elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

marsbahis

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bets10

smartbahis

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

marsbahis

kavbet

piabellacasino giriş

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

piabellacasino

mavibet

lidyabet

Vaycasino Giriş

Vaycasino

galabet

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

jojobet

padişahbet

pusulabet

deneme bonusu veren yeni siteler

madridbet

kingroyal

madridbet

efesbet

betcio

meritking

meritking

meritking

madridbet

madridbet

meritking

kingroyal

madridbet

madridbet

meritking

deneme bonusu veren yeni siteler

efesbet

meritking

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

madridbet

kingroyal

meritking

meritking

meritking

kralbet

parobet

meritking

పబ్‌లో దూరి సాయుధుల కాల్పులు.. 9మంది మృతి

జోహెనెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలోని బెక్కెర్స్‌డల్ పట్టణంలో ఓ పబ్ వద్ద రక్తపాతం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కొందరు సాయుధులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో తొమ్మండుగురు మృతి చెందారు. కనీసం పది మంది వరకూ గాయపడ్డారు . మృతుల్లో ముగ్గురు బాలలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ఆదివారం మధ్యాహ్నం వెల్లడించాయి. జోహెన్స్‌బర్గ్‌కు దాదాపు 46 కిలోమీటర్ల దూరంలో అర్థరాత్రి తరువాత కోలాహలంగా ఉన్న పబ్ ఒక్కసారిగా తెల్లటి మిని బస్సులో, సిల్వర్ సెడాన్ వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తుల దాడితో హాహాకారాలతో దద్దరిల్లింది. వస్తూనే వారు ముందుగా పబ్ నిర్వాహకులను ఎంచుకుని కాల్పులకు దిగారు. తరువాత కూడా పబ్‌కు వచ్చిన వారిపై వారి కాల్పులు సాగాయి. ఈ క్రమంలో తూటాలకు బలి అయ్యి చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదిగా నిర్థారణ అయింది.

టాంబో సెక్షన్‌లోని క్వానాకోలో టావెర్న్ వద్ద ఈ పబ్ నెలకొని ఉంది. కాల్పులకు దిగి అక్కడి నుంచి దుండగులు వెంటనే తమ వాహనాలలో అక్కడి నుంచి పారిపోయారు. వీరు వెళ్లుతూ వెళ్లుతూ పట్టణంలో జనంపై కూడా కాల్పులకు దిగినట్లు తెలిసింది. దుండగుల ఆచూకి కోసం గాలిస్తున్నట్లు ప్రాంతీయ పోలీసు కమిషనర్ మేజర్ జనరల్ ఫ్రెడ్ కెకనా మీడియాకు తెలిపారు. మృతులలో ఒకరు పబ్ వెలుపల ఉన్న టాక్సీ కారు డ్రైవర్ అని వివరించారు. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాలలో అర్థరాత్రి వరకూ సాగే పబ్‌లు, బార్లను ఎంచుకుని సాయుధులు దాడులకు దిగుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడి పబ్‌లో జరిగిన దారుణకాండకు కారణంఏమిటనేది ఆరా తీస్తున్నారు. దుండగులను పట్టుకుంటేనే సంబందిత ధటనపై కొంత సమాచారం నిర్థారించుకునేందుకు వీలు అవుతుందని అధికారులు తెలిపారు.

కాంగ్రెస్ దేశ విరోధి.. అసామీ విద్వేషి: ప్రధాని మోడీ

నామ్రూప్ ః కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అసోంలోకి అక్రమంగా బంగ్లాదేశీయులు వచ్చి ఇక్కడ స్థిరపడేలా ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. అసోంలోని దిబ్రూఘర్ జిల్లా నామ్రూప్‌లో రూ 10,601 కోట్ల వ్యయంతో ఏర్పాటు అయిన ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం తరువాత జరిగిన సభలో ఆదివారం ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ ఫ్యాక్టరీ బ్రౌన్‌ఫీల్డ్ అమోనియా యూరియా తయారీ ప్లాంట్‌గా నిలుస్తుంది. ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌కు ఈ దేశం అంటే బాధ్యత లేదు. బంగ్లాదేశీయులు ఇక్కడి అడవులు, భూములలోకి ప్రవేశించేందుకు కాంగ్రెస్ సహకరిస్తోంది.

కేవలం పార్టీ ఓటు బ్యాంకును ఈ అక్రమ వలసదార్ల బలంతో పెంచుకోవాలనేదే కాంగ్రెస్ తపన అని తెలిపారు. అసామీల ఉనికి, వారి సాంస్కృతిక ఆచార వ్యవహారాల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు. బిజెపి ఎప్పుడూ అసామీల ప్రత్యేకతను కాపాడేందుకు కార్యాచరణకు దిగుతోందని అన్నారు. ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్న పాత కర్మాగారాన్ని కాంగ్రెస్ తమ హయాంలో ఏనాడూ ఆధునీకరించలేదని , రైతుల సమస్యల పరిష్కారానికి ఆలోచించలేదని విమర్శించారు. ఈ సభలో ఆయన ప్రసంగం ఎక్కువగా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శ్శనాస్త్రాలతోనే సాగింది. అన్నింటికి మించి కాంగ్రెస్ జాతి వ్యతిరేక చర్యలు శృతి మించుతున్నాయని సభలో ఆయన తెలిపారు.

అధికారం కోసం అక్రమ వలసదార్లకు వత్తాసు

అధికారం దక్కించుకోవాలనేదే వారి ఏకైక లక్షం, అందుకే వారు తరచూ ఓటర్ల జాబితాల సవరణను వ్యతిరేకిస్తున్నారు. ఈ సర్ ప్రక్రియ సజావుగా సాగితే వారు ఆశలు పెట్టుకున్న అక్రమ వలసదారుల పేర్లు జాబితాల్లో నుంచి ఎగిరిపోతాయనేదే వారి భయం అని విమర్శించారు. మేము చేసే ప్రతి మంచి పనిని ఎంచుకుని ఎదురుదాడికి దిగడమే వారి పని అయిందని వ్యాఖ్యానించారు. బిజెపి ఎప్పుడూ అస్సామీల ఉనికి వారి భూములు, వారి తరతరాల ఆత్మగౌరవం నిలిపేందుకు యత్నిస్తోందని అన్నారు. అసోంలో రెండు రోజుల పర్యటన ముగింపు రోజున మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అసామీల పట్ల గౌరవం లేని అరాచక పార్టీ

అసామీ భూమి పుత్రుడు డాక్టర్ భూపెన్ హజారికాకు తమ ప్రభుత్వం భారత రత్న ప్రదానం చేసింది. దీనిని కాంగ్రెస్ బహిరంగంగా వ్యతిరేకించిందని మోడీ తెలిపారు. ఆటగాళ్లు పాటగాళ్లకు మోడీ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను కట్టబెడుతోందని, పరువు తీస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మాట్లాడారంటే వారికి ఇక్కడి ప్రముఖుల పట్ల ఎంతటి గౌరవం ఉందనేది తెలుస్తుందని ప్రధాని మోడీ స్పందించారు. కాంగ్రెస్ మాటలు భూపెన్ దా పట్లనే కాకుండా అసాం ప్రజలందరి పట్ల అవమానించినట్లుగానే ఉన్నాయని విమర్శించారు.

అహోం రాజుల నాటి వైభవం

శతాబ్దాల క్రితం అహోం రాజుల కాలంలో ఉన్నంత శక్తివంతంగా అస్సాంను తీర్చిదిద్దడమే బిజెపి లక్షం అన్నారు. ఇక్కడి అపార వనరులను సద్వినియోగం చేయడం, వాటికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేలా చేయడం కోసం తమ ప్రభుత్వం పలు చర్యలకు దిగుతోందని వివరించారు. ఇక్కడ ఇప్పుడు ప్రారంభించిన ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి మొదలైన నాటి నుంచే ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తి అవుతుందని మోడీ చెప్పారు. దీనితో ఈ ప్రాంతంలో ఎరువుల సరఫరా గొలుసుకట్టు క్రమం అంతా పదిలం అవుతుంది.ఇది రైతాంగానికి మేలు చేస్తుందని తెలిపారు. అసోంలో ఉత్పత్తి అయిన బ్లాక్‌టీని రష్యా అధ్యక్షులు పుతిన్‌కు ఇటీవల తాము ఆయన భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కానుకగా ఇచ్చామని గుర్తుచేశారు.

కోడిగుడ్డు ఆల్ టైం రికార్డ్.. పెరుగుతున్న చికెన్ ధరలు

రిటైల్ మార్కెట్‌ను షేక్ చేస్తున్న కోడిగుడ్లు, చికెన్ ధరలు

కోడిగుడ్డు రూ.8కి పెరిగి ఆల్ టైం గరిష్టం రికార్డ్ నమోదు

చికెన్ ధరలు క్రమేణా పెరుగుతూ రూ.280కి చేరువ

తగ్గిన కోడిగుడ్ల ఉత్పతితో పెరిగిన డిమాండే కారణం

గుడ్డు, చికెన్ ధరల పెరుగుదలతో సామాన్యులు గగ్గోలు

మన తెలంగాణ/హైదరాబాద్: కోడిగుడ్లు, కోడి మాంసం, కూరగాయలు ఇలా ఒకటేంటి అన్నీ రోజు రోజుకీ పెరుగుతుంటే సగటు జీవికి బ్రతుకు భారమవుతోంది. కూరగాయల కన్నా కోడి గుడ్లు ధరలు తక్కువ ఉంది కదా అని సరిపెట్టుకునే వారికి గుడ్డు ధర కూడా రూ.8కి పైగానే రిటైల్ మార్కెట్‌లో ధర పలుకుతుంటే హడలిపోతున్నారు. దీనికితోడు సాధారణ ప్రజలకు తక్కువ ధరలో లభించే మాంసాహారమైన బ్రాయిలర్ కోడి మాంసం ధర కూడా ప్రతి రోజు పెరిగి, ఆదివారం నాటికి కిలోధర రూ.280కి చేరింది. దీంతో చికెన్ ధరలు ఒక వైపు, కోడి గుడ్ల ధరలు మరో వైపు భారీగా పెరుగుతూ మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. దీంతో సామాన్యులు హడలిపోతున్నారు.

కోడిగుడ్ల హోల్‌సేల్ మార్కెట్ వర్గాల సమాచారం మేరకు ఈ స్థాయిలో ఎప్పుడూ ధరలు పెరగలేదని, ఈ పెరుగుదల ఆల్ టైం రికార్డ్ సృష్టిస్తున్నాయని చెబుతున్నారు. సామాన్యుడికి ఎప్పుడూ తక్కువ ధరలో అందుబాటులో ఉండే కోడి గుడ్ల ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్లో రూ.5గా ఉన్న గుడ్డు ధర, క్రమేణా రూ.6కి పెరిగి ఆ తర్వాత పెరుగుతూ వస్తూ ఏకంగా రూ.7.30కి చేరుకుంది. ఆ తర్వాత ఏకంగా గుడ్డు ధర రూ.8కు చేరుకుంది. కొన్నిచోట్ల రిటైల్ వ్యాపారులు ఏడున్నర ఉంటే ఎనిమిది తీసుకుంటున్నారు. దీంతో అవసరాన్ని బట్టి 50 పైసలు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. 30 కోడి గుడ్లు ధర (ట్రే) గతంలో రూ.160 నుంచి రూ.170 వరకు ఉంటే, ఇప్పుడు రూ.210 నుంచి రూ.240కి చేరుకుంది.

మరో రెండు నెలలు ఇవే ధరలు కొనసాగే అవకాశం

మరో రెండు నెలల పాటు ఇవే ధరలు, లేదా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తక్కువ ధరకే లభించే గుడ్ల ధరలు ఒకేసారి పెరగడంతో సామాన్యులు షాక్ అవుతుంటే ఫామ్‌ల యజమానులు మాత్రం ధరలు ఇలా రెండు మూడు నెలలు కొనసాగితే తాము నష్టాల బారి నుంచి బయటపడతామని చెబుతున్నారు. కోళ్లు వ్యాధులతో చనిపోవడం ఒకటైతే, కోడి గుడ్లు దిగుమతి కావడం వల్ల మరింత మార్కెట్ క్షీణించి కోడి గుడ్లు ధరల్లేక, కోళ్లు లేక ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు. ఇలా కొంచెం ధర పెరిగి కోడిగుడ్ల మార్కెట్ స్థిరంగా కొనసాగితే తాము ఇప్పటికి ఎదుర్కొంటున్న నష్టాల నుంచి బయటపడతామని వెల్లడిస్తున్నారు.

కాగా గుడ్ల ధరలు రికార్డుస్థాయిలో పెరుగుతుండడం వెనుక అనేక కారణాలను వ్యాపారులు వెల్లడిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్నా భోజన పథకం, వసతి గృహాల్లో వినియోగం, బేకరీలు, ఇలా చాలా రకాలుగా కోడిగుడ్ల వినియోగం విపరీతంగా పెరగడంతో పాటు కూరగాయలకు బదులుగా కోడిగుడ్లు తినే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వచ్చింది. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం వల్ల కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. దీనికితోడు కోళ్ల దాణా, మక్కలు వంటి ధరలు కూడా పెరగడంతో కోళ్ల ఫారం ఉత్పత్తిదారులకు పెట్టుబడి వ్యయం విపరీతంగాపెరిగిపోయిందని చెబుతున్నారు.

గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగేది. పెట్టుబడి పెరగడంతో చాలా మంది రైతులు ఫారాల కోళ్ల ఫారాలను మూసివేయడం వల్ల గుడ్ల గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయి ఆరు కోట్ల కోడిగుడ్లకు పడిపోయిందని చెబుతున్నారు. ఈ కారణంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్‌లో కోడిగుడ్డు ధర రూ.7.30, రిటైల్లో రూ.8 పలకడం పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్ టైమ్ గరిష్ఠంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరో రెండు నెలల పాటు ఇదే ధర కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

మేడారం మహా జాతర 2026 పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం

మన తెలంగాణ / హైదరాబాద్ : మేడారం మహా జాతర 2026 పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆయన నివాసంలో ఆవిష్కరించారు. అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

నల్లధనం తెస్తామన్న హామీ ఏమైంది?.. కిషన్ రెడ్డిపై జగ్గా రెడ్డి ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః అధికారంలోకి రాగానే విదేశాల్లో ఉన్న నల్లధనం తెస్తామన్న హామీ ఏమైందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లేఖ రాయడంపై జగ్గారెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి అకౌంట్‌లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని బిజెపి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ హామీ సంగతి ఏమైందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

ఈ హామీల గురించి కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఆ విధంగా లేఖ రాస్తే తాము ఆయన లేఖకు సమాధానం ఇస్తామని జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బిజెపికి లేదని ఆయన దుయ్యబట్టారు. సోనియా గాంధీ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించామని, ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలెండర్ ఇస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు దాటినా ఇచ్చిన హామీలను బిజెపి నిలబెట్టుకోలేదని, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని జగ్గా రెడ్డి తెలిపారు.

కిషన్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సవాల్

మీ 12 ఏళ్ళ పాలన, మా రెండేళ్ళ పాలనపై చర్చకు సిద్ధమా?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ సవాల్

కిషన్ రెడ్డికి సోనియాకు లేఖ రాసే స్థాయి లేదు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః “కేంద్రంలో మీ పన్నెండేళ్ళ పాలన, రెండేళ్ళ మా పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా?” అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి చేసింది ఏమిటో ప్రజలకు చెప్పాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండేళ్ళలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవని తెలిపారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసే స్థాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని ఆయన విమర్శించారు.

తెలంగాణపై అడుగడుగునా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీపై వత్తిడి తెచ్చే సామర్థం లేని కిషన్ రెడ్డికి సోనియా గాంధీకి లేఖ రాసే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల్లో కేంద్రం తెలంగాణపై పక్షపాతం చూపుతున్నదని ఆయన ఆరోపించారు. బిసి రిజర్వేషన్లు, మెట్రో రైలు ప్రాజెక్టు, మూసి నది సుందరీకరణ, రాష్ట్రంలో కేంద్ర విద్యా సంస్థల స్థాపన వంటి కీలక అంశాల్లో ప్రధాని మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కనిపించడం లేదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

మహాలక్ష్మితో లాభాల్లోకి ఆర్‌టిసి: భట్టి విక్రమార్క

మహిళల ప్రయాణానికి ప్రత్యేక కార్డులు

పిఎం ఈ -డ్రైవ్ కింద నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు

విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు బుక్స్, యూనిఫామ్స్, షూస్

రజక, నాయి బ్రాహ్మణ కులవృత్తుల ఉచిత విద్యుత్ బిల్లుల విడుదల

సమీక్షా సమావేశంలో ఉప ఉఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మన తెలంగాణ/హైదరాబాద్: మహాలక్ష్మి పథకం వల్ల ఆర్‌టిసి లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ హాస్టళ్లలోని నిరుపేద విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ ఛార్జీలను 200 శాతం పెంచామన్నారు. ప్రతి మూడు నెలలకు కాస్మోటిక్, మెస్ చార్జీల బిల్లులను చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ప్రజాభవన్ లో ఆర్‌టిసి, బిసి సంక్షేమ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్‌టిసి ఎండి నాగిరెడ్డి, ఇతర జాయింట్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు, ఎంజెపి కార్యదర్శి సైదులు, బిసి సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆర్‌టిసి బలోపేతం చేసేందుకు, కార్మికులను ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని అన్నారు.

ముఖ్యంగా ఆడబిడ్డలకు బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు తెచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల ఆర్‌టిసి లభాల్లోకి వచ్చిందన్నారు. మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం అందించిన సహాకారంతో సంస్థకు కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ ల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. ప్రభుత్వ సహకారంతో సంస్థ నూతనంగా ఆదాయా మార్గాలను అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఆర్‌టిసిలో మహాలక్ష్మీ పధకం కింద ఇప్పటి వరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగాయని, ఈ పథకం వల్ల మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్‌టిసిలో పిఎఫ్ బకాయిలు రూ. 1400 కోట్లు ఉంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రూ. 660 కోట్లకు తగ్గించినట్లు ఆయన తెలిపారు. సిసిఎస్ బకాయిలు గతంలో రూ.600 కోట్లు ఉండగా ప్రజాప్రభుత్వం రూ.373 కోట్లకు తగ్గించిందన్నారు.

మహిళల ప్రయాణానికి ప్రత్యేక కార్డులు

ఆర్‌టిసిలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం చేసుకొని ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని అధికారులను బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ కార్డులు తెలంగాణలోని ప్రతి మహిళకు చేరాలని అధికారులకు ఆయన సూచించారు. ఆర్‌టిసిలో పిఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని, వీటికి చార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పిఎం ఈ -డ్రైవ్ కింద నిజామాబాద్ వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు.

పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు

ప్రతి సంవత్సరం పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్, షూస్ పంపిణీ చేయాలని అందుకు సంబధించిన నిధులు విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ను ఆదేశించారు. నాయి బ్రాహ్మణ, రజకకుల సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు లేకుండా నెల వారిగా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటోందని, అందులో భాగంగా ఒకేసారి వంద ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసిందని చెప్పారు. గతంలో ఎంజెపిలో 327 గురుకులాల్లో కేవలం 26 గురుకులాలకు మాత్రమే సొంత భవనాలున్నాయని తెలిపారు. ప్రజాప్రభుత్వం వంద ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు కార్పొరేట్ తరహాలో భవనాలను నిర్మిస్తోందన్నారు. గురుకులాల స్కూల్ అద్దె, మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీల కోసం రూ.152 కోట్లు విడుదల చేశారని తెలిపారు. గీత వృత్తిదారుల రక్షణకు ఇప్పటి వరకు 30 వేల కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టుల నియామకాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. మార్చ్ 2026 వరకు 3,233 కండక్టర్ పోస్టులు అవసరం ఉండగా తాత్కాలికంగా నియామకాలు జరపడంతో పాటు 50 శాతం రెగ్యులర్ నియామకాలకు అనుమతివ్వాలని కోరారు. చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు, డ్రైవింగ్ లైసెన్స్ ల జారిలో ఉన్న ఇబ్బందులు తేలెత్తకుండా యూజర్ ఛార్జీలకు అనుమతివ్వాలని, రవాణా శాఖ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ పెంచడానికి కొత్త వాహనాలకు అనుమతివ్వాలని ,టాక్స్ కలెక్షన్ కోసం ట్యాబ్ లు మంజూరు చేయాలని మంత్రి డిప్యూటీ సిఎంను కోరారు.

గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఎ.. 14 రోజులు రిమాండ్

మావోయిస్టులతో లింకులు…?

జనగామలో మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్ చేసిన ఎన్‌ఐఎ

గాదె ఇన్నయ్యను అరెస్టు చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్‌ఐఎ అధికారులను అడ్డుకున్న చిన్నారులు

ఉపా చట్టం కింద కేసు నమోదు

నాంపల్లి ఎన్‌ఐఎ కోర్టు ముందు హాజరుపర్చిన ఎన్‌ఐఎ అధికారులు

14 రోజులు రిమాండ్ విధించిన ఎన్‌ఐఎ కోర్టు, చంచల్‌గూడ జైలుకు తరలింపు

ఎన్‌ఐఎ లోతుగా దర్యాప్తు

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మావోయిస్టు, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య అరెస్టు కలకలం రేపుతోంది. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఎ అధికారులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో నిర్వహిస్తు న్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వెళ్లిన ఎన్‌ఐఎ అధికారులు గాదె ఇన్నయ్యను అరెస్టు చేశారు. గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్‌ఐఎ అధికారులను చిన్నారులు అడ్డుకున్నారు. ఇదివరకే గాదా ఇన్నయ్యపై పలు సెక్షన్ల కింద ఎన్‌ఐఎ కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో గాదె ఇన్నయ్య (గాదె ఇన్నారెడ్డి)ని ఎన్‌ఐఎ ఆది వారం అరెస్ట్ చేసింది. ఆయనపై ఎన్‌ఐఎ తీవ్రమైన అభియోగాలు నమోదు చేస్తూ చర్యలు చేపట్టింది. గాదే ఇన్నయ్యను అరెస్టు చేయడం కోసం పోలీసులు ఆయన నివాసాన్ని చుట్టుము ట్టారు. నిషేధిత సంస్థల భావజాలా న్ని ప్రచారం చేయడం, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడటం ద్వారా దేశ భద్రతకు ముప్పు కలిగిస్తున్నారనే ఆరోపణల పై ఎన్‌ఐఎ ఆయనతో పాటు ఇతరులపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఈ క్రమం లో జనగామ జిల్లాలో ఎన్‌ఐఎ గాదె ఇన్నయ్యను అదుపులోకి తీసు కుంది.

మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి (వికల్ప్) అంత్యక్రియల సందర్భంగా జరిగిన ఒక సభ గాదె ఇన్నయ్య అరెస్టు కు ప్రధాన కారణమైంది. సిపిఐ (మావోయిస్ట్) అనుబంధ సంస్థ అయిన ’అమరుల బంధు మిత్రుల సంఘం’ (ఎబిఎంఎస్) ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ’భారత్ బచావో’ వ్యవస్థాపకుడిగా గాదె ఇన్నయ్య ప్రసంగించారు. తన ప్రసంగంలో భాగంగా భారత ప్రభుత్వ భద్రతా బలగాలు రామచంద్రారెడ్డిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చిత్రహింసలు పెట్టి హత్య చేశాయని ఇన్నయ్య ఆరోపించారు. సుమారు 150 నుండి 200 మంది ప్రజలు పాల్గొన్న ఆ అంత్యక్రియల సభలో గాదె ఇన్నయ్య చేసిన ప్రసం గానికి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఎన్‌ఐఎ స్పష్టం చేసింది. ఆయన చేసిన ప్రసంగం దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగు బాటు కార్యకలాపాలను ప్రేరేపించడానికి ప్రయత్నించినట్లు ఉందని ఎన్‌ఐఎ పేర్కొంది. ఈ కారణంగా కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన వీడియో సాక్ష్యాలను ఎన్‌ఐఏ సేకరించినట్లు సమాచారం. ఈ ప్రసంగం ద్వారా గాదె ఇన్నయ్య ప్రజలను రెచ్చగొట్టి, దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు లేదా విధ్వంసక కార్యకలాపాలకు పురికొల్పే ప్రయత్నం చేశారని దర్యాప్తు సంస్థ పేర్కొంది.

హిడ్మా తల్లిని కలిశాడు.. హిడ్మా మరణంపై ఉద్వేగభరిత ప్రసంగం 

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత గాదె ఇన్నయ్య ఛత్తీష్‌గడ్ వెళ్లారు. హిడ్మా తల్లిని కలిశారు. అక్కడున్న నేషనల్, స్టేట్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్లతో హిడ్మా మరణంపై ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ఈ సమయంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అమిత్ షా తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్‌ఐఎ దృష్టి సారించింది. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు పంపింది. తాజాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఇన్నయ్యపై కేసు నమోదు చేసింది. కాగా, ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో 200 మంది అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు.

గతంలో మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర

కాగా, గాదె ఇన్నయ్య గతంలో మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నా రు. ప్రస్తుతానికి ఆయన ’భారత్ బచావో’ అనే సంస్థ ద్వారా సామాజిక, రాజకీయ అంశా లపై గళం వినిపిస్తున్నారు. గతంలో కూడా ఆయనపై కొన్ని కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఎన్‌ఐఎ రంగంలోకి దిగి అరెస్ట్ చేయడం తో ఈ కేసు తీవ్రత పెరిగింది. ‘ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మావోయిస్టు పార్టీకి మద్ధతు తెలుపుతున్నట్లు, మావోయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా గాదె ఇన్నయ్య మాట్లాడిన వీడియో ప్రకారం మేము అరెస్టు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఆ ఇంటర్య్యూ ఇచ్చి రెండు మూడు నెలలైంది. ఆదివారం కావడంతో కోర్టు ఉండదనే కారణంతోనే అరెస్టు చేశారు. సుమారు నలబై యాబై మంది పది కార్లలో వచ్చి అతడు పారిపోతాడేమోనని చుట్టూ నిఘా పెట్టారు. ప్రజల మనిషి ఎటూ పోడూ. తల్లిలాంటి పార్టీపైన ఎంతో కొంత ప్రేమ ఉంటుందే తప్ప అతడు ఎటూపోడు‘- అని గాదె ఇన్నయ్య కుమార్తె అన్నారు.

గాదే ఇన్నయ్యకు 14 రోజుల రిమాండ్ విధించిన ఎన్‌ఐఎ కోర్టు

గాదె ఇన్నయ్య అరెస్టు నాంపల్లి ఎన్‌ఐఏ న్యాయస్థానంలో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. నాంపల్లిలోని ఎన్‌ఐఎ న్యాయస్థానం గాదె ఇన్నయ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచలగూడ జైలుకు తరలించారు.

ఎన్‌ఐఎ లోతుగా దర్యాప్తు…!

ఈ వీడియో క్లిప్పింగులను పరిశీలించిన ఎన్‌ఐఏ అధికారులు, ఇది మావోయిస్టులకు సానుభూతి పెంచే చర్యగా గుర్తించారు. అరెస్టు సందర్భంగా ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి పలు మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు, కొన్ని ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక సమాచారం ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో మావోయిస్టు ఉద్యమం లో కీలకంగా పనిచేసిన ఇన్నారెడ్డి, ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ప్రస్తుతం జాఫర్‌ఘడ్‌లో అనాథ పిల్లల కోసం ఆశ్రమం నడు పుతున్నారు. అయితే ఆశ్రమం మాటున ఏవైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగుతున్నాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టు నేత హిడ్మా మరణం తర్వాత చెల్లాచెదురైన పార్టీ కేడర్‌ను ఇన్నారెడ్డి ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమానికి వచ్చే విరాళాలు, నిధులు మావోయిస్టులకు అందుతున్నాయా? అనే అంశాలపై కూడా ఎన్‌ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

చిరు హిట్ సినిమా క్యారెక్టర్లతో అనిల్ రావిపూడి సెల్ఫీ

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌తో ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026, జనవరి 12న విడుదల కానుంది. అయితే ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ విషయాన్ని అనిల్ కూడా ఫాలో అయ్యారు. ఎఐ సాయంతో సినిమా నటులతో సెల్ఫీలు దిగుతున్నట్లు ఉండే వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అనిల్ కూడా అదే చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించి ‘ఖైదీ’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ తదితర చిత్రాల్లో చిరంజీవి పాత్రలతో సెల్ఫీ దిగుతున్నట్లు ఉండే ఓ వీడియోని ఆయన షేర్ చేశారు. చివర్లో తన సినిమాని కూడా జత చేశారు. ‘అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి.. ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. 

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఓపెనర్లు

మౌంట్‌ మాంగనూయ్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ సరికొత్త సృష్టించారు. ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడిగా ప్రపంచ రికార్డు సాధించారు. టెస్ట్ క్రికెట్‌లోనే కాదు.. యావత్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడిగా కాన్వే, లాథమ్ నిలిచారు.

ఈ మ్యాచ్‌లో లాథమ్ తొలి ఇన్నింగ్స్‌లో 137, రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేయగా.. కాన్వే తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ(227), రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేశాడు. వ్యక్తిగతంగా కాన్వే మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, శతకం సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీట్‌ను కేవలం తొమ్మిది మంది మాత్రమే సాధించారు.