elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbetaresbetteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalpuntobahispuntobahispadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbet

స్పష్టమైన విధివిధానాలతో ముందుకెళ్తున్నాం: సిఎం రేవంత్

హైదరాబాద్: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిందని.. రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం.. ప్రణాళికలు రూపొందించుకున్నాం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో అన్ని విభాగాల కార్యదర్శులతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ పాలసీలు లేవని అన్నారు. అందువల్ల అనేక సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యమైన విభాగాలకు పాలసీలు తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ విడుదల చేశామని అన్నారు.

రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని సిఎం తెలిపారు. స్పష్టమైన విధి విధానాలతో ముందుకెళ్తున్నామని.. గొప్ప కార్యాచరణ అమలుకు అధికారుల సహకారం ఉండాలని అన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని సూచించారు. ప్రతి నెల కార్యదర్శుల పని తీరుపై సిఎస్ సమీక్ష నిర్వహిస్తారని.. ప్రతి నెల కార్యదర్శులు.. సిఎస్‌కు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతి 3 నెలలకోసారి కార్యదర్శుల పని తీరుపై తానే స్వయంగా సమీక్షిస్తానని అన్నారు. అధికారులు సమన్వయం చేసుకొని పని చేయడం కీలకమని.. అభివృద్ధి విషయంలో సమన్వయం కోసం మెకానిజం ఉండాలని తెలిపారు. 

చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో కోహ్లీ

టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డుల గని. తన కెరీర్‌లో విరాట్ ఎన్నో అనితరసాధ్యమైన రికార్డులను బద్దలుకొట్టాడు.. సృష్టించాడు కూడా. టి-20, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా కోహ్లీ సిద్ధమవుతున్నాడు. అయితే కోహ్లీ ఎదుట మరో రికార్డు ఎదురుచూస్తోంది.

విరాట్ కోహ్లీ దాదాపు 15 సంవత్సరాల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ అడనున్నాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున ఈ దేశీ టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నాడు. అంధ్ర జట్టుతో డిసెంబర్ 24న మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 14,557 వన్డే పరుగులు ఉన్నాయి. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్‌లో ఓవరాల్‌గా 15,999 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆంధ్రతో జరిగే మ్యాచ్‌లో 1 పరుగు చేస్తే.. లిస్ట్-ఎ క్రికెట్‌లో 16 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు విరాట్. తద్వారా ఈ ఫీట్ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. ఈ లిస్ట్‌లో కోహ్లీ కంటే ముందు టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ లిస్ట్-ఎ ఖాతాలో 21,999 పరుగులు ఉన్నాయి.

ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. టి-20ల్లో ప్రపంచరికార్డు

సాధారణంగా హ్యాట్రిక్ సాధిస్తే.. దాన్ని ఎంతగానో సెలబ్రేట్ చేసుకుంటారు బౌలర్లు.. అతడి టీమ్. మరి ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీస్తే.. అంతేకాక.. అదే ఓవర్‌తో మొత్తం మ్యాచ్‌నే గెలిపిస్తే.. ఆ ఆనందాన్ని అవుధులు ఉండవు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఇండోనేషియా-కంబోడియా మధ్య జరిగిన టి-20 మ్యాచ్‌లో జరిగింది. ఇండోయానేషియా బౌలర్ గ్రెడే ప్రియాందన ఈ మ్యాచ్‌లో సంచలనం సృష్టించాడు. టి-20ల్లో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అంతేకాక.. తాను వేసిన తొలి ఓవర్‌లోనే ఈ ఫీట్ సాధించడం గమనార్హం.

బాలి వేదికగా మంగళవారం కంబోడియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా తొలుత బ్యాటింగ్ చేసి 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో కంబోడియా 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి పటిష్టంగానే కనిపించింది. కానీ, అప్పుడే గ్రెడే ప్రియాందన ఎంటరయ్యాడు. 16వ ఓవర్‌లో తొలి మూడు బంతులకే ముగ్గురిని ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత బంతి డాట్ బాల్ అయింది. ఆ తర్వాతి రెండు బంతుల మధ్యలో ఒక వైడ్ వేసి రెండు వికెట్లు తీశాడు. దీంతో కంబోడియా 107 పరుగులకే ఆలౌట్ అయింది. పలితంగా ఇండోనేషియా ఈ మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇదే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన ప్రియాందన 11 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేశాడు. అయితేనేం బంతితో కంబోడియా బ్యాటర్లను వణికించాడు. 1 ఓవర్‌లో కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది అంతర్జాతీయ టి-20ల్లో తొలి బౌలర్‌గా నయా చరిత్ర లిఖించాడు. గతంలో ఇలాంటి ఫీట్ కేవలం దేశవాళీ క్రికెట్‌‌లో కేవలం రెండు సానకలు మాత్రమే నమోదైంది. 2013-14లో విక్టరీడే టి-20 కప్‌లో యుసిబి-బిసిబి మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ అల్ మీన్ హోస్సేన్ ఒకే ఓవర్‌లో ఐధు వికెట్లు తీశాడు. ఇక 2019-20లో సయ్యద్ మస్తాద్ అలీ ట్రోఫీలో కర్ణాటక ఆటగాడు అభిమన్యు మిథున్ హరియాణాపై ఈ ఘనతను సాధించాడు. కానీ, అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ప్రియాందనదే తొలి రికార్డు.IDROVISIA

అతిగా వ్యవహరించే పోలీసులను వదిలిపెట్టేదే లేదు: హరీశ్

హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో నోటీసుల వార్తలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాష్ట్రంలో సిట్‌లు ఒక ప్రహసనం అయ్యాయని ఎద్దేవా చేశారు. డిఫెన్స్‌లో పడింది కాబట్టి నాకు నోటీసు ఇస్తారట అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే 3వ తేదీ సాయంత్రం నోటీసు ఇవ్వమని చెప్పారట అని.. కొందరు అధికారులు పోస్టింగుల కోసం అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం అతి చేస్తే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఎపిలో ఏం జరిగిందో అందరూ చూశారు కాదా అని.. రాజకీయ కక్షతో ఇబ్బంది పెడితే మీకు అదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు.

తమకు త్యాగాల చరిత్ర ఉందని.. అరెస్టులకు భయపడేది లేదని హరీశ్ స్పష్టం చేశారు. అరెస్టు చేస్తే చేసుకోండి, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని అన్నారు. అతిగా వ్యవహరించే అధికారుల పేర్లు బుక్‌లో రాస్తున్నామని.. అక్రమాలు, అరాచకాలు, సెటిల్‌మెంట్లు అన్ని నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న వారిని గమనిస్తున్నామని అన్నారు. అతిగా వ్యవహరించే పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని రిటైర్ అయినా, విదేశాల్లో ఉన్నా, కేంద్ర సర్వీసులకు వెళ్లినా పట్టుకొస్తామని హెచ్చరించారు. 

అనంతపురంలో ఇద్దరు కూతుళ్లను కాలువలోకి తోసేసిన తండ్రి

అమరావతి: కన్నతండ్రి ఇద్దరు కూతుళ్లను కాలువలోకి తోసేసి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నేమకల్లు గ్రామంలో కల్లప్ప అనే వ్యక్తి భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. కల్లప్పకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కూతుళ్లు సింధూ, అనసూయ స్థానిక పాఠశాలలో ఐదు, ఆరు తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో కూతుళ్లకు మాయమాటలు చెప్పి హెచ్‌ఎల్‌సి కాలువ దగ్గరకు తీసుకెళ్లాడు. పెద్ద కూతురు కాలువలోకి తోసేశాడు. అనంతరం చిన్న కూతురును కాలువలోకి తోయడానికి ప్రయత్నించడంతో తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె గట్టిగా పట్టుకొని కాలువలోకి తోసేశాడు. కూతుళ్లు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అతడిని నిలదీశారు. కర్నాటకలోని సిరిగేరి క్రాస్ వద్ద కాలువలో తోసేసానని, మరోసారి గ్రామ శివారులోని హెచ్‌ఎల్‌సి కాలువలోకి తీసేశానని వివరణ ఇచ్చాడు. గ్రామస్థులు ప్రశ్నించడంతో కల్లప్ప స్పృహతప్పిపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాలువలో నుంచి పెద్ద కూతురు అనసూయ మృతదేహాన్ని బయటకు తీశారు. రెండో కూతురు మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

బెట్టింగ్ యాప్స్ కేసు: సిఐడి విచారణకు మంచు లక్ష్మి..

హైదరాబాద్: సినీ నటి మంచు లక్ష్మి మంగళవారం సిఐడి విచారణకు హాజరయ్యారు. విచారణ కోసం ఆమె లక్డీకపూల్‌లోని సిఐడి కార్యాలయానికి వచ్చారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఆ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కిమీషన్లపై అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈ కేసులో ఆమె ఇడి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. గతంలో ఆమెతో పాటు హీరో విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, రానాలు కూడా ఈ విచారణకు హాజరయ్యారు. 

15 ఏళ్ల తర్వాత కోహ్లీ మ్యాచ్.. ఫ్యాన్స్‌కి నిరాశే

బెంగళూరు: టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ త్వరలో డొమెస్టిక్ క్రికెట్‌లో తిరిగి అడుగు పెట్టనున్నాడు. దాదాపు 15 సంత్సరాల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ పాల్గొననున్నాడు. చివరిసారి ఫిబ్రవరి 18, 2010లో ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ ఆడాడు. మళ్లీ ఇన్నాళ్లకు దేశవాళీ టోర్నమెంట్‌లో కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సోమవారం రాత్రి విరాట్ బెంగళూరుకు చేరుకున్నాడు.

చిన్నస్వామి స్టేడియంలో జరిగే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌ అన్ని ఫ్యాన్స్‌ లేకుండానే నిర్వహించాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు స్టాండ్‌లు మాత్రమే తెలిచి 2 లేదా 3 వేల మంది అభిమానులను లోపలికి అనుమతించాలని కెఎస్‌సిఎ కోరగా.. ఆ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి నిరాకరించారు. గ్రేటర్ బెంగళఊరు అథారిటీ కమిషనర్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు పోలీస్ కమీషనర్, అగ్నిమాపక, అత్యవసర శాఖలు, ఆరోగ్యశాఖతో కూడిన ఈ కమిటీ త్వరలో చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. దాని ఆధారంగా ప్రేక్షకుల అనుమతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

12 మంది పిల్లలు, 5 పందులు: కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణలో విద్యారంగంపై కొనసాగుతున్న నేరపూరిత నిర్లక్ష్యానికి అద్దంపట్టే చిత్రం ఇది అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం వేములలో పూర్వప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అంగన్‌వాడీలో పందులు తిరుగాడుతుంటే, బిక్కుబిక్కుమంటూ భోజనం కోసం విద్యార్థులు వరసలో నిలబడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోను కెటిఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. 12 మంది పిల్లలు. 5 పందులు అనే క్యాప్షన్ పెట్టారు. కాంగ్రెస్ గద్దెనెక్కాక రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో 102 ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరిగాయని, 2188 పిల్లలు అసుపత్రుల పాలయ్యారని విమర్శించారు. వివిధ కారణాల వల్ల 118 మంది ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని కెటిఆర్ చురకలంటించారు. 

భర్తను చంపి…. గ్రైండర్‌లో ముక్కలు ముక్కలుగా చేసి మురికి కాలువలో శరీర భాగాలు పడేశారు

లక్నో: ప్రియుడితో కలిసి భర్తను చంపి గ్రైండర్‌లో ముక్కలుగా చేసి శరీర భాగాలను మురిక కాలువలో పడేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సంభాల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  చందౌసిలోని మొహల్లా చున్నీలో రాహుల్, రుబీ అనే దంపతులు నివసిస్తున్నారు. గౌరవ్ అనే వ్యక్తితో రుబీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. అక్రమ సంబంధం విషయంలో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 18న భర్తను తన ప్రియుడితో కలిసి ఇనుప రాడ్‌తో కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని గ్రైండర్‌లో వైసి ముక్కలు ముక్కలు చేశారు. ఈడ్గాలోని మురికి కాలువలో శరీర భాగాలను పడేశారు. మరికొన్ని శరీర భాగాలు రాజ్‌ఘాట్‌లోని గంగా నదిలో పడేశారు. తన భర్త కనిపించడంలేదని అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈడ్గాలోని మురికి కాలువలో డిసెంబర్ 15న శరీర భాగాలు కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక శరీర భాగంపై రాహుల్ పేరు ఉండడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. రాహుల్ భార్య రూబీని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కుళ్లిపోయిన శరీర భాగాలకు డిఎన్‌ఎ పరీక్షలు చేయించారు. రాహుల్‌దే మృతదేహం అని గుర్తించారు. రూబీని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. తన ప్రియుడు గౌరవ్‌తో కలిసి హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

గిల్, సూర్యల మధ్య చాలా తేడాలు ఉన్నాయి: కైఫ్

టెస్ట్, వన్డేలకు కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మాన్ గిల్.. టి-20 ఫార్మాట్‌లో మాత్రం రాణించలేకపోతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టి-20 సిరీస్‌లో అతను ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఈ కారణంగానో.. లేక ఇతర కారణాల వల్లనో టి-20 ప్రపంచకప్‌ – 2026 కోసం ప్రకటించిన జట్టులో గిల్‌ను పక్కన పెట్టారు సెలక్టర్లు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా నిరాశపరుస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ని కొనసాగించి.. గిల్‌పై వేటు వేయడాన్ని కొందరు తప్పుబట్టారు. తాజాగా ఈ విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ స్పందించారు. గిల్, సూర్యల మధ్య చాలా తేడాలు ఉన్నాయని ఆయన అన్నారు.

‘‘టి-20ల్లో సూర్య మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు. ఐసిసి ర్యాంకింగ్స్‌లో అతడు టాప్-10లో ఉన్నాడు. ఎన్నో మ్యాచుల్లో భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. కాబట్టి సూర్యను గిల్‌తో పోల్చలేము. గిల్ అంతర్జాతీయ టి-20ల్లో తనను తాను ఇంకా నిరూపించుకోవాలి. ఉదాహరణకు కోహ్లీ విషయమే చూస్తే.. కొవిడ్ సమయంలో ఆ రెండేళ్ల పాటు పెద్దగా పరుగులు చేయలేదు. కానీ, అంతకు ముందు అతడికి గొప్ప రికార్డు ఉంది. 10 సంవత్సరాల పాటు మ్యాచ్ విన్నర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీకి మద్ధతుగా నిలవగా.. పేలవ ఫామ్‌ నుంచి బయటపడి మళ్లీ తిరిగి భారీ స్కోర్లు చేయడం ప్రారంభించాడు. సూర్య కూడా ప్రస్తుతం ఇదే కేటగిరీలో ఉన్నాడు. టి-20 ఫార్మాట్‌లో సూర్యకు గిల్ ఎక్కడా చేరువలో లేడు. ఫామ్‌లో లేని ఇద్దరిని జట్టు నుంచి తొలగించాలని అనడం సరికాదు’’ అని కైఫ్ పేర్కొన్నారు.