elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetbetsmove

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

kingroyal

madridbet

hızlıcasino

tlcasino

marsbahis

kavbet

pusulabet

grandpashabet

wbahis

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

betcio

mavibet

lidyabet

pusulabet giriş

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

కెసిఆర్ చెప్పినవన్నీ.. పచ్చి అబద్ధాలు

 రూ.25వేల కోట్లు ఖర్చుపెట్టి పాలమూరుకు చుక్క నీళ్లు ఇవ్వలేదు

 45 టిఎంసిలకు తగ్గించామన్నది అవాస్తవం

కేంద్రం నుంచి డిపిఆర్ వెనక్కి వచ్చింది మీ హయాంలోనే: మంత్రి ఉత్తమ్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు గుండెకాయ అని లక్షల కోట్లు పోసి కట్టారని, తీరా చూస్తే ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆదివారం రాత్రి సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 90 శాతం అబద్ధం అని అన్నారు. లక్షల కోట్లు బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఒక్క రైతుకు లాభం జరుగలేదని తెలిపారు. కేవలం కమీషన్ల కోసమే భారీ ప్రాజెక్టు కట్టారని అన్నారు. కేవలం రైతులు, ప్రాజెక్టులనే కాకుండా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరినీ కేసీఆర్ మోసం చేశారని అన్నారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళుతున్న తమకు కేసీఆర్ నీతులు చెప్పడం బాగోలేదని, కేసీఆర్ నోటి వెంట నీతులు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని విమర్శించారు.

పాలమూరును మోసం చేసింది మీరే

కృష్ణా జలాల విషయంలో పాలమూరు ప్రజలను మోసం చేసింది మీరే నని కేసీఆర్ కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు విషయంలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధాలన్నారు. పదేళ్ల పాలనలో లక్ష ఎకరాలకు కూడా కొత్త ఆయకట్టు నీరు ఇవ్వలేదని, పాలమూరు రంగారెడ్డిలో 45 టీఎంసీలు తగ్గించామన్నది అబద్ధం అన్నారు. ఇరిగేషన్ ను నాశనం చేసింది మీరు..రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు.. కృష్ణా జలాల విషయంలో పాలమూరును మోసం చేసింది మీరు..2023 ఏప్రిల్ 12 న డీపీఆర్ వెనక్కు పంపారని, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మంత్రి మీరే కదా..? మీరు ఇచ్చిన జీవో ప్రకారమే 45 టీఎంసీలు కృష్ణా నుంచి, 45 టీఎంసీలు గోదావరి నుంచి ఇవ్వాలని కోరామన్నారు. 500 టీఎంసీలు ఏపీ వాడుకునేందుకు మీరు రాసివ్వలేదని చెప్పే దమ్ముందా..? అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

ఏపీ నీటిని తరలించుకుపోతుంటే ఏం చేశారు

ఉమ్మడి రాష్ట్రంలో 750 టీఎంసీలు తరలించుకుపోతే మీ పాలనలో 1400 టీఎంసీలు తరలించుకోయారని, ఏపీ నీటిని తరలించుకుపోతుంటే ఏం చేశారని కెసిఆర్ ను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిలదీశారు. అందుకు సహకరించింది మీరు కాదా..? ఇప్పుడు చెప్పండి ఎవరు మోసం చేశారోనని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు చేసింది సున్నా అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డికి 7 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కంటే సమర్థవంతంగా కృష్ణా ట్రిబ్యునల్ లో పోరాడుతున్నామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా దేవాదులను పట్టించుకోలేదని విమర్శించారు. మీరు లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం కూలిపోయిందని, ప్రాణహిత చేవెళ్ల రద్దు చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు. పదేళ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, బీమా, ఎస్ ఎల్ బీసీ మొదలైన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టు ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, ఎవరు మోసం చేశారో..? కేసీఆర్ కరెక్ట్‌గా ప్రిపేరై రావాలని, లేదంటే ఇలాగే లెక్కలు తెలియకుండా మాట్లాడుతారన్నారు. కృష్ణా బేసిన్‌లో కేసీఆర్ చేసింది దగా, మోసం అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రైల్వే టికెట్ల ధరలు పెంపు

 26 నుంచి కొత్త ఛార్జీలు అమలు

కిలో మీటరుకు 1, 2 పైసల చొప్పున భారం

మెయిల్, ఎక్స్‌ప్రెస్, నాన్ ఎసి రైళ్లకు కిలోమీటరుకు 2పైసలు పెంపు

రైల్వేకు రూ.650 కోట్ల అదనపు ఆదాయం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇక రైల్వే టికెట్ల చార్జీలు పెరుగుతున్నాయి. డిసెంబర్ 26 నుంచి కొత్త చార్జీల అమలు మొదలు కాబోతోంది. సబర్బన్ రైళ్ల చార్జీలను పెద్దగా పెంచనప్పటికీ, దూర ప్ర యాణాలు చేసే వారిపై మాత్రం చార్జీల పెంపుతో ఇబ్బందులు తప్పవు. పెంపు కిలోమీటర్‌కు సగటున 2 పైసలు ఉంటుంది. 215 కిలోమీటర్ల వరకూ జనరల్ క్లాస్ టికెట్ల ధర మారదు. కా నీ, 215 కిమీ కంటే ఎక్కువ దూరాలకు కి.మీ.కి 1 పైసా చొప్పున చార్జీలు పెరుగుతాయి. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఎయిర్ కండీషన్ లేని కోచ్‌లకు, కి.మీ.కి 2 పైసల చొప్పున పెంపు ఉంటుంది. ఎయిర్ కండీషన్డ్ కోచ్ లకు ప్రయాణ ఖర్చు కూడా కిమీకి 2 పైసలు పెరిగింది. కొత్త రేట్లు ప్రారంభమైన తర్వాత ఎయిర్ కండీషన్ లేని కోచ్ లలో 500 కిమీ ప్రయాణానికి రూ.10 ఎక్కువ ఖర్చవుతుంది. తాజా చార్జీల పెంపుదల వల్ల రైల్వే ఆదాయం రూ. 600 కోట్ల మేరకు పెరుగుతోంది.

గత పదేళ్లుగా రైల్వే తన నెట్ వర్క్ విస్తరించింది. రైల్వే కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. రైల్వేలో ఉద్యోగస్తులు పెరిగారు.దాంతో జీతాలు, ఇతర ఖర్చులు రూ.1,15,000 కోట్లకు పెన్షన్ ఖర్చు రూ. 60,000 కోట్ల కు పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్యకలాపాల ఖర్చు 2,63,000 కోట్లకు పెరిగింది. ఉద్యోగుల ఖర్చులు పెరుగుదలను తీర్చేందుకు రైల్వేలు కార్గో లోడింగ్, ప్రయాణీకుల చార్జీలు పెంచడంపై దృష్టి సారించింది. గతంలో జూలైలో రైల్వే చార్జీలను పెంచాయి. మెయిల్ ,ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఎయిర్ కండీషన్ లేని తరగతుల చార్జీని కిమీ కు 1 పైస చొప్పున పెంచారు. ఎయిర్ కండీషన్డ్ తరగతుల్లో ప్రయాణం కిమీ కి రూ. 2 పైసలు చొప్పున పెరిగింది. అంతకు ముందు 2020 జనవరి 1 న రైల్వే చార్జీలు పెంచారు. 2020లో, ఆర్డినరీ, మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లకు సెకండ్ – క్లాస్ చార్జీలు వరుసగా కిమీ.కి 1 పైసా, 2 పైసలు పెరిగాయి. స్లీపర్ తరగతులు, అన్ని ఏసీ తరగతుల చార్జీలు వరుసగా కి.మీ కి 2 పైసల నుంచి 4 పైసలు పెరిగాయి.

ఎలక్టోరల్ నిధుల్లో బిజెపికి రూ.3,811 కోట్లు

 కాషాయ పార్టీ ఖాతాలోకి 82 శాతం నిధులు 

కాంగ్రెస్‌కు రూ.296 కోట్లు, టిఎంసి రూ.102 కోట్లు, బిఆర్‌ఎస్ రూ.10 కోట్లు

పార్టీలకు పంపిణీ చేసిన ఎలక్టోరల్ ట్రస్ట్‌లు

న్యూఢిల్లీ: కంపెనీలు, వ్యక్తుల నుంచి వచ్చిన వి రాళాలను రాజకీయ పార్టీలకు పంపిణీ చేయాలనే ఏకైక లక్ష్యంతో కంపెనీలు ఏర్పాటు చేసిన ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నిధులలో అధికార భారతీయ జనతా పార్టీకే పెద్ద పీట దక్కింది. 2024-25 సంవత్సరంలో తొమ్మిది ఎలక్టోరల్ ట్రస్ట్‌లు పం పిణీ చేసిన రూ.3,811.34 కోట్లలో బీజేపీకి రూ.3,142.65కోట్లు అందాయి. అంటే మొ త్తం నిధులలో 82.45 శాతం అన్నమాట. ట్రస్ట్ ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన నివేదికల ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రె స్ పార్టీకి రూ.296.76 కోట్లు అందాయి అంటే 7.83 శాతం. కాగా, తృణమూల్ కాంగ్రెస్ పా ర్టీకి రూ.102కోట్లు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.98కోట్లు, తెలుగుదేశం పార్టీకి రూ.44 కోట్లు, బిఆర్‌ఎస్ పార్టీకి రూ.10 కోట్లు, బిజెడికి రూ.15 కోట్లు, తమిళనాడు డిఎంకె పార్టీకి రూ.10 కోట్ల మేరకు నిధులు అందాయి.

ఇంతవరకూ మొత్తం 19 ఎలక్టోరల్ ట్రస్ట్‌లలో 13 ట్రస్ట్ లు నివేదికలు నివేదికలు సమర్పించాయి. కాగా నాలుగు ట్రస్ట్‌లు తాము ఎటువంటి నిధులను అందుకోలేదని, ఎవరికీ పంపిణీ చేయలేదని పేర్కొన్నాయి. ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌లు పార్టీల కు పంపిణీ చేసిన నిధుల వివరాలు ఇలా ఉన్నా యి. ఫ్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.2,658. 49 కోట్లు అందుకోగా, రూ.2,668.46 కోట్లు పార్టీలకు పంపిణీ చేసింది. కాగా ప్రోగ్రెసివ్ ట్రస్ట్ రూ.915 కోట్లు అందుకుని రూ.914.97 కోట్లు పంపిణీ చేసింది.

న్యూ డెమోక్రటిక్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ రూ.160 కోట్లు అందుకుని రూ. 160కోట్లు పార్టీలకు పంపిణీ చేయగా, హార్మో ని ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.35.56కోట్లు అందుకు ని రూ.35.66 కోట్లు, పార్టీలకు అందజేసింది. ఇక ట్రయంఫ్ ట్రస్ట్ రూ.25 కోట్లు అందుకుని పూర్తిగా పంపిణీ చేసింది. అలాగే సమాజ్ ఎలక్టోరల్ ట్రస్ అసోసియేషన్ రూ.6కోట్లు అందుకుని అంతా పంపిణీ చేయగా, జన ప్రగతి ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.1.02 కోట్లు అందుకుని కోటి రూపాయలు పంపిణీ చేసింది. ఇక జన కల్యా ణ్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ రూ.20 లక్షలు అందుకుని రూ. 19 కోట్లు పంపిణీ చేయగా, ఇంజిగార్డిగ్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.8 లక్షలు అందుకుని రూ. 7,75 లక్షలు రాజకీయ పార్టీలకు పంపిణీ చేసింది.

సోనియాకు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ 2047 పేరిట తెచ్చిన విజన్ డాక్యుమెంట్‌ను అభినందించారు సరే, కానీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల సంగతేంటి..?, మ్యానిఫెస్టో అమలు పరిస్థితిపై ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టిని అభినందించిన మీరు ఎన్నికల వాగ్ధానాల ప్రణాళిక, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపై ఎప్పుడైనా ఆరా తీశారా, ఎంత వరకు అమలు చేశారని వివరణ అడిగారా అని ప్రశ్నించారు. ఆదివారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించి గానీ, 6 గ్యారంటీలు ప్రజలకు అందించారా లేదా అనే వాస్తవాలు గానీ మీకు తెలిసినట్లు లేదని, తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించినట్లు కూడా లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

కానీ, ఇచ్చిన హామీలు వదిలివేసి తెలంగాణ ప్రజలను వంచిస్తూ, ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పేరిట విజన్ డాక్యుమెంట్ తో కొత్త పల్లవి అందుకొని మీ పార్టీ, మీరు ఒకరినొకరు అభినందించుకుంటున్నారని విమర్శించారు. ఆనాడు ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన మీరు, మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారని అన్నారు. మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలను గాలికొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేలేశారా? లేక గాంధీ భవన్‌లో పాతరేశారా? తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటికైనా కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించేముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. లేదంటే మీరు ప్రయోగించిన అభయహస్తమే ప్రజల ఆగ్రహం రూపంలో మీ పాలిట భస్మాసుర హస్తమై మిమ్మల్ని అధికారానికి దూరం చేయకుండా మానదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని మనవి చేస్తున్నానని తెలిపారు. మీరు ఇచ్చిన హామీల అమలులో మోసం చేస్తే, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కూడా మీకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిచర్యలకు పాల్పడి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నానని కిషన్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణలోనే తదుపరి ‘సర్’

 ఎన్నికల వ్యవస్థకు బిఎల్‌ఓలే వెన్నెముక

వాళ్ల నిబద్ధతపైనే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ విజయం ఆధారపడి ఉంది: సిఇసి

మనతెలంగాణ/హైదరాబాద్ : తదుపరి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్‌ఐఆర్..సర్) తె లంగాణలోనే అని ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి) జ్ఞానేష్‌కుమార్ వెల్లడించారు. తెలంగాణలో ఎస్‌ఐఆర్‌ను విజయవంతంగా చేద్దామని బూత్ స్థాయి అధికారులను(బిఎల్‌ఒ)లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సగటున ఒక్కో బిఎల్‌ఒకు 930 మంది ఓటర్లు వస్తారని తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన బూత్ స్థాయి అధికారుల సమావేశంలో సిఇసి జ్ఞానేష్‌కుమార్ మాట్లాడారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ విషయంలో తెలంగాణ త్వరలోనే దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో ఇటీవల బీహార్‌లో విజయవంతంగా పూర్తయిన ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రమాణికాంగా తీసుకోవాలని పేర్కొన్నారు. భారత ఎన్నికల వ్యవస్థకు బిఎల్‌ఒలే వెన్నెముక అని, వారి నిబద్ధత, కృషిపైనే ఓటర్ల జాబితా సరవణ విజయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. బీహార్‌ను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అక్కడ నిర్వహించిన భారీ ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎలాంటి లోపాలు లేకుండా పూర్తయిందని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 7.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియలో ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాకపోవడం, రీపోలింగ్, రీకౌంటింగ్ అవసరం లేకపోవడం విశేషమని పేర్కొన్నారు.

ఎన్నికల చట్టాలను అందరూ పాటించాల్సిందే

తెలంగాణ విస్తీర్ణం కెనడాకంటే పెద్దది అని సిఇసి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. సమగ్ర ఓటర్ల జాబితా శుద్ధి పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికల పరిపాలన ఒక కొత్త యుగంలోకి అడుగుపెడుతుందని అన్నారు. బిఎల్‌ఒలతో జరిగిన పరస్పర చర్చలో పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉండటానికి పట్టణ ఓటర్ల నిరాసక్తతే ప్రధాన కారణమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు మాత్రం ఉత్సాహంగా క్యూల్లో నిలబడి ఓటు హక్కును వినియోగిస్తూ దేశానికి దారి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఎన్నికలు పూర్తిగా దేశ చట్టాల ప్రకారమే నిర్వహించబడుతున్నాయని, ఎన్నికల చట్టాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

అలాగే 1995లో సభ్యదేశంగా చేరిన ఇంటర్నేషనల్ ఐడియాకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌కు ఛైర్మన్‌షిప్ లభించిందని తెలిపారు. ఇది భారత ఎన్నికల సంఘం ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, వినూత్న ఎన్నికల నిర్వహణ సంస్థగా గుర్తింపు పొందినదానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక గణాంకాలను వివరించారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్, సీనియర్ డిప్యూటీ సిఇసి పవన్ కుమార్ శర్మ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అమెరికా కంపెనీతో ఇస్రో డీల్

చెన్నై : ఈ నెల 24వ తేదీ బుధవారం ఇస్రో ఎల్‌విఎం 3 ఎం 6 ప్రయోగం ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్‌ను కక్షలోకి పంపిస్తుంది. అమెరికాకు చెందిన ఎఎస్‌టి స్పేస్ మోబైల్ తో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ శాటిలైట్‌ను నిర్ణీత ప్రాంతానికి తరలిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. ఈ మేరకు దీనిని రూపొందించారు. ఎఎస్‌టి స్పేస్ మొబైల్ కంపెనీ వారు తొలిసారిగా ప్రపంచ స్థాయిలో అంతరిక్ష ఆధారిత సెల్యూలర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రధానమైనది ఈ శాటిలైట్‌ను విజయవంతంగా కక్షలోకి చేర్చడమే. వాణిజ్యపరంగా వినియోగదారులకు, పలు ప్రభుత్వ యాప్‌లకు ఈ నూతన సెల్యూలర్ నెట్‌వర్క్ ఉపయోగపడుతుంది.

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పలు విధాలుగా సాంకేతిక పరమైన లోపాలను ఎదుర్కొంటున్నారని ఎఎస్‌టి తమ వెబ్‌సైట్‌లో తెలిపింది. ఈ లోపాలను సరిదిద్దడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు బిలియన్ల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా చేస్తామని వివరించారు. అంతేకాకుండా ఇప్పటికీ ఫోన్ల అనుసంధానం లేని కోటానుకోట్ల మందికి ఈ శాటిలైట్ ప్రసారాల ద్వారా సరికొత్త సేవలు అందిస్తామని తెలిపారు. బ్లూబర్డ్ శాటిలైట్ల శ్రేణి ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తృతానికి కంపెనీ ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగానే ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుని ఈ శాటిలైట్‌ను కక్షలోకి పంపించేందుకు సిద్ధమయ్యారు. భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రోకు ఈ శాటిలైట్ ప్రయోగం వాణిజ్యపరమైన దిశలో ఉపయుక్తం అవుతుంది. 

సోమవారం రాశి ఫలాలు (22-12-2025)

మేషం

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణాలు చేస్తారు. వృధా ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.

వృషభం

ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న నాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మిధునం

వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు పరుస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

కర్కాటకం

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

సింహం

గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

కన్య

బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఒక వ్యవహారంలో సఖ్యత లోపిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

తుల

ఉద్యోగస్తులకు నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం

అందరిలోనూ గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది. లాభాల బాటలో సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది.

ధనస్సు

ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అందరిలోనూ పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

మకరం

ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నవి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.

కుంభం

దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

మీనం

సంతానం వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు తప్పవు. బంధువులతో విభేదాలు కొంత బాధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

 

రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం

మన తెలంగాణ / హైదరాబాద్ : సికిందరాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులతో ఆత్మీయంగా మాట్లాడారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.

బిగ్ బాస్ సీజన్-9 విన్నర్ కల్యాణ్ పడాల

మన తెలంగాణ/హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా కల్యాణ్ పడాల నిలిచారు. హోస్ట్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఆయన ట్రోఫీతో పాటు రూ. 35 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నారు. తనూజ రన్నరప్‌గా నిలిచారు. కల్యాణ్ కు విన్నర్ చెక్ తో పాటు బ్రాండ్ న్యూ మారుతి సుజుకి విక్టోరిస్ కారు, ’రాఫ్’ నుంచి రూ.5 లక్షల చెక్‌ను అందజేశారు. బిగ్‌బాస్ సీజన్–9 ఫైనల్ రేసులో ఐదుగురు కంటెస్టెంట్లు నిలవగా ఆదివారం జరి గిన ఫినాలేలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత నటి సంజన గల్రానీ ఐదో స్థానంతో ఎలిమినేట్ అయ్యారు.

టాప్-3లో ఉంటానని భావించిన ఆమె ఈ ఫలితంతో షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత, టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా ఉన్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ నాలు గో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆయన ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత రూ. 15 లక్షల ఆఫర్‌కు డెమోన్ పవన్ అంగీకరించి పోటీ నుంచి తప్పుకున్నారు. పవన్ నిష్క్ర మణతో విజేత ప్రైజ్‌మనీ రూ. 50 లక్షల నుంచి రూ. 35 లక్షలకు తగ్గింది. చివరికి కల్యాణ్ పడాల అత్య ధిక ఓట్లు సాధించి టైటిల్ గెలుచుకోగా, తనూజ రన్నరప్‌గా నిలిచారు. స్టార్ మా, జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఈ ఫినాలే ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠతతో సాగింది.

తొలి టి20.. లంకపై భారత్ ఘన విజయం

విశాఖపట్నం: శ్రీలంక మహిళలతో ఆదివారం విశాఖపట్నంవేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు సాధించింది. ఓపెనర్ విశ్మీ గుణరత్నె ఒక్కటే కాస్త నిలకడగా రాణించింది. సమన్వయంతో ఆడిన విశ్మీ 39 పరుగులు చేసింది. కెప్టెన్ చామరి ఆటపట్టు (15), హసిని పెరీరా (20), హర్షిత (21) పరుగులు సాధించారు.

భారత బౌలర్లు సమష్టిగా రాణించిప్రత్యర్థి టీమ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 14.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (25), షఫాలీ వర్మ (9) శుభారంభం అందించలేక పోయారు. అయితే జెమీమా రోడ్రిగ్స్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన జెమీమా 44 బంతుల్లోనే 10 ఫోర్లతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 15 (నాటౌట్) తనవంతు సహకారం అందించింది.