Canlı Maç İzle

diyetisyen

x

Hacklink

imajbet

Agb99

Hacklink

betebet

kayaşehir escort

BetKare Güncel Giriş

taksim escort

üsküdar escort

Hacklink

casino kurulum

Hacklink

vdcasino

Hacklink

dinamobet

Hacklink

Hacklink

meritking

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

çağlayan escort

esenyurt escort

fix my speaker

deneme bonusu

meritking

SBOBET88

sekabet

Hacklink

MerlinToon

kiralık hacker

Hacklink panel

marsbahis

betturkey

grandpashabet

Hacklink

Hacklink

pusulabet

marsbahis

kingroyal

kingroyal

jojobet giriş

sekabet

Hacklink Panel

Hacklink

xx1

Holiganbet

sarıyer escort

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

bomonti escort

Hacklink

ultrabet

grandpashabet

Hacklink

özbek escort

agb99

matbet

Hacklink

Hacklink

yakabet 2026

Hacklink

Hacklink

Hacklink

Hacklink

deneme bonusu veren siteler

Hacklink

tarafbet

hititbet giriş

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Slot Mahjong

vdcasino

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

çeşme escort

Hacklink

Hacklink

Hacklink

betpas

Hacklink

หวยออนไลน์

pusulabet

Hacklink

Hacklink satın al

kavbet

Betokeys

Hacklink Panel

download cracked software,software download,cracked software

lunabet

ultrabet

vdcasino

marsbahis giriş

betcio

kralbet

బోడుప్పల్ లో ప్రియుడితో కలిసి భర్తను చంపి… హార్ట్ ఎటాక్ గా నమ్మించిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని హత్యకు కుట్ర

భార్యతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు

మన తెలంగాణ/బోడుప్పల్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియురాలు తన ప్రియుడు, స్నేహితులు కలిసి భర్తను చంపింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… బోడుప్పల్ లోLR తూర్పు బృందావన్ కాలనీలో వి జె అశోక్ (45) తన భార్య పూర్ణిమ(36), కొడుకుతో నివాసం ఉంటున్నారు. అశోక్ శ్రీనిధి విశ్వవిద్యాలయంలో లాజిస్టిక్ మేనేజర్ గా, భార్య పూర్ణిమ ఇంటి దగ్గరే ప్లే స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.తన భార్య పూర్ణిమ,గతంలో అదే కాలనీలో నివాసం ఉన్న ప్రియుడు భవన నిర్మాణ కార్మికుడు పాలేటి మహేష్ తో అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న భర్త తన భార్యను ప్రశ్నించడం వేధించడం ప్రారంభించాడు. దీని కారణంగా తన భార్య ప్రియుడుతో కలిసి భర్తను అంతమొందించడానికి కుట్రపన్నారు. ప్రియుడి స్నేహితుడైన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూక్య సాయికుమార్ (22) సహాయంతో ఈనెల 11న తన భర్త పని నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మహేష్ ,సాయి కుమార్ అతని పట్టుకుని దాడి చేయగా భార్య అతని కాళ్లు పట్టుకుంది. మహేష్ మూడు చున్నీలతో మృతుడిని గొంతు కోసి హత్య చేశారు. హత్య తర్వాత నిందితుడు మృతుడి బట్టలు మార్చాడు. సాక్షాలు లేకుండా చేయడానికి వస్తువులను పడేశాడు. తన భర్త గుండెపోటు వల్ల మరణించాడని బంధువులను తప్పుదారి పట్టించింది. తన భర్త ఇంటి వాష్ రూమ్ లో అపస్మారక స్థితిలో పడి ఉన్నారని మల్కాజ్గిరి ప్రభుత్వాసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మొదట్లో ఎలాంటి అనుమానం కలుగలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతదేహంపై అనుమానాస్పద గాయాలు కనిపించడం, చెంప, మెడపై గాయాలు కూడా ఉండడంతో మరణంపై కొంత అనుమానం రావడంతో సిసిటివి ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు ఆపిల్ ఫోన్ (ఏ2), రక్తంతో తడిసిన మూడు చున్నీలు, మరకలున్న చొక్కా బనియన్, మరణించిన వ్యక్తి విరిగిన పళ్ళు, నేరారూపణ చేసే ఫోటోలు, వీడియోలు ఉన్న ఒక పెన్ డ్రైవ్, ఫ్యాషన్ ప్రో 2 వీలర్ బైక్ (ఏ 3), రక్తపు మరకలు ఉన్న ప్యాంటు చొక్కా (ఏ3) ఆధారాలతో ఏ1 తన భార్య పూర్ణిమ, ఎ2 పాలేటి మహేష్ , ఎ3 భూక్య సాయికుమార్‌గా నిందితులుగా గుర్తించారు. కేసును సెక్షన్ 194 బిఎన్‌ఎస్‌ఎస్ నుండి సెక్షన్ 103(1),238 ఆర్/డబ్ల్యూ 3(5) బిఎన్‌ఎస్ కు మార్చారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు ఐపిఎస్ నాయకత్వంలో మల్కాజిగిరి జోన్ డిసిపి సిహెచ్ శ్రీధర్, మల్కాజ్గిరి డివిజన్ ఎసిపి ఎస్ చక్రపాణి, ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసును గుర్తించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిఐ గోవిందరెడ్డి , ఎస్ఐ నర్సింగరావు, ఉదయ భాస్కర్, సిబ్బంది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తాం

మన తెలంగాణ/మోత్కూర్: గ్రామాలకు వచ్చే నిధులన్నింటినీ గ్రామాల అభివృద్ధికి వినియోగించి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తామని నూతన సర్పంచులు ప్రకటించారు. మోత్కూరు మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ఆయా గ్రామపంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయించగా బాధ్యతలు స్వీకరించారు. దాచారం సర్పంచ్ కర్నె జ్యోతివీరేశంతో తహసీల్దార్ జ్యోతి, పాటిమట్ల సర్పంచ్ బండ రమవిజయరెడ్డితో ఏవో కీర్తి, సదర్శాపురం సర్పంచ్ మునుకుంట్ల నీలకంఠంతో ఇరిగేషన్ఏ ఈ అఖిల్,  అనాజిపురం సర్పంచ్ బీసు వెంకటయ్యతో ఎంఈవో టి. గోపాల్ రెడ్డి, పొడిచేడు సర్పంచ్ జిట్ట సైదులుతో ఈ ఈ మంగులాల్, దత్తప్పగూడెం సర్పంచ్ గుండు యాదగిరితో ఎంపీవో జనార్దన్ రెడ్డి, పాలడుగు సర్పంచ్ అంతటి భగవంతుతో డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి, ముశిపట్ల సర్పంచ్ పైళ్ల నర్సిరెడ్డితో పీఆర్ ఏఈ శివ, పనకబండ సర్పంచ్ లోతుకుంట రేణుకఅనిల్ కుమార్తో ఎంపీడీవో బాలాజీనాయక్, రాగిబావి సర్పంచ్ మెండు శ్రీవాణి చంద్రశేఖర్రెడ్డితో ఎంపీవో జనార్దన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. వారితో పాటు ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీల నూతన పాలకవర్గ సభ్యులను నాయకులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పని చేయడంతో పాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా చేస్తామని ప్రకటించారు.

క్రిష్‌తో మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి?

సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ‘ఆదిత్య 369’కి కొనసాగింపుగా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘ఆదిత్య 999 మ్యాక్స్’తోనే మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం కానున్నట్టు బాలయ్య ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నాడు. ఇదివరకే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇతర క్యాస్టింగ్ పై క్రిష్ ఫోకస్ పెట్టాడట. ఈ సినిమాలో బలమైన క్యాస్టింగ్ కూడా ఉంటుందట. అలాగే మోక్షజ్ఞ లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఆ మధ్య తన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య మాట్లాడుతూ.. “మోక్షజ్ఞను హీరోగా ఎలా పరిచయం చేయాలో నాకు తెలుసు. అతని కోసం ఒక ఐదు, ఆరు స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నాయి” అని చెప్పుకొచ్చారు. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు. అయితే క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిసింది. 

బడ్జెట్ కసరత్తు షురూ!

 బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని కోరిన తెలంగాణ ఆర్థిక శాఖ

 2026 -27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనకు శ్రీకారం

 జనవరి 3 లోగా అన్ని శాఖల ప్రతిపాదనలు పంపాలి

 మార్చి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బడ్జెట్ కసరత్తు ప్రారంభమైంది. 2026- 27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనకు తెలంగాణ ఆర్థిక శాఖ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను కోరింది. జనవరి 3లోగా ప్రతిపాదనలు పంపించాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచించింది. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో సవరించిన ప్రతిపాదనలు కూడా పంపాలని కోరింది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత, శాఖల వారీగా మంత్రులు, కార్యదర్శులతో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్షలు జరిపి బడ్జెట్ కేటాయింపుల అంచనాలపై చర్చిస్తారు. వచ్చే ఏడాది మార్చి నెలలో శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఏడాది పన్నుల ద్వారా రూ.1.75 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకు లక్ష కోట్ల రూపాయలు వచ్చినట్లు అంచనాలున్నాయి.

మార్చి నాటికి పన్నుల వసూళ్లు బాగా పుంజుకుంటాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఆర్థిక సంవత్సరానికి తొలి బడ్జెట్‌ను గత ఏడాది శాసనసభలో ప్రవేశపెట్టింది. 2023 డిసెంబర్‌లో పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2024 -25 ఆర్థిక సంవత్సరానికి 2024 ఫిబ్రవరి 10వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత జూలై 25న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అప్పటికే ఆర్థిక సంవత్సరం 4 నెలలు గడచిపోయింది. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి ఉభయ సభల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,91,059 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది.

బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత మేర ఆదాయం ఆ ఏడాది రాలేదు. కేంద్రం నుంచి కూడా భారీగా గ్రాంట్ల రూపంలో నిధులు వస్తాయని అనుకున్నా అదీ జరగలేదు. వివిధ కారణాల రీత్యా కొన్ని రంగాల్లో రావాల్సినంత ఆదాయం కూడా ఖజానాకు చేరలేదు. దీంతో అంచనాలను చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం 2025- 26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3.04 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను సమర్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రూ. 3 లక్షల కోట్ల మార్కును దాటిన బడ్జెట్, రూ 2.26 లక్షల కోట్ల ఆదాయ వ్యయం, రూ. 36,504 కోట్ల మూలధన వ్యయాన్ని కలిగి ఉంది.

సంక్షేమానికే పెద్దపీట

సహజంగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల అమలు కోసం బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ అభయ హస్తం, ఉచిత బస్సు, రూ.500 సిలిండర్, గృహజ్యోతి తదితర పథకాలు, హామీలకు నిధుల కేటాయింపు చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతోపాటు మహిళా శక్తి పథకం, ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కోసం మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే రాజీవ్ యువ వికాసం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణంకోసం నిధులు కేటాయించనున్నారు. మరో వైపు ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ అభివృద్ధి, మెట్రో రైల్ విస్తరణ పనులు, ఉస్మానియా ఆసుపత్రి, స్పోర్ట్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ తదితరాలకు బడ్జెట్‌లో నిధులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం, సాగునీటి రంగాలకు యథావిధిగా భారీ కేటాయింపులు ఉండనున్నాయి.

రుణమాఫీ భారం ఈ ఏడాది లేనందున ఆ మేరకు కొంత వెసులుబాటు కలుగుతుందని ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సర్దుబాటు చేయవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాది సంక్షేమ రంగంపై ఎక్కువగా దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా నిధులు పొందుపరిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలకు సంబంధించి నిధుల కేటాయింపు తప్పనిసరి. వీటన్నింటితో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధనంపై వ్యయం పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మూలధన వ్యయాన్ని పెంచితేనే ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం తగిన కార్యాచరణ అమలు చేసే యోచనలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ, వ్యాయాలను బేరీజు వేసుకుని రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉండనుంది.

టాప్ 5 శాఖలకు అత్యధిక నిధులు

గత ఏడాదిలో బడ్జెట్ వ్యవసాయ, విద్యుత్, రోడ్లు భవనాలు, హోం, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. అత్యధికంగా షెడ్యూల్ కులాల (ఎస్సి) సంక్షేమానికి ఏకంగా రూ.40,234 కోట్లు కేటాయించారు. ఇక షెడ్యూల్ తెగల (ఎస్టి) సంక్షేమానికి మరో రూ.17,169 కోట్లు కేటాయించారు. ఇలా కేవలం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసమే గత ఏడాది బడ్జెట్ లో సింహభాగం నిధులు కేటాయించారు. ఇక విద్యా రంగానికి రూ.23,108 కోట్లు కేటాయించారు. విద్యను ప్రాముఖ్యతనిస్తూ రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కోసం మొదటి దశలో 58 స్కూళ్ల నిర్మాణానికి రూ.11,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.

బడ్జెట్‌లో వివిధ శాఖలకు చేసిన కేటాయింపులు చూస్తే పంచాయతీరాజ్ శాఖకు రూ. 31,605 కోట్లు, వ్యవసాయ శాఖ రూ. 24,439 కోట్లు,విద్యా శాఖ రూ. 23,108 కోట్లు, ఎస్సీ సంక్షేమం రూ. 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ. 17,169 కోట్లు, బీసీ సంక్షేమం రూ. 11,405 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ రూ. 2,862 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ రూ. 3,591 కోట్లు, పశుసంవర్ధక శాఖ రూ. 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖ రూ. 5,734 కోట్లు, కార్మిక శాఖ రూ. 900 కోట్లు, చేనేత రంగానికి రూ. 371 కోట్లు, పరిశ్రమల శాఖ రూ. 3,527 కోట్లు, ఐటీ రంగానికి రూ. 774 కోట్లు, గ్యాస్ సిలిండర్ రాయితీ- రూ723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు, ఎస్డీఎఫ్, సీడీపీ నిధులు రూ.3300 కోట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ రూ.2,900 కోట్లు కేటాయించారు.

29 నుంచి అసెంబ్లీలో జలయుద్ధం

29 నుంచి అసెంబ్లీ సమావేశాలు

జనవరిలో ఎంపిటిసి, జెడ్‌పిటిసీ ఎన్నికలు

ఏడు ఆర్డినెన్స్‌ల స్థానే బిల్లులు

నీటి పారుదల రంగంపైనా చర్చ

జిహెచ్‌ఎంసిలో మున్సిపాలిటీపైనా చర్చ

సిఎం, మంత్రుల సమావేశంలో నిర్ణయాలు

ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులదేః సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. అదేవిధంగా జనవరిలో సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలకు వెళ్ళాలని కూడా నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోలు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. సుమారు మూడున్నర గంటల పాటు వివిధ కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నిబంధన ప్రకారం ఆరు నెలల్లోగా సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున, శీతాకాల సమావేశాలను 29న ప్రారంభించి, ఆ తర్వాత వచ్చే నెల 2వ తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. సమావేశాలు ప్రారంభించిన తర్వాత రెండు రోజుల్లో (31 డిసెంబర్, జనవరి 1) వేడుకల కోసం విరామం తీసుకుని ఆ తర్వాత రెండో తేదీ నుంచి కొనసాగించుకుందామని పలువురు మంత్రులు చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అంశంతో పాటు ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై హాట్‌హాట్‌గా చర్చ జరిగినట్లు సమాచారం.

స్థానిక ఎన్నికలను సీరియస్‌గా తీసుకోండి: సిఎం హెచ్చరిక

ఇదిలాఉండగా రాబోయే ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత కటువుగానే చెప్పినట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ కొందరు మంత్రుల జిల్లాలు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ కంటే బిఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిన సర్పంచులే అత్యధికంగా గెలవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలా ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన జిల్లాల్లో నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయని వాటికి సంబంధించిన గణాంకాలాను మంత్రులకు అందజేసి అలా ఎందుకు జరిగిందని నిలదీసినట్లు తెలిసింది. కొంత మంది పార్టీ ఎమ్మెల్యేల పని తీరు నచ్చలేదని, అనవసరంగా బంధు, మిత్రులను బరిలోకి దించడం వల్ల నష్టపోయామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారని తెలిసింది.

ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వత్తిళ్ళకు లొంగకుండా, కఠినంగా ఉండాలని, పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న వారికే టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని సిఎం సూచించారని తెలిసింది. ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించే బాధ్యతను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు తీసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులనుద్ధేశించి అన్నారని విశ్వసనీయ సమాచారం. అభ్యర్థుల ఎంపిక ఆచితూచి జరగాలని, గెలిచే అభ్యర్థులనే బరిలోకి దింపాలని ఈ విషయంలో ఏ మాత్రం రాజీపడరాదని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించినట్లు తెలిసింది. స్థానిక ఎన్నికల ముందు మండల, జిల్లా స్థాయిలో విపక్షాల నుంచి ముఖ్య నాయకులు ఎవరైనా పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరిస్తే వారిని చేర్చుకునేందుకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

ఇదిలాఉండగా పాలమూరు-రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత, మాజీ సిఎం కెసిఆర్ లేవదీసిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కెసిఆర్ లేవదీసిన అంశాలపై అసెంబ్లీలో నిలదీయాలని, ఆ పార్టీ నాయకులను ఇరకాటంలో పెట్టే విధంగా, వారి హయాంలో తీసుకున్న నిర్ణయాలను సభ ముందు ఉంచి ఆత్మరక్షణలో పడేసే విధంగా వ్యూహాన్ని అనుసరించాలని మంత్రులకు ముఖ్యమంత్రి దిశా నిర్ధేశం చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్ష నాయకుడు చర్చకు రప్పించేలా ఆ పార్టీకి సవాళ్ళు విసరాలని, ఎదురు దాడికి దిగడం ద్వారా వారిని ఇరకాటంలోకి నెట్టాలని సూచించినట్లు తెలిసింది. ప్రధాన ప్రతిపక్షానికి అసెంబ్లీలో చర్చకు తాను బలంగా సమాధానం చెప్పగలనని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారని తెలిసింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా గోదావరి కృష్ణా జలాలపై చర్చకు పెట్టి ప్రతిపక్ష బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కూడా ఈ సందర్భంగా సిఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా జిహెచ్‌ఎంసి వార్డుల విభజనపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ముఖ్యమంత్రి సవివరంగా వివరించినట్లు సమాచారం. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆశించిన దానికంటే తగ్గిన సీట్లు, రాబోయే స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల అంశం ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఆ ఎన్నికల్లో పార్టీ హామీ ఇచ్చిన మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేసే విషయంపై మంత్రుల అభిప్రాయాలను సిఎం తీసుకున్నట్లు తెలిసింది. శీతాకాల సమావేశాల్లో ఏడు ఆర్డినెన్స్‌ల స్థానే బిల్లులపై కూడా మంత్రులకు సిఎం రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలిసింది.

నేడు శ్రీలంకతో భారత్ రెండో టి20

విశాఖపట్నం: శ్రీలంకతో మంగళవారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు ఆతిథ్య భారత మహిళా జట్టు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో భారత్ పోరుకు సిద్ధమైంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆతిథ్య జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. కిందటి మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించింది. ఈసారి కూడా ఆమెపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, అమన్‌జీత్ కౌర్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. ఇక శ్రీలంకకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. పటిష్టమైన టీమిండియాను ఓడించాలంటే సర్వం ఒడ్డి పోరాడక తప్పదు.

స్కాలర్‌షిప్ బకాయిలు రూ.365 కోట్లు విడుదల

 గత ప్రభుత్వం కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలు అన్ని ఒకేసారి విడుదల

 విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రజా ప్రభుత్వం

 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

మన తెలంగాణ / హైదరాబాద్ : సంక్షేమ శాఖలలో పెండింగ్ లో ఉన్న బకాయిలు అన్ని ఒకేసారి విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లుల బకాయిలు క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్య విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం విద్యతోనే సమాజంలో సమూల మార్పులు వస్తాయన్నారు.

బకాయిల విషయానికి వస్తే బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలకు సంబంధించిన రూ.365.75 కోట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం మేరకు సోమవారం సాయంత్రం ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజాభవన్‌లో ఆర్థిక, సంక్షేమ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన రూ.21.62 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి రూ.191.63 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి రూ.152.59 కోట్లు విడుదలయ్యాయి. సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యం, విద్య ప్రజా ప్రభుత్వం ఎజెండా

ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సామాన్య జనుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అదే మా ఎజెండా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం బేగంపేటలోని తాజ్ వివాంతా హోటల్‌లో నిర్వహించిన విజయ మెడికల్ సెంటర్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రెండవ శ్రేణి నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో డయాగ్నస్టిక్స్ సెంటర్స్ ప్రారంభించాలని విజయ మెడికల్ సెంటర్ నిర్ణయించడం అభినందనీయమన్నారు. వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, అన్ని రకాల పరీక్షలను చేయాలని అందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామన్నారు.

కొన్ని దశాబ్దాల క్రితమే లేజర్ వైద్యం ద్వారా మ్యాక్సీవిజన్ కాసు ప్రసాద్ రెడ్డి తన జ్ఞానాన్ని సమాజానికి ఇచ్చారని వివరించారు. సూర్యనారాయణ, ప్రసాద్ రెడ్డి, వేలు ముగ్గురు బాల్య స్నేహితులు కొన్ని దశాబ్దాల పాటు కలిసి ఉండటమే కాకుండా విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థలో కీలకమైన తొలి రక్షణ అడుగును బలోపేతం చేసే ప్రయత్నమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దు

రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దు

రేవంత్‌రెడ్డిది మరుగుజ్జు మనస్తత్వం

కెసిఆర్ స్టేట్స్‌మెట్‌లా మాట్లాడితే, రేవంత్‌రెడ్డి స్ట్రీట్ రౌడీలా మాట్లాడారు

చొక్కాలు మార్చినంత మాత్రాన రేవంత్‌రెడ్డి పార్టీలు మార్చారు

చంద్రబాబు మీ గురువు అని మేం అంటే రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు

వెంకయ్యనాయుడుతో స్వయంగా చంద్రబాబే తన గురువు అని అంగీకరించారు

సోనియాగాంధీని ఓసారి దేవత అంటారు, మరోసారి బలిదేవత అంటారు

కృష్ణా జలాల్లో 45 టిఎంసిలకు.. మంత్రి ఉత్తమ్ స్వయంగా తన దస్తూరితో కేంద్రానికి లేఖ రాశారు

ఎవరి ఒత్తిడితో నీటి వాటాను తగ్గించుకున్నారు

మంత్రి ఉత్తమ్ ఇప్పుడైనా ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి

కెసిఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే.. సిఎం, నీళ్ల మంత్రికి ఎందుకంత ఇబ్బంది

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాల కోసంమే బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మాట్లాడారని ఆ పార్టీ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. కెసిఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందని తెలిపారు. బిఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని రేవంత్ ఆరోపించారని, రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దని సిఎంను కోరారు. కెసిఆర్ స్టేట్స్‌మెన్‌గా మాట్లాడితే, రేవంత్ స్ట్రీట్ రౌడీగా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, కెసిఆర్ ప్రెస్‌మీట్ పెట్టగానే వెంటనే సిఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ పెట్టడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది ముఖ్యమంత్రి స్థాయికి స్థాయికి తగ్గ ప్రవర్తన కాదని అన్నారు.

కెసిఆర్ లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాలి.. లేదంటే సమాధానాలు చెప్పాలని, అది చేయకుండా మరుగుజ్జు మనస్తత్వంతో, సంకుచిత మనస్తత్వంతో చిట్ చాట్ పెట్టుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్‌ది హిమాలయాల ఎత్తు కలిగిన మనస్తత్వం అయితే రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వం అని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ ఎదిగినట్లు రేవంతరెడ్డే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. రూ.50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పిసిసి పదవిని కొనుగోలు చేసినట్లు గతంలో కోమటిరెడ్డి చెప్పారని అన్నారు. తమది అలాంటి నాయకత్వం కాదని, నిజాయతీగా త్యాగాల పునాదులపై ఎదిగిన నాయకత్వమని చెప్పారు. ఎంఎల్‌ఎ పదవులు, మంత్రి పదవులను గడ్డిపోచల్లా త్యాగాలు చేసిన చరిత్ర తమ పార్టీ నేతలదని పేర్కొన్నారు. చొక్కాలు మార్చినంత మాత్రాన రేవంత్‌రెడ్డి పార్టీలు మార్చారని, ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదని, ఆయనకు నీతి జాతి ఏమైనా ఉందా..? అని నిలదీశారు. ఎంఎల్‌సిని కొంటూ రూ.50 లక్షలతో పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని అన్నారు.

రేవంత్‌కు ఒక స్టాండ్, సిద్దాంతం, పద్ధతి లేదని విమర్శించారు. తమది త్యాగాల చరిత్ర అయితే, ఆయనది వెన్నుపోటు చరిత్ర అని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డికి ఎపి సిఎం చంద్రబాబు గురువు అని అంటే ఆయన తమపై విమర్శలు చేస్తారని, కానీ ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతిని కలిసి చంద్రబాబే తన గురువు అని చెప్పారని అన్నారు. ఒకసారి చంద్రబాబును గురువు అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తావు, మరోసారి తానే స్వయంగా ఆయన గురువు అని అంగీకరిస్తారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సోనియాగాంధీని ఒకసారి దేవత అంటారు, ఇంకోసారి బలిదేవత అంటారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టు పనుల్లో ఒక్కటైనా చేశారా..?

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడైనా ప్రిపేర్ అయ్యి ప్రెస్‌మీట్స్ నిర్వహించాలని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. నీళ్ళ మంత్రి ఉత్తమ్‌కు సగం సగం నాలెడ్జ్ మాత్రమే ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే.. సిఎం, నీళ్ల మంత్రికి ఎందుకంత ఇబ్బంది అని నిలదీశారు. ఎవరి ఒత్తిడితో నీటి వాటాను తగ్గించుకున్నారని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో 45 టిఎంసిలకు.. మంత్రి ఉత్తమ్ స్వయంగా తన దస్తూరితో కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఉత్తర కుమారుడిలా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులో చేసిన పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టు పనుల్లో ఒక్కటైనా చేశారా చెప్పాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. పాలమూరు ప్రాజెక్ట్ డిపిఆర్‌లు వాపస్ వచ్చాయని అంటున్నారని, 2023లో డిపిఆర్ వాపస్ వస్తే కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సిఇఎ) అనుమతి, సెంట్రల్ సాయిల్, మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్(సిఎస్‌ఎంఆర్‌ఎస్) అనుమతి, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, అనుమతి, కేంద్ర భూగర్భ జల బోర్డు (సిజిడబ్లూబి) అనుమతి ఎలా సాధించామని అడిగారు.

పాలమూరు డిపిఆర్ 2023 ఏప్రిల్ 12న వాపస్ వస్తే, మూడు రోజుల్లోనే తమ ప్రభుత్వం జల్ శక్తి మంత్రిత్వ శాఖను లేఖ రాసిందని, కెసిఆర్ జల్ శక్తి అధికారులతో మాట్లాడారని గుర్తు చేశారు. తాము ఇఎసి సిఫారసు సహా 7 అనుమతులు సాధించించామని తెలిపారు. 2024 డిసెంబర్ 19న డిపిఆర్ వాపస్ లేఖ రాస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇదే కదా కెసిఆర్ ప్రభుత్వాన్ని నిలదీసిందని పేర్కొన్నారు. రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదని నిలదీశారు. ఇది కాకుండా 45 టిఎంసిలు చాలు అంటూ ఢిల్లీకి మంత్రి ఉత్తమ్, సిఎం లేఖ రాశారని, మళ్లీ సిగ్గులేకుండా తాము రాయలేదు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 టిఎంసిలతో ఎవరికి అన్యాయం చేస్తారని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాకా, రంగారెడ్డి జిల్లాకా, నల్లగొండ జిల్లాకా..? అని అడిగారు.తమ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్ట్ పనులు 90 శాతం పూర్తి చేసిందని, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. నార్లాపూర్ పంప్ హౌజ్‌లో పంపును రన్ చేసి మహబూబ్ నగర్ ప్రజానీకానికి ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తాయని కెసిఆర్ భరోసా ఇచ్చారని చెప్పారు. పాలమూరు 90శాతం పనులు ఎక్కడ అయ్యారని మంత్రి అంటున్నారని, అక్కడి వెళ్తామా..అంటూ సవాల్ విసిరారు.

ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్ చేసిందే కెసిఆర్

ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్ చేసిందే కెసిఆర్ అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందని, జిఎస్‌డిపి, తలసరి ఆదాయంలో కెసిఆర్ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలిపారని చెప్పారు. మూడురెట్ల జిఎస్‌డిపి, తలసరి ఆదాయం పెరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి తన రెండేళ్ల పాలనలో చెక్ డ్యామ్‌ల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. 11 లక్షల 60 వేల 895 ఎకరాలకు నీళ్లిస్తామని అసెంబ్లీ సిఎం చెప్పారని, కనీసం 11 వేల ఎకరాలకు అయినా నీళ్లు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. తాము 17 లక్షల 24 ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చామని, 31 లక్షల ఎకరాలను స్థిరీకరించామని చెప్పారు. రేవంత్‌రెడ్డి 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఎక్కడ ఇచ్చాడో చూపెట్టాలని, లేదంటే ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాలని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా మోసం చేశామని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. కాంగ్రెస్ నేతలు ఇంక సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసిఆర్ ప్రభుత్వంలో ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు కుప్పకూలిందని,కనీసం శవాలను కూడా బయటికి తీయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను నెంబర్‌వన్ చేశామని సిఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని కెసిఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి రాకముందే 2022 -23లో 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి, తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా నిలబెట్టింది కెసిఆర్ అని పేర్కొన్నారు. అప్పట్లో ఒడ్లు కొనలేమని కేంద్రం చేతులు ఎత్తేస్తే తాము కెసిఆర్ నాయకత్వంలో ఢిల్లీకి పొయ్యి ధర్నాలు చేశామని గుర్తు చేశారు.

2020 -21లో ధాన్యం సేకరణలో కూడా తాము రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపామని అన్నారు. ఆ ఏడాది తాము 141 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. రేవంత్‌రెడ్డి వచ్చినంక ఇంత ధాన్యాన్ని ఎన్నడూ సేకరించలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోనే పంటలు పండుతున్నాయని చెప్పారు. మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి ప్రాజెక్టుల కింద పండే పంటలు కాళేశ్వరం నీళ్లతోని పండుతున్న పంటలు కాదా..? అని ప్రశ్నించారు. ఎక్కువ వర్షాలు పడితే ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి, మధ్యతరహా వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి, కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి నీళ్లు వాడుతామని వివరించారు. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకు రిసోర్సెస్ అని చెప్పారు. గడిచిన రెండేళ్లుగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఎస్‌ఆర్‌ఎస్‌పి, ఎల్లంపల్లి మోటార్‌లు ఆన్‌చేసి రిజర్వాయర్‌లను నింపామని, లక్షల ఎకరాలకు నీళ్లు పారించి పంటలు పండించామని హరీష్‌రావు తెలిపారు.

బరితెగించిన బిఆర్‌ఎస్

 కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు 

ఆంధ్రావాళ్లకు అమ్ముడుపోయిందే బిఆర్‌ఎస్ పార్టీ 

పాలమూరుకు ఇప్పటికీ పూర్తి పర్యావరణ అనుమతులు రాలేదు: మంత్రి ఉత్తమ్ ధ్వజం

ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కెసిఆర్‌కు కనబడటం లేదా?

మీది హైప్.. మాది హోప్ క్రియేట్ చేసే వర్కింగ్ కల్చర్

మీలాగా గాలిలో మేడలు కట్టడం మాకు రాదు

కెసిఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం

రైతుల సౌకర్యం కోసమే యూరియా సరఫరా యాప్

రైతుల గురించి మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్‌కు లేదు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు

బిఆర్‌ఎస్సే దద్దమ్మ ప్రభుత్వం: మంత్రి జూపల్లి

మన తెలంగాణ/హైదరాబాద్ : కేసీఆర్, హరీష్‌రావు బరితెగించి మాట్లాడుతున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. హరీష్‌రావు అతి తెలివితేటలు వాడటం ప్రజలు గమనిస్తున్నారన్నారని, హరీశ్‌రావు గోబె ల్స్ అని పెట్టుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. సిగ్గులేకుండా కేసీఆర్, హరీశ్‌రావు వ్యాఖ్య లు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఆంధ్ర వాళ్లకు అమ్ముడు పోయిందే బీఆర్‌ఎస్ పార్టీ అని మండిపడ్డారు. సోమవారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కేసీఆర్ డిజైన్ చేసి నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని, మేడిగడ్డ గురించి మాట్లాడటం ఆపి సిగ్గుతో తలదించుకోవాలన్నా రు. తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మించినవేనన్నారు.

కాళేశ్వరం నుంచి ఐదేళ్లలో 70 టీఎంసీ మా త్రమే నీళ్లను ఉపయోగించారన్నారు. కాళేశ్వరంలో మూడు బ్యారేజ్‌లు కూలిపోతే సిగ్గుతో తల దించుకోవాల్సింది పో యి ఎదురు దాడి చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలోని పాలమూరు, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అప్పులు తీర్చడానికి ఏడాదికి 16 నుంచి 20వేల కోట్లు రూపాయలు కడుతున్నామని చెప్పారు. గతంలో వాళ్ళు చేసిన 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్, గోదావరి డైవర్షన్ సేవింగ్ 45 టీఎంసీలు నిర్ణయం ప్రకారమే లేఖ రాశామని, లేఖ కొత్తది కాదన్నారు. పాలమూరుకు ఇప్పటికీ పూర్తిగా పర్యావరణం అనుమతులు రాలేదని, పదేళ్ళ పాటు పాలమూరు పూర్తి చేయకుండా అక్కడి ప్రజలను కేసీఆర్ మోసం చేశారన్నా రు. 90 శాతం పనులు పూర్తయితే ఒక్క ఎకరాకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

కేసీఆర్, హరీశ్‌రావు తీస్మార్ ఖాన్లు

కేసీఆర్ మాట్లాడితే కాంట్రాక్టర్లు అంటున్నారని, మొత్తం లెక్కలు తీస్తే అసలు విషయం తెలుస్తుందని ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు ద్రోహం, కుట్రతో ఏపీకి నీళ్లు అప్పగించారని ఆరోపించారు. కేసీఆర్, హరీష్‌రావు తీస్మార్ ఖాన్లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌లో ఏపీతో కు మ్మకై రోజుకు 3 టీఎంసీలు అప్పగించారని, అబద్ధాలు మా ట్లాడటానికి హరీష్‌రావుకు నోరు ఎలా వస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించామన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని నిలదీశారు. నల్గొండ జిల్లాకు అన్యాయం చేసేందుకు కేసీఆర్ డిండికి అనుమతి ఇవ్వలేదని కోమటిరెడ్డి పై కోపంతో బ్రహ్మనవెల్లి ప్రాజెక్టుపై కుట్ర చేశారని ఆరోపించారు.

మాది చేతల ప్రభుత్వం:తుమ్మల

కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో రైతు ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల పట్ల బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను సోమవారం మంత్రి ఓ ప్రకటనలో ఖండించారు. రైతు ల సమయాన్ని ఆదా చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం యూరియా సరఫరాలో యాప్ తీసుకొస్తుందని స్పష్టం చేశారు. పదేళ్ళు అధికారంలో ఉన్నామని చెప్పుకొనే వారికి యూరియా ఎవరిస్తారు? ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అని తెలియక మాట్లాడుతున్నారో లేక ఎప్పటిలాగే స్వార్ధరాజకీయాల కోసం మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలని కోరారు.

ప్రభుత్వం వద్ద సరిప డా యూరియా నిల్వలు ఉన్నా, ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతులను మరింత భయపెట్టే విధం గా మాట్లాడి, రైతులు యూరియా కోసం ఒకేసారి కొనుగోళ్ల కోసం వచ్చే విధంగా చేశారని మంత్రి ఆరోపించారు. కొందరు యూరియాను పక్కదారి పట్టించినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఈ మో సాన్ని ప్రభుత్వం మీద నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని గ్రహించిన గ్రామీణ ప్రజలు మరొక్కసారి బిఆర్‌ఎస్‌ను తిరస్కరించారన్నా రు. యూరియా పక్కదారి పట్టకుండా, రైతులు క్యూ లైన్లలో సమయాన్ని వృధా చేసుకొకుండా, పారదర్శకంగా అమ్మకాలు జరగాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం యాప్‌ని తీసుకొస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 

మీలా గాల్లో మేడలు కట్టం: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ రెండేళ్లపాటు చేసిన అభివృద్ధి కేసీఆర్‌కు కనబడకపోవడం విడ్డూరంగా ఉందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా కేసీఆర్ నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. జరుగుతున్న అభివృద్ధిని కేసీఆర్ ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదని వ్యా ఖ్యానించారు. కేసీఆర్ గారూ… మీ హయాంలో చేసింది తక్కువ, చెప్పుకుంది ఎక్కువ అని అన్నారు. తమ హయాంలో చేసేదే ఎక్కువ.. చెప్పుకునేది తక్కువ అని, మీలాగా మాకు ‘గాల్లో మేడలు’ కట్టడం రాదని ఎద్దేవా చేశారు.

‘గేట్ పాస్’ కల్చర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాం

మీ హయాంలో ఏ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా మీ ‘కుటుం బం’ అనుమతి తప్పనిసరి. అవునా..కాదా..? మేము ఆ ‘గేట్ పాస్’ కల్చర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాం. అందుకే నేడు ప్రపంచ స్థాయి పెట్టుబడులకు తెలంగాణ బై ఛాయిస్ కాదని, బై డెస్టినేషన్‌గా మారిందని, అందుకే పరిశ్రమలు తెలంగాణకు క్యూ కడుతున్నాయని స్పష్టం చేశారు. ఎక్కడో ఉండి పాలన సాగించిన మీకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకోవడం ‘హైప్’ లాగే కనిపిస్తుంది. ఇది హైప్ కాదు..ఈ రాష్ట్రం కోసం, భా వితరాల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న ‘హోప్’ అని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో కూడా అనేక ఒప్పందాలు జరిగాయని గుర్తు చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అనేది ఎప్పటికీ కొనసాగే నిరంతర ప్రక్రియ అని తెలిపారు.

తప్పుడు ప్రచారం తగదు

దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి శ్రీకారం చుట్టామని, కానీ మీరు మాత్రం ‘రియల్ ఎస్టేట్’ కోసమే అంటూ తప్పుడు ప్రచారం చేయడం తగదని శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అవసరాలకు అనుగుణంగా అన్ని ఒకే చోట ఉండాలనే గొప్ప సంకల్పంతో ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు రూపొందించామన్నారు. ‘వరంగల్ టెక్స్ టైల్ పార్క్’ మీద పేటెంట్ మీదా…? మరి మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు…? అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఒక ప్రణాళికా ప్రకారం మేం అసంపూర్తిగా మిగిలిపోయిన పార్క్‌ను పూర్తి చేశామని, అక్కడికి దిగ్గజ కంపెనీలను తీసుకువచ్చామని, దేశంలో ఇదే మొట్ట మొదటి ఫంక్షనల్ పీఎం మిత్ర పార్క్ అని, కేంద్రం నుంచి తమ హయాంలోనే రూ.30 కోట్లు ఈ పార్కు అభివృద్ధికి తీసుకు వచ్చామన్నారు. 

వార్డుల పునర్విభజనపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన డివిజన్ల విభజన ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి దాఖలయిన 80 పిటిషన్లు సోమవారం హైకోర్టు కొట్టేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను ప్రభుత్వం జిహెచ్‌ఎంసిలో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా జిహెచ్‌ఎంసిలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కి పెంచింది. ఈ క్రమంలో డివిజన్ల విభజన సరిగ్గా జరగలేదంటూ నారగూడెం మల్లారెడ్డి, సోల్కర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, విజయ్ కుమార్, దేవర శ్రీనివాస్, మధుకర్ రెడ్డి, గొరిగే. రాజు, వెంకటేష్ అనే వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఆంటోని రెడ్డి, అవినీష్‌రావులు వాదనలు వినిపించారు. విభజనలో అనేక అవకతవకలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమయిన నిర్ణయాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత డివిజన్ విభజన ప్రజల అభిప్రాయాలు, స్థానిక వాస్తవాలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టిందని పిటిషన్‌లో వివరించారు.

ఈ విభజన వల్ల ప్రజలకు పరిపాలనా ఇబ్బందులు, అభివృద్ధి అసమానతలు, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు సంబంధిత నిబంధనలు, చట్టపరమైన విధానాలను పూర్తిగా పాటించకుండా డివిజన్ విభజన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై తక్షణమే స్టే విధించాలని, ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా సరైన మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఎంసిహెచ్‌ఆర్‌డిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఆ నివేదికను ఇంతవరకు బయటపెట్టలేదని, అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.

కాగా, చట్టపరిధిలోనే వార్డు విభజన నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఉంచామని, ఇప్పటివరకు అందిన 3,100 అభ్యంతరాలు పరిష్కరిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే ప్రక్రియ ముగిసినందున ఈ అంశంల కల్పించుకోలేమంటూ దాఖలయిన 80 పిటిషన్లు కొట్టివేసింది.