హైదరాబాద్: 2015 గ్రూప్ -2 ర్యాంకర్లకు ఊరట లభించింది. గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. 2019లో చేపట్టిన గ్రూప్-2 నియామకాలను సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. 2019 గ్రూప్-2 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను టిజిపిఎస్సి ఆశ్రయించింది. ఈ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేయడంతో పాటు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
వైటనర్ వినియోగం, దిద్దుబాట్ల ఉన్న పార్ట్ బి జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయడం చెల్లదని 2019లో హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారుసులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం టిజిపిఎస్సికి లేదని వెల్లడించింది. ఆన్సర్ సీట్లలో ట్యాంపరింగ్ జరిగిందనడం, వాటిని పక్కన పెట్టడం కమిషన్ వైఫల్యమేనని తప్పుబట్టింది. 2019 అక్టోబర్ 24న ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్టవిరుద్ధమని వాటిన రద్దు చేస్తామని హైకోర్టు తెలిపిన విషయం విధితమే. సాంకేతికమిటీ సిఫారసుల మేరకు హైకోర్టు గత తీర్పుకు తగ్గట్టుగా తిరిగి మూల్యాంకనం నిర్వహించడంతో పాటు అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని సూచనలు చేసింది. ఈ తీర్పుపై టిజిపిఎస్సి డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా కోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ ఇప్పుడు తీర్పునిచ్చింది.