kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetkalebetkalebetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetoviskulisbetkulisbetroyalbetroyalbetrinabetrinabetbetkolikbetkolikteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişpadişahbetpadişahbetyakabetyakabetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetbox

నేడు శ్రీలంకతో భారత్ రెండో టి20

విశాఖపట్నం: శ్రీలంకతో మంగళవారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు ఆతిథ్య భారత మహిళా జట్టు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో భారత్ పోరుకు సిద్ధమైంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆతిథ్య జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. కిందటి మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించింది. ఈసారి కూడా ఆమెపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, అమన్‌జీత్ కౌర్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. ఇక శ్రీలంకకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. పటిష్టమైన టీమిండియాను ఓడించాలంటే సర్వం ఒడ్డి పోరాడక తప్పదు.

స్కాలర్‌షిప్ బకాయిలు రూ.365 కోట్లు విడుదల

 గత ప్రభుత్వం కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలు అన్ని ఒకేసారి విడుదల

 విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రజా ప్రభుత్వం

 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

మన తెలంగాణ / హైదరాబాద్ : సంక్షేమ శాఖలలో పెండింగ్ లో ఉన్న బకాయిలు అన్ని ఒకేసారి విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లుల బకాయిలు క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్య విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం విద్యతోనే సమాజంలో సమూల మార్పులు వస్తాయన్నారు.

బకాయిల విషయానికి వస్తే బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలకు సంబంధించిన రూ.365.75 కోట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం మేరకు సోమవారం సాయంత్రం ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజాభవన్‌లో ఆర్థిక, సంక్షేమ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన రూ.21.62 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి రూ.191.63 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి రూ.152.59 కోట్లు విడుదలయ్యాయి. సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యం, విద్య ప్రజా ప్రభుత్వం ఎజెండా

ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సామాన్య జనుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అదే మా ఎజెండా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం బేగంపేటలోని తాజ్ వివాంతా హోటల్‌లో నిర్వహించిన విజయ మెడికల్ సెంటర్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రెండవ శ్రేణి నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో డయాగ్నస్టిక్స్ సెంటర్స్ ప్రారంభించాలని విజయ మెడికల్ సెంటర్ నిర్ణయించడం అభినందనీయమన్నారు. వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, అన్ని రకాల పరీక్షలను చేయాలని అందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామన్నారు.

కొన్ని దశాబ్దాల క్రితమే లేజర్ వైద్యం ద్వారా మ్యాక్సీవిజన్ కాసు ప్రసాద్ రెడ్డి తన జ్ఞానాన్ని సమాజానికి ఇచ్చారని వివరించారు. సూర్యనారాయణ, ప్రసాద్ రెడ్డి, వేలు ముగ్గురు బాల్య స్నేహితులు కొన్ని దశాబ్దాల పాటు కలిసి ఉండటమే కాకుండా విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థలో కీలకమైన తొలి రక్షణ అడుగును బలోపేతం చేసే ప్రయత్నమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దు

రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దు

రేవంత్‌రెడ్డిది మరుగుజ్జు మనస్తత్వం

కెసిఆర్ స్టేట్స్‌మెట్‌లా మాట్లాడితే, రేవంత్‌రెడ్డి స్ట్రీట్ రౌడీలా మాట్లాడారు

చొక్కాలు మార్చినంత మాత్రాన రేవంత్‌రెడ్డి పార్టీలు మార్చారు

చంద్రబాబు మీ గురువు అని మేం అంటే రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు

వెంకయ్యనాయుడుతో స్వయంగా చంద్రబాబే తన గురువు అని అంగీకరించారు

సోనియాగాంధీని ఓసారి దేవత అంటారు, మరోసారి బలిదేవత అంటారు

కృష్ణా జలాల్లో 45 టిఎంసిలకు.. మంత్రి ఉత్తమ్ స్వయంగా తన దస్తూరితో కేంద్రానికి లేఖ రాశారు

ఎవరి ఒత్తిడితో నీటి వాటాను తగ్గించుకున్నారు

మంత్రి ఉత్తమ్ ఇప్పుడైనా ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి

కెసిఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే.. సిఎం, నీళ్ల మంత్రికి ఎందుకంత ఇబ్బంది

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాల కోసంమే బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మాట్లాడారని ఆ పార్టీ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. కెసిఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందని తెలిపారు. బిఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని రేవంత్ ఆరోపించారని, రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దని సిఎంను కోరారు. కెసిఆర్ స్టేట్స్‌మెన్‌గా మాట్లాడితే, రేవంత్ స్ట్రీట్ రౌడీగా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, కెసిఆర్ ప్రెస్‌మీట్ పెట్టగానే వెంటనే సిఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ పెట్టడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది ముఖ్యమంత్రి స్థాయికి స్థాయికి తగ్గ ప్రవర్తన కాదని అన్నారు.

కెసిఆర్ లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాలి.. లేదంటే సమాధానాలు చెప్పాలని, అది చేయకుండా మరుగుజ్జు మనస్తత్వంతో, సంకుచిత మనస్తత్వంతో చిట్ చాట్ పెట్టుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్‌ది హిమాలయాల ఎత్తు కలిగిన మనస్తత్వం అయితే రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వం అని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ ఎదిగినట్లు రేవంతరెడ్డే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. రూ.50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పిసిసి పదవిని కొనుగోలు చేసినట్లు గతంలో కోమటిరెడ్డి చెప్పారని అన్నారు. తమది అలాంటి నాయకత్వం కాదని, నిజాయతీగా త్యాగాల పునాదులపై ఎదిగిన నాయకత్వమని చెప్పారు. ఎంఎల్‌ఎ పదవులు, మంత్రి పదవులను గడ్డిపోచల్లా త్యాగాలు చేసిన చరిత్ర తమ పార్టీ నేతలదని పేర్కొన్నారు. చొక్కాలు మార్చినంత మాత్రాన రేవంత్‌రెడ్డి పార్టీలు మార్చారని, ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదని, ఆయనకు నీతి జాతి ఏమైనా ఉందా..? అని నిలదీశారు. ఎంఎల్‌సిని కొంటూ రూ.50 లక్షలతో పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని అన్నారు.

రేవంత్‌కు ఒక స్టాండ్, సిద్దాంతం, పద్ధతి లేదని విమర్శించారు. తమది త్యాగాల చరిత్ర అయితే, ఆయనది వెన్నుపోటు చరిత్ర అని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డికి ఎపి సిఎం చంద్రబాబు గురువు అని అంటే ఆయన తమపై విమర్శలు చేస్తారని, కానీ ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతిని కలిసి చంద్రబాబే తన గురువు అని చెప్పారని అన్నారు. ఒకసారి చంద్రబాబును గురువు అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తావు, మరోసారి తానే స్వయంగా ఆయన గురువు అని అంగీకరిస్తారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సోనియాగాంధీని ఒకసారి దేవత అంటారు, ఇంకోసారి బలిదేవత అంటారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టు పనుల్లో ఒక్కటైనా చేశారా..?

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడైనా ప్రిపేర్ అయ్యి ప్రెస్‌మీట్స్ నిర్వహించాలని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. నీళ్ళ మంత్రి ఉత్తమ్‌కు సగం సగం నాలెడ్జ్ మాత్రమే ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే.. సిఎం, నీళ్ల మంత్రికి ఎందుకంత ఇబ్బంది అని నిలదీశారు. ఎవరి ఒత్తిడితో నీటి వాటాను తగ్గించుకున్నారని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో 45 టిఎంసిలకు.. మంత్రి ఉత్తమ్ స్వయంగా తన దస్తూరితో కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఉత్తర కుమారుడిలా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులో చేసిన పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టు పనుల్లో ఒక్కటైనా చేశారా చెప్పాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. పాలమూరు ప్రాజెక్ట్ డిపిఆర్‌లు వాపస్ వచ్చాయని అంటున్నారని, 2023లో డిపిఆర్ వాపస్ వస్తే కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సిఇఎ) అనుమతి, సెంట్రల్ సాయిల్, మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్(సిఎస్‌ఎంఆర్‌ఎస్) అనుమతి, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, అనుమతి, కేంద్ర భూగర్భ జల బోర్డు (సిజిడబ్లూబి) అనుమతి ఎలా సాధించామని అడిగారు.

పాలమూరు డిపిఆర్ 2023 ఏప్రిల్ 12న వాపస్ వస్తే, మూడు రోజుల్లోనే తమ ప్రభుత్వం జల్ శక్తి మంత్రిత్వ శాఖను లేఖ రాసిందని, కెసిఆర్ జల్ శక్తి అధికారులతో మాట్లాడారని గుర్తు చేశారు. తాము ఇఎసి సిఫారసు సహా 7 అనుమతులు సాధించించామని తెలిపారు. 2024 డిసెంబర్ 19న డిపిఆర్ వాపస్ లేఖ రాస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇదే కదా కెసిఆర్ ప్రభుత్వాన్ని నిలదీసిందని పేర్కొన్నారు. రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదని నిలదీశారు. ఇది కాకుండా 45 టిఎంసిలు చాలు అంటూ ఢిల్లీకి మంత్రి ఉత్తమ్, సిఎం లేఖ రాశారని, మళ్లీ సిగ్గులేకుండా తాము రాయలేదు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 టిఎంసిలతో ఎవరికి అన్యాయం చేస్తారని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాకా, రంగారెడ్డి జిల్లాకా, నల్లగొండ జిల్లాకా..? అని అడిగారు.తమ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్ట్ పనులు 90 శాతం పూర్తి చేసిందని, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. నార్లాపూర్ పంప్ హౌజ్‌లో పంపును రన్ చేసి మహబూబ్ నగర్ ప్రజానీకానికి ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తాయని కెసిఆర్ భరోసా ఇచ్చారని చెప్పారు. పాలమూరు 90శాతం పనులు ఎక్కడ అయ్యారని మంత్రి అంటున్నారని, అక్కడి వెళ్తామా..అంటూ సవాల్ విసిరారు.

ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్ చేసిందే కెసిఆర్

ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్ చేసిందే కెసిఆర్ అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందని, జిఎస్‌డిపి, తలసరి ఆదాయంలో కెసిఆర్ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలిపారని చెప్పారు. మూడురెట్ల జిఎస్‌డిపి, తలసరి ఆదాయం పెరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి తన రెండేళ్ల పాలనలో చెక్ డ్యామ్‌ల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. 11 లక్షల 60 వేల 895 ఎకరాలకు నీళ్లిస్తామని అసెంబ్లీ సిఎం చెప్పారని, కనీసం 11 వేల ఎకరాలకు అయినా నీళ్లు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. తాము 17 లక్షల 24 ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చామని, 31 లక్షల ఎకరాలను స్థిరీకరించామని చెప్పారు. రేవంత్‌రెడ్డి 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఎక్కడ ఇచ్చాడో చూపెట్టాలని, లేదంటే ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాలని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా మోసం చేశామని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. కాంగ్రెస్ నేతలు ఇంక సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసిఆర్ ప్రభుత్వంలో ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు కుప్పకూలిందని,కనీసం శవాలను కూడా బయటికి తీయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను నెంబర్‌వన్ చేశామని సిఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని కెసిఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి రాకముందే 2022 -23లో 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి, తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా నిలబెట్టింది కెసిఆర్ అని పేర్కొన్నారు. అప్పట్లో ఒడ్లు కొనలేమని కేంద్రం చేతులు ఎత్తేస్తే తాము కెసిఆర్ నాయకత్వంలో ఢిల్లీకి పొయ్యి ధర్నాలు చేశామని గుర్తు చేశారు.

2020 -21లో ధాన్యం సేకరణలో కూడా తాము రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపామని అన్నారు. ఆ ఏడాది తాము 141 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. రేవంత్‌రెడ్డి వచ్చినంక ఇంత ధాన్యాన్ని ఎన్నడూ సేకరించలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోనే పంటలు పండుతున్నాయని చెప్పారు. మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి ప్రాజెక్టుల కింద పండే పంటలు కాళేశ్వరం నీళ్లతోని పండుతున్న పంటలు కాదా..? అని ప్రశ్నించారు. ఎక్కువ వర్షాలు పడితే ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి, మధ్యతరహా వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి, కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి నీళ్లు వాడుతామని వివరించారు. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకు రిసోర్సెస్ అని చెప్పారు. గడిచిన రెండేళ్లుగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఎస్‌ఆర్‌ఎస్‌పి, ఎల్లంపల్లి మోటార్‌లు ఆన్‌చేసి రిజర్వాయర్‌లను నింపామని, లక్షల ఎకరాలకు నీళ్లు పారించి పంటలు పండించామని హరీష్‌రావు తెలిపారు.

బరితెగించిన బిఆర్‌ఎస్

 కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు 

ఆంధ్రావాళ్లకు అమ్ముడుపోయిందే బిఆర్‌ఎస్ పార్టీ 

పాలమూరుకు ఇప్పటికీ పూర్తి పర్యావరణ అనుమతులు రాలేదు: మంత్రి ఉత్తమ్ ధ్వజం

ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కెసిఆర్‌కు కనబడటం లేదా?

మీది హైప్.. మాది హోప్ క్రియేట్ చేసే వర్కింగ్ కల్చర్

మీలాగా గాలిలో మేడలు కట్టడం మాకు రాదు

కెసిఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం

రైతుల సౌకర్యం కోసమే యూరియా సరఫరా యాప్

రైతుల గురించి మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్‌కు లేదు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు

బిఆర్‌ఎస్సే దద్దమ్మ ప్రభుత్వం: మంత్రి జూపల్లి

మన తెలంగాణ/హైదరాబాద్ : కేసీఆర్, హరీష్‌రావు బరితెగించి మాట్లాడుతున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. హరీష్‌రావు అతి తెలివితేటలు వాడటం ప్రజలు గమనిస్తున్నారన్నారని, హరీశ్‌రావు గోబె ల్స్ అని పెట్టుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. సిగ్గులేకుండా కేసీఆర్, హరీశ్‌రావు వ్యాఖ్య లు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఆంధ్ర వాళ్లకు అమ్ముడు పోయిందే బీఆర్‌ఎస్ పార్టీ అని మండిపడ్డారు. సోమవారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కేసీఆర్ డిజైన్ చేసి నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని, మేడిగడ్డ గురించి మాట్లాడటం ఆపి సిగ్గుతో తలదించుకోవాలన్నా రు. తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మించినవేనన్నారు.

కాళేశ్వరం నుంచి ఐదేళ్లలో 70 టీఎంసీ మా త్రమే నీళ్లను ఉపయోగించారన్నారు. కాళేశ్వరంలో మూడు బ్యారేజ్‌లు కూలిపోతే సిగ్గుతో తల దించుకోవాల్సింది పో యి ఎదురు దాడి చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలోని పాలమూరు, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అప్పులు తీర్చడానికి ఏడాదికి 16 నుంచి 20వేల కోట్లు రూపాయలు కడుతున్నామని చెప్పారు. గతంలో వాళ్ళు చేసిన 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్, గోదావరి డైవర్షన్ సేవింగ్ 45 టీఎంసీలు నిర్ణయం ప్రకారమే లేఖ రాశామని, లేఖ కొత్తది కాదన్నారు. పాలమూరుకు ఇప్పటికీ పూర్తిగా పర్యావరణం అనుమతులు రాలేదని, పదేళ్ళ పాటు పాలమూరు పూర్తి చేయకుండా అక్కడి ప్రజలను కేసీఆర్ మోసం చేశారన్నా రు. 90 శాతం పనులు పూర్తయితే ఒక్క ఎకరాకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

కేసీఆర్, హరీశ్‌రావు తీస్మార్ ఖాన్లు

కేసీఆర్ మాట్లాడితే కాంట్రాక్టర్లు అంటున్నారని, మొత్తం లెక్కలు తీస్తే అసలు విషయం తెలుస్తుందని ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు ద్రోహం, కుట్రతో ఏపీకి నీళ్లు అప్పగించారని ఆరోపించారు. కేసీఆర్, హరీష్‌రావు తీస్మార్ ఖాన్లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌లో ఏపీతో కు మ్మకై రోజుకు 3 టీఎంసీలు అప్పగించారని, అబద్ధాలు మా ట్లాడటానికి హరీష్‌రావుకు నోరు ఎలా వస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించామన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని నిలదీశారు. నల్గొండ జిల్లాకు అన్యాయం చేసేందుకు కేసీఆర్ డిండికి అనుమతి ఇవ్వలేదని కోమటిరెడ్డి పై కోపంతో బ్రహ్మనవెల్లి ప్రాజెక్టుపై కుట్ర చేశారని ఆరోపించారు.

మాది చేతల ప్రభుత్వం:తుమ్మల

కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో రైతు ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల పట్ల బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను సోమవారం మంత్రి ఓ ప్రకటనలో ఖండించారు. రైతు ల సమయాన్ని ఆదా చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం యూరియా సరఫరాలో యాప్ తీసుకొస్తుందని స్పష్టం చేశారు. పదేళ్ళు అధికారంలో ఉన్నామని చెప్పుకొనే వారికి యూరియా ఎవరిస్తారు? ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అని తెలియక మాట్లాడుతున్నారో లేక ఎప్పటిలాగే స్వార్ధరాజకీయాల కోసం మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలని కోరారు.

ప్రభుత్వం వద్ద సరిప డా యూరియా నిల్వలు ఉన్నా, ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతులను మరింత భయపెట్టే విధం గా మాట్లాడి, రైతులు యూరియా కోసం ఒకేసారి కొనుగోళ్ల కోసం వచ్చే విధంగా చేశారని మంత్రి ఆరోపించారు. కొందరు యూరియాను పక్కదారి పట్టించినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఈ మో సాన్ని ప్రభుత్వం మీద నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని గ్రహించిన గ్రామీణ ప్రజలు మరొక్కసారి బిఆర్‌ఎస్‌ను తిరస్కరించారన్నా రు. యూరియా పక్కదారి పట్టకుండా, రైతులు క్యూ లైన్లలో సమయాన్ని వృధా చేసుకొకుండా, పారదర్శకంగా అమ్మకాలు జరగాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం యాప్‌ని తీసుకొస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 

మీలా గాల్లో మేడలు కట్టం: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ రెండేళ్లపాటు చేసిన అభివృద్ధి కేసీఆర్‌కు కనబడకపోవడం విడ్డూరంగా ఉందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా కేసీఆర్ నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. జరుగుతున్న అభివృద్ధిని కేసీఆర్ ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదని వ్యా ఖ్యానించారు. కేసీఆర్ గారూ… మీ హయాంలో చేసింది తక్కువ, చెప్పుకుంది ఎక్కువ అని అన్నారు. తమ హయాంలో చేసేదే ఎక్కువ.. చెప్పుకునేది తక్కువ అని, మీలాగా మాకు ‘గాల్లో మేడలు’ కట్టడం రాదని ఎద్దేవా చేశారు.

‘గేట్ పాస్’ కల్చర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాం

మీ హయాంలో ఏ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా మీ ‘కుటుం బం’ అనుమతి తప్పనిసరి. అవునా..కాదా..? మేము ఆ ‘గేట్ పాస్’ కల్చర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాం. అందుకే నేడు ప్రపంచ స్థాయి పెట్టుబడులకు తెలంగాణ బై ఛాయిస్ కాదని, బై డెస్టినేషన్‌గా మారిందని, అందుకే పరిశ్రమలు తెలంగాణకు క్యూ కడుతున్నాయని స్పష్టం చేశారు. ఎక్కడో ఉండి పాలన సాగించిన మీకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకోవడం ‘హైప్’ లాగే కనిపిస్తుంది. ఇది హైప్ కాదు..ఈ రాష్ట్రం కోసం, భా వితరాల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న ‘హోప్’ అని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో కూడా అనేక ఒప్పందాలు జరిగాయని గుర్తు చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అనేది ఎప్పటికీ కొనసాగే నిరంతర ప్రక్రియ అని తెలిపారు.

తప్పుడు ప్రచారం తగదు

దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి శ్రీకారం చుట్టామని, కానీ మీరు మాత్రం ‘రియల్ ఎస్టేట్’ కోసమే అంటూ తప్పుడు ప్రచారం చేయడం తగదని శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అవసరాలకు అనుగుణంగా అన్ని ఒకే చోట ఉండాలనే గొప్ప సంకల్పంతో ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు రూపొందించామన్నారు. ‘వరంగల్ టెక్స్ టైల్ పార్క్’ మీద పేటెంట్ మీదా…? మరి మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు…? అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఒక ప్రణాళికా ప్రకారం మేం అసంపూర్తిగా మిగిలిపోయిన పార్క్‌ను పూర్తి చేశామని, అక్కడికి దిగ్గజ కంపెనీలను తీసుకువచ్చామని, దేశంలో ఇదే మొట్ట మొదటి ఫంక్షనల్ పీఎం మిత్ర పార్క్ అని, కేంద్రం నుంచి తమ హయాంలోనే రూ.30 కోట్లు ఈ పార్కు అభివృద్ధికి తీసుకు వచ్చామన్నారు. 

వార్డుల పునర్విభజనపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన డివిజన్ల విభజన ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి దాఖలయిన 80 పిటిషన్లు సోమవారం హైకోర్టు కొట్టేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను ప్రభుత్వం జిహెచ్‌ఎంసిలో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా జిహెచ్‌ఎంసిలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కి పెంచింది. ఈ క్రమంలో డివిజన్ల విభజన సరిగ్గా జరగలేదంటూ నారగూడెం మల్లారెడ్డి, సోల్కర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, విజయ్ కుమార్, దేవర శ్రీనివాస్, మధుకర్ రెడ్డి, గొరిగే. రాజు, వెంకటేష్ అనే వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఆంటోని రెడ్డి, అవినీష్‌రావులు వాదనలు వినిపించారు. విభజనలో అనేక అవకతవకలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమయిన నిర్ణయాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత డివిజన్ విభజన ప్రజల అభిప్రాయాలు, స్థానిక వాస్తవాలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టిందని పిటిషన్‌లో వివరించారు.

ఈ విభజన వల్ల ప్రజలకు పరిపాలనా ఇబ్బందులు, అభివృద్ధి అసమానతలు, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు సంబంధిత నిబంధనలు, చట్టపరమైన విధానాలను పూర్తిగా పాటించకుండా డివిజన్ విభజన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై తక్షణమే స్టే విధించాలని, ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా సరైన మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఎంసిహెచ్‌ఆర్‌డిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఆ నివేదికను ఇంతవరకు బయటపెట్టలేదని, అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.

కాగా, చట్టపరిధిలోనే వార్డు విభజన నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఉంచామని, ఇప్పటివరకు అందిన 3,100 అభ్యంతరాలు పరిష్కరిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే ప్రక్రియ ముగిసినందున ఈ అంశంల కల్పించుకోలేమంటూ దాఖలయిన 80 పిటిషన్లు కొట్టివేసింది.

సమస్త భూ సమాచారానికి ఒక్క క్లిక్ చాలు

ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలు

భూభారతి పోర్టల్‌తో అనుసంధానం

ఒక్క క్లిక్‌తో రైతులకు పూర్తి భూసమాచారం

ప్రతి సర్వే నెంబర్‌కు మ్యాప్ రూపకల్పన

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సి.సి.ఎల్.ఎ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : భూ పరిపాలన వ్యవస్ధను మరింత పారదర్శకంగా,వేగవంతంగా అందించడానికి రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి భూభారతి పోర్టల్‌తో అనుసంధానం చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వచ్చే జనవరి నెలలో ఆధునీకరించిన ఈ వ్యవస్ధను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాంపల్లిలోని సి.సి.ఎల్.ఎ కార్యాలయాన్ని సోమవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అనంతరం వివిధ విభాగాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూ పరిపాలనకు కేంద్రమైన సిసిఎల్‌ఎ కార్యాలయం నిర్వహణ సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్‌కు ధీటుగా కార్యాలయాన్ని ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో మరోసారి కార్యాలయాన్ని తనిఖీ చేస్తానని, అప్పటివరకు కొంతమార్పు కనిపించాలని అన్నారు. వరుసగా విభాగాల వారీగా సమీక్షించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారుల పూర్తి సమాచారంతో సిద్దంగా ఉండాలని పేర్కొన్నారు.

ఒకే మోడల్‌లో కొత్త తహశీల్దార్ కార్యాలయాలు

దశాబ్దాల క్రితం ప్రభుత్వం వివిధ అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ సేకరణ జరిపిందని మంత్రి తెలిపారు. ఇప్పటికీ కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తుల పేరు మీదే ఉన్నాయని, ఇవన్నీ కూడా రికార్డులలో మార్చాలని చెప్పారు. అలాగే అసైన్డ్, భూధాన్ భూములపై సమీక్షతో పాటు కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగులపై విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఏ విభాగంలో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి..కోర్టు కేసులన్నింటిపై పూర్తిస్ధాయి సమీక్ష నిర్వహిస్తానని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించబోయే తహశీల్దార్ కార్యాలయాలు ఒకే మోడల్‌గా ఉండాలని, ఇందుకు సంబంధించిన డిజైన్ రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఒక్క క్లిక్‌తో రైతుకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా, అదేవిధంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నెంబర్‌కు మ్యాప్, నాలా ఆర్డర్లు, ఆర్‌ఒఆర్, గ్రామాల నక్షా, ఫీడ్ బ్యాక్ వంటి పూర్తి సమాచారం లభించేలా సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలతో అనుసంధానం చేస్తూ భూభారతి పోర్టల్‌ను పూర్తి స్ధాయిలో ప్రజలకు చేరువ చేయబోతున్నామని తెలిపారు. ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే కావాల్సిన సమాచారం లభిస్తుందన్నారు.

క్రయ విక్రయదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి సర్వే నెంబర్‌కు మ్యాప్‌ను రూపొందించే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్ధ ఆధునీకరణ చేసే ప్రతిపనిలో సామాన్యుని కోణం ఉండాలని, ఎలాంటి లోపాలకు, తారుమారుకు ఆస్కారం లేకుండా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ది చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐ.జీ. రాజీవ్ గాంధీ హనుమంతు, సిసిఎల్‌ఎ ఇంఛార్జ్ కార్యదర్శి మంద మకరంద్, ఎన్.ఐ.సి. ఎస్.ఐ.ఓ ప్రసాద్, విజయ్‌మోహన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వర్క్ పర్మిట్లకూ ఎసరు

 హఠాత్తుగా అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్ చేసిన అమెరికా

వాషింగ్టన్ పోస్ట్ కథనం హెచ్1బి వీసాదారులకు తప్పని తిప్పలు

స్వదేశానికి వచ్చి చిక్కుపడిపోయిన వేలాదిమంది టెకీలు

వాషింగ్టన్/న్యూఢిల్లీ: హెచ్1 బి వీసాదార్లకు అమెరికాలో తరచూ మారుతున్న వీసా నిబంధనలు చుక్కలు చూపుతున్నాయి. తమ వర్క్ పర్మి ట్ల రెన్యూవల్‌కు తరలివచ్చిన హెచ్1 బి వీసాదార్లు, ప్రత్యేకించి యువత ఇప్పుడు భారత్‌లో నే చిక్కుపడ్డారు. వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను నిలిపివేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అమెరికా కౌన్సిలర్ కార్యాలయాల్లో వారి అపాయింట్‌మెంట్లను హఠాత్తుగా రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నది. డిసెంబర్ 1526 మధ్య జరగాల్సిన అపాయింట్‌మెంట్ల ను వాయిదా వేసింది. హాలీడే సీజన్‌ను కారణమని అంటున్నారు. అయితే, అమెరికా ఇటీవల వీసా జారీకి భారీ స్థాయిలో ప్రక్షాళన చేపట్టిం ది. ప్రత్యేకించి వీసా దరఖాస్తుదార్ల గత సోషల్ మీడియా, ఇప్పటి సమాచారం క్షుణ్ణంగా తనిఖీ చేపట్టాలనే నిబంధనకు దిగింది. ఈ క్రమంలోనే అమెరికా విదేశాంగ శాఖ భారతీయ ఐటి నిపుణులకు, వర్కర్లకు ఇ మొయిల్ ద్వారా స మాచారం పంపిస్తూ ఇంటర్వూలను వచ్చే ఏ డాది వరకూ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

సోషల్ మీడియా పరిశీలన పాలసీ (వెట్టింగ్) క్రమంలో ఇంటర్వూలను నిలిపివేస్తున్నట్లు తె లిపారు. దీనితో డిసెంబర్ చివరిలో జరగాల్సిన ఇంటర్వూలు, కొత్తగా హెచ్1 బి వీసాల జారీ లు, రెన్యూవల్స్ నిలిచిపోయ్యాయి. జనవరిలో జరుగుతాయని చెపుతున్నారు కానీ అమెరికా వీసా ఇమిగ్రేషన్ వర్గాల నుంచి సంబంధిత విషయంపై పూర్తి స్థాయి అధికారిక నిర్థారణ రాలేదు. దీనితో భారతీయ ఐటి వర్గాలలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వందలాది మంది అభ్యర్థుల ఇప్పుడు దేశంలో నిలిచిపోవల్సి వచ్చిందని పలు ప్రముఖ లా కంపెనీలు తెలిపాయి. వర్క్ ప ర్మిట్ల పునరుద్ధరణకు వందలాది మంది ఈ నెల తొలి దశలో ఇండియాకు వచ్చారు. అయితే ఇప్పుడు వారి వీసా అపాయ్‌ట్మెంట్లు అర్థాతరంగా రద్దు కావడం, తరువాత ఇంటర్వూ లు జరుగుతాయని చెప్పడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరం అయిందని వీసా సంబంధిత కంపెనీ వర్గాలు తెలిపాయి.

జాబ్‌లపై భయాలతో ఐటి యువత

అమెరికాలో క్రిస్మస్, ఆ తరువాతి నూతన సంవత్సర సెలవు ల సీజన్ దశలో వీసాదార్ల అపాయ్‌ట్మెంట్లు ఎక్కువగా ఈ నెల 15 నుంచి 26 మధ్యలో ఖరారు అయ్యాయి. అయితే వీసా ఇంటర్వూల కొత్త నిబంధనలతో ఈ ఇంటర్వూలను ఇప్పుడు రద్దు చేశారు. వచ్చే ఏడాది మార్చి నెలలో జరుగుతాయని సమాచా రం అందించారు. ఇదంతా కూడా మహా గందరగోళానికి దారితీసింది. ఇంతకు ముందెప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఇకపై ఇంటర్వూలు ఏప్పుడు జరుగుతాయనేది ఇప్పుడైతే చెప్పలేమని ప్రముఖ వీసా కన్సల్టెంట్ సంస్థల వారు తెలిపారు. ఈ విషయంపై ఏదైనా పరిష్కార మార్గం ఉందా అనేది తాను చెప్పలేకపోతున్నట్లు ఇమిగ్రేషన్ సంబంధిత న్యాయ నిపుణులు వీణా విజ య్ అనంత్ వాషింగ్టన్ పోస్టుకు తెలిపారు. డెట్రాయెట్ శివార్లలో హెచ్ 1 బి వీసాపై ఉన్న ఓ వ్యక్తి ఈ నెలలోనే బంధువుల పెళ్లి ఉందని ఇండియాకు వచ్చాడు. పైగా ఆయనకు ఈ నెలాఖరులో నే కాన్సులర్ అపాయ్‌ట్మెం టు ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రక్రి య లేకుండా పో యింది. తమ యాజమాన్యాలు తమను ఎంతకాలం ఉద్యోగాలలో ఉంచుతాయనే భయాలు పలువురిలో నెలకొన్నాయి.

ఉద్యోగులకు గూగుల్, యాపిల్ షాక్‌లు

ప్రస్తుత దశలో హెచ్ 1బిపై పనిచేసే ఐటిలు అమెరికా వీడరాదని భారత్‌కు చెందిన వారికి హెచ్చరికలు వెలువడ్డాయి. అమెరికా టె క్ దిగ్గజ సంస్థలు గూగుల్, యాపిల్ ముందుగానే విషయాలను విశ్లేషించాయి. అమెరికా వీ రీ ఎంట్రీ పద్థతిలో అమెరికా ఎం బస్సీల్లో, కాన్సులేట్స్‌లో జాప్యం జరుగుతుందని కనుగొన్నారు. చివరికి ఇంటర్వూలకు, వీసాల రెన్యూవల్‌కు కనీసం 12 నెలల సమయం పడుతుందని , అందుకే సాధ్యమైనంత వరకూ భారత్‌కు వెళ్లవద్దని ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు అంతర్గత సమాచారం ద్వారా తెలిపారు. అయితే ఇండియాకు రెన్యువల్‌కు వచ్చిన వారు ఇప్పుడు తమ కంపెనీల నుంచి తరువాతి నిర్ణయం గురించి భయపడుతున్నారు. మరో వైపు వీసాల రెన్యువల్‌కు ఎన్ని చిక్కులో, ఎటువంటి మార్పులో అనే ఆందోళన చెందారు.

‘బంగ్లా’లో ఆరని మంటలు

మరో విద్యార్థి నాయకుడిపై కాల్పులు

చెలరేగుతున్న ఆందోళనలు, హింసాకాండ

న్యూఢిల్లీ: అల్లర్లు హింసాకాండ, ఆందోళనలతో బంగ్లాదేశ్ భగ్గున మండిపోతోంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇంకిలాబ్ మంచ్ నేత ఉస్మాన్ హాది హత్యపై హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో మరో విద్యార్థి నాయకుడిపై కాల్పులు జరాగాయి. ఖుల్నా జిల్లాలో విద్యార్థుల నాయకత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నాయకుడు మహమ్మద్ సిక్దర్ తలపై కాల్పులు జరిపారు. నగరంలోని సోనదంగ ప్రాం తంలో సోమవారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సిక్దార్ ఎన్సీపీ కార్మిక విభాగం, జాతీయ శ్రామిక్ శక్తికి చెందిన ఖుల్నా డివిజన్ కన్వీనర్ ఖుల్నాలో త్వరలో పార్టీ తరుపున డివిజన్ కార్మిక ర్యాలీ నిర్వహించే ఏర్పాట్లలో ఉండగా అతడిపై దాడి జరిగింది. సిక్దర్ తల ఎడమవైపున తుపాకీ గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్చారు.

గతవారం తీవ్రవాద నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణం తర్వాత దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. 32 ఏళ్ల హాది 2024లో బంగ్లాదేశ్ లో జరిగిన విద్యార్థి తిరుగుబాటులో కీలక పాత్రవహించాడు. ఈ ఆందోళన అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. బంగ్లాదేశ్ లో 2026 ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆ ఎన్నికల ప్రచారానికి హాది బయలుదేరుతుండగా డిసెంబర్ 12న ముసుగు ధరించిన దుండగులు జరిపిన కాల్పులలో తీవ్రంగా గాయపడి, ఢాకాలో ప్రాథమిక చికిత్సతర్వాత మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తరలించగా డిసెంబర్ 18న హాది మరణించిన సంగతి తెలిసిందే. 

విద్యుత్ ఉద్యోగులకు 17.65 శాతం డిఎ ఖరారు

మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డిఎ ఖరారు చేస్తూ విద్యుత్ శా ఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచీ ఆధారంగా ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలలో డియర్ నెస్ అలవెన్స్ (డిఎ)/డియర్ నెస్ రిలీఫ్ (డిఆర్) ను సమీక్షిస్తూ విడుదల చేస్తారు. అం దులో భాగంగా ఈ సంవత్సరం 1-. 7-. 2025 నుంచి అమలయ్యేలా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డిఎ/డిఆర్ ను 17.651 శాతంగా ఖరారు చేశారు. తాజా ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోకి 71,387 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజెన్లు, పెన్షన ర్లు లబ్ది పొందనున్నారు.

పెంచిన డీఏ ప్రకారం టీజీ ట్రాన్స్ కోలో 3,036 మంది ఉద్యోగులకు, 3,769 మంది ఆర్టిజన్లకు, 2,446 మంది పెన్షనర్లకు మొత్తంగా 9,251 మందికి లబ్ది చేకూరనుంది. జెన్ కో విషయానికి వస్తే 6,913 మంది ఉద్యోగులకు, 3,583 మంది ఆర్టిజన్లకు, 3,579 మంది పెన్షనర్లకు లబ్ది కలగనుంది. ఎస్పీడీసీఎల్ లో 11,957 మంది ఉద్యోగులకు, 8,244 మంది ఆర్టిజన్లకు, 8,244 మంది పెన్షనర్లకు లబ్ది కలగనుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో 9,728 మంది ఉద్యోగులకు, 3,465 మంది ఆర్టిజన్లకు, 6,115 మంది పెన్షనర్లకు లబ్ది కలగనుంది. మొత్తంగా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు కలిపి 71,387 మందికి లబ్ది చేకూరనుంది.

బొలేరో వాహనాన్ని ఢీకొన్న లారీ .. ముగ్గురు కూలీల మృతి

మరో 13 మందికి గాయాలు

మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన

మన తెలంగాణ/జైపూర్ : పొట్ట కూటి కోసం కూలీ పని చేయడానికి వెళ్తూ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు నిద్రలోనే మృత్యువు ఒడిలోకి చేరారు. ఈ విషాధ సంఘటన మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, జైపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఇందారం జిఎం ఆఫీసు సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన చాందిని బుజ్ గ్రామానికి చెందిన 23 మంది కూలీలు బొలేరో వాహనంలో పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ పరిసర గ్రామాల్లో వరి నాట్ల కోసం బయల్దేరారు.

సోమవారం తెల్లవారుజామున ఇందారం క్రాస్ రోడ్డు సమీపంలో డ్రైవర్ మూత్రవిసర్జన కోసం వాహనాన్ని ఎడమ వైపునకు మెల్లగా రోడ్డు దించుతున్నాడు. ఆ సమయంలో శ్రీరాంపూర్ నుండి వచ్చిన లారీ అతి వేగంగా బొలేరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొనడంతో సమీపంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళా కూలీ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతి చెందిన వారిలో మీనాబాటిల్‌వాల్ (45), నీలాభాయ్ (60), ఇమిలిబాయ్ (48) ఉన్నారు. ప్రమాదం సమాచారం అందుకున్న జైపూర్ పోలీసులు 108 వాహనం ద్వారా 13 మంది క్షతగాత్రులను మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో రోడ్డు పనులు జరగడంతో పాటు రోడ్డు పూర్తిగా కోసుకుపోయి ఉంది. కాగా, సంఘటన స్థలాన్ని సందర్శించిన సిఐ నవీన్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడని తెలిపారు.