పాదచారుల భద్రతపై జీహెచ్ఎంసి ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పాదచారుల సౌకర్యాలను మెరుగుపరచడం, నగర వీధులను సుందరంగా తీరిదిద్దడమే లక్ష్యంగా జూబ్లీహిల్స్లోని ఫిల్మ్నగర్ ప్రాంతంలో మోడల్ ఫుట్పాత్ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసి ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ సర్కిల్-18, ఖైరతాబాద్జోన్ పరిధిలోని రామానాయుడు స్టూడియో – రోడ్ నెం. 79/82 జంక్షన్ నుండి బీవిబా జంక్షన్, సివిఆర్ ఛానల్, రోడ్ నెం. 82 వరకు పాదచారుల రద్దీ అధికంగా ఉండే 1500 మీటర్ల పొడవైన మార్గాన్ని కవర్ చేస్తుంది. ఇందులో ఎడమ వైపు రూ. 1000 మీటర్లు, కుడి వైపు 500 మీటర్లు అభివృద్ధికి ప్రణాళికలను జిహెచ్ఎంసి రూపొందించింది. ఇందుకోసం మొత్తం రూ. 1 కోటి 68 లక్షలు వెచ్చించనున్నారు. వచ్చే 4 నెలల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. జిహెచ్ఎంసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఫుట్పాత్లో ప్లాస్టిక్ పేవర్ బ్లాకుల పయోగించబడుతోంది.
ఈ బ్లాకులు..
65-70% పోస్ట్-కన్స్యూమర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు అవుతాయి. 35 ఎంపిఏ కంప్రెషన్ బలం కలిగి ఉంటాయి 225ఎంఎం 112 ఎంఎంస 50 ఎంఎం(జిగ్-జాగ్ ప్యాటర్న్) పరిమాణంలో ఉంటాయి. సాధారణ కాంక్రీట్ పేవర్లకు సరిసమానమైన దృఢత్వంను అందిస్తాయి భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి పర్యావరణాన్ని కాపాడటానికి తోడ్పడతాయి స్మార్ట్ ఫుట్పాత్ కోసం సోలార్ గ్రిడ్ ఫుట్పాత్ పైభాగంలో 10 కెడబ్లూపి సామర్థ్యం గల సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. 600 డబ్య్లూ లేదా అంతకంటే పై రేటెడ్ సోలార్ మాడ్యూల్స్ 10 కెడబ్లూ గ్రిడ్ -టైడ్ ఇన్వర్టర్.
8-10 అడుగుల ఎత్తులో ఎంఎస్ మౌంటింగ్ స్ట్రక్చర్ ఆటోమేటెడ్ మాడ్యూల్ క్లీనింగ్ సిస్టమ్ ఏసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లు, లైట్నింగ్ అరెస్టర్, ఎర్తింగ్, అన్ని ఎలక్ట్రికల్ కనెక్షన్లు, ఇన్స్టాలేషన్ & కమిషనింగ్ ఈ సోలార్ పందిరి ( రూప్ టాప్ ) పాదచారుల భద్రతను పెంచడంతో పాటు సౌరశక్తి ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దివ్యాంగులకు అనుకూలంగా టాక్టైల్ పేవర్లు ( స్పర్శ సంబంధిత టైల్స్) దృష్టిలోపం ఉన్నవారికి, వృద్ధులకు మార్గనిర్ధేశం చేసేలా టాక్టైల్ పేవర్లు మరియు గైడ్ బార్లు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఫుట్పాత్ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది.