elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetbetsmove

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

hızlıcasino

tlcasino

marsbahis

kavbet

pusulabet

grandpashabet

wbahis

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

betcio

mavibet

lidyabet

pusulabet giriş

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

matbet

sakarya escort

meritking

రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం

మన తెలంగాణ / హైదరాబాద్ : సికిందరాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులతో ఆత్మీయంగా మాట్లాడారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.

బిగ్ బాస్ సీజన్-9 విన్నర్ కల్యాణ్ పడాల

మన తెలంగాణ/హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా కల్యాణ్ పడాల నిలిచారు. హోస్ట్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఆయన ట్రోఫీతో పాటు రూ. 35 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నారు. తనూజ రన్నరప్‌గా నిలిచారు. కల్యాణ్ కు విన్నర్ చెక్ తో పాటు బ్రాండ్ న్యూ మారుతి సుజుకి విక్టోరిస్ కారు, ’రాఫ్’ నుంచి రూ.5 లక్షల చెక్‌ను అందజేశారు. బిగ్‌బాస్ సీజన్–9 ఫైనల్ రేసులో ఐదుగురు కంటెస్టెంట్లు నిలవగా ఆదివారం జరి గిన ఫినాలేలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత నటి సంజన గల్రానీ ఐదో స్థానంతో ఎలిమినేట్ అయ్యారు.

టాప్-3లో ఉంటానని భావించిన ఆమె ఈ ఫలితంతో షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత, టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా ఉన్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ నాలు గో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆయన ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత రూ. 15 లక్షల ఆఫర్‌కు డెమోన్ పవన్ అంగీకరించి పోటీ నుంచి తప్పుకున్నారు. పవన్ నిష్క్ర మణతో విజేత ప్రైజ్‌మనీ రూ. 50 లక్షల నుంచి రూ. 35 లక్షలకు తగ్గింది. చివరికి కల్యాణ్ పడాల అత్య ధిక ఓట్లు సాధించి టైటిల్ గెలుచుకోగా, తనూజ రన్నరప్‌గా నిలిచారు. స్టార్ మా, జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఈ ఫినాలే ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠతతో సాగింది.

తొలి టి20.. లంకపై భారత్ ఘన విజయం

విశాఖపట్నం: శ్రీలంక మహిళలతో ఆదివారం విశాఖపట్నంవేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు సాధించింది. ఓపెనర్ విశ్మీ గుణరత్నె ఒక్కటే కాస్త నిలకడగా రాణించింది. సమన్వయంతో ఆడిన విశ్మీ 39 పరుగులు చేసింది. కెప్టెన్ చామరి ఆటపట్టు (15), హసిని పెరీరా (20), హర్షిత (21) పరుగులు సాధించారు.

భారత బౌలర్లు సమష్టిగా రాణించిప్రత్యర్థి టీమ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 14.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (25), షఫాలీ వర్మ (9) శుభారంభం అందించలేక పోయారు. అయితే జెమీమా రోడ్రిగ్స్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన జెమీమా 44 బంతుల్లోనే 10 ఫోర్లతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 15 (నాటౌట్) తనవంతు సహకారం అందించింది.

ఇంగ్లండ్ హ్యాట్రిక్ ఓటమి.. ఆస్ట్రేలియాదే యాషెస్ సిరీస్

అడిలైడ్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మరో రెండు టెస్టులు మిగిలివుండగానే 30 తేడాతో యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. 435 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 352 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఓపెనర్ జాక్ క్రాలీ (85) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

జో రూట్ (39), హ్యారీ బ్రూక్ (30), జేమీ స్మిత్ (60), విల్‌జాక్స్ (47), బ్రైడన్ కార్స్ 39 (నాటౌట్) రాణించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమిన్స్, లియాన్ మూడేసి వికెట్లను పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 371, రెండో ఇన్నింగ్స్‌లో349 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది.

పబ్‌లో దూరి సాయుధుల కాల్పులు.. 9మంది మృతి

జోహెనెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలోని బెక్కెర్స్‌డల్ పట్టణంలో ఓ పబ్ వద్ద రక్తపాతం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కొందరు సాయుధులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో తొమ్మండుగురు మృతి చెందారు. కనీసం పది మంది వరకూ గాయపడ్డారు . మృతుల్లో ముగ్గురు బాలలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ఆదివారం మధ్యాహ్నం వెల్లడించాయి. జోహెన్స్‌బర్గ్‌కు దాదాపు 46 కిలోమీటర్ల దూరంలో అర్థరాత్రి తరువాత కోలాహలంగా ఉన్న పబ్ ఒక్కసారిగా తెల్లటి మిని బస్సులో, సిల్వర్ సెడాన్ వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తుల దాడితో హాహాకారాలతో దద్దరిల్లింది. వస్తూనే వారు ముందుగా పబ్ నిర్వాహకులను ఎంచుకుని కాల్పులకు దిగారు. తరువాత కూడా పబ్‌కు వచ్చిన వారిపై వారి కాల్పులు సాగాయి. ఈ క్రమంలో తూటాలకు బలి అయ్యి చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదిగా నిర్థారణ అయింది.

టాంబో సెక్షన్‌లోని క్వానాకోలో టావెర్న్ వద్ద ఈ పబ్ నెలకొని ఉంది. కాల్పులకు దిగి అక్కడి నుంచి దుండగులు వెంటనే తమ వాహనాలలో అక్కడి నుంచి పారిపోయారు. వీరు వెళ్లుతూ వెళ్లుతూ పట్టణంలో జనంపై కూడా కాల్పులకు దిగినట్లు తెలిసింది. దుండగుల ఆచూకి కోసం గాలిస్తున్నట్లు ప్రాంతీయ పోలీసు కమిషనర్ మేజర్ జనరల్ ఫ్రెడ్ కెకనా మీడియాకు తెలిపారు. మృతులలో ఒకరు పబ్ వెలుపల ఉన్న టాక్సీ కారు డ్రైవర్ అని వివరించారు. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాలలో అర్థరాత్రి వరకూ సాగే పబ్‌లు, బార్లను ఎంచుకుని సాయుధులు దాడులకు దిగుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడి పబ్‌లో జరిగిన దారుణకాండకు కారణంఏమిటనేది ఆరా తీస్తున్నారు. దుండగులను పట్టుకుంటేనే సంబందిత ధటనపై కొంత సమాచారం నిర్థారించుకునేందుకు వీలు అవుతుందని అధికారులు తెలిపారు.

కాంగ్రెస్ దేశ విరోధి.. అసామీ విద్వేషి: ప్రధాని మోడీ

నామ్రూప్ ః కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అసోంలోకి అక్రమంగా బంగ్లాదేశీయులు వచ్చి ఇక్కడ స్థిరపడేలా ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. అసోంలోని దిబ్రూఘర్ జిల్లా నామ్రూప్‌లో రూ 10,601 కోట్ల వ్యయంతో ఏర్పాటు అయిన ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం తరువాత జరిగిన సభలో ఆదివారం ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ ఫ్యాక్టరీ బ్రౌన్‌ఫీల్డ్ అమోనియా యూరియా తయారీ ప్లాంట్‌గా నిలుస్తుంది. ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌కు ఈ దేశం అంటే బాధ్యత లేదు. బంగ్లాదేశీయులు ఇక్కడి అడవులు, భూములలోకి ప్రవేశించేందుకు కాంగ్రెస్ సహకరిస్తోంది.

కేవలం పార్టీ ఓటు బ్యాంకును ఈ అక్రమ వలసదార్ల బలంతో పెంచుకోవాలనేదే కాంగ్రెస్ తపన అని తెలిపారు. అసామీల ఉనికి, వారి సాంస్కృతిక ఆచార వ్యవహారాల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు. బిజెపి ఎప్పుడూ అసామీల ప్రత్యేకతను కాపాడేందుకు కార్యాచరణకు దిగుతోందని అన్నారు. ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్న పాత కర్మాగారాన్ని కాంగ్రెస్ తమ హయాంలో ఏనాడూ ఆధునీకరించలేదని , రైతుల సమస్యల పరిష్కారానికి ఆలోచించలేదని విమర్శించారు. ఈ సభలో ఆయన ప్రసంగం ఎక్కువగా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శ్శనాస్త్రాలతోనే సాగింది. అన్నింటికి మించి కాంగ్రెస్ జాతి వ్యతిరేక చర్యలు శృతి మించుతున్నాయని సభలో ఆయన తెలిపారు.

అధికారం కోసం అక్రమ వలసదార్లకు వత్తాసు

అధికారం దక్కించుకోవాలనేదే వారి ఏకైక లక్షం, అందుకే వారు తరచూ ఓటర్ల జాబితాల సవరణను వ్యతిరేకిస్తున్నారు. ఈ సర్ ప్రక్రియ సజావుగా సాగితే వారు ఆశలు పెట్టుకున్న అక్రమ వలసదారుల పేర్లు జాబితాల్లో నుంచి ఎగిరిపోతాయనేదే వారి భయం అని విమర్శించారు. మేము చేసే ప్రతి మంచి పనిని ఎంచుకుని ఎదురుదాడికి దిగడమే వారి పని అయిందని వ్యాఖ్యానించారు. బిజెపి ఎప్పుడూ అస్సామీల ఉనికి వారి భూములు, వారి తరతరాల ఆత్మగౌరవం నిలిపేందుకు యత్నిస్తోందని అన్నారు. అసోంలో రెండు రోజుల పర్యటన ముగింపు రోజున మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అసామీల పట్ల గౌరవం లేని అరాచక పార్టీ

అసామీ భూమి పుత్రుడు డాక్టర్ భూపెన్ హజారికాకు తమ ప్రభుత్వం భారత రత్న ప్రదానం చేసింది. దీనిని కాంగ్రెస్ బహిరంగంగా వ్యతిరేకించిందని మోడీ తెలిపారు. ఆటగాళ్లు పాటగాళ్లకు మోడీ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను కట్టబెడుతోందని, పరువు తీస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మాట్లాడారంటే వారికి ఇక్కడి ప్రముఖుల పట్ల ఎంతటి గౌరవం ఉందనేది తెలుస్తుందని ప్రధాని మోడీ స్పందించారు. కాంగ్రెస్ మాటలు భూపెన్ దా పట్లనే కాకుండా అసాం ప్రజలందరి పట్ల అవమానించినట్లుగానే ఉన్నాయని విమర్శించారు.

అహోం రాజుల నాటి వైభవం

శతాబ్దాల క్రితం అహోం రాజుల కాలంలో ఉన్నంత శక్తివంతంగా అస్సాంను తీర్చిదిద్దడమే బిజెపి లక్షం అన్నారు. ఇక్కడి అపార వనరులను సద్వినియోగం చేయడం, వాటికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేలా చేయడం కోసం తమ ప్రభుత్వం పలు చర్యలకు దిగుతోందని వివరించారు. ఇక్కడ ఇప్పుడు ప్రారంభించిన ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి మొదలైన నాటి నుంచే ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తి అవుతుందని మోడీ చెప్పారు. దీనితో ఈ ప్రాంతంలో ఎరువుల సరఫరా గొలుసుకట్టు క్రమం అంతా పదిలం అవుతుంది.ఇది రైతాంగానికి మేలు చేస్తుందని తెలిపారు. అసోంలో ఉత్పత్తి అయిన బ్లాక్‌టీని రష్యా అధ్యక్షులు పుతిన్‌కు ఇటీవల తాము ఆయన భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కానుకగా ఇచ్చామని గుర్తుచేశారు.

కోడిగుడ్డు ఆల్ టైం రికార్డ్.. పెరుగుతున్న చికెన్ ధరలు

రిటైల్ మార్కెట్‌ను షేక్ చేస్తున్న కోడిగుడ్లు, చికెన్ ధరలు

కోడిగుడ్డు రూ.8కి పెరిగి ఆల్ టైం గరిష్టం రికార్డ్ నమోదు

చికెన్ ధరలు క్రమేణా పెరుగుతూ రూ.280కి చేరువ

తగ్గిన కోడిగుడ్ల ఉత్పతితో పెరిగిన డిమాండే కారణం

గుడ్డు, చికెన్ ధరల పెరుగుదలతో సామాన్యులు గగ్గోలు

మన తెలంగాణ/హైదరాబాద్: కోడిగుడ్లు, కోడి మాంసం, కూరగాయలు ఇలా ఒకటేంటి అన్నీ రోజు రోజుకీ పెరుగుతుంటే సగటు జీవికి బ్రతుకు భారమవుతోంది. కూరగాయల కన్నా కోడి గుడ్లు ధరలు తక్కువ ఉంది కదా అని సరిపెట్టుకునే వారికి గుడ్డు ధర కూడా రూ.8కి పైగానే రిటైల్ మార్కెట్‌లో ధర పలుకుతుంటే హడలిపోతున్నారు. దీనికితోడు సాధారణ ప్రజలకు తక్కువ ధరలో లభించే మాంసాహారమైన బ్రాయిలర్ కోడి మాంసం ధర కూడా ప్రతి రోజు పెరిగి, ఆదివారం నాటికి కిలోధర రూ.280కి చేరింది. దీంతో చికెన్ ధరలు ఒక వైపు, కోడి గుడ్ల ధరలు మరో వైపు భారీగా పెరుగుతూ మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. దీంతో సామాన్యులు హడలిపోతున్నారు.

కోడిగుడ్ల హోల్‌సేల్ మార్కెట్ వర్గాల సమాచారం మేరకు ఈ స్థాయిలో ఎప్పుడూ ధరలు పెరగలేదని, ఈ పెరుగుదల ఆల్ టైం రికార్డ్ సృష్టిస్తున్నాయని చెబుతున్నారు. సామాన్యుడికి ఎప్పుడూ తక్కువ ధరలో అందుబాటులో ఉండే కోడి గుడ్ల ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్లో రూ.5గా ఉన్న గుడ్డు ధర, క్రమేణా రూ.6కి పెరిగి ఆ తర్వాత పెరుగుతూ వస్తూ ఏకంగా రూ.7.30కి చేరుకుంది. ఆ తర్వాత ఏకంగా గుడ్డు ధర రూ.8కు చేరుకుంది. కొన్నిచోట్ల రిటైల్ వ్యాపారులు ఏడున్నర ఉంటే ఎనిమిది తీసుకుంటున్నారు. దీంతో అవసరాన్ని బట్టి 50 పైసలు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. 30 కోడి గుడ్లు ధర (ట్రే) గతంలో రూ.160 నుంచి రూ.170 వరకు ఉంటే, ఇప్పుడు రూ.210 నుంచి రూ.240కి చేరుకుంది.

మరో రెండు నెలలు ఇవే ధరలు కొనసాగే అవకాశం

మరో రెండు నెలల పాటు ఇవే ధరలు, లేదా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తక్కువ ధరకే లభించే గుడ్ల ధరలు ఒకేసారి పెరగడంతో సామాన్యులు షాక్ అవుతుంటే ఫామ్‌ల యజమానులు మాత్రం ధరలు ఇలా రెండు మూడు నెలలు కొనసాగితే తాము నష్టాల బారి నుంచి బయటపడతామని చెబుతున్నారు. కోళ్లు వ్యాధులతో చనిపోవడం ఒకటైతే, కోడి గుడ్లు దిగుమతి కావడం వల్ల మరింత మార్కెట్ క్షీణించి కోడి గుడ్లు ధరల్లేక, కోళ్లు లేక ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు. ఇలా కొంచెం ధర పెరిగి కోడిగుడ్ల మార్కెట్ స్థిరంగా కొనసాగితే తాము ఇప్పటికి ఎదుర్కొంటున్న నష్టాల నుంచి బయటపడతామని వెల్లడిస్తున్నారు.

కాగా గుడ్ల ధరలు రికార్డుస్థాయిలో పెరుగుతుండడం వెనుక అనేక కారణాలను వ్యాపారులు వెల్లడిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్నా భోజన పథకం, వసతి గృహాల్లో వినియోగం, బేకరీలు, ఇలా చాలా రకాలుగా కోడిగుడ్ల వినియోగం విపరీతంగా పెరగడంతో పాటు కూరగాయలకు బదులుగా కోడిగుడ్లు తినే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వచ్చింది. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం వల్ల కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. దీనికితోడు కోళ్ల దాణా, మక్కలు వంటి ధరలు కూడా పెరగడంతో కోళ్ల ఫారం ఉత్పత్తిదారులకు పెట్టుబడి వ్యయం విపరీతంగాపెరిగిపోయిందని చెబుతున్నారు.

గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగేది. పెట్టుబడి పెరగడంతో చాలా మంది రైతులు ఫారాల కోళ్ల ఫారాలను మూసివేయడం వల్ల గుడ్ల గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయి ఆరు కోట్ల కోడిగుడ్లకు పడిపోయిందని చెబుతున్నారు. ఈ కారణంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్‌లో కోడిగుడ్డు ధర రూ.7.30, రిటైల్లో రూ.8 పలకడం పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్ టైమ్ గరిష్ఠంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరో రెండు నెలల పాటు ఇదే ధర కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

మేడారం మహా జాతర 2026 పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం

మన తెలంగాణ / హైదరాబాద్ : మేడారం మహా జాతర 2026 పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆయన నివాసంలో ఆవిష్కరించారు. అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

నల్లధనం తెస్తామన్న హామీ ఏమైంది?.. కిషన్ రెడ్డిపై జగ్గా రెడ్డి ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః అధికారంలోకి రాగానే విదేశాల్లో ఉన్న నల్లధనం తెస్తామన్న హామీ ఏమైందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లేఖ రాయడంపై జగ్గారెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి అకౌంట్‌లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని బిజెపి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ హామీ సంగతి ఏమైందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

ఈ హామీల గురించి కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఆ విధంగా లేఖ రాస్తే తాము ఆయన లేఖకు సమాధానం ఇస్తామని జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బిజెపికి లేదని ఆయన దుయ్యబట్టారు. సోనియా గాంధీ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించామని, ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలెండర్ ఇస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు దాటినా ఇచ్చిన హామీలను బిజెపి నిలబెట్టుకోలేదని, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని జగ్గా రెడ్డి తెలిపారు.

కిషన్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సవాల్

మీ 12 ఏళ్ళ పాలన, మా రెండేళ్ళ పాలనపై చర్చకు సిద్ధమా?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ సవాల్

కిషన్ రెడ్డికి సోనియాకు లేఖ రాసే స్థాయి లేదు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః “కేంద్రంలో మీ పన్నెండేళ్ళ పాలన, రెండేళ్ళ మా పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా?” అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి చేసింది ఏమిటో ప్రజలకు చెప్పాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండేళ్ళలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవని తెలిపారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసే స్థాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని ఆయన విమర్శించారు.

తెలంగాణపై అడుగడుగునా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీపై వత్తిడి తెచ్చే సామర్థం లేని కిషన్ రెడ్డికి సోనియా గాంధీకి లేఖ రాసే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల్లో కేంద్రం తెలంగాణపై పక్షపాతం చూపుతున్నదని ఆయన ఆరోపించారు. బిసి రిజర్వేషన్లు, మెట్రో రైలు ప్రాజెక్టు, మూసి నది సుందరీకరణ, రాష్ట్రంలో కేంద్ర విద్యా సంస్థల స్థాపన వంటి కీలక అంశాల్లో ప్రధాని మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కనిపించడం లేదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.