elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetbetsmove

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

kingroyal

madridbet

hızlıcasino

tlcasino

kingroyal

marsbahis

kavbet

pusulabet

grandpashabet

wbahis

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

betcio

mavibet

lidyabet

pusulabet giriş

Vaycasino Giriş

Vaycasino

galabet

టీచర్‌తో కానిస్టేబుల్ అక్రమ సంబంధం…. భర్తను బెదిరించిన పోలీస్

అమరావతి: టీచర్‌తో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమె భర్తను పోలీస్ బెదిరించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావు పేట ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురజాల సబ్ డివిజన్‌లోలో ఓ వ్యక్తి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ మహిళ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. ఆమెతో కానిస్టేబుల్ చనువుగా ఉండేవాడు. ఈ విషయం భర్తకు తెలియడంతో కానిస్టేబుల్‌ను నిలదీశాడు. దీంతో కానిస్టేబుల్ ఆమె భర్తను బెదిరించాడు. దీంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేయడానిక వెళ్తే ఎస్‌ఐ లేడని పోలీసులు అతడిని వెళ్లగొట్టారు. ఫిర్యాదు స్వీకరించకుండా అతడిని వెనక్కి పంపారు. కొన్ని సంవత్సరాల నుంచి అదే పోలీస్ స్టేషన్ లో పని చేస్తుండడంతో ఫిర్యాదు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. సదరు కానిస్టేబుల్ పలుమార్లు అవినీతి పాల్పడినట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

చిన్నారి

అమృత ద్వీపం

అమ్మ ఉమ్మనీటి గర్భాలయం

రక్తపు గోడల కావలి కవచం నీకది

అడుగుబయట పడిందో నీ రక్షణభారం నీదే

తాతని, అన్నని అంటూనే

నీ బుజాల కింద విషపు రాపిడితో

కాటేస్తాయి మదమృగాలు

చిన్నప్పటి నుంచే

నీ గోళ్ళు గుచ్చే సులాలుగా పెంచు

నీ పలువరుసను కాముకుడి కుత్తుకను చీల్చే

కత్తులుగా సానపెట్టు

ఏ బంధానికి లొంగకు

ఏ ఆకర్షణ వలలో చిక్కుబడిపోకు

బొట్టుబిళ్ళలకో, స్వీటు డబ్బాకో

సెల్‌ఫోన్‌కో ఆశపడకు

తోటలోకో, పొదమాటుకో రమ్మంటే

బలిపశువులా వెంట వెళ్ళకు

పేదరికాన్ని చదువుతో జయించు

పెనుముప్పును జ్ఞానంతో ఎదురించు

దుర్మార్గపు లోకమిది

వావివరుసలు లేని తుచ్చుల కాలమిది

అధికారాలు ఆర్భాటాలు, సంఘాలు,

ధర్నాలు ఏవి నిన్ను కాపాడలేవు

నీ దేహం నీది హక్కులన్నీ నీవే

కాళ్ళు, చేతుల్లాంటివే నీ రహస్య అంగాలు

దుష్టనీడ పడకుండా నిన్ను నువ్వు కాచుకో

మానం, అవమానం కన్నా ప్రాణం మిన్న

చిన్నారి, నీ జీవితంరా ఇది

మల్లెపువ్వులాగా మంచి గంధంలాగా

నిండుపున్నమిలో పిల్ల తెమ్మెరలాగా

సాగాలి తల్లీ నీ పయనం

జలతారు వెన్నెలలాగా

భద్రం భద్రం చిట్టితల్లి

రోహిణి వంజారి

పున్నమి పూసిన కవిత్వ పండుగ ఎన్నీల ముచ్చట్లు

క్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన తెలంగాణ మొదటి లిఖిత కవి గుణాఢ్యుడు కరీంనగర్ పరగణాలోనే పైశాచీ భాషలో ‘బృహత్కథ’ను రచించాడు. రెండువేల సంవత్సరాలకు పూర్వం కరీంనగర్ జిల్లా, కోటిలింగాలలో హాలుడు ప్రాకృతంలో ‘గాథా సప్తశతి’ కవిత్వ సంకలనాన్ని వెలువరించాడు. ఇక్కడ లభించిన ఆధారా ల వల్ల తెలుగు లిపి అత్యంత ప్రాచీనమైందని చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీ.శ.10వ శతాబ్దంలో వేములవాడ చాళుక్య రెండవ అరికేసరి ఆస్థాన కవి, పంపకవి సోదరుడు జినవల్లభు డు కురిక్యాలలోని బొమ్మలమ్మ గుట్టపై తొలి తెలుగు కందపద్య శాసనం చెక్కించాడు. పశ్చిమ చాళుక్య ప్రభువు అరికేసరి ఆస్థాన కవి పంపడు వేములవాడలో తొలి కన్నడ కావ్యం ‘విక్రమార్జు న విజయం’ రచించాడు. తొలి తెలుగు ఛందోలక్షణ గ్రంథం ‘కవి జనాశ్రయం’ మల్లియ రేచ న 10వ శతాబ్దిలో వేములవాడలో రాశాడు. 15 వ శతాబ్దపు మడికి సింగన తొలి తెలుగు సంకల న గ్రంథం ‘సకల నీతి సమ్మతము’ను రాసాడు.

వెలిగందల నారయ, వేములవాడ భీమకవి, బహుభాషాకోవిదుడు పి.వి, జ్ఞానపీఠ గ్రహీత సినారె, పద్నాలుగు భాషల భాస్కరుడు ఇలా ఎందరో సారస్వత కృషీవలురు కరీంనగర్ సాహితీ క్షేత్రాన్ని సుశ్యామలం చేశారు. మరెందరో ప్రాతఃస్మరణీయుల ప్రభావం ప్రాభవంతో ఇప్పటికీ కరీంనగర్ నేలపైన కవిత్వం దేదీప్యమానంగా ప్రభవిస్తున్నది.

 

హనుమకొండలో కాళోజీ మిత్రమండలి నెలనెలా కవుల సమావేశం నిర్వహించేది. అక్కడ సాహిత్యంపై చర్చోపచర్చలు, కవిత్వగానాలు సాగేవి. ‘ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్న ప్రజాకవి కాళోజి స్పూర్తితోనే కరీంనగర్‌లో ఎన్నీ ల ముచ్చట్లు పురుడు పోసుకున్నాయి. తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆగస్టు 21, 2013 రాకిట్ల పున్నమి రోజున అన్నవరం దేవేందర్ ఇంటి మిద్దెమీద ఎన్నీల ముచ్చట్లకు అంకురార్పణ జరిగింది. కరీంనగర్‌లో ఆరంభమై న ఎన్నీల ముచ్చట్లు అనతి కాలంలోనే హుజూరాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట, మంచిర్యాల, బొంబాయి తదితర ప్రాంతాలకు పాకినాయి. ఇలాంటి కలయికలు హైదరాబాదు లో సి.వి.కృష్ణారావు ఆధ్వర్యంలో ‘నెలనెలా వెన్నెల’ పేరుమీద జరుతుండగా, పుష్యమీ సాగర్ కవి మిత్రబృందం కూడా హైదరాబాదులో నెలనెలా కలుసుకుంటున్నారు. అలాగే ‘కవితల చెరువు’ పేర వి.ఆర్.శర్మ కవి మిత్రులు నెలనెలా గుమిగూడుతున్నారు. కవిత్వం కోసమే కవుల కలయికకు వేదిక కావడం ఎన్నీల ముచ్చట్లు సాధించిన ప్రత్యేకత.

ప్రతి పున్నమికి ఒక కవి ఇంటి డాబామీద నిరాటంకంగా ఎన్నీల ముచ్చట్లు కవిత్వోత్సవంగా గత పదమూడేండ్లుగా నిర్విరామంగా, నిర్విఘ్నంగా నడుస్తూ చరిత్రను సృష్టిస్తున్నాయి. దీంతో కరీంనగర్ కొత్త కవుల స్ఫూర్తి కేంద్రకంగా మారిందని చెప్పవచ్చు. మారుమూల పల్లెల్లోని సృజనకారులను వెలికితీయడం, కొత్త గొంతుకల కు వేదికనివ్వడం, నూతన కలాలకు తర్ఫీదునందించడం, తెలంగాణ అస్తిత్వానికి జీవం పోయ డం, సామాజిక స్పృహను పెంచడం, ఉత్తమోత్త మ ప్రజా సాహిత్యానికి ఊతమివ్వడం, ప్రజాప క్షం వహించే మట్టిలోని మాణిక్యాలను సానబెట్ట డం వంటివి ఎన్నీల ముచ్చట్లు లక్ష్యాలు.

నెలనెలా పున్నమి వెన్నెల వెలుగుల్లో కవులంద రూ ఒకచోట కలుసుకుంటారు. మంచి చెడ్డలు మాట్లాడుకుంటారు. ఆతిథ్యపు కవి ఇంటి డాబా పైన తట్టు వేసుకుని, మూడు తరాల కవులు సక లం ముఖలం పెట్టుకొని గుండ్రంగా కూర్చుంటా రు. సమకాలీన ఎతకతలను కవిత్వంగా చెప్పుకుంటారు. ఆ కవిత్వాన్నంతా సాహితీ సోపతి సంస్థ ‘ఎన్నీల కవితా గాన’ సంకలనంగా మరుసటి నెలకల్లా పుస్తకంగా అచ్చు వేస్తుంది. సమావేశానికి కొ త్తగా వచ్చిన వాళ్లతో మొదటగా కవిత్వం చదివించ డం ఇందులో ఆనవాయితి. ఆకాశంలోని చంద్రుని వెన్నెలను ఆస్వాదిస్తూ, కవిత్వం చెప్పటం గొప్ప అనుభూతి. ఆతిథ్యం ఇచ్చే కవి కుటుంబం, బంధువులు ఇదొక ఇంటి పండుగ లెక్క భావిస్తారు. కవులకు ఉపాహారంగా సర్వపిండి, గుడాలు, పులిహోర, రొట్టెలు, సమోసాలు, బిస్కె ట్లు లాంటివి వడ్డిస్తారు. కొందరైతే భోజనాలు పెడతారు. తేనీటి విందును సైతం అందిస్తారు. నలిమెల భాస్కర్ లాంటి పెద్దలు కొత్తగా రాసిన వాళ్ళ కవిత్వంలోని మంచిచెడ్డలను విశ్లేషిస్తారు. తగు సూచనలు చేస్తారు. వచ్చే ఎన్నీల ముచ్చట్లు వేదికను అప్పుడే ఖరారు చేసుకుంటారు. మా ఇంట్లంటే, మా ఇంట్లని వేదికకు ఆతిథ్యం కల్పించడానికి కవులు పోటీ పడుతుంటారు.

ఈ కార్యక్రమం మూస పద్ధతులకు భిన్నమైంది. అధ్యక్ష, అతిథుల్లాంటి సభా మర్యాదలు లేకుం డా అందరూ ప్రతి పున్నమకు ఒకచోట చేరి కవి త్వం వినిపిస్తారు. నిరంతరాయంగానూ, దిగ్విజయంగానూ ఈ కార్యక్రమం కొనసాగడానికి ప్రధాన కారణం కొత్తగా రాయడానికి ప్రయత్నిస్తున్న కవులూ, కవయిత్రులే. ఎన్నీల కవితా గాన సంకలనాలు వరుసగా 25 వెలువడ్డాయి. వీటిపై కూకట్ల తిరుపతి రాసిన సమీక్షా వ్యాసాలు ‘జల్లె డ’ పుస్తకంగా వచ్చాయి. ఆ తర్వాత ఆర్థిక వనరుల కొరత వల్ల ఎన్నీల కవితా గాన సంకలనాలు ప్రతిమూడు నెల్లకొకటి, తర్వాత ఎడాదికి ఒకటి చొప్పున, ఇప్పటివరకు సుమారు 60 పుస్తకాలు ముద్రితమయ్యాయి.

తెరవే కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా కొనసాగిన గాజోజు నాగభూషణం, బూర్ల వెంకటేశ్వర్లు, కూకట్ల తిరుపతి, కందుకూరి అంజయ్య, సి.వి. ఎన్నీల ముచ్చట్లను సమన్వయం చేశారు. ఏ సాహితీవేత్త జయంతో, వర్ధంతో ఉంటే వాళ్ళను గుర్తు చేసుకుంటూ, వాళ్ళ చిత్రాలను ఆ నెలలో సంకలనాల ముఖచిత్రాలుగా వేసేవాళ్ళం.

ఎన్నీల ముచ్చట్లు జరిగే స్థల సమాచారాన్ని ముం దు రోజు దినపత్రికల్లో ప్రకటించడం వల్ల కార్యక్రమానికి విద్యార్థులు, యువతీ యువకులు, గృహిణిలు, సాహిత్యాభిమానులు, కొత్తవారు విరివిగా వచ్చేవారు. ఎన్నీల ముచ్చట్లు గుంపు మూడు తరాల కవుల కలయికగా కనిపిస్తుంది.

కొత్త తరానికి రచనా మెలకువలు తెలుపడానికి రెండుసార్లు కవిత్వ కార్యశాలలు, ఒక మారు కథారచన కార్యశాలను తెరవే నిర్వహించింది. సాహితీ శ్రష్టలతో కొత్త కవులు, రచయితలకు దిశానిర్దేశం చేయించారు. ఇందులో డా.నలిమెల భాస్కర్, ఎం.నారాయణశర్మ, చింతకింది కాసీం, సీతారాం, శిలాలోలిత, పెన్నా శివరామకృష్ణ, జూకంటి జగన్నాథం దెంచనాల శ్రీనివాస్, అల్లం రాజయ్య, శ్రీధర్‌రావు దేశ్ పాండే, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, పెద్దింటి అశోక్ కుమార్ తదితరులతో శిక్షణ ఇప్పించారు.

ఎన్నీల ముచ్చట్లు ద్వారా వెలుగులోకి వచ్చి, పుస్తకాలు వేసిన వారిలో మహమ్మద్ నసీరుద్దీన్, తప్పెట ఓదయ్య, దామరకుంట శంకర య్య, సదాశ్రీ, తోట నిర్మలారాణి, రామానుజం సుజాత, పెనుగొండ బసవేశ్వర్, పెనుగొండ సరసి జ-, విలాసాగరం రవీందర్, మమత వేణు, మెరుగు ప్రవీణ్, సిరిపురం వాణిశ్రీ, సంగీతం శ్రీలేఖ, కనకం శ్రీనివాస్, డా.వాసాల వరప్రసాద్, మహ్మద్ ఖలిద్ తదితరులు ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నీల ముచ్చట్లు 13వ వార్షికోత్సవాలలో లబ్ద ప్రతిష్టులు అతిథులుగా పాల్గొని కొత్త కవులకు మార్గదర్శనం చేశారు. కరీంనగర్ కవిత్వం అంటేనే ఉద్యమం, ఆందోళన, కదలిక, చలనం, అలజడి ఇత్యాదుల సమ్మేళనం. ఏనాడూ కరీంనగర్ కవిత్వం ఉద్యమాలకు ఎడంగా లేదు. ఆందోళనలకు జడంగా లేదు. మీదుమిక్కిలి అది కదలికలతో పెనవేసుకుని ఉంది. చైతన్యయుత చలనాలతో ముడివేసుకొని ఉంది. ఇక్కడి అక్షరం ప్రజల పక్షాన నిలబడుతున్నది. ఇక్కడి అక్షరం తెలంగాణ సాహితి వారసత్వంలోంచి అంది వచ్చిన ధిక్కారాన్ని ఎంచుకుంటున్నది.

కూకట్ల తిరుపతి

సమంతకు చుక్కలు చూపించిన అభిమానులు

హైదరాబాద్: హీరోయిన్ సమంతకు అభిమానులు చుక్కలు చూపించారు. హైదరాబాద్లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. కారు వద్దకు వెళ్తుండగా సమంతపైకి ఒక్కసారిగా ఫ్యాన్స్ దూసుకొచ్చారు. బౌన్సర్ల సాయంతో సమంత కారు ఎక్కి వెళ్లిపోయింది. ఆమెను కారు వద్దకు తీసుకెళ్ల్లేందుకు బౌన్సర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. మొన్న నిధి అగర్వాల్కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రాజాసాబ్ సినిమా ఈవెంట్లో నిధిని అభిమానులు చుట్టుముట్టారు. అభిమానుల అత్యుత్సాహంతో హీరోయిన్స్ ఇబ్బందులు పడుతున్నారు. హీరోయిన్లపై వెర్రి అభిమానంతో ఇలాంటి చేస్తుండడంతో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ ను కామంతో తాకినట్టు తెలుస్తోందని విమర్శలు వచ్చాయి. 

అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి.. హత్య

అమరావతి: అన్నదమ్ములను వేటకొడవళ్లతో  నరికి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దుర్గి మండలంలో జరిగింది. జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అడిగొప్పుల గ్రామంలో హనుమంతు, శ్రీరామమూర్తి అనే అన్నదమ్ములు ఉండేవారు. ఇంటి ముందే ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు వేటకోడవళ్లతో నరికి చంపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

ప్రేమపెళ్లి… కూతురుకు అంత్యక్రియలు చేసిన తండ్రి… వీడియో వైరల్

భోపాల్: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని తండ్రి ఆమెకు అంత్యక్రియలు చేశాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం విధిశా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సవిత(23) అనే యువతి అదృశ్యం కావడంతో తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి యువతి కోసం వెతకగా ఆమె ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా తెలిసింది. ఆగ్రహం రగిలిపోయిన తండ్రి తన కూతురు చనిపోయిందని బంధువులు, స్నేహితులను పిలిపించాడు. కూతురు ఫొటోను పాడేపై పెట్టి ఊరేగించాడు. శాస్త్రోక్తంగా ఆమె పిండప్రదానం, అంత్యక్రియలు పూర్తి చేశాడు. 23 ఏళ్లు కనిపెంచిన తండ్రికి గుండె కోత మిగిల్చారని కూతురుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. 

జల్ జంగ్ సైరన్

నేనే రంగంలోకి దిగుతున్న

ఇయ్యాల్టి వరకు ఓ కథ.. రేపట్నుంచి మరో కథ

నదీ జలాల కోసం మరో ఉద్యమం

ఉమ్మడి పాలమూరుకు కృష్ణా జలాల్లో అప్పుడూ.. ఇప్పుడూ అన్యాయమే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ద్రోహం చేస్తున్నాయి

174 టిఎంసిలు రావాల్సింది, 40 టిఎంసిలకే చాలంటారా?

డిపిఆర్‌ను వెనక్కి పంపితే మౌనం దాల్చుతారా? 

పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం 

మూడు జిల్లాల్లో బహిరంగ సభలు పెడతాం 

ఈ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్పా మరో ధ్యాసలేదు

చెక్‌డ్యామ్‌లు పేల్చిన నిందితులు పాతాళంలో ఉన్నా పట్టుకొస్తాం

ఇది సర్వ భ్రష్ట ప్రభుత్వం 

బిజెపి శనిలా దాపురించింది

చంద్రబాబు మాటలు విని ఇబ్బంది పెట్టింది

మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు పాలమూరుకు ద్రోహం చేశాయని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మరోసారి అలాగే వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎండగడుతూ పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బహిరంగ సభలు పెడతామని వెల్లడించారు. గ్రామగ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తామని వెల్లడించారు. బహిరంగ సభలు పెడతామని, వాటికి తానే స్వయంగా హాజరవుతానని తెలిపారు. ప్రజాక్షేత్రంలో నిష్క్రియ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఇవాల్టి దాకా వేరు కథ.. రేపట్నుంచి వేరే.. తోలుతీస్తామని హెచ్చరించారు. రెండేళ్ల నుంచి మౌనంగా ఉన్నానని.. ఇక తప్పనిసరి పరిస్థితి అని బయల్దేరానని తెలిపారు.

అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతానని పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లా నాయకులతో సమావేశమై, కచ్చితంగా పెద్ద ఎత్తున గ్రామగ్రామాన సభలు పెడతామని తెలిపారు. కవులు, గాయకులను తట్టి లేపుతామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాలని.. తమ కండ్ల ముందే ఇంత దుర్మార్గం జరుగుతుంటే కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉండాలని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన బిఆర్‌ఎస్‌ఎల్‌పి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కెసిఆర్ పార్టీ నేతలకు పలు అంశాలపై దిశానిర్ధేశం చేశారు. అనంతరం బిఆర్‌ఎస్ ముఖ్యనేతలతో కలిసి కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో ప్రధాన ఎజెండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపైనే జరిగిందని తెలిపారు. కేంద్రం, రాష్ట్రం పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే సమావేశంలో చర్చించామని వెల్లడించారు.

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటూ కాంగ్రెస్ సర్కార్‌కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని.. తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రెండేళ్లు ఆగామని.. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తామన్నారు. ఇకపై రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. ఇంట్లోకి వచ్చి దోచుకుపోతామంటే ఊరుకుంటామా..? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరేనని, 174 టీఎంసీల నీరు పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులకు రావాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణానది 300 కి.మీ ప్రవహిస్తోందని, ఉద్యమ సమయంలో పాలమూరుకు జరిగిన అన్యాయం వివరించానని తెలిపారు. బచావత్ ట్రైబ్యునల్ పంపకాల్లో పాలమూరు గురించి స్పష్టంగా చెప్పిందని, 1974లో బచావత్ ట్రైబ్యునల్ 17 టిఎంసిలు జూరాలకు సుమోటోగా కేటాయించిందని, కానీ, బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను పట్టించుకున్నవారే లేరు అని పేర్కొన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల పరిస్థితిపై పూర్తి అధ్యయనం చేశామని, పాలమూరు జిల్లాకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. చంద్రబాబు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని అన్నారు. పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని, భూ గర్బజలాల ద్వారా మరో లక్షన్నర ఎకరాల ఆయకట్టు వచ్చిందని వివరించారు. పాలమూరు జిల్లాకు 170 టిఎంసిలు తీసుకెళ్లాలన్నది బిఆర్‌ఎస్ సర్కారు వ్యూహం అని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో చెరువుల లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించామని, చంద్రబాబు మాటలు విని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని కెసిఆర్ ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం మొదటి నుంచి తమకు శనిలా దాపురించిందని విమర్శించారు. ఎంత దద్దమ్మ ప్రభుత్వం అయినా పాత ప్రాజెక్టులను కొనసాగించాలి కదా..? అని ప్రశ్నించారు. రెండేళ్లయినా పాలమూరు ప్రాజెక్టులో తట్టెడు మట్టయినా తీయలేదని విమర్శించారు.

నా విమర్శలకు తట్టుకోలేకే చంద్రబాబు కర్ణాటకకు డబ్బు చెల్లించారు

పాలమూరు నుంచి ముంబయికి విస్తృతంగా వలసలు ఉండేవని, గోరటి వెంకన్న కూడా పాలమూరు వలసలపై పాట రాశారని కెసిఆర్ అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి పేరిట చంద్రబాబు సభలు పెట్టారన్నారు. జూరాల ప్రాజెక్టు కోసం పరిహారం డబ్బు చంద్రబాబు కట్టడం లేదని తన విమర్శలకు తట్టుకోలేక కర్ణాటకకు డబ్బు చెల్లించారని పేర్కొన్నారు.తాను ఉద్యమం మొదలుపెట్టాక తొలిసారి జోగులాంబ గద్వాల పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. ఎంతో అధ్యయనం చేశాకే జోగులాంబ- గద్వాల పాదయాత్ర చేశామన్నారు. ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పాటైందని, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనుకకు నెట్టివేయబడ్డ రాష్ట్రమని పదే పదే చెప్పినట్లు గుర్తు చేశారు. ఆనాడు పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని, రాష్ట్రం వచ్చాక ప్రాజెక్టుల పరిస్థితిపై పూర్తి అధ్యయనం చేశామన్నారు. తమ హయాంలో పాలమూరు, నల్లగొండ జిల్లాలను అద్భుతంగా తీర్చిదిద్దామని వ్యాఖ్యానించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పడావు పెట్టారని ప్రశ్నించారు. ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని.. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆవేశంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్షంగా మన బాధ్యతను నిర్వహిద్దామని పార్టీ పిలుపునిచ్చారు.

తెలంగాణ నదీ జలాలకు బిఆర్‌ఎస్ మాత్రమే శ్రీరామరక్ష

తెలంగాణ తెచ్చిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా తమపై రెండు బాధ్యతలు ఉన్నాయని కెసిఆర్ తెలిపారు. అడ్డం పొడువు మాట్లాడి, కారుకూతలు కూసి ఏదో చేస్తామంటే ఇక నడవదని అన్నారు. తొందరపడి ఏ పని చేయట్లేదని.. అక్కసుతో మాట్లాడట్లేదని తెలిపారు. అనేక రకాల సమస్యలపై బిఆర్‌ఎస్ పార్టీ పోరాడుతూనే ఉందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే దాని మీద చప్పుడు లేదు.. ఇటు కృష్ణాలో పాలమూరు ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే దీనిపైనా చప్పుడు లేదు.. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్లు..? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని నిలదీశారు. అందుకే ఈ పిరిస్థితుల్లో తానే స్వయంగా రంగంలోకి దిగాలని అనుకున్నానని పేర్కొన్నారు. తెలంగాణ నదీ జలాలకు బిఆర్‌ఎస్ మాత్రమే శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. తెలంగాణపై ఆర్తి బిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు మరో ఉద్యమం చేపడదామని పిలుపునిచ్చారు.

ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలే తప్ప.. వేరే ధ్యాసే లేదు

ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలే తప్ప.. వేరే ధ్యాసే లేదని కెసిఆర్ కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. సర్కార్ విధానాలను ఎక్కడికక్కడ నిలదీస్తామని.. అన్యాయాలపై ప్రశ్నిస్తామని అన్నారు. ఎంత సేపూ భూములు అమ్ముకుందామనే యావలోనే ఉంటే ఎలా….? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని ఇదేమి దద్దమ్మ ప్రభుత్వం అని..? అని నిలదీశారు. కేవలం 40 టిఎంసిలు చాలని కేంద్రానికి ఎలా లేఖ రాస్తారని అడిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతామని ప్రకటించారు. రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు కొనే దిక్కు లేదు.. యూరియా ఇచ్చే సిస్టమ్ లేదని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగమాగం చేస్తుందన్నారు. వీరి పాలనా విధానాలు గమనిస్తుంటే.. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా…నిద్రపోతుందా..? అనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. ఎంతసేపు భూములు అమ్ముకుందామనే యావలోనే ఉంటే ఎలా..? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. ప్రభుత్వం నోరుమూసుకుని ఉంటుందని.. అందుకే తాము ముందడుగు వేస్తామని అన్నారు.

ఫ్యూచర్ సిటీ పేరుతో జరిగేదంతా రియల్‌ఎస్టేట్ దందానే

రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ.. ఫ్యూచర్ సిటీ అంతా ఉత్తిదే అని కెసిఆర్ విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో జరిగేదంతా రియల్ ఎస్టేట్ దందానే అని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ..తొక్క సిటీ.ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీని రేవంత్‌రెడ్డి పెంచారా..? అని నిలదీశారు. 400 సంవత్సరాల చరిత్ర వల్ల క్రమంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని, అలా అన్ని సిటీలు అయిపోవు అని పేర్కొన్నారు. అన్నీ దిక్కుమాలిన పాలీసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా ల్యాండ్ పూలింగ్‌పై బిఆర్‌ఎస్ పార్టీ హైకోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం అంతా సవ్యవంగానే చేస్తున్నామని చెప్పిందని అన్నారు. జూ పార్క్ తీసుకపోయి ఫ్యూచర్ సిటీలో పెడుతాడట అంటూ విమర్శించారు. తాము ఇలాంటి పనులు చేయలేదు అని, ఏం చేయదలచుకున్నా రాష్ట్రాన్ని అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము ఇలాంటి చిల్లరపనులు చేయలేదని తెలిపారు.

బిజినెస్ మీటింగ్‌లకు ఆద్యుడు చంద్రబాబని, ఆయన మొదటిసారి సిఎం అయినప్పుడు విశాఖలో బిజినెస్ మీటింగ్ పెట్టారన్నారు. అప్పట్లో విశాఖ ఎంఒయుల్లో వంట మనుషులు సంతకాలు పెట్టారు, అవన్నీ నిజమైతే లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి కదా..? ప్రశ్నించారు.తాము బిజినెస్ మీటింగ్‌లు పెట్టలేదని, మంచి పాలసీలతోనే పెట్టుబడుదారుల్నీ ఆకర్షించినట్లు తెలిపారు. గతంలో ఫాక్స్‌కాన్ కంపెనీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తే రూ.3,000 కోట్లు ఎదురు ఇస్తామని మహారాష్ట్ర తీసుకుపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేదని ఇక కోటీశ్వరులను ఎలా చేస్తారు..? అని ప్రశ్నించారు. తాము భూముల ధరలు పెంచగలిగామని నాలుగు ఎకరాలు ఉన్నవాడు ధీమాగా ఉండేవాడని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల ధరలు కుప్పుకూలాయని, రైతులను, ఉద్యోగులను అందరినీ ఏడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పులు కట్టలేకపోతున్నామని అంటే కాగ్ చెంపలు వాయించిందని గుర్తుచేశారు. ఎక్కడ మాట్లాడినా కెసిఆర్ చచ్చిపోవాలనే మాట్లాడతారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో కోపం వస్తే ఒక మాట అనొచ్చు కానీ ప్రతిసారీ తనపైనే శాపనార్థాలు పెడతారా..? అని ఆక్షేపించారు. గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోయారని, ఇప్పటికి 125 మంది చనిపోయారు. గట్టి అధికారిని పెట్టి గట్టి చర్యలు తీసుకోలేరా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బస్తీ దవాఖానాలను కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

కాంగ్రెస్ సర్కార్ బస్తీ దవాఖానాలను కూడా నిర్వీర్యం చేస్తోందని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ కిట్ పథకాన్ని కూడా ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని అసెంబ్లీ వేదికగా ప్రశంసించామని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచానని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది..? అని ప్రశ్నించారు. కెసిఆర్ కిట్ పథకాన్ని కూడా కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నిలిపివేసిందని నిలదీశారు. కాంగ్రెస్ రైతులను రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇచ్చే చెక్ డ్యామ్‌లను పేల్చివేయడం దారుణమని వాపోయారు. తాము అధికారంలోకి వచ్చాక కూల్చినవాళ్లు పాతాళంలో ఉన్నా పట్టుకువస్తామని కెసిఆర్ హెచ్చరించారు.

అసెంబ్లీకి రండి…చర్చిద్దాం

జనవరి 2 నుంచి శాసనసభ

తెలంగాణకు ఎవరేం చేశారో అక్కడే మాట్లాడుదాం

పాలమూరుపై పచ్చి అసత్యాలు చెప్పారు

మీ హయాంలోనే అత్యధిక జలదోపిడీ

కృష్ణా జలాలపై తెలంగాణకు మరణశాసనం రాసిందే మీరు 

పదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ నిర్మించలేదు

కాంట్రాక్టర్లు కమీషన్ల కోసమే ఎత్తిపోతల పథకాలు చేపట్టారు

కెసిఆరే చంద్రబాబు నాయుడి శిష్యుడు 

పట్టిసీమను అభినందించింది మీరు కాదా?

అల్లుడు, కొడుకు కుర్చీ కోసం కొట్టుకుంటుంటే తప్పనిసరై బయటికి వచ్చారు

బిడ్డ కవితకు సారె పెట్టలేక బయటికి సాగనంపారు

కెసిఆర్ ఆర్థిక ఉగ్రవాది 

మీరు చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే తిరిగి మేం అప్పులు చేస్తున్నాం

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టడంతో కనువిప్పు కలిగింది

మీడియాతో చిట్‌చాట్‌లో కెసిఆర్‌పై సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

మన తెలంగాణ / హైదరాబాద్ : కేసీఆర్ మారుతారని ఆశించినా ఎలాంటి మార్పులు రాలేలదని, మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతం గురించి పచ్చి అసత్యాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదివారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ తెలంగాణకు కేసీఆర్ చేసిన మేలు కంటే..అన్యాయమే ఎక్కువ చేశారన్నారు. ఆరోపణలు చేయడం కాదు..దమ్ముంటే చర్చకు రావాలి.. వచ్చే జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతాం..దమ్ముంటే కేసీఆర్ సమావేశాలకు రావాలని సీఎం రేవంత్ సవాల్ చేశారు. తెలంగాణకు ఎవరేం చేశారో సభలోనే చర్చిద్దామని, కలుగులోంచి ఎలుక బయటకు వచ్చినట్లు నేడు కేసీఆర్ బయటకు వచ్చారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టడంతో కనువిప్పు కలిగిందన్నారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అని, రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. నాలుగు రకాలుగా అవకాశాలు ఉంటే అన్ని రకాల అప్పులు చేశారని ఆరోపించారు.

కెసిఆర్ హయాంలోనే అత్యధిక జల దోపిడీ 

కెసిఆర్ హయాంలోనే అత్యధిక జలదోపిడీ జరిగిందని, మూడు జిల్లాలకు మరణ శాసనం రాసిందే కెసిఆర్ అని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డికి జూరాల నుంచి నీటిని తీసుకుంటే మన హక్కులు మనకు ఉండేవని, కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయి కేసిఆర్ లిఫ్టులు కట్టారని ఆరోపించారు. జలాలు నిజాలపై అసెంబ్లీలో చర్చిద్దాం రండి..కెసిఆర్ చేసిన ద్రోహం ఏ నాయకుడు చేయలేదని విమర్శించారు. అసలు చంద్రబాబు శిష్యుడే కేసీఆర్ అని, పట్టిసీమను అభినందిస్తున్నానని అన్నదే కేసీఆర్ అన్నారు. ఆయన తమలపాకుతో కొడితే తాను తలుపు కర్రతో కొడతా..ఆయన విసనకర్రతో కొడితే నేను నీటి తొట్టితో కొడతా..కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నారని కేసీఆర్ బయటకు వచ్చారని అన్నారు. ముఖాముఖి చర్చలకు రమ్మంటే ముఖం చాటేస్తున్నాడని, కుర్చీ కోసం అల్లుడు కొడుకు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని చెప్పారను. కెసిఆర్ ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని సీఎం పేర్కొన్నారు.

కృష్ణా మీద కేసీఆర్ ఒక ప్రాజెక్టు కట్టలేదు

పదేళ్ల కాలంలో కృష్ణా మీద కేసీఆర్ ఒక ప్రాజెక్టు కట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయి కేసీఆర్ వేలకోట్ల కమిషన్లు దండుకున్నారని, పదేళ్ల లో కృష్ణా నదిపై రెండు లక్షల కోట్లు ఖర్చుపెట్టి లక్ష 80 కోట్ల బిల్లులు చెల్లించారని ఆరోపించారు. ఏపీ జలదోపిడికి దోహదం చేసింది కేసీఆర్ అని ధ్వజమెత్తారు. జూరాల దగ్గర ఓడిసి పట్టుకోవాల్సిన కృష్ణా జిల్లాలను శ్రీశైలం నుండి ఇచ్చి ఏపీకి రాసిచ్చారని విమిర్శంచారు. 811 టిఎంసి లలో 512 టిఎంసిలు ఏపీకి, తెలంగాణకు 299 టీఎంసీలతో తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిజనిర్ధారణ కమిటీ వేద్దామని కోరారు. పాలమూరు రంగారెడ్డి కట్టవద్దన్న హర్షవర్ధన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి దివాళా తీయించింది కేసీఆర్ అని విమర్శించారు.

జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా శీతాకాల అసెంబ్లీ సమావేశాలపై క్లారిటీ ఇచ్చారు. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై సీఎం అధ్యక్షతన అనధికారిక సమావేశం జరగనున్నట్లు తెలిసింది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలు ప్రకటించడంతో పాటు ఎన్ని రోజులు నిర్వహంచాలన్న అంశంపై కూడా స్పష్టత రానుంది. ఈ సమావేశాల్లో 7 ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు ఎలా? అన్ని రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాల కోసం చర్చలు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత

గర్వంతో ఎగిరిపడే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పారు

పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలయితే బిఆర్‌ఎస్ సత్తా తెలిసొచ్చేది

బిఆర్‌ఎస్‌ఎల్‌పి, కార్యవర్గ సమావేశంలో కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : తనను దూషించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్‌రావు అసహనం వ్యక్తం చేశారు. తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే వారి విధానంగా అర్థమవుతుందని ఆక్షేపించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్‌ఎల్‌పి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నదీ జలాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఉద్యమ కార్యాచరణ, రాష్ట్రంలో రైతుల సమస్యలు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని అన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బిఆర్‌ఎస్ సత్తా ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసేదని పేర్కొన్నారు. గర్వంతో ఎగిరే కొంతమంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఉమ్మడి ఎపి మాజీ సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని బిఆర్‌ఎస్ హాయాంలో అసెంబ్లీ వేదికగా ప్రశంసించామని గుర్తుచేశారు. ఆరోగ్య శ్రీ మొత్తాన్ని రూ. 2 లక్షలు ఉంటే రూ.5 లక్షలకు పెంచామని చెప్పారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది..? అని ప్రశ్నించారు. కెసిఆర్ కిట్ లాంటి పథకాలను కూడా నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల ఆస్తుల విలువ తగ్గింది

బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము ఎక్కడా అహంకార వైఖరి ప్రదర్శించలేదని కెసిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క పాలసీని కూడా తేలేదని విమర్శించారు. హిల్ట్ పాలసీని మాత్రం రియల్ ఎస్టేట్ కోసమే తీసుకువచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు యూరియా రైతుల ఇంటికి, చేను వద్దకు వచ్చేదని, ఇప్పుడు ఏకంగా యూరియా కోసం కుటుంబమంతా లైన్‌లో నిలబడే దారుణమైన పరిస్థితి నెలకొందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా, ఉన్న వాటిని ఆపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెక్ డ్యామ్‌లు పేల్చివేయడం దారుణం

రాష్ట్రంలో బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాచి రంపాన పెడుతోందని ధ్వజమెత్తారు. రైతులకు నీళ్లు ఇచ్చే చెక్ డ్యామ్‌లను పేల్చివేయడం దారుణమని, మళ్లీ బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కూల్చినవాళ్లు పాతాళంలో ఉన్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో పాలమూరు, నల్గొండ జిల్లాలను అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు- రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఎందుకు పడావు పెట్టారు..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం 10 శాతం పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు.

హాజరైన బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు

బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అధ్యక్షతన జరిగిన బిఆర్‌ఎస్‌ఎల్‌పి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, జగదీష్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మాజీ రాజ్యసభ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు.

కెసిఆర్ చెప్పినవన్నీ.. పచ్చి అబద్ధాలు

 రూ.25వేల కోట్లు ఖర్చుపెట్టి పాలమూరుకు చుక్క నీళ్లు ఇవ్వలేదు

 45 టిఎంసిలకు తగ్గించామన్నది అవాస్తవం

కేంద్రం నుంచి డిపిఆర్ వెనక్కి వచ్చింది మీ హయాంలోనే: మంత్రి ఉత్తమ్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు గుండెకాయ అని లక్షల కోట్లు పోసి కట్టారని, తీరా చూస్తే ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆదివారం రాత్రి సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 90 శాతం అబద్ధం అని అన్నారు. లక్షల కోట్లు బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఒక్క రైతుకు లాభం జరుగలేదని తెలిపారు. కేవలం కమీషన్ల కోసమే భారీ ప్రాజెక్టు కట్టారని అన్నారు. కేవలం రైతులు, ప్రాజెక్టులనే కాకుండా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరినీ కేసీఆర్ మోసం చేశారని అన్నారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళుతున్న తమకు కేసీఆర్ నీతులు చెప్పడం బాగోలేదని, కేసీఆర్ నోటి వెంట నీతులు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని విమర్శించారు.

పాలమూరును మోసం చేసింది మీరే

కృష్ణా జలాల విషయంలో పాలమూరు ప్రజలను మోసం చేసింది మీరే నని కేసీఆర్ కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు విషయంలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధాలన్నారు. పదేళ్ల పాలనలో లక్ష ఎకరాలకు కూడా కొత్త ఆయకట్టు నీరు ఇవ్వలేదని, పాలమూరు రంగారెడ్డిలో 45 టీఎంసీలు తగ్గించామన్నది అబద్ధం అన్నారు. ఇరిగేషన్ ను నాశనం చేసింది మీరు..రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు.. కృష్ణా జలాల విషయంలో పాలమూరును మోసం చేసింది మీరు..2023 ఏప్రిల్ 12 న డీపీఆర్ వెనక్కు పంపారని, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మంత్రి మీరే కదా..? మీరు ఇచ్చిన జీవో ప్రకారమే 45 టీఎంసీలు కృష్ణా నుంచి, 45 టీఎంసీలు గోదావరి నుంచి ఇవ్వాలని కోరామన్నారు. 500 టీఎంసీలు ఏపీ వాడుకునేందుకు మీరు రాసివ్వలేదని చెప్పే దమ్ముందా..? అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

ఏపీ నీటిని తరలించుకుపోతుంటే ఏం చేశారు

ఉమ్మడి రాష్ట్రంలో 750 టీఎంసీలు తరలించుకుపోతే మీ పాలనలో 1400 టీఎంసీలు తరలించుకోయారని, ఏపీ నీటిని తరలించుకుపోతుంటే ఏం చేశారని కెసిఆర్ ను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిలదీశారు. అందుకు సహకరించింది మీరు కాదా..? ఇప్పుడు చెప్పండి ఎవరు మోసం చేశారోనని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు చేసింది సున్నా అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డికి 7 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కంటే సమర్థవంతంగా కృష్ణా ట్రిబ్యునల్ లో పోరాడుతున్నామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా దేవాదులను పట్టించుకోలేదని విమర్శించారు. మీరు లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం కూలిపోయిందని, ప్రాణహిత చేవెళ్ల రద్దు చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు. పదేళ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, బీమా, ఎస్ ఎల్ బీసీ మొదలైన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టు ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, ఎవరు మోసం చేశారో..? కేసీఆర్ కరెక్ట్‌గా ప్రిపేరై రావాలని, లేదంటే ఇలాగే లెక్కలు తెలియకుండా మాట్లాడుతారన్నారు. కృష్ణా బేసిన్‌లో కేసీఆర్ చేసింది దగా, మోసం అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.