల అశోక్ ( దూరదృష్టి)

(రచయిత సీనియర్ సంపాదకులు) 

భారత జాతీయ ఆత్మకు 150 ఏళ్ల స్ఫూర్తి

వందేమాతరం’.. ఇది కేవలం ఒక గేయమే కాదు. భారతదేశాన్ని ఒక భౌగోళిక ప్రాంతంగా కాకుండా, తల్లిగా దర్శించే వేల సంవత్సరాల జాతీయ సంస్కృతి భావజాలానికి ప్రతీక. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ఈ మహాగీతం 150 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ సమయంలో, దాని చారిత్రక నేపథ్యం, అసలైన భావార్థం, కాలక్రమంలో జరిగిన వక్రీకరణలపై దేశవ్యాప్తంగా గంభీరమైన చర్చ జరగాల్సిన అవసరం ఏర్పడింది. బంకించంద్ర చటోపాధ్యాయ 1875లో ‘వందేమాతరం’ను రచించి, అనంతరం ఆనందమఠ్ నవలలో భాగంగా చేర్చారు. బ్రిటిష్ బానిస పాలన భారతీయ మనసుల్లో నిస్సహాయతను నాటే ప్రయత్నం చేసిన కాలంలో, ఆ సంకెళ్లను ఛేదించే ఆధ్యాత్మిక- జాతీయ స్ఫూర్తిగా వందేమాతరం అవతరించింది. ‘సుజలాం సుఫలాం’ అనే తొలి పాదం నుంచే భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని, తన పిల్లలను ఆదరించే తల్లిగా భావించాలన్న ఆలోచనను ప్రజల మనసుల్లో బలంగా నాటింది. భారతదేశాన్ని పూజించాల్సిన మాతృభావంగా సామాజిక చైతన్యంలో స్థిరపరిచింది.

భారతదేశం కేవలం ఒక భూమి ముక్క కాదు; అది జీవించే జాతీయ ఆత్మ. అటల్ బిహారీ వాజ్‌పేయి అన్నట్టుగా.. ‘భారత్ ఏ భూమి కా తుక్డా సహీ హై… యే జీతా జాతా ఏక్ రాష్ట్ర పురుష్ హై’. ఈ భావన ఏ ఒక్క కాలానికి చెందినది కాదు. వేదకాలం నుంచే ‘ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను’ అనే దృఢమైన ఆలోచన భారతీయ సంస్కృతికి మూలాధారం. అదే మాతృభావం, తాత్విక భావజాలం, అదే జాతీయ చైతన్యం కాలక్రమంలో వందేమాతరంగా అవతరించింది. సరస్వతి, లక్ష్మీ వంటి దేవీదేవతలను భరతమాత రూపంలో దర్శించే విశాలమైన సంస్కృతి భారతదేశానిది. స్వామి వివేకానంద భారతదేశాన్ని తల్లిగా ఆరాధించే భావజాలాన్ని స్పష్టంగా వివరించి, దానిని తరతరాలకు అందించారు. అలాంటి వేల సంవత్సరాల సంస్కృతి పరంపరలోంచే వందేమాతరం అవతరించింది. అందుకే వందేమాతరం ఏ మతానికి చెందిన గేయం కాదు.. అది భారత జాతీయ సంస్కృతికి ప్రతీక. దాన్ని మతపరమైన గేయంగా ముద్ర వేయడమంటే భారతీయ సంస్కృతి మూలాలనే అపహాస్యం చేయడమే.

అయితే దురదృష్టవశాత్తు, కాలక్రమంలో వందేమాతరాన్ని బెంగాల్ రాజకీయాలకు, మత కోణాల కోసం ముడిపెట్టే ప్రయత్నాలు జరిగాయి. ‘ఇది బెంగాలీల గేయం’, ‘ఇది మతపరమైన పాట’ అనే విమర్శలు చరిత్రను అర్థం చేసుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలే. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ కవి కావచ్చు, బంకించంద్ర ఛటోపాధ్యాయ బెంగాలీ రచయిత కావచ్చు. కానీ వారు ప్రాతినిధ్యం వహించినది ఏ ప్రాంతానికో, ఏ మతానికో కాదు.. సంపూర్ణ భారత జాతీయ ఆత్మకోసమేనని గుర్తుంచుకోవాలి. వారిని ప్రాంతీయ సంకుచితత్వంతో పరిమితం చేయాలనుకోవడం, భారతీయ జాతీయ భావజాలాన్ని చిన్నచూపుగా చూడడమే. బ్రిటిష్ కుట్రలకు ఎదురుగా భారతీయ ఐక్యతను నిలబెట్టిన శబ్దంగా వందేమాతరం మార్మోగింది. బ్రిటిషర్లు ‘విభజించి పాలించు’ అనే కుట్రను అమలు చేయడానికి బెంగాల్‌ను ప్రయోగశాలగా మార్చారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన శక్తివంతమైన నినాదం ‘వందేమాతరం’. ఆ గీతమే స్వదేశీ ఉద్యమానికి ప్రాణం పోసి, ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించింది. ఈ స్ఫూర్తి బెంగాల్‌కే పరిమితం కాలేదు, దేశం నలుమూలలా విస్తరించి స్వాతంత్య పోరాటానికి దిశానిర్దేశం చేసింది.

బెంగాల్‌కే పరిమితం కాకుండా, హైదరాబాద్‌లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ ‘వందేమాతరం’ నినాదం గట్టిగా మార్మోగింది. రామచందర్ రావు వంటి నాయకులు నిజాం అణచివేతకు ఎదురుగా పోరాడిన సందర్భంలో.. అదే గేయం ఉద్యమకారులకు ధైర్యం, దిశ ఇచ్చింది. తమిళనాడులో సుబ్రమణ్యం భారతి వంటి మహానుభావులు కూడా ఇదే జాతీయ భావజాలాన్ని ప్రజలలో వ్యాప్తి చేశారు. అందుకే వందేమాతరం ఏ ఒక్క ప్రాంతపు నినాదం కాదు.. భారతదేశమంతటా ప్రతిధ్వనించిన జాతీయ నినాదం. ఇక్కడే ప్రధాన ప్రశ్న ఉద్భవిస్తుంది- వందేమాతరాన్ని మత కోణంలోకి లాగిన వారు ఎవరు? సంపూర్ణ గీతాన్ని పక్కన పెట్టి, కొన్ని చరణాలకే పరిమితం చేయడం ఎవరి స్వార్ధానికి అనుగుణంగా జరిగింది? 1933 -1947 మధ్యకాలంలో, దేశవిభజన రాజకీయాలు, జిన్నా కోసం సర్దుబాట్లు, కొన్ని వర్గాలను సంతృప్తిపర్చే ప్రయత్నాలు.. ఇవన్నీ భారత జాతీయ ఆత్మను బలహీనపరచే చర్యలే.

అప్పటి కాంగ్రెస్ జాతీయ చైతన్యాన్ని రాజకీయం కోసం తక్కువ చేసి, జిన్నా వ్యూహాలను అనుకూలంగా చూడటానికి సిద్ధపడింది. చరిత్ర స్పష్టంగా నిరూపిస్తోంది. స్వాతంత్యానికి ప్రతీకగా, దేశమాతకు ప్రతీకగా పుట్టిన వందేమాతరాన్ని, రాజకీయ లాభాల కోసం కుదించడమే తప్పు. మొత్తం వందేమాతరాన్ని కత్తిరించి, కొన్ని చరణాలకే పరిమితం చేయడంవల్ల గీతంలోని అసలు అర్థం, సంపూర్ణ స్ఫూర్తి దేశప్రజలకి అందలేదు. వందేమాతరం మొత్తం పాడినప్పుడు మాత్రమే, భారత దేశాన్ని తల్లిగా ఆరాధించే పూర్తి భావజాలం, జాతీయ చైతన్యం స్పష్టమవుతుంది. అన్ని చరణాలు కలిసినప్పుడు మాత్రమే, భారత జాతీయ ఆత్మను ప్రతిబింబిస్తాయి. వందేమాతరం 150 ఏళ్ల ప్రయాణం స్పష్టంగా చెప్పేది ఏంటంటే- భారతదేశాన్ని మతపరమైన కళ్లజోడు ద్వారా మాత్రమే చూడాల్సిన అవసరం లేదని. వేలాది సంవత్సరాల సంస్కృతి పరంపరను తల్లిగా ఆరాధించే భావజాలమే నిజమైన భారతీయత, ఆ భావజాలానికి ప్రతీక వందేమాతరం. ఈ గేయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం అసహ్యకరం. దాని అసలు అర్థాన్ని, స్ఫూర్తిని నేటి తరానికి చేరవేయడం అత్యవసర కర్తవ్యం. వందేమాతరం కేవలం చరిత్ర జ్ఞాపకం మాత్రమే కాకుండా, వర్తమానానికి దిశానిర్దేశం, భావితరాలకు ప్రేరణ.

– డా. ఎస్.ప్రకాశ్ రెడ్డి

(బిజెపి సీనియర్ నాయకులు)

నిరాశపరిచిన ‘గుర్రం పాపిరెడ్డి’

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందించారు. ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.

కథ: గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య) అలాగే సౌదామిని (ఫరియా అబ్దుల్లా) కలిసి గొయ్యి (జీవన్), చిలిపి (వంశీధర్ గౌడ్), మిలట్రీ (రాజ్ కుమార్ కసిరెడ్డి)లతో మాట్లాడి శ్రీశైలంలో ఉన్న ఒక శవాన్ని తీసుకొచ్చి శ్రీనగర్ కాలనీలోని స్మశాన వాటికలో మరో శవంతో మార్చాలని ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలో రాజ కుటుంబీకులు హైగ్రీవ (జాన్ విజయ్), నీలగ్రీవ (ప్రదీప్ రుద్ర) లు గుర్రం పాపిరెడ్డిని టార్గెట్ చేసి అతన్ని వెతుకుతూ ఉంటారు. అసలు గుర్రం పాపిరెడ్డి ఎవరు? పైగా వాళ్ళ ఆస్తి ఎందుకు కొట్టేయాలని చూస్తాడు? అసలు ఆ శవం ఎవరిది? ఎందుకు మార్చాలనుకున్నారు? అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

విశ్లేషణ: తెలుగులో గతంలోనూ డార్క్ కామెడీ థ్రిల్లర్‌లు చాలానే వచ్చాయి. కానీ ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా రొటీన్‌గా సాగి ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ డార్క్ కామెడీ మూవీలో ఫన్ అండ్ ట్విస్ట్‌లు అక్కడక్కడా ఉన్నప్పటికీ, కథనం మాత్రం చాలా సాగదీతగా ఉండడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టుగా ఉంటుంది. ప్రారంభంలో ఫన్ ట్రాక్స్‌తో వెళ్లిన సినిమా మెయిన్ ప్లాట్‌లోకి వెళ్లిన తర్వాత అందులో బలం లేదు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ కథలో వేగం తగ్గుతుంది. కోర్టు రూమ్ డ్రామా మొదలైనప్పటి నుంచి కథలో సీరియస్‌నెస్ తగ్గిపోయింది. సింపుల్ కథకు పురాణాలను లింక్ పెట్టడంతో లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఇక నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా తమ నటనతో పర్వాలేదనిపించారు. యోగిబాబు లాంటి కోలీవుడ్ కమేడియన్‌ని పెట్టుకొని తక్కువే వాడుకున్నారు. ఇంకా లెజెండరీ బ్రహ్మానందంకి మంచి ఫన్ ట్రాక్స్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఈ మధ్య కాలంలోనే వచ్చిన కొన్ని ఫన్ క్రైమ్ థ్రిల్లర్స్ గుర్తు రాక మానవు. కొత్తదనం ఆశించేవారికి ఈ సినిమా నిరాశపరుస్తుంది. దీనికి తోడు కథనంకి పాటలు మరింత అడ్డుగా అనిపిస్తాయి. ఈ సినిమాలో బోర్‌గా అనిపించే అంశాలు చాలానే ఉన్నాయి. చివరగా ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా ప్రేక్షకులను అలరించలేక నిరాశపరిచింది.  

ఉదయ్ భాస్కర్ సహజ నటన హైలైట్‌గా..

సహజ నటనకు, భావోద్వేగ ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉదయ్ భాస్కర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సెకండ్ ఇన్నింగ్స్’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సుమారు పదహారు సంవత్సరాల నటనా అనుభవం కలిగిన ఉదయ్ భాస్కర్ పాత్రలోకి పూర్తిగా లీనమయ్యే నటుడిగా పరిశ్రమలో గుర్తింపు పొందారు. ‘సెకండ్ ఇన్నింగ్స్’ చిత్రంలో ఉదయ్ భాస్కర్ ప్రదర్శన గురించి చిత్ర బృందం ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తోంది. భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో ఆయన నటన సినిమాకే ప్రధాన బలంగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సహనటిగా నక్షత్రతో ఆయన నటించిన సన్నివేశాలు సహజంగా, నిజాయితీగా వచ్చాయని, ఇద్దరి మధ్య కనిపించే భావోద్వేగ అనుసంధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.