StreamEastStreamEastStreamEastizmit escortmardin escortstreameastkiralık hackermarmaris escort@samalex34 escort calıstırıyorkulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişStreameastqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişStreameastkulisbetgalabetelexbetrestbetperabetbahiscasinobetkolikpadişahbettrendbetlivebahislordbahisbetlikeyakabetqueenbetrestbetperabetelexbetklasbahisultrabetrestbetyakabetperabetultrabet girişgobahisbetnanoroketbetgobahisbetnanoroketbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

body to body massage in istanbul

dizipal

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

sakarya escort bayan

Hacklink

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

betcio güncel giriş

betpas

Restbet giriş

İmajbet giriş

casibom giriş

milosbet

casibom giriş

galabet giriş

casibom

casibom

galabet

galabet

lacara

casibom

bahiscasino

online diyetisyen

kralbet

jojobet giriş

casibom

betmarino

Betpas

yakabet

artemisbet

artemisbet

pasacasino

Meritking Giriş

nakitbahis

nakitbahis

asyabahis

jojobet giriş

Restbet giriş

İmajbet giriş

nakitbahis

casibom giriş

milosbet

Marsbahis

meritking

restbet

holiganbet

pinbahis

pinbahis

marsbahis

matbet giriş

galabet

Marsbahis

istanbul escort

bakırköy escort

jojobet

ronabet giriş

galabet

bets10

ultrabet

jojobet

pusulabet

pusulabet giriş

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hilarionbet

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

pusulabet

pusulabet

matbet

jojobet

jojobet giriş

Meritking

jojobet

casibom

agb99

Agb99

jojobet

galabet

milosbet

ultrabet

beyoğlu escort

betpuan

türk porno

pusulabet

meritking giriş

pusulabet

imajbet

imajbet

matbet güncel giriş

sekabet

betboo

pusulabet

marsbahis

matbet

grandpashabet

Casibom

Casibom Giriş

pusulabet giriş

Slot Mahjong

betcio

Casibom Güncel Giriş

Betpas

pusulabet

pusulabet giriş

sekabet

1xbet

çağlayan escort

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

pusulabet

Online Hack Tool

Meritking Güncel Giriş

casibom giriş

betebet

casibom

casibom giriş

casibom

casibom

casibom güncel giriş

casibom

casibom giriş

jojobet giriş

pusulabet giriş

pusulabet

jojobet

jojobet

jojobet giriş

ultrabet

padişahbet

milosbet

milosbet

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

jojobet

jojobet

casibom güncel

betturkey giriş

Google Maps Yorum Satın Al

casibom

casibom giriş

casibom güncel giriş

son bölüm izle

eşref rüya son bölüm izle

lidyabet

Hacklink panel

Hacklink satın al

marsbahis

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

All Smo Tools

sekabet

jojobet

casibom giriş

casibom

bets10

jojobet

betlike

pusulabet

anadoluslot

milosbet

ultrabet

bağcılar escort

piabellacasino

piabellacasino

ultrabet

jojobet

padişahbet

padişahbet

jojobet

gaziosmanpaşa escort

Kartal Escort

mislibet

Hacklink

wbahis

jojobet

matbet

jojobet giriş

ultrabet

padişahbet

pusulabet

wbahis

betwoon

pusulabet giriş

atlasbet

İstanbul escort

betebet

betebet

interbahis

pusulabet

enobahis

meritking

meritking giriş

jojobet

bandar judi

betasus

jojobet giriş

jojobet

jojobet

berlinbet

bahisfair

casivera

casinowon

ultrabet

marsbahis giriş

kingroyal

jojobet

timebet

padişahbet

vdcasino

royalbet

masterbetting

betoffice

hiltonbet

meybet

galabet

tikobet

betsilin

hiltonbet

meritking

royalbet

teosbet

grandpashabet

meritking

celtabet

Meritking

betoffice

cratosroyalbet

Jojobet giriş

meritking

casino levant

1xbet

madridbet

marsbahis giriş

marsbahis

matadorbet

pusulabet

marsbahis

kavbet

kavbet giriş

matbet giriş

grandpashabet giriş

meritking

vdcasino giriş

meritking

Sweet Bonanza

Sweet Bonanza Oyna

casibom güncel giriş

Matbet giriş

holiganbet 1183

onwin

casinoroyal

cratosroyalbet

cratosroyalbet giriş

Casibom Bonus

casibom resmi

betlivo

jojobet

marsbahis

pusulabet

pusulabet giriş

lordbahis

ultrabet

ultrabet

ultrabet

restbet

perabet giriş

roketbet

marsbahis

holiganbet

holiganbet

Gates of Olympus

royalbet

imajbet

cratosroyalbet

casibom giriş

cratosroyalbet

pusulabet

artemisbet

betpas

dinamobet

betturkey

suratbet

betebet

süratbet

meritking

madridbet

meritking

otobet

cratosroyalbet

onwin

meritking

meritking giriş

grandpashabet

sahabet

vizyonbet

meritking

matadorbet

nitrobahis

jojobet

cratosroyalbet

meritking

pusulabet

cratosroyalbet

taksim escort

betmoney

slotday

kingroyal

meritking

kingroyal

meritking

meritking

madridbet

meritking

kingroyal

meritking

మసకబారుతున్న ‘ఎరుపు’

కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పాలకవర్గం సిపిఎం నేతృత్వం లోని ఎల్‌డిఎఫ్‌కు, విపక్ష కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్‌కు గట్టి షాక్ ఇచ్చాయి. చివరకు కేరళ రాజకీయ తెరపై ‘కమలం’ విరిసింది. రానున్న ఏప్రిల్ మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి కూడా అధికారం చేపట్టేలా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రేరణ కలిగిస్తాయని ఎంతో కలలుగన్న ఎల్‌డిఎఫ్‌కు తీవ్ర ఆశాభంగం తప్పలేదు. గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నేతృత్వం లోని విపక్షానికే చోటు లభించడం అనూహ్య పరిణామం. 14 జిల్లా పంచాయతీల్లో ఒక్కో ఫ్రంట్ చెరి సమాన సంఖ్యలో సీట్లు దక్కించుకున్నాయి. గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రజలను ప్రభావితం చేయడంలో పాలకవర్గం ఎల్‌డిఎఫ్ రికార్డు నెలకొల్పినప్పటికీ, ఈసారి దశాబ్ద కాలంగా అధికారంలో లేని యుడిఎఫ్ పైనే ఓటర్లు సానుభూతి చూపించడం ప్రత్యేకంగా గమనించవలసి ఉంది. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే 50 ఏళ్ల సంప్రదాయాన్ని 2021 లో ఎల్‌డిఎఫ్ ఛేదించినా, ఈసారి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగానే కనిపించింది.

శబరిమల అయ్యప్ప క్షేత్రంలోని బంగారు ఆభరణాల చోరీ, ఆలయ యాజమాన్య బోర్డు ప్రెసిడెంట్ అయిన సిపిఎం నాయకుని అరెస్టు, ఆయనపై తదుపరి చర్య తీసుకోవడానికి అధికార పార్టీ సిపిఎం అంగీకరించకపోవడం ఇవన్నీ అయ్యప్ప భక్తులకే కాదు, ప్రజలకు కూడా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ విషయం లో అలసత్వం చూపిస్తే తీవ్ర పరిణామాలుంటాయని యుడిఎఫ్ హెచ్చరించింది కూడా. ఇక కాంగ్రెస్ నేతృత్వం లోని యుడిఫ్ విషయానికి వస్తే యువజన కాంగ్రెస్ శాసనసభ్యునిపై అత్యాచార కేసులు ఉన్నప్పటికీ, స్థానిక విజయం అసెంబ్లీ ఎన్నికల ముందు యుడిఎఫ్‌ను మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలున్నాయి. కానీ వాటి గురించి ప్రజలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ఆ సమస్యను పరిష్కరించుకుంటుందని విడిచిపెట్టి యుడిఎఫ్‌కే పట్టం కట్టారు. దీన్ని గమనించి పార్టీలోని అంతర్గత కుమ్ములాటల చిక్కుముడులను అధిష్ఠాన వర్గం ముందు పరిష్కరించక తప్పదు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఎప్పటికప్పుడు పరిశీలించి, ఆమేరకు స్థానిక నాయకత్వాన్ని పటిష్టపర్చాలి. ప్రజల్లో పార్టీపై నమ్మకం పెంచాలి. ఈ విజయావకాశాన్ని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు తిరిగి ప్రజలు పట్టం కట్టేలా కాంగ్రెస్ నేతృత్వం లోని యుడిఎఫ్ గట్టిగా నిర్మాణాత్మక కృషి సాగిస్తేనే కొంతవరకు నెగ్గుకు రాగలుగుతుంది. తిరువనంతపురం కార్పొరేషన్‌లో ఘన విజయం సాధించిన ఎన్‌డిఎ కూటమి కార్పొరేషన్ పాలనా పగ్గాలు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఇతర ప్రాంతాల్లో సుస్థిరత సాధించలేకపోయినప్పటికీ, రాష్ట్ర రాజధానిగా గుండెకాయ వంటి తిరువనంతపురం కార్పొరేషన్ నుంచి చక్కని పాలన అందించి రాష్ట్రానికి ఆదర్శం అవుతామని బిజెపి ధీమాగా చెబుతోంది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో 45 ఏళ్లుగా ఎల్‌డిఎఫ్ పాలనే కొనసాగుతోంది. ఈసారి మొత్తం 101 వార్డుల్లో 50 వార్డులను బిజెపి (ఎన్‌డిఎ) గెల్చుకుంది. ఎల్‌డిఎఫ్‌కు 29 వార్డులు, యుడిఎఫ్‌కు 19 వార్డులు మాత్రమే దక్కాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఇంకా చాలా కాలం ఉన్నప్పటికీ తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈసారి గెలుపొందడానికి బిజెపి వ్యూహాలు రూపొందిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎల్‌డిఎఫ్ 99, విపక్షం యుడిఎఫ్ 41 స్థానాలు గెల్చుకోగా, త్రిస్సూర్ స్థానాన్ని ఎన్‌డిఎ దక్కించుకుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్‌డిఎ థర్డ్ ఫ్రంట్‌గా అవతరించకుండా ఉంటే స్థానిక సంస్థల విజయాలపై యుడిఎఫ్ మరింత ఉత్సాహంగా ఉండేది. రాష్ట్రంలో ఎక్కువగా ద్విపార్శ సంకీర్ణ పోటీలు జరుగుతున్నాయి. ఈ పార్టీలు ఏ సమయంలో ఎటువైపు మొగ్గు చూపుతాయో చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో మూడవ ఫ్రంట్‌గా ఎన్‌డిఎ కూటమి అవతరించడం మిగతా పార్టీలన్నిటికీ గందరగోళంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది.

దేశంలోనే ఏకైక వామపక్ష పాలక రాష్ట్రంగా కేవలం తన వ్యక్తిత్వంతో ఆదర్శాన్ని పినరయి విజయన్ ప్రదర్శించారు. ఇప్పుడు ఓటు వాటాల పరంగా వారి ఉనికితో సంబంధం లేకుండా ఎల్‌డిఎఫ్ ఓడిపోవడం వామపక్ష పార్టీలను ఓ మూలకు నెట్టేసినట్టే అవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి సురేష్ గోపీ త్రిస్సూర్ లోక్‌సభ స్థానం నుంచి 74,686 ఓట్ల మెజార్టీతో చారిత్రాత్మక విజయం సాధించారు. బిజెపి ఏకైక ఎంపీగా నిలిచారు. ఈ విజయం కేరళ రాజకీయాల్లో త్రిముఖ పోటీకి నాంది పలికిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి విజయావకాశాలు మెండుగా ఉంటాయని కాషాయ నాథులు అంచనా వేశారు. కానీ లోక్‌సభ ఎన్నికల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై ఏమాత్రం పడలేదు. కమలనాథుల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. 2020 నుంచి త్రిస్సూర్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు బిజెపికి తప్పుడు సంకేతాలనే అందిస్తున్నాయి. ఆనాడు త్రిస్సూర్ అసెంబ్లీలో బిజెపి 6, ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ చెరో 24 స్థానాలను సాధించుకున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో త్రిస్సూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఇలాంటి ఫలితాలు రాకూడదని పార్టీలు అనుకుంటున్నాయి. ఏదేమైనా సిపిఎం పట్టు సడలి అరుణ కిరణాలు మసకబారుతున్నాయా? అన్నప్రశ్న ఎదురవుతోంది.  

నేతలది తలోదారి.. చర్చలు పెడదారి

డేటా లోపభూయిష్టంగా ఉన్నప్పుడు, విధానాలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. పెంచిన వృద్ధి రేటు డేటా, గణాంకాలు ఆర్థిక పరమైన కష్టాలను తెచ్చి పెడతాయి. సామాజిక రంగా లలో పెట్టుబడి తగ్గించేందుకు ఇక్కట్లలో ఉన్న సమాజాలనుంచి మద్దతు తగ్గేందుకు తోడ్పడే రిస్క్ కూడా ఉంది. అసంఘటిత రంగంలో కోల్పోయిన ఉపాధి అవకాశాలను తక్కువగా లెక్కించినట్లయితే, ఉపాధి కల్పన పథకాలు సరిపోవు. పేదరికం అంచనాలను వక్రీకరిస్తే, ఆకలి బాధలను తీర్చి, పౌష్టికాహార లోపం సవరించే పథకాలు బలహీనపడగలవు. ఈ కోణంలో డేటా లేదా తప్పుడు సమాచారం ఇవ్వడమే, అది సమాజానికే హానికరంగా పనిచేస్తుంది. అయినా, ఈ ఆందోళనలను పారదర్శకంగా ఎదుర్కొనేందుకు బదులు, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ తరచు దీనిని తిరస్కరిస్తూ, డేటా తారుమారు చేసేందుకే సిద్ధపడుతోంది. బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో వాస్తవాలు వేరేగా చిత్రీకరిస్తున్నా, ఆర్థిక వ్యవస్థ నిరంతరంగా స్పష్టమైన చిత్రాన్ని చూపేందుకు ప్రయత్నిస్తోంది. 

భారతదేశ ఆర్థిక పునాదులను పటిష్టం చేసేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన సమయంలో పార్లమెంటు రాజకీయాలు, సైద్ధాంతిక నాటకాలలో మునిగిపోయినట్లు కన్పిస్తున్నది. రాజ్యాంగ విలువల చర్చ కాకుండా జాతీయ గీతం వందేమాతరంపై చర్చ అనుమానాలకు తావు ఇస్తోంది. 150 ఏళ్ల గీతంపై చారిత్రక వివరణ భావోద్వేగాలపై చట్టసభ సభ్యులు చర్చిస్తుండగా, ఇదే సమయంలో జరిగిన పరిణామాలను పట్టించుకోలేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి భారతదేశానికి, దాని జాతీయ ఖాతాల డేటా నాణ్యతకు సి గ్రేడ్ కేటాయించింది. పార్లమెంటు చర్చలలో మునిగి ఉండగా ప్రపంచ ఆర్థిక సంస్థ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఆర్థిక డేటా విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నది. ఇది దేశ ఆర్థికపరమైన ప్రాధాన్యతలు, పాలన, జవాబుదారీతనం క్షీణించడాన్ని తేటతెల్లం చేస్తున్నది. హిందూత్వ సైద్ధాంతిక చట్రానికి అనుగుణంగా చరిత్రను ఎలా పునర్నిర్వచిస్తున్నారో వందేమాతరం చర్చే వెల్లడిస్తున్నది. చరిత్రను సంక్లిష్టమైన వివాదాస్పదంగా, రాజ్యాంగపరమైన సున్నితత్వాలకు అనుగుణంగా వ్యవహరించడానికి బదులు, చట్ట సభ్యులు పవిత్రమైన కథనాన్ని విధించేందుకు ప్రయత్నించారు. ఒకప్పటి పరిణామాలపై అసమ్మతిని నమ్మకద్రోహంగా చిత్రీకరించడం యాదృచ్ఛికం కాదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పతనం, వాయు కాలుష్యం, ఆర్థిక పాలన వంటి పౌరుల జీవితాలను నిజంగా ప్రభావితం చేసే అంశాలపై చర్చను అడ్డుకోవడం కోసమే, ఈ చర్చ లేవదీశారు. అమూల్యమైన, పరిమితమైన పార్లమెంటరీ సమయం, సమకాలీన సమస్యలను పరిష్కరించదు. ప్రజాస్వామ్య చర్చలకు అవకాశం ఇవ్వడం లేదు.

భారతదేశ డేటా వ్యవస్థలపై ఐఎంఎఫ్ అంచనాలతో పోల్చినప్పుడు ఈ చర్చలను తప్పుదోవ పట్టించే ధోరణి ఇబ్బందికరంగా మారుతుంది. భారత జాతీయ ఖాతాల గణంకాలకు ఐఎంఎఫ్ -సి- గ్రేడ్ ఇవ్వడం అన్నది కేవలం సాంకేతిక ఫుట్ నోట్ కాదు. ఇది ఆర్థిక వాస్తవికతను ఎలా కొలుస్తారు. ఎలా అర్థం చేసుకుని వ్యాఖ్యానిస్తారనే దానికి స్పష్టమైన నేరారోపణ. ప్రొణబ్ సేన్, అరుణ్ కుమార్ వంటి ఆర్థికవేత్తలు ఎత్తి చూసినట్లుగా, వ్యవసాయాన్ని మినహాయించిన తర్వాత, జిడిపిలో దాదాపు 30 శాతం ఉండే అసంఘటిత రంగాన్ని అంచనా వేయడానికి భారత వ్యవస్థీకృత రంగ ప్రతినిధులు ప్రధానంగా ఆధారపడడం ఆందోళన కలిగించే విషయం. ఈ పద్ధతి స్వల్పకాలంలో స్థిరమైన వృద్ధికి పనిచేసి ఉండవచ్చు. కానీ నిర్మాణాత్మక ఇబ్బందుల సమయంలో ఇది దెబ్బతీస్తుంది. భారతదేశం వరుసగా ఇలాంటి సమస్యలను చాలా ఎదుర్కొంది.

నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు, కొవిడ్ -19 మహమ్మారి వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల మధ్య సంబంధాలపై పెద్ద ప్రభావమే చూపాయి. పెద్ద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు త్వరగానే కోలుకున్నాయి. విస్తరించాయి కూడా. కానీ, అసంఘటిత రంగం, చిన్న వ్యాపారులు, కార్మికులు, సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు దీర్ఘకాలిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఈ క్లిష్ట సమయంలో రెండు రంగాలు కలిసి కదిలాయని భావించడం తప్పుకాదు. ఇది క్రమపద్ధతిలో ఆర్థిక వ్యవస్థ పనితీరును సుస్పష్టం చేస్తుంది. అటువంటి అంచనాల నేపథ్యంలో వెల్లడైన వృద్ధిరేటు కాగితంపై ఆకట్టుకునేలా కన్పించవచ్చు.కానీ లోతైన ఆర్థిక లోపాలను కప్పివేస్తాయి. నమ్మదగని డేటా వల్ల తలెత్తే ఇబ్బందులు విద్యాపరమైన చర్చకు మించి ఉంటాయి. విధాన నిర్ణయాలు తీసుకోవడానికి, బడ్జెట్‌లను కేటాయించేందుకు, సంక్షేమ పథకాల రూపకల్పనకు, అభివృద్ధి ప్రాధాన్యతలను నిర్ణయించడానికి ఆర్థిక డేటా యే ఆధారం.

డేటా లోపభూయిష్టంగా ఉన్నప్పుడు, విధానాలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. పెంచిన వృద్ధి రేటు డేటా, గణాంకాలు ఆర్థిక పరమైన కష్టాలను తెచ్చి పెడతాయి. సామాజిక రంగాలలో పెట్టుబడి తగ్గించేందుకు ఇక్కట్లలో ఉన్న సమాజాలనుంచి మద్దతు తగ్గేందుకు తోడ్పడే రిస్క్ కూడా ఉంది. అసంఘటిత రంగంలో కోల్పోయిన ఉపాధి అవకాశాలను తక్కువగా లెక్కించినట్లయితే, ఉపాధి కల్పన పథకాలు సరిపోవు. పేదరికం అంచనాలను వక్రీకరిస్తే, ఆకలి బాధలను తీర్చి, పౌష్టికాహార లోపం సవరించే పథకాలు బలహీనపడగలవు. ఈ కోణంలో డేటా లేదా తప్పుడు సమాచారం ఇవ్వడమే, అది సమాజానికే హానికరంగా పనిచేస్తుంది. అయినా, ఈ ఆందోళనలను పారదర్శకంగా ఎదుర్కొనేందుకు బదులు, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ తరచు దీనిని తిరస్కరిస్తూ, డేటా తారుమారు చేసేందుకే సిద్ధపడుతోంది. బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో వాస్తవాలు వేరేగా చిత్రీకరిస్తున్నా, ఆర్థిక వ్యవస్థ నిరంతరంగా స్పష్టమైన చిత్రాన్ని చూపేందుకు ప్రయత్నిస్తోంది.

జిడిపి గణన పద్ధతుల్లో మార్పులు, వినియోగం, ఉపాధి డేటా విడుదల చేయడంలో విపరీతమైన జాప్యం, ఇబ్బందికరమైన సర్వే ఫలితాలు వస్తే, వాటిని అణచివేయడం లేదా దాచివేయడం, స్వతంత్ర, స్పష్టమైన అభిప్రాయాలను పక్కన పెట్టడం ఇవన్నీ అపనమ్మకాన్ని పెంచేందుకు దోహదపడుతున్నాయి. ఒకప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, జాతీయ గణాంకాల కమిషన్ వంటి వాటిలో రాజీనామాలు పెరిగిపోవడం, మార్జినలైజేషన్‌ల వల్ల ప్రజల విశ్వసనీయత తగ్గింది. మీడియాలో ఒక ముఖ్యమైన వర్గం ఈ సమస్యను మరింత జటిలం చేసింది. ముఖ్యమైన మినహాయింపులతో పాటు, ప్రధాన స్రవంతి మీడియాలోని పెద్ద విభాగాలు ఐఎంఎఫ్ ఆందోళనలను విస్మరించాయి. లేదా ఆవశ్యకతను తొలగించి లోపలి పేజీలకు కుదించాయి. డేటా నాణ్యత, పద్ధతి సమగ్రత, విధాన పరిణామాలను విశ్లేషించే టెలివిజన్ చర్చలకు బదులు, సైద్ధాంతిక పరమైన వాదనలు, పక్షపాత చర్చలకు వీలు కల్పిస్తున్నారు.

ఇది కేవలం ఎడిటోరియల్ వైఫల్యం కాదు, ప్రజాస్వామ్య వైఫల్యం, సంక్లిష్టమైన ఆర్థిక వాస్తవాలను అర్థం చేసుకోవడానికి పౌరులు మీడియాపై ఆధారపడే వ్యవస్థలో నిశ్శబ్దం ఆవరించింది. తగ్గించడం వల్ల ప్రజలను సమాచారం లేకుండా శక్తిహీనులుగా మారుస్తాయి. పార్లమెంటు చర్చించే అంశాలకు, అది విస్మరించే అంశాలకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉంది. చట్టసభ సభ్యులు ఎవరు ఏ అంశాన్ని మాట్లాడాలి అని వాదిస్తున్నప్పటికీ, భారతదేశంలో నగరాలు కలుషితమైన గాలితో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగిపోయింది. నదులను శుభ్రపరచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, అవి ఇప్పటికీ విషపూరితంగానే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు దీర్ఘకాలంగా నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఫలితంగా అసమానతలు పెరిగిపోతున్నాయి. డేటా ఆధారిత చర్చ, ఆ డేటా ఆధారిత విధానం, శాసనసభ దృష్టిని కోరుతున్న సమస్యలు ఇవి. బదులుగా ప్రతీకవాదం గుంపులుగా మారుస్తోంది. జాతీయవాదం పాలనకు ప్రత్యామ్నాయంగా మారుతోంది.

ఈ అడ్డంకులు అధిగమించి ముందుకు సాగాలంటే, నిర్ణయాత్మకమైన దిద్దుబాటు అవసరం. మొదట భారతదేశం తన గణాంక సంస్థల విశ్వసనీయత, స్వతంత్రతను పునరుద్ధరించాలి. స్పష్టమైన పద్ధతి పారదర్శకత, సకాలంలో సర్వేల విడుదల చేయడం ద్వారా డేటా సేకరణ, వ్యాప్తికి రాజకీయ ఒత్తిడి నుంచి విముక్తి కల్పించాలి.

అంచనాలలోని తేడాలను దాచిపెట్టకుండా బహిర్గతంగా చర్చించాలి. రెండోది తీవ్రమైన విధాన చర్చలకు పార్లమెంటు స్పష్టమైన వేదికగా తన పాత్ర నిర్వహించాలి. ఆర్థిక డేటా నాణ్యత, ఉపాధి ధోరణులు, అసమానతలు, అభివృద్ధి ఫలితాలపై శాసనసభలు ఖచ్చితంగా చర్చించాలి. సైద్ధాంతిక చర్చలకు అప్పుడప్పుడు అంతరాయాలుగా చర్చలు సరికాదు. మూడవది. మీడియా తన అధికారాన్ని పెంచడానికి బదులుగా సమాచారం అందిచే బాధ్యతను తిరిగి నొక్కి చెప్పాలి. డేటా విశ్వసనీయత, సంస్థాగత కోత, విధాన వైఫల్యం గురించి విమర్శనాత్మక కథనాల ప్రాధాన్యత, లోతైన చర్చలు అర్హమైనవి. చివరగా, నిజమైన జాతీయ బలం బలవంతగా రుద్దడం వల్ల రాదని రాజకీయ నాయకత్వం గుర్తించాలి. అంతేకాదు, భౌతిక పరిస్థితులను మెరుగుపరచడం, అవకాశాలను విస్తరించడం, ప్రభుత్వ సంస్థలపై నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా వస్తుందని కూడా రాజకీయ నాయకత్వం గుర్తించాలి.

భారత ప్రజాస్వామ్యం విజయాన్ని అభినందిస్తూనే, ఊహాగానాలపై నడవడానికి వీలు లేదు. చట్టసభ సభ్యులు వర్తమానం గురించి కాక, చర్చ గురించి చర్చించినప్పుడు, డేటాను, భావజాలానికి అనుగుణంగా చర్చించినప్పుడు, అభివృద్ధి ఒక భ్రమగా మారుతుంది. జాతీయవాదం నిజమైన పరీక్ష ఆచార బద్ధమైన విధేయత ప్రదర్శనలో కాదు సత్యాన్ని ఎదుర్కొనడానికి, వాటిపై చర్య తీసుకోవడానికి సిద్ధమవడం లోనే ఉంది.

గీతార్థ పాఠక్

ఇంటి నుంచే యూరియా బుకింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: రైతులు యూరియా కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే అవసరమైన యూరియాను ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ ను వ్యవసాయశాఖ తీసుకురానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు. రబీ ముందస్తు ప్రణాళికపై రాష్ట్ర, జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సచివాలయంలో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం వారి విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు వ్యవసాయశాఖ కేవలం ఎరువుల పంపిణీ కోసం ఒక కొత్త మొబైల్ యాప్ ను తీసుకురావడానికి సన్నహకాలు చేస్తుందని, దానిని ఈ నెల 20 నుండి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు తమకు సమీపంలోని డీలర్,

జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యతను తెలుసుకోవచ్చన్నారు. రైతు తన పంటలకు అవసరమైన యూరియా పరిమాణాన్ని, తనకు అనుకూలమైన ఏ డీలర్ వద్ద నుంచైనా ముందుగా బుక్ చేసి కొనుగోలు చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా లభించనుందని మంత్రి పేర్కొన్నారు. అవసరమైతే, యూరియా బుకింగ్ కోసం రైతులు తమ పరిధిలోని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఇఓ)సేవలను కూడా వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. దేశంలోనే యూరియాని అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటని, రైతులకు యూరియా వాడకం వలన కలిగే నష్టాలను వివరించి, యూరియా వినియోగం తగ్గించాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు. అందుకోసం అధికారులు విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

యాప్‌లో నమోదు ఇలా

-రైతులు/ సిటిజన్, డిపార్ట్ మెంట్, డీలర్ల కోసం వేర్వేరు లాగిన్లు. మొబైల్ నెంబర్, ఒటిపి ద్వారా లాగిన్ అయ్యే అవకాశం. లాగిన్ అవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉందో కనిపిస్తుంది. లాగిన్ అయిన రైతులు తమ జిల్లాను ఎంపిక చేయగానే ఆ జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా బ్యాగులు కనిపిస్తాయి.- తరువాత సీజన్, పాస్ బుక్ నెంబర్, ఎన్ని ఎకరాలలో పంట వేస్తున్నారో, ఏఏ పంటను వేస్తున్నారో నమోదు చేయాలి. సాగు చేసే ఎకరాలను బట్టి అవసరమయ్యే యూరియా బ్యాగులు యాప్ లో కనిపిస్తాయి. అయితే వారు సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి వారికి అవసరమయ్యే యూరియా బస్తాలను 15 రోజుల వ్యవధితో 1 నుండి 4 దశలలో అందచేసేలా వివరాలు కనిపిస్తాయి. పాస్ బుక్ లు లేని రైతులు వారి పట్టా పాస్ బుక్ దగ్గర ఆధార్ సెలెక్ట్ చేసుకొని, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఒటిపి కన్ఫర్మేషన్ తరువాత వారు వివరాలను నింపాలి.- కౌలు రైతులు కూడా పేరు, తండ్రిపేరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఒటిపి కన్ఫర్మేషన్ తరువాత భూ యజమాని పట్టా పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేస్తే, యజమాని మొబైల్ నెంబర్ తో ఒటిపి వ్యాలిడేషన్ తరువాత కౌలు రైతులు కూడా తమ వివరాలు ఎంటర్ చేసేలా ఈ యాప్ లో అవకాశం కల్పించారు.- ఇక, డీలర్లు తమ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి, రోజువారిగా వారికి వచ్చిన స్టాక్, అమ్మకం వివరాలను నింపాల్సి ఉంటుంది.

యూరియా పొందడం ఇలా

యూరియా బుక్ చేసిన అనంతరం రైతుకు ఒక బుకింగ్ ఐడి వస్తుందని, ఆ బుకింగ్ ఐడి ఆధారంగా రైతు ఎంపిక చేసిన డీలర్ వద్ద నుంచి యూరియాను కొనుగోలు చేయవచ్చన్నారు. సంబంధిత డీలర్, రైతు లేదా అతని ప్రతినిధి వద్ద ఉన్న బుకింగ్ ఐడి, బుక్ చేసిన పరిమాణాన్ని ధృవీకరించిన తరువాతే యూరియాను విక్రయిస్తారని మంత్రి పేర్కొన్నారు. బుకింగ్ సమయంలో రైతు కేవలం పంట పేరు, సాగు విస్తీర్ణం నమోదు చేస్తే సరిపోతుందని దీంతో నమోదు చేసిన వివరాల ఆధారంగా, వ్యవస్థ స్వతంత్రంగా రైతుకు అవసరమయిన మొత్తం యూరియా పరిమాణాన్ని, ఏ ఏ వ్యవధుల్లో బుక్ చేసుకోవచ్చో లెక్కిస్తుందన్నారు. రైతుల సౌకర్యార్థం, ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లతో కూడిన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటుందని మంత్రి వివరించారు. అధికారులందరూ యాప్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, యాప్‌ను అమలలోకి తీసుకురావాలని ఆదేశించారు. యూరియా పక్కదారి పట్టకుండా, పంట పండించే రైతులకు మాత్రమే యూరియా అందించాలనే లక్ష్యంతో ఈ యాప్ ని రైతుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.

తప్పంతా ‘ఇండిగో’దేనా?

భారతీయ విమాన ప్రయాణికులలో చాలా మందికి ఒక విషయం మీద ఏకాభిప్రాయం ఉంది. ఇండిగో తన సామ్రాజ్యాన్ని ఆర్భాటాల మీద గానీ, ఆకర్షణీయమైన గిమ్మిక్స్ మీద గానీ నిర్మించలేదు. అది అత్యంత సులభమైన ఒకే ఒక్క పనిని అసాధారణ సమర్థతతో చేసింది. సమయానికి టేక్ ఆఫ్ కావడం, సమయానికి ల్యాండ్ కావడం. అదే భారతీయుల విశ్వాసాన్ని సంపాదించింది. రోజుకు సుమారు 2,300 విమానాలు, గడియారంలా నడిచే విధానం, దేశీయంగా 90కి పైగా, అంతర్జాతీయంగా 45 గమ్యస్థానాలకు రోజుకు సగం మిలియన్ ప్రయాణికులను ఎలాంటి హడావుడి లేకుండా, సమంజసమైన చార్జీలతో తరలించడం. ఇదే ఇండిగో బలం. కింగ్‌ఫిషర్, జెట్, గో ఫస్ట్ వంటి ప్రత్యర్థి సంస్థలు కూలిపోయిన వేళ, కఠినమైన సామర్థ్యం అనే తన ఆపరేటింగ్ సిద్ధాంతంతో ఇండిగో మరింత బలపడింది. ఆరు ఈ (6ఈ)అనే కోడ్‌తో అది భారత ఆకాశంలో దాదాపు ఏకాధిపత్య స్థాయికి చేరింది. మార్కెట్ వాటా 60% కంటే ఎక్కువ. ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన మార్కెట్ అయిన అమెరికాలో కూడా అతిపెద్ద దేశీయ విమాన సంస్థకు కేవలం 21శాతం మార్కెట్ వాటా మాత్రమే ఉంది. ఆర్థిక సంవత్సరం 2025లో ఇండిగో లాభం (పన్నుల తర్వాత) రూ. 7,258 కోట్లు. ఏప్రిల్ నెలలో కొద్ది రోజులు ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న విమాన సంస్థగా కూడా నిలిచింది. ఈ విజయంలో పెద్ద భాగం దాని మినిమలిస్ట్ వ్యాపార నమూనాదే. ఖర్చులను గట్టిగా కుదించడం.

ఉత్పాదకతను గరిష్టస్థాయికి తీసుకెళ్లడం. ఆసియా విమాన సంస్థలలోనే అతి తక్కువ ఖర్చుతో కూడిన ‘కాస్ట్ పర్ అవైలబుల్ సీట్ కిలోమీటర్’ (సిఎఎస్క్) రూ.3.71. సాధించడం. దీని రహస్య మంత్రం సొగసైన మితవ్యయం. ఒకే రకం విమానాలపై ఆధారపడటం. దాని సుమారు 400 విమానాల భారీ ఫ్లీట్ అంతా ఎయిర్‌బస్‌దే. విమానం ఎగిరినప్పుడే డబ్బు వస్తుంది. ఇండిగో విమానాలు ఇతరుల కంటే ఎక్కువగా ఎగిరాయి. వేగవంతమైన టర్న్‌రౌండ్లు, రోజుకు 12 గంటల వినియోగ లక్ష్యాలు. సీట్లు ఘనంగా అమరిక. విమానంలో వేడి భోజనం లేకపోవడం వల్ల బరువు తగ్గింది. ఇంధన వినియోగం తగ్గింది. తన సొంత ఐఫ్లై శిక్షణ కేంద్రం లో ప్రమాణీకరించిన సిబ్బంది విధానాలు కార్మిక సామర్థ్యాన్ని పెంచాయి. పైలట్- టు- ఎయిర్‌క్రాఫ్ట్ నిష్పత్తి విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఒక్కో విమానానికి సుమారు 13 మంది పైలట్లు మాత్రమే. ఎయిర్ ఇండియా ప్రధాన ఫ్లీట్‌లో ఇది దాదాపు 34కి ఒకటి. వనరుల కేటాయింపులో ఇండిగో కత్తిరించినంత పదునైన ఖచ్చితత్వం చూపింది. ఈ వారపు మీడియా కవర్ స్టోరీస్ మొత్తం ఇండిగో సంస్థపై నడిచింది.

కేంద్ర ప్రభుత్వం తన విరోధ భావాన్ని ఈ ఇండిగో సంస్థపై రుద్దింది. ఇండిగో సంస్థ ఓ పదునైన అంచుపై విన్యాసం చేసి, తానే దానికి బలైంది. డిసెంబరు మొదట్లో ఒక్కసారిగా ఇండిగో వల్ల చెలరేగిన గందరగోళం అందరినీ షాక్‌కు గురి చేసింది. కొన్ని రోజుల్లోనే లక్షకు పైగా కాదు, దాదాపు పది లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సుమారు 5,000కి పైగా విమానాలు రద్దయ్యాయి లేదా తీవ్ర ఆలస్యం అయ్యాయి. డిసెంబరు 4 నుంచి 6 మధ్య 2,948 దేశీయ విమానాలు ఆకాశం నుంచి మాయమయ్యాయి. డిసెంబరు 5 ఒక్కరోజే 1,588 రద్దయ్యాయి. ఇది ఇండిగో విమానాల్లో 78 శాతం. విమానాశ్రయాలు రైల్వే స్టేషన్ల కంటే దారుణంగా మారాయి. లగేజ్ ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయింది. చాలాసార్లు తప్పు గమ్యస్థానాలకు వెళ్లింది. ప్రత్యర్థి విమాన సంస్థలు సర్జ్ ప్రైసింగ్‌కు దిగాయి. చార్జీలు ఆకాశాన్ని తాకుతుంటే, ఇండిగో ప్రతిష్ఠ నేలచూపులు చూసింది. ఇంత ఘోరంగా ఇండిగో నియంత్రణ కోల్పోవడానికి కారణం ఏమిటి? దీని మూలాలు భారత్ అత్యవసరంగా అవసరమైన ఒక సంస్కరణలో ఉన్నాయి. కొత్త ‘ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్’ (ఎఫ్‌డిటిఎల్), అంటే పైలట్ల అలసట నిర్వహణ నిబంధనలు. పైలట్లు ఎంతసేపు పనిచేయాలి, ఎంత విశ్రాంతి తీసుకోవాలి అన్నది ఇవే నిర్ణయిస్తాయి.

ఎన్నో ఏళ్లుగా భారత్ ఈ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాల కంటే చాలా వెనుకబడి ఉంది. న్యాయపోరాటాలు, నిపుణుల సంప్రదింపుల తర్వాత, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) జనవరి 2024లో సవరించిన ప్రమాణాలను జారీ చేసింది. వాటిని అమలు చేసేందుకు విమాన సంస్థలకు దాదాపు రెండు సంవత్సరాల గడువు ఇచ్చింది. పైలట్ల ఫ్లయింగ్ అవర్స్ తగ్గించబడ్డాయి. తప్పనిసరి విశ్రాంతి 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. నైట్ డ్యూటీకి కొత్త నిర్వచనం ఇచ్చారు. వారానికి నైట్ ల్యాండింగ్స్‌ను ఆరు నుంచి రెండు వరకు తగ్గించారు. మొత్తం 22 నిబంధనలు, రెండు దశల్లో… జులై 1, నవంబర్ 1 నుంచి అమలు. ఈ కొత్త నిబంధనల ప్రభావానికి అత్యధికంగా గురైన సంస్థ ఇండిగోనే. ఇంత పూర్తిగా ‘లీన్ ఎఫిషియెన్సీ’ మీద ఆధారపడి నిర్మితమైన మరో విమాన సంస్థ లేదు. అలసట నిబంధనలు పైలట్ల లభ్యతను కత్తిరించాయి. అయితే ఇండిగో సిద్ధమైందా? అందుబాటులో ఉన్న ఆధారాలు ‘లేదు’ అని చెబుతున్నాయి. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, పైలట్ల నియామకంలో అది నెమ్మదించింది. ఆశ్చర్యకరంగా, పైలట్ల సంఖ్యను పెంచటానికి బదులు, మార్చిలో ఉన్న 5,463 నుంచి డిసెంబరు నాటికి 5,085కి తగ్గించింది. ఆలస్యంగావచ్చే విమానాల డెలివరీలు, తన స్థాయి వల్ల కొంత వెసులుబాటు దొరుకుతుందనే అంచనాతో అది పందెం కట్టింది. నవంబర్ చివరి నుంచి డిసెంబరు ఆరంభం వరకు వాతావరణం సమస్యలు తెచ్చింది.

దక్షిణంలో సైక్లోన్ దిత్వా, ఉత్తరంలో పొగమంచు. ఇప్పటికే అతి పలుచని మానవ వనరుల బఫర్లు ఉండటంతో, రోస్టరింగ్ సాఫ్ట్‌వేర్ జామ్ అయింది. చట్టబద్ధంగా విశ్రాంతి తీసుకున్న పైలట్లు తక్కువగా ఉండగా, విమానాలు ఎక్కువగా ఉండే అసాధ్య సమస్యను అది పరిష్కరించడానికి ప్రయత్నించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది కేవలం గణిత సమస్య కాదు.తన నిర్మాణ పరిమితులను మించి విస్తరించిన వ్యాపార నమూనా తుదకు తనకు తానే కూలిపోయిన పరిణామం. నియంత్రణ సంస్థ డిజిసిఎ వైఖరి అంత మెరుగ్గా లేదు. పైకి చూస్తే, అది విమాన సంస్థలతో అనేక సమావేశాలు నిర్వహించి, పురోగతిని సమీక్షించినట్టు కనిపించింది. కానీ ప్రధానంగా సంస్థల స్వయం ఘోషణలపైనే ఆధారపడింది. వ్యవస్థ పూర్తిగా కూలిపోయే వరకు ఇండిగో భరోసాలు ఎలా అంగీకరించబడ్డాయి? గణనీయమైన ప్రభావం ఉన్న సంస్థ ఇది. ప్రముఖులతో నిండిన బోర్డు ఉంది. నియంత్రణ సంస్థ పని అందంగా స్వేచ్ఛ ఇవ్వడంకాదు, ఎప్పటికీ అప్రమత్తంగా ఉండటం. అలసట ఆధారిత పని విధానానికి ఇండిగో నిర్వహణ నిజంగా సరిపోతుందా! అని డిజిసిఎ కఠినంగా చూసి ఉంటే, వ్యవస్థ ఈ విధంగా దెబ్బతినేది కాదు.

ఈ గందరగోళానికి కారణాలను స్పష్టంగా చెప్పకుండా ఇండిగో నిర్వహణ కూడా తన ప్రతిష్ఠను కాపాడుకోలేకపోయింది. భారత్‌లో ఆపరేటింగ్ ఖర్చుల్లో 30 నుంచి 40 శాతం పన్నులే. అమెరికాలో ఇది సగటున 25% మాత్రమే. తన ఆధిపత్యం వల్ల నియంత్రికులను బందీలుగా చేసుకోవచ్చనే భావన ఇండిగోకు కలిగివుండవచ్చు. అది దాని సామ్రాజ్యం సామర్థ్యంపై నిర్మితమైంది. ఇప్పుడు అది అతి అంచుకు దగ్గరగా నడవకుండా, లాభాల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మళ్లీ నిర్మించుకోవాలి. భారత్‌కు తన ఏకైక అద్భుతమైన విమానయాన విజయ కథ కూలిపోవడం భరించలేని విషయం. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇండిగో సంస్థస్థానంలో మరో పోటీ విమానయాన రంగాన్ని అదానీ సంస్థను తీసుకుని రావటానికే ఇండిగోను బలి పశువును చేశారా! అదానీ కోసం ఎంతకైనా తెగించే మోడీ ఇండిగో పతనం వెనుక ఉన్నారు అనే అభిప్రాయం సోషల్ మీడియా మరింత అనుమానాలు వ్యాపిస్తున్నాయి. ఈ క్రీడలో కేంద్ర ప్రభుత్వం అసమర్థతా భారాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి చురుకుగా ఉండే కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై పడింది. ఏదిఏమైనా ఈ మబ్బులు ఎక్కువ కాలం అసలు నిజాలు ఏమిటో దాచలేవు (వెలుగు చూడక తప్పదు.). 

డా. కోలాహలం రామ్ కిశోర్

9849328496

క్వాంటమ్ కంప్యూటింగ్ తప్పనిసరి కారాదు

క్వాంటమ్ టెక్నాలజీల్లో ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పడుతుండగా, తదుపరి కంప్యూటింగ్ విప్లవంలో నాయకత్వం సాధించాలని ప్రభుత్వాలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో, విద్యావేత్తల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వంటి సాంప్రదాయ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లను తగ్గించి అన్ని ఇంజినీరింగ్ విద్యార్థులకూ క్వాంటమ్ కంప్యూటింగ్‌ను తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలా? భవిష్యత్తు క్వాంటమ్- సిద్ధమైన గ్రాడ్యుయేట్లు కోరుకుంటోందని కొందరు వాదిస్తున్నారు. మరికొందరు ఇది అకాలికం, విధ్వంసకరం, విద్యార్థులు -పరిశ్రమలకు హానికరమని హెచ్చరిస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనగా క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలైన సూపర్‌పొజిషన్, ఎంటాంగిల్‌మెంట్‌లను ఉపయోగించి, క్విట్స్ ద్వారా సమాచారాన్ని ప్రాసెస్ చేయడం. ఒకే సమయంలో 0, 1 లేదా రెండూ కాగలిగే క్విట్స్ వల్ల కొన్ని సమస్యలను సాధారణ కంప్యూటర్ల కంటే ఎక్స్‌పోనెన్షియల్ వేగంతో పరిష్కరించవచ్చు. మందుల ఆవిష్కరణ, క్రిప్టోగ్రఫీ, ఆప్టిమైజేషన్ వంటి రంగాల్లో ఇది విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆశిస్తున్నారు. ఐబిఎం, గూగుల్, ఐఆన్‌క్యు, రిగెట్టి, సైక్వంటం వంటి సంస్థలు క్విట్స్ సంఖ్య పెంచుతూ, ఎర్రర్ కరెక్షన్ మెరుగుపరుస్తున్నాయి. కానీ వాణిజ్యపరంగా విస్తృతంగా ఉపయోగపడే ఫాల్ట్-టాలరెంట్ క్వాంటం కంప్యూటర్లు ఇంకా సంవత్సరాల దూరంలో ఉన్నాయి.

డిసెంబరు 2025 నాటికి క్వాంటమ్ ఉద్యోగ మార్కెట్ చిన్నదైనా, వేగంగా వృద్ధి చెందుతోంది. 2025 మొదటి తొమ్మిది నెలల్లోనే 1.25 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా వెంచర్ ఫండింగ్ వచ్చింది. గత ఐదేళ్లలో ఉద్యోగ ప్రకటనలు 180-500% పెరిగాయి. జీతాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అయినా, నైపుణ్యం ఉన్న వారు చాలా తక్కువ; ఉద్యోగ ఖాళీలు -అర్హుల నిష్పత్తి 3:1గా ఉంది. ఈ నైపుణ్య కొరత కారణంగా క్వాంటమ్ విద్య విస్తృతంగా చేర్చాలనే డిమాండ్ పెరిగింది. ఎంఐటి, స్టాన్‌ఫోర్డ్డ్, ఐఐటీలు ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటింగ్‌ను అడ్వాన్స్‌డ్ ఎలక్టివ్ లేదా స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. చైనా, సింగపూర్, కెనడా, భారత్ (2023 నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా) సాంప్రదాయ బ్రాంచ్‌లను తొలగించకుండానే క్వాంటమ్ విద్యను పెంచుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా ప్రతిష్ఠిత సంస్థ సాంప్రదాయ బ్రాంచ్‌ల స్థానంలో క్వాంటమ్‌ను తప్పనిసరి చేయలేదు. కనీస అవగాహన (క్విట్స్, సూపర్‌పొజిషన్, ఎంటాంగిల్‌మెంట్, షార్/గ్రోవర్ అల్గారిథమ్స్) భవిష్యత్తుకు సిద్ధం చేస్తుందని, 1-2 క్రెడిట్ తేలికైన కోర్సు సరిపోతుందని అంటారు. ఎలక్టివ్ లేదా బలమైన సాంప్రదాయ బ్రాంచ్‌లతో పాటు ఉంటే ఇది ఉత్తమమే.

కానీ సాంప్రదాయ బ్రాంచ్‌లను తగ్గించి అందరికీ తప్పనిసరి చేయడం తీవ్ర వ్యతిరేకతకు గురవుతోంది. ఈ రోజు 99% సాంకేతికత (చిప్స్, విద్యుత్ గ్రిడ్‌లు, వాహనాలు, భవనాలు, విమానాలు) ఇంకా సాంప్రదాయ ఇంజినీరింగ్ సూత్రాలపైనే ఆధారపడి ఉంది. ఈ బ్రాంచ్‌లను తగ్గిస్తే నాలుగైదేళ్లలోనే పరిశ్రమలు తీవ్ర నైపుణ్య కొరతను ఎదుర్కొంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్‌కు లీనియర్ ఆల్జీబ్రా, కాంప్లెక్స్ నంబర్స్, ప్రాబబిలిటీ, క్వాంటమ్ మెకానిక్స్ బలమైన పునాది అవసరం. ఈ విషయాల్లోనే చాలా మంది విద్యార్థులు కష్టపడుతుంటే, బలవంతంగా నేర్పిస్తే భారీగా ఫెయిల్యూర్, గుర్తుపెట్టుకోవడం, నిరాశాజనకంగా ఉంటుంది. టైర్-2, 3కాలేజీల్లో ఫ్యాకల్టీకే కిస్కిట్, సిర్క్ వంటి టూల్స్ అనుభవం ప్రాథమిక అవగాహన లేదు, వీరితో విద్యార్థులకు పాఠాలు బోధించడం అంటే కష్టసాధ్యమే. ల్యాబ్ లు నడపడం దాదాపు అసాధ్యం. గతంలో క్లౌడ్ కంప్యూటింగ్ (2010-15), ఎఐయంఎల్ (2018-22) తప్పనిసరి చేసినప్పుడు చాలా కాలేజీల్లో అధ్యాపకులు లేక మూస ధోరణిలో బోధనా సామర్థ్యాలు లేని వారు బోధించడంవలన జోక్ సబ్జెక్టులుగా మిగిలాయి.

క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా కష్టతరమైనది కాబట్టి ఫలితం మరీ దారుణంగా ఉంటుంది. మంచి కళాశాలల్లో, బలమైన సంస్థల్లో సాంప్రదాయ బ్రాంచ్‌లతోపాటు తేలికైన క్వాంటమ్ మాడ్యూల్ విజయవంతమవుతుంది. కానీ బలహీనమైన విద్యావ్యవస్థలో తప్పనిసరి చేయడం విద్యాపరమైన దుర్వినియోగమే. దీనికి సరైన మార్గం, సాంప్రదాయ బ్రాంచ్‌లను బలోపేతం చేస్తూ, అందరికీ తేలికైన అవగాహన కోర్సు, ఆసక్తి ఉన్న టాప్ 10- 20% విద్యార్థులకు డీప్ ఎలక్టివ్స్/మైనర్స్ ఇవ్వడం. ఫ్యాకల్టీ శిక్షణ, పునాది విషయాల బలోపేతం, క్రమంగా అమలు – ఇదే హైప్‌ను అధిగమించి నిజమైన సామర్థ్యం తయారు చేసే మార్గం.క్వాంటమ్ కంప్యూటింగ్ నిస్సందేహంగా భవిష్యత్తు. కానీ ఇప్పుడున్న సుస్థిర పునాదులను పడగొట్టి, ఇంకా పరిపక్వం కాని రంగాన్ని అందరిపై రుద్దడం హేతుబద్ధం కాదు.  

డా. ముచ్చుకోట. సురేష్ బాబు

9989988912

ఆఖరిపోరుకు అస్త్రశస్త్రాలు

మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. గ్రామాల్లో ఎంఎల్‌ఎ ఎన్నికల కన్నా గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే నువ్వానేనా అన్నట్లు పోరు సాగుతోంది. ఎందుకంటే గ్రామాల్లో పట్టు నిలుపుకుంటే పార్టీలకు రా ష్ట్రంలో సులువుగా అధికారం దక్కుతుందని నా యకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గ్రా మాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన మంత్రులు, ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, పార్టీల ముఖ్య నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో 8,566 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో ముం దంజలో నిలిచింది.- మొత్తం 5,275 సర్పంచ్ స్థానాలు (61.58 శాతం) కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అలాగే బిఆర్‌ఎస్ రెండో స్థానంలో 2,330 స్థానాలు (27.20 శాతం) సాధించి పల్లె పోరులో పట్టు నిలుపుకుంది. బిజెపి పార్టీ మూడో స్థానంలో- 453 సీట్లు (5.29 శాతం) గెలుచుకోగా, స్వతంత్రులు/ఇతరులు 483 సీట్లు (5.64 శాతం) పొందారు.

పట్టు నిలబెట్టుకునేలా వ్యూహాలు’తొలి విడత, రెండో విడత పల్లె పోరులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సంక్షేమం, అభివృద్ధి ప్రచారాస్త్రాలు చేసుకొని ఓటర్లను ఆకట్టుకున్నారు. తమ ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉంటుందని పల్లెలను ప్రగతి రథంలో నిలుపుతామని హామీలు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేరేలా కృషి చేస్తామని చెప్పారు. దీంతో అక్కడ పల్లెల్లో కాంగ్రెస్ రెండు విడతల్లో విజయకేతనం ఎగురేసింది. బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు గత పదేళ్లలో ప్రభుత్వం అందించిన పథకాలు వివరిస్తూ రాబోయేది మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఓటర్లకు ఆకట్టుకున్నారు. తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా తాము చొరవ తీసుకుంటామని ప్రచారం చేసున్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని, సంక్షేమ పథకాలకు ఎలాంటి ఢోకా ఉండదని బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓటర్లను వివరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలంటే తమను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో బిజెపి అధికారంలోకి వస్తుందని ప్రచారం చేసుకుని ఓటర్లను ఆకట్టుకున్నారు. రెండు విడతల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మూడు ప్రధాన పార్టీలు మూడో విడతల్లో సత్తా చాటేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రెండు విడతల్లో ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకుని మూడో విడతలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుపొందేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గుర్తులు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు గుర్తులు ఓటర్లకు గుర్తుండిపోయలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమ గుర్తులను ఓటర్లు మరిచిపోకుండా ఉండేలా వీడియోలు, ఫొటోలు రూపొందించడంతో పాటు ఆయా గుర్తులను ఇంటింటికీ చూపిస్తూ ప్రచారం నిర్వహించడంతో పాటు వాట్సాప్, ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. తొలి, రెండో విడత పోలింగ్ జరిగిన గ్రామాల్లో పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత కొత్తగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల తరఫున ఆయా నియోజకవర్గ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, పార్టీల అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగారు. గ్రామాలలోని సామాజిక వర్గాల వారీగా పోటాపోటీ సమావేశాలు నిర్వహించి ఓట్లు గంపగుత్తగా సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హామీలు గుప్పించడంతో పాటు ఆయా కుల సంఘాలు,యువజన సంఘాలు, మహిళా సంఘాలు కోరిన డబ్బులు, బహుమతులు అందిస్తున్నారు. కొందరు ముందుగానే కొంత మొత్తం ఇచ్చి గెలిచిన తరువాత మిగతాది ఇస్తామని చెబుతుంటే మరికొందరు మొత్తం డబ్బు ఇచ్చేస్తూ ఓటర్లు కోరిన పనులు సర్పంచ్ కాగానే చేస్తామని మాటిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి గ్రామంలో ఉన్న ఓట్ల సంఖ్య ఆధారంగా కుల, యువజన, మహిళా సంఘాలకు కోరినంత నజరానాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమకు ఓట్లు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని వాగ్దానాలు చేస్తున్నారు. గ్రామంలోని సిసి రోడ్ల నిర్మాణాలు, బోరుబావుల తవ్వకం, తాగునీటి శుద్ధి కేంద్రం, గ్రంథాలయం, క్రీడా వసతులు, పాఠశాల భవనాల నిర్మాణం, సిసి కెమెరాల ఏర్పాటు లాంటి అవసరాలను గెలిచిన వెంటనే నెరవేరుస్తామని అభ్యర్థులు చెబుతున్నారు. దీంతో పాటు గత సర్పంచ్‌ల వైఫల్యాలు, ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ ఈ ఎన్నికల్లో తమనే గెలిపించమని వేడుకుంటున్నారు.

ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారం(డిసెంబర్ 15) సాయంత్రం 5 గంటలకు ముగిసింది.ప్రచారం ముగిసిన తర్వాత బహిరంగ సమావేశాలు, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియోలలో ప్రచారం నిర్వహించడం పూర్తిగా నిషేధం అని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఇసి) ఇదివరకే మార్గదర్శకాలు జారీ చేసింది. పోలింగ్‌కు 44 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం నిర్వహించకుండా ఎన్నికలు జరిగే ఆంక్షలు విధించింది. మూడో విడతలో 4,157 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 36,434 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. అందులో 394 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కాగా, అత్యధికంగా నల్గొండలో 42, సంగారెడ్డిలో 27, కామారెడ్డి జిల్లాలో 26 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా 7,916 స్థానాలు ఏకగ్రీవంగా అయ్యాయి. సర్పంచ్ స్థానాలకు మొత్తం 12,640 మంది అభ్యర్థులు పోటీలు నిలువగా, వార్డు స్థానాలకు 75,283 మంది బరిలో ఉన్నారు. ఈ నెల 17వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మూడో విడత పోలింగ్ జరగనుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ జరిగే ప్రాంతాలలో సోమవారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేయగా, తిరిగి 17న సాయంత్రం తెరుచుకోనున్నాయి.

ఉపాధి హామీ నుంచి గాంధీ ఔట్

న్యూఢిల్లీ: గ్రామీణుల కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) రద్దుకు కేంద్రం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దాని స్థానంలో కొత్త చట్టం తీసుకు వచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. సోమవారంనాడు లోక్‌సభలో మూడు కీలక బిల్లులతో పాటు ఉపాధి హామీ స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవక్ మిషన్(గ్రామీణ్)(విబిజి ఆర్‌ఎఎం జి)2025 పేరిట కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనప్పటికీ విపక్షాల తీవ్ర వ్యతిరేకత నడుమ వెనక్కి తగ్గింది. అయితే లోక్‌సభ సభ్యులకు నూతన బిల్లు ప్రతులను అందజేసినట్లు సమాచారం. ఈ శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి స్థాయి సంఘానికి పంపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నూతన బిల్లు ప్రకారం రాష్ట్రాల ప్రభుత్వాలు పథకం అమలులో అత్యధిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచనున్నారు. వికసిత్ భారత్2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ్ బిల్లుకు రూపకల్పన చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతనంతో కూడిన ఉపాధితో పాటు సంపన్న, సుస్థిర భారత్‌కు దారులు వేసేలా కొత్త చట్టంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపూ గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా కేంద్రం పేరు మార్చింది. 

విస్తరణపై కసరత్తు?

మన తెలంగాణ/హైదరాబాద్; ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం హస్తినలో విశ్రాంతి తీసుకున్నారు. అధికార, అనధికార (పార్టీ) కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఢిల్లీలో ఏఐసిసి అధ్వర్యంలో ఆదివారం జరిగిన ఓట్ చోర్ గద్దీ చోడ్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం హైదరాబాద్‌కు చేరుకుని, రవీంద్ర భారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కాగా, ఆయన సోమవారం ఎవరికీ అప్పాయింట్‌మెంట్స్ ఇవ్వకుండా గడిపారు. శనివారం ఆయన ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీతో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లో పాల్గొన్నారు. మ్యాచ్‌లో పాల్గొనేందుకు ప్రాక్టీస్ చేసి అలసటగా ఉన్నందున విశ్రాంతి తీసుకున్నారని సన్నిహితులు చెబుతున్నా, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై మంతనాలు జరపడంలో బిజీగా గడిపారని పార్టీ నాయకుల ద్వారా సమాచారం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్‌తో కూడా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు 

ప్రముఖ క్రికెటర్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ముగ్గురు కొత్త వారికి అవకాశం లభిస్తుందని అప్పుడు ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు జరగబోయే పునర్ వ్యవస్థీకరణలో ఇరువురికి ఉద్వాసన ఉంటుందన్న ప్రచారాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. అధిష్టానం అనుమతితో పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఉండే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. తనకు మంత్రివర్గంలో చేరాలన్న ఆసక్తి లేదని, తాను పిసిసి అధ్యక్ష పదవితో సంతృప్తిగా ఉన్నానని ఆయన మీడియా ప్రతినిధులతో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

సామాజిక తిరుగుబాటు

మన తెలంగాణ / హైదరాబాద్/ఖమం బ్యూరో: దేశంలో రిజర్వేషన్‌లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా దమాష ప్రకారం బిసి రిజర్వేషన్లు పెంచాలని లేనిపక్షంలో సామాజిక తిరుగుబాటు తప్పదని అఖిలపక్ష పార్టీల నేతలు, బిసి సంఘాలు జెఎసి నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఇచ్చిన చలో ఢిల్లీ పిలుపుమేరకు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బిసిల మహాధర్నా జరిగింది. ఈ మహా ధర్నాకు టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ జాతీయ నాయకుడు కె. నారాయణ, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బిఆర్‌ఎస్ ఎంపి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి,మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కుంతియా, ఎపి బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, మహారాష్ట్ర అధ్యక్షులు సచిన్ రాజోలుకర్ హాజరయ్యారు. బిసి రిజర్వేషన్ల పెంపు పై కాంగ్రెస్ వెనుకడుగు వేయదని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. స్థానిక పరిస్థితుల దృష్టా గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించామే తప్ప, బిసి రిజర్వేషన్ల ప్రక్రియ నుండి కాంగ్రెస్ పార్టీ వైదొలగలేదని ఆయన స్పష్టం చేశారు. ఢీల్లీలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే తో ఇప్పటికే చర్చించామని, అతి త్వరలోనే కేంద్రంపై పోరాడడానికి తమ రాజకీయ కార్యచరణ ప్రకటిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

బిజెపి అడ్డుపడుతోంది : నారాయణ

బిసి రిజర్వేషన్లు అమలు కాకుండా బిజెపి అడుగడుగునా అడ్డుపడుతుందని సిపిఐ జాతీయ నాయకుడు డా. కె. నారాయణ అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను తమ చేతిలో పెట్టుకుని బిసి రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు . తెలంగాణ నుండి ఎన్నికైన ఎనిమిది మంది బిజెపి ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దెబ్బకు దిగి వస్తుందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు : బిఆర్‌ఎస్ నేతలు

కామారెడ్డి డిక్లరేషన్ నుండి కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామాలు ఆడుతోందని బిఆర్‌ఎస్ నేతలు వి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టినా, చట్టం చేసినా బిఆర్‌ఎస్ పార్టీ అండగా నిలబడిందని, కాని కాంగ్రెస్ చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా వ్యహరిస్తుందని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వచ్చి ప్రధాని కలవాలని డిమాండ్ చేసినా కలవడం లేదని, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతలు పార్లమెంటులో కనీసం మాట్లాడడం లేదని అన్నారు. అనేక బిల్లులను కాంగ్రెస్ బిజెపిలు కలిసి పార్లమెంటులో ఆమోదించుకున్న సందర్భాలు ఉన్నాయని, బిసి బిల్లు విషయంలో మాత్రం రొండు పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని వారన్నారు. బిసి రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల చిత్తశుద్ధి ఎండగట్టడానికి పార్లమెంటులో ప్రవేట్ బిల్లును ప్రవేశపెట్టామని, కాంగ్రెస్ బిజెపిలకు చిత్తశుద్ధి ఉంటే బిఆర్‌ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతు తెలపాలని వారు డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే 2014 జూన్ 14వ తేదీన చట్టసభల్లో మహిళలు, ఒబిసిలకు 33 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కెసిఆర్ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేయడాన్ని ఈ సందర్భంగా వద్దిరాజు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కెసిఆర్ నాయకత్వాన జరిగిన మహోద్యమం మాదిరిగానే బిసిల న్యాయమైన హక్కులు, రాజ్యాధికారంలో సముచితమైన వాటా కోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు. కుల గణనలో బిసిల జనాభాను తక్కువ చేసి చూపడం, కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం, ఇతర 56 అంశాల గురించి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ తమ పార్టీ ఉద్యమించిందని అన్నారు. దీనిని మరింత ఉద్ధృతం చేయడంలో భాగంగానే కెసిఆర్ మార్గనిర్దేశనంలో పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టామని వివరించారు. కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు బిసి,

ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన 432 హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత రాహూల్ గాంధీకి ఓట్ చోర్ అంశంపై ఉన్న ఆసక్తి బిసి రిజర్వేషన్లు పెంచే విషయంలో ఇసుమంత కూడా చూపకపోవడం శోచనీయమన్నారు. తమ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వారి అధినాయకత్వాలపై వత్తిడి పెంచి ఆమోదం పొందేలా చూడాలని కోరారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి మాట్లాడుతూ బిసి బిల్లు పై పార్లమెంట్లో కొట్లాడుతున్న బిజెపి స్పందించడం లేదని అన్నారు. మల్లు రవి మాట్లాడుతుండగా బిసి సంఘాల నేతలు అఖిలపక్షంతో సిఎం ఢిల్లీకి ఎందుకు రావడం లేదని పార్లమెంటులో రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ఉపన్యాసానికి అడ్డు తగిలారు.

మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు మాట్లాడుతూ బిసి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ బిసిలకు న్యాయం జరగకపోవడం దురదృష్టకరమన్నారు. పార్లమెంటులో బిసి రిజర్వేషన్లపై ప్రైవేటు బిల్లు పెట్టే లా రాహుల్ గాంధీ పై ఒత్తిడి తెస్తామన్నారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉదృతం చేస్తున్నామన్నారు. అయినప్పటికీ బిజెపి కాంగ్రెస్ పార్టీలు స్పందించకుండా బిసిలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇప్పటికీ రెండుసార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపటినా అఖిలపక్షంతో ఎoదుకు ప్రధాని కలవడం లేదని ప్రశ్నించారు. బిజెపి బీసీలకు బద్ద శత్రువుగా మారిందని, నాటి మండల్ నుండి నేటి బిసి రిజర్వేషన్ల వరకు బిసిలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బిసి రిజర్వేషన్లు అమలు చేయని బిజెపిని, ఒత్తిడి పెంచని కాంగ్రెస్ పార్టీ లను బిసిలు విశ్వసించరని వారికి తగిన బుద్ధి చెబుతామని జాజుల హెచ్చరించారు. ఈ మహా ధర్నాకు బిసి జెఎసి వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ సమన్వయం చేయగా బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, మహిళా సంఘం అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, పెరిక సురేష్, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, వీరస్వామి, పిట్ల శ్రీధర్, కౌల జగన్నాథం, నాగ మల్లేశ్వరరావు, నందగోపాల్, జాజుల లింగం గౌడ్, వేముల రామకృష్ణ, మడత వెంకట్ గౌడ్, గూడూరు భాస్కర్, స్వర్ణ, గౌతమి, ఉదయనేత, శివమ్మ, శివకుమార్, సుమన్ , బిక్షం గౌడ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

నితీశ్‌కు ఏమైంది..?

పాట్నా ః బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం వివాదాస్పద రీతిలో వ్యవహరించారు. అధికారిక కార్యక్రమంలో ఓ మహిళా ఆయుష్ డాక్టర్ మేలిముసుగు (హిజాబ్) తొలిగించి చూశారు. సంబంధిత డాక్టర్లకు నియామక పత్రాలను అందించేందుకు ఏర్పాటు అయిన సభలో చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తింది. దీనితో సిఎం తీరుపై విమర్శలు జోరందుకున్నాయి. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ ముఖ్యమంత్రి వైఖరి జుగుప్సాకరంగా ఉందని విమర్శించారు. ఆయన ఫక్కా సంఘీగా మారారని, ఇప్పుడు జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్ చేసింది. ఇటీవలి కాలంలో ఆయుషు డాక్టర్లుగా కొందరిని ఎంపిక చేశారు. మహిళా డాక్టర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. పత్రాలు అందిస్తున్న దశలో తన ఎదుటికి హిజాబ్‌తో వచ్చిన నుస్రత్ పర్వీన్ ముసుగును సిఎం తొలిగించారు. ముందు ముఖం ముసుగు తీయమ్మా అంటూనే తానే ఈ పనిచేశారు. వెంటనే ఇది కెమెరాల క్లిక్‌లతో వీడియోగా మారింది. సిఎం చేసిన పనికి నుస్రత్ కంగుతింది. అక్కడున్న వారు నవ్వుతూ ఉండటం కన్పించింది.

ఈ వీడియోను రాష్ట్ర ఆర్జేడీ నేతలు సామాజిక మాధ్యమాలలో పొందుపర్చారు. నితీష్‌కు ఏమైంది? ఆయన మానసిక స్థితి పూర్తిగా దిగజారిందా? చిత్తచాంచల్యం ఏర్పడిందా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ సగం సగంగా అనుకుంటూ వస్తే ఇప్పుడు సిఎం నితీశ్ నూటికి నూరుపాళ్లు సంఘీ అయ్యారని విమర్శించారు. సిఎం తీరు బాగాలేదని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఓ ముస్లిం మహిళను అవమానించిన సిఎం రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేసింది. సిఎం స్థాయి వ్యక్తి ఈ విధంగా చేస్తే, మహిళను గేలిచేస్తే ఇక రాష్ట్రంలో వారికి భద్రతా ఉంటుందా? అని పార్టీ నిలదీసింది. కష్టపడి చదివి డాక్టరు అయిన ముస్లిం మహిళ పట్ల ముఖ్యమంత్రి ఇంత దిగజారుడుగా వ్యవహరించడం సిగ్గుచేటు అని పార్టీ పేర్కొంది. ఏకంగా సిఎం ఓ సభలో ముస్లిం హిజాబ్‌ను తీసివేస్తే సామాజికంగా దీని సంకేతాలు ఏ విధంగా వెలువడుతాయని పార్టీ వర్గాలు ప్రశ్నించాయి. ఇది మరీ మితిమీరిన దుష్ప్రవర్తన, సిగ్గుచేటు వ్యవహారం , క్షమించరానిదని స్పందించారు. జరిగిన ఘటనపై అధికార వర్గాల నుంచి కానీ సిఎం నుంచి కానీ ఎన్‌డిఎ వర్గాల నుంచి కానీ ఎటువంటి స్పందనా వెలువడలేదు.